Posts

Showing posts from November, 2017

స్వర్ణరేఖ!

Image
                                            స్వర్ణరేఖ! స్వర్ణరేఖ!- ఉషోదయపు ఎర్రని బింబం నీ ముఖారవిందం  అరుణకిరణాలకు నీ మొము పుత్తడి మేరుపందం చెమ్పల మీద కెంపు రంగొచ్చి ముద్ద మందారం  సిరోజాలలోఉన్న మల్లెపూల సౌరభానికి ఆహ్లాదం !

ఈశ్వర కృప.!

Image
ఈశ్వర కృప.! . ఈశ్వర కృపా ప్రసరణము జరగడాన్ని 'శ'కార బీజం అంటారు. . అందుకే శివునికున్న పేర్లలో ప్రధానమైన పేరు 'శంకర'. "శం కరోతి ఇతి శంకరః"  . . కామకోటికి పర్యాయ పదం 'శ'. కోటి అంటే కోటి సంఖ్య అని కాదు, . కోటి అంటే హద్దు అని. కామ అంటే కోర్కె. . కోర్కెల యొక్క హద్దు మీద ఆవిడ నిలబడి ఉంటుంది.  . దేని అంచైనా ఆవిడే. ఆవిడ ఇవ్వగలదు. ప్రసరణం చేయగలదు.  . కదలిక చేత ప్రసరింపబడితే అమ్మవారు. కదలికలన్నీ ఆగిపోతే శివుడు. . అదీ తత్త్వం.

గుడి ..గూటిలో.వినాయకుడు.

Image
గుడి ..గూటిలో.వినాయకుడు. – వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ | నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ||

గోపయ్య నల్లనా.. ఎందువలనా? (మా అమ్మ చెప్పిన కథ. సంత్ సూరదాస్ కవితట.)

Image
గోపయ్య నల్లనా.. ఎందువలనా? (మా అమ్మ చెప్పిన కథ. సంత్ సూరదాస్ కవితట.) . "అమ్మా.."  "ఏం కన్నయ్యా!" అని అడిగింది యశోదమ్మ కృష్ణుడిని.  "నాకు కోపమొచ్చింది" "కోపం అంటే ఏంటి, కన్నయ్యా?" "ఏమో! వచ్చింది. అంతే!"  "సరే, వచ్చింది లే!" "ఉహూ, ఎందుకూ? అని అడుగు" "హ్మ్" "హ్మ్మ్ కాదు, "ఎందుకు కన్నయ్యా?" అని అడగాలి" "అడిగాను లే , చెప్పు" "నన్ను నల్ల వాడని అన్న నవ్వాడు." "పోన్లే, అన్నేగా!" "వల్లభుడు కూడా నవ్వాడు. నీలమణీ నవ్వాడు." "నవ్వనీలే నాన్నా. వాళ్ళని తెల్లవాళ్ళని నువ్వూ నవ్వు." "మరి నువ్వూ తెల్లగా ఉంటావూ!" "అయితే!" "అందరూ తెల్లగానే ఉంటారు. నా అంత నల్లగా ఎవరూ ఉండరు."  "నీ అంతవాడివి నువ్వే కన్నా!" "అంటే?" "గొప్పవాడివనీ.." "గొప్ప కాదు నల్లవాడినట." "అయితే ఏం? నీ కళ్ళంత అందమైన కళ్ళు ఎవరికైనా ఉన్నాయా? నీ జుత్తు చూడు ఎంత నల్లగా, పట్టు

మోహముద్గరః -భజ గోవిందం.! ( ఆది శంకరాచార్య) శ్లోకం - 13.

Image
మోహముద్గరః -భజ గోవిందం.! ( ఆది శంకరాచార్య) శ్లోకం - 13. - కాతే కాంతా ధనగతచిన్తా వాతుల కిం తవ నాస్తి నియంతా| త్రిజగతి సజ్జనసంగతిరేకా భవతి భవార్ణవతరణే నౌకా|| - శ్లోకం అర్ధం :  ఓయీ! నీ భార్య ఎవరు? నీకు ఎల్లప్పుడును ధనమును గూర్చిన చింతయేనా? వేరొక చింతలేదా? నిన్ను సన్మార్గమున నడిపింప చేయగలవారెవ్వరు లేకపోయారా?  నీవు ముల్లోకములు వెదకినను సంసార సాగరమును దాటించుటకు సజ్జన సాంగత్యము తప్ప వేరొక నౌక లేదని తెలుసుకొనుము. . తాత్పర్యము : ఓయీ ! పరాత్పరుడైన భగవంతుడు లేడా? అతడు కరుణామయుడు. నారు వేసిన వాడు నీరు పోయడా? పుట్టించినవాడు పూట గడపడా! ఎందుకు నీకు చింత. అయ్యో! నేను లేకున్నా నా భార్యా-బిడ్డల గతి ఏమిటని చింతించకుము.  దయా స్వరూపుడైన ఆ దేవుడు అందరికీ తిండి, గుడ్డ, నీడ తప్పక ఇచ్చును. కావున ఈ విషయముల మీద చింతించుట మాని, మనసు పరమాత్మపై లగ్నము చేయుము. సమయమును వృధా చేయక, సత్ సాంగత్యము చేగొని, వారి వలన ధర్మాధర్మములు, మంచి చెడ్డలు తెలుసుకొని, సన్మార్గమును గుర్తించి, భవ సాగరములో జీవిత నావను చక్కగా భగవత్ గమ్యమునకు తీసుకొని పొమ్ము. -

శుభం -సౌందర్య లహరి! (శ్రీ శంకర భగవత్పాద విరచితము) శ్లోకము (35)

Image
శుభం -సౌందర్య లహరి! (శ్రీ శంకర భగవత్పాద విరచితము) శ్లోకము (35) - మనస్త్వం వ్యోమ త్వం మరుదసి మరుత్సారథి రసి త్వమాపస్త్వంభూమిస్త్వయిపరిణతాయాంనహిపరం, త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వ వపుషా చిదానన్దాకారం శివ యువతి భావేన బిభృ షే !! - ఓ భగవతీ ! మనస్సు నువ్వు , ఆకాశం నువ్వు , మరుత్తు నువ్వు , అగ్ని నువ్వు , జలం నువ్వు , భూమి నువ్వు . నువ్వు పరిణమించి న దానవవు తూంటే నీకంటే యితరం ఏదీ లేదు. . నువ్వే నీ స్వరూపాన్ని ప్రపంచ రూపంగా పరిణమింప చేయ టానికి చిదానందాకారాన్ని ( చిచ్ఛక్తి ఆనందభైరవుల ఆకారం) ధరిస్తున్నావు. - ఓం హిమగిరితనయాయైనమః  ఓం అన్నపూర్ణాయైనమః ఓం గణేశజనన్యైనమః

అందుకో జాలని ఆనందమే నీవు... ఎందుకో చేరువై.....దూరమవుతావూ..

Image
అందుకో జాలని ఆనందమే నీవు... ఎందుకో చేరువై.....దూరమవుతావూ..

ఎన్నిసార్లు రావాలి? నేన్రాను పో!

Image
రాగమయి రావే.. '  ఎన్నిసార్లు రావాలి? నేన్రాను పో! . ఒకానొక దుష్ట సంవత్సరం విపరీతంగా పాడబడ్డ పాట.. ' రాగమయి రావే! అనురాగమయి రావే!'.  ఒకళ్ళ తరవాత మరొకళ్ళు.. రేషన్ షాపు దగ్గర 'క్యూ' కట్టినట్టు వరసలో నిలబడి మరీ పాడారు. ఓ నలుగురు పాడంగాన్లే నాకు విసుగొచ్చేసింది. ఈ వెధవలు పిలిస్తే 'రాగమయి' రావడం మాట అటుంచి..  దడుపుడు జొరంతో పారిపొయ్యే ప్రమాదం తీవ్రంగా ఉంది! చిత్రమేమంటే మహాగాయకుడు ఘంటసాల సినిమా కోసం పాడిన మట్టి రికార్డ్ మూడున్నర నిమిషాలే! కానీ మావాళ్ళు ఘంటసాల కన్నా బాగా పాడేద్దామని ఉత్సాహపడేవాళ్ళు. అంచేత ఒరిజినల్ పాటలో లేని కొత్త సంగతులు వేసి.. తన్మయత్వంతో కళ్ళు మూసుకుని రాగాలు సాగదీస్తూ పది నిమిషాలకి పైగా పాడేవాళ్ళు. చివురులు మేసిన చిన్నారి కోయిల.. ' చరణం  ఆ నాటి 78 rpm రికార్డులో లేదు. మరొక్కసారి విని ఆనందిచండి .https://www.youtube.com/watch?v=V34qpC67oMY&list=PLuPm_Z49ejre342yuhZYUWu4-ST4xOfR0&index=6

సజ్జ మీద ధ్యాస ! -

Image
సజ్జ మీద ధ్యాస ! - ఒక అమ్మాయి గుడికి వెళ్ళి తిరిగి వచ్చింది... దర్శనం బాగా జరిగిందా తల్లీ, అని ఆమె తండ్రి ప్రశ్నించారు..... కూతురు: ఇక మీదట నన్ను ఎపుడూ గుడికి వెళ్ళమనకండి నాన్నాగారు... కోపంగా చెప్పింది.. తండ్రి: ఏం జరిగింది తల్లీ కూతురు: గుడిలో ఒక్కరంటే ఒక్కరు దేవుని మీద ధ్యాసతో లేరక్కడ. అందరూ వారి మొబైల్ ఫోన్లలో మాట్లాడడం, ఫోటోలు తీయడం, భక్తికి సంభందించినది కాక వేరే విషయాలు చర్చించడం చేస్తున్నారు. కనీసం భజనలు వద్ద కూడా సరైన పద్దతులలో ఉండడం లేదు . ఎవరిలోను నాకు భక్తి కనిపించ లేదు.  తండ్రి: ( కాసేపు మౌనం పాటించి) సరే.. నువ్వు తుది నిర్ణయం తీసుకొనే ముందు నాదోక్క చిన్న కోరిక.. చేస్తావా...  కూతురు: తప్పకుండా నాన్నాగారు.. మీమాట ఎపుడూ కాదనలేదు. చెప్పండి ఏమి చేయాలో.... తండ్రి: ఒక సజ్జ నిండా పూలు తీసుకొని వెళ్ళు గుడికి..  మూడంటే మూడే ప్రదక్షిణలు చేసి రావాలి.. అయితే చిన్న గమనిక..  నీ సజ్జ నుంచి ఒక్క కూడా పువ్వు కూడా క్రింద పడరాదు సుమీ... ఈ పని చేయగలవా.... . కూతురు: అలాగే నాన్నాగారు. తప్పకుండా చేస్ మీకోసం ,అని సజ్జలో పూలు తీసుకొని బయలు దేరింది.. ఒక మూడు గంట తరువాత ఇంట

మోహముద్గరః -భజ గోవిందం.! ( ఆది శంకరాచార్య) శ్లోకం - 12.

Image
- మోహముద్గరః -భజ గోవిందం.! ( ఆది శంకరాచార్య) శ్లోకం - 12. - దినయామిన్యౌ సాయం ప్రాతః  శిశిరవసంతౌ పునరాయాతః| కాలః క్రీడతి గచ్ఛత్యాయుః తదపి న ముంచత్యాశావాయుః|| - శ్లోకం అర్ధం : రాత్రింబవళ్ళు, ఉదయ సాయంకాలములు,  శిశిర వసంతాది ఋతువులు ఒకదాని వెంబడి ఒకటి వచ్చుచు పోవుచుండును.  ఈ విధముగా కాలము క్రీడించుచున్నది, ఆయువు క్షీణించుచున్నది. అయిననూ ఆశాపిశాచము మాత్రము నిన్ను వదలకయే ఉన్నది. - తాత్పర్యము : మానవ జీవిత పరిమితి వంద సంవత్సరములు. అందులో మన దురలవాట్ల వల్ల, రోగముల వల్ల, వ్యాధుల వల్ల, ఆపదల వల్ల ఆ జీవితకాలము ఎంతో తరగిపోవుచున్నది. అందులో సగభాగము మనము నిద్రలో గడుపుచున్నాము. తిండి, క్రీడలు, వినోదములకు చాలా భాగము వినియోగించు చున్నాము.  ఆ మిగిలిన కొంత భాగమైనను భగవంతుని సేవకై వినియోగించక, పర దూషణలు, నిందలు, కామ క్రీడాది కార్యక్రమములకై వినియోగించు చున్నాము. ఈ విధంగా మన జీవితకాల మంతయు గడిచి పోవుచున్నది.  స్వామి సేవ రేపు, మాపు అనుకొంటూ లేని పోని సాకులతో  కాలయాపన చేయుచున్నాము. ఈ విధంగా గంటలు, రోజులు, పక్షములు, మాసములు, సంవత్సరములు గడిచి పోవుచున్నవే కాని, భగవత్ ధ్

సౌందర్య లహరి! (శ్రీ శంకర భగవత్పాద విరచితము) శ్లోకము (34)

Image
శుభం -సౌందర్య లహరి! (శ్రీ శంకర భగవత్పాద విరచితము) శ్లోకము (34) - శరీరం త్వం శమ్భోశ్శశిమిహిర వక్షోరుహ యుగం తవాత్మానాం మన్యే భగవతి నవాత్మాన మనఘం, అతశ్శేష శ్శేషీత్యయ ముభయ సాధారణతయా స్థితస్సమ్బన్ధో వాం సమరస పరానన్ద పరయోః !! - ఓభగవతీ! నువ్వు శంభుడికి రవిచంద్రులు స్తనయుగం గాగల శరీరమవుతున్నావు. అమ్మా ! నీశరీరాన్ని దోషరహితమైన నవ వ్యూహాత్మకమైన ఆనంద భైరవుడి గా తలంచుచున్నాను.  ఇందువల్ల యీశేష శేషీ భావ సంబంధం సామరస్యంతో కూడిఆనంద భైరవి రూప చిచ్ఛక్తులైన  మీ ఇరువురకుశివశక్తులకు) ఉభయ  సాధారణంగా వుంది. - ఓం హ్రీంకార్యైనమః ఓం నాదరూపాయైనమః ఓం సుందర్యైనమః -

తిరుపతి వేంకట కవుల సమయ స్ఫూర్తి!

Image
తిరుపతి వేంకట కవుల సమయ స్ఫూర్తి! - అవధాన నిర్వహణంలో ఆశుకవితా ప్రసారంలో అనుపమాన చాతుర్యం వారిసొత్తు. సమయానుకూలంగా చమత్కార భాజనంగా ఆశువును నడిపించటంలో ఆరితేరిన వారు తిరుపతి వేంకట కవులు. వారు అవధాన జైత్ర యాత్రలు చేస్తూ వివిధరాజాస్థానలను దర్శించేవారు.సమయాను కూలంగా ఆప్రభువులను రంజింపచేస్తూ వారిచే సన్మానింప బడుచుండెడివారు. ఆపరంపరలో భాగంగా వారు విజయనగర( తూర్పుకోస్తా) సంస్థానానికి విచ్చేశారు. పండితాభిమానియు,కవిజన పోషకుడును అగు ఆనంద గజపతి సన్నిధిలో వారు చెప్పిన పద్యాన్ని యిప్పుడు విందాం! ఉ: ఎందరిఁ జూపెనేని వరియింపదు మాకవితాకుమారి, క  న్నందుకు దేశముల్ దిరుగుటబ్బెను, సౌఖ్యము లేకపోయె, నా  నంద నృపాల! నీదు సుగుణంబుల నే వివరించునంత వెం  టం దలయూచె;ఁ గావున, తటాలున దీని బరిగ్రహింపుమా!! .  తెలుగులోనూ తమను మించిన కవులు లేరని సవాలు చేస్తూ, మీసాలు ఎందుకు పెంచారో, వారి పద్యంలోనే విందాం! దోసమటం బెరింగియు దుందుడు కొప్పగ పెంచినారమీ, మీసము రెండు బాసలకు మేమె కవీంద్రులమంచు దెల్పగా రోసము కల్గినన్ కవివరుల్ మము గెల్వుడు గెల్చిరేని యీ మీసము తీసి మీ పద సమీపములం దలలుంచి మ్రొక్కమే. .  తిరు

హాస్యభరిత నాటకం" కన్యాశుల్కం"

Image
" కన్యాశుల్కం".! , హాస్యభరిత శైలిలో సాంఘిక దురాచారాలను దునుమాడిన నాటకం" కన్యాశుల్కం". . ఆధునిక గద్య రచనకీ ప్రారంభకుడూ, ప్రవక్తా గురజాడ అప్పారావు. ఎన్నెన్నో సాహిత్య రంగాలలో ఆయన కొత్త మార్గాలు తెరచి కొత్త ప్రక్రియలు అవలంబించారు. ప్రత్యేకంగా వచన రచనలో ఆయన వాడుక భాషను స్వీకరించి దానిని మహోన్నతమైన సాహిత్య స్థాయికి తీసుకు వెళ్ళాడు.  గురజాడ చేపట్టక పూర్వం,  ఆయన మాటల్లోనే... "గ్రామ్య భాష దిక్కుమాలిన స్త్రీ... ఆమెను పండితులు నిష్కారణంగా దూషించి అవమానించగా కనికరించి ఫీజు లేకుండా వకాల్తా పట్టితిని"... అన్నాడు గురజాడ. . ఈనాడు వాడుక భాష దిక్కుమాలినది కాదు. గుడిసెల్లో పుట్టి పెరిగి, స్వయంప్రతిభతో కళాశిఖరాలందుకున్న నటీమణీతోనో, స్వల్ప ప్రారంభాల నుంచి బైటపడి, స్వయంకృషితో చదువులన్నీ నేర్చి, పార్లమెంటు భవనాల నలంకరించే విదుషీమణితోనో నేటి వ్యావహారిక భాషను సరిపోల్చవలసి ఉంటుంది. వాడుక భాషకు ఏ ఒక్కరైనా ఇంత గౌరవం సాధించారంటే అతడు గురజాడ అప్పారావనే చెప్పాలి. . మన దేశభాషలన్నింటిలోనూ, పూర్తిగా వచనంతో, అందులోకి పాత్రోచితమైన వ్యావహారిక శైలిలో మొట్టమొదటి నాటకం రా

అది నిఘంటువు కాదమ్మా. భగవద్గీత.'!

Image
అది నిఘంటువు కాదమ్మా. భగవద్గీత.'! . అది నిఘంటువు కాదమ్మా. భగవద్గీత.'! .. అమ్మకాల ఆసామీ పిలుపుగంట నొక్కేసరికి పేరిందేవి తలుపు తీసింది. ' అమ్మా! ఇది చాలా మంచి నిఘంటువు. ఏ తెలుగు పదానికి ఆంగ్లపదం కావాలన్నా ఇందులో దొరుకుతుంది. మీకు ప్రత్యేకమైన తగ్గింపు ధరలో ఇస్తాను. తీసుకోండమ్మా.' పేరిందేవి విసుగ్గా అంది, ' మా ఇంట్లో నిఘంటువు వుందయ్యా. అదుగో, ఆ బల్ల మీద వుంది చూడు.' ' అమ్మా! అది నిఘంటువు కాదమ్మా. భగవద్గీత.' పేరిందేవి ఆశ్చర్యంగా అడిగింది, ' ఇంత దూరం నించి అది ఏ పుస్తకమో కనబడదుగా! అది భగవద్గీత అని నీకెల్లా తెలిసింది?' ' చాలా దుమ్ము కొట్టుకుని వుండిపోయింది కదమ్మా? ఎప్పుడు తెరవకుండా వున్నారంటే అది భగవద్గీతే అనుకున్నానమ్మా.' ( నేను చిన్నప్పుడు ఆకాశవాణిలో ఒక పాట విన్నాను. ' పుట్టినావీ భరతఖండాన, చేత పట్టావ నువు గీత ఎపుడైన?')

భారతీయులమండీ మేం భారతీయులం:

Image
- భారతీయులమండీ మేం భారతీయులం ! రచన: అనంత శ్రీరామ్ ( గీత రచయిత) భారీ డైలాగులు కొట్టడానికీ,బార్ల షాపులలో కూర్చోడానికీ బాగా అలవాటు పడ్డాం భారాలు ఎత్తుకోమంటే ఎలా ఎత్తుకొంటాం వీలయితే దించేసుకొంటాం లేదా వదిలించేసుకొంటాం ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని ఎదురు చూస్తాం, ఒక వేళ ఎవరైనా వచ్చి ఏదైనా చేస్తే ఎగతాళి చేస్తాం. భారతీయులమండీ మేం భారతీయులం. మకిలి పట్టిన దేశాన్ని కడిగేయాలంటాం, కానీ మా కడుపులో నీళ్లు మాత్రం కదలకూడదు. ఒక్కొక్క లంచపు కొడుకుని ఏరిపారేయాలంటాం, ఓట్లప్పుడు మేం అడిగే లంచాల జోలికి మాత్రం రావద్దు. దోచుకొన్న దొరల పళ్ళు రాలగొట్టేయాలంటాం, మేం ఎగ్గొట్టిన పన్నుల గురించి మాత్రం అడగకూడదు. దేశమంటే మట్టి కాదు మనీ అనేది మా నినాదం, అందుకే మనీ మొత్తం మట్టిలో (రియల్ ఎస్టేట్) దాచుకొంటాం పైవాడు వచ్చి ఆ మట్టిని తవ్వితే తప్ప మా ఇంటి ముందున్న మట్టి రోడ్డు గుర్తుకు రాదు. నువ్వు పనులు చేస్తే కానీ పన్నులు కట్టమని జనం, నువ్వు పన్నులు కట్టితే కానీ పనులు చేయమని ప్రభుత్వం ఇదీ మా కోడి,గుడ్డు సూత్రం. అంతేకానీ మేం కోడిగుడ్డు వేసుకోవడం ఆపం అరే బాబూ దేశంరా అంటే ఆ! గాడిదగుడ్డు లే

మనకు శ్రీక్రిష్ణ భగవానులు వారు భగవద్గీతలో ఏమి చెప్పారు

Image
- మనకు శ్రీక్రిష్ణ భగవానులు వారు భగవద్గీతలో ఏమి చెప్పారు? - "శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ , స్వనుష్టితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః" -ఇతరుల ధర్మం చక్కగా ఆచరించడం కంటే లోటుపాటులతో అయినా తన ధర్మం పాటించడమే మేలు. పరధర్మం భయభరితం కావడం వలన స్వధర్మాచరణలో మరణమైనా మంచిదే అని చెప్పారు. ఇక్కడ స్వధర్మమనగా మనకు పూర్వీకులనుండి వచ్చిన జీవనశైలి, వృత్తి, అలవాట్లు, సంప్రదాయాలు మొదలగునవి . ఈ అసమాన వైశిష్ట్యం కలిగిన స్వధర్మాన్ని వదలి కడుపు నింపుకోటానికి చెప్పలేని పరధర్మాలను ఆశ్రయిస్తూ, అందులో భాగంగా స్వధర్మాన్ని అపహాస్యం, అవహేళన చేస్తూ, కించ పరుస్తూ నా అంత తెలివికలవాడు లేడని చొక్కా కాలరు ఎగరేసుకుంటున్నాము. ఇది ఒక మతం మారి ఇంకో మతాన్ని అనుసరిస్తూ.. తన పూర్వ మతాన్ని కించపరస్తూ మాటాడే వారికి కూడా అన్వయింపబడుతుంది. . చాలా మంది ఈ పరధర్మ మార్గంలో వెళ్లడం ద్వారా ఏమి కోల్పోతున్నారో మీకు తెలుసా? కాలానికి నిలిచిన ఒక బలీయమైన సంస్కృతి అనే హారంలో ఒక ముత్యంలా ఉండే అవకాశం, తద్వారా వచ్చే అనన్యమైన దైవసంపదను పొందే అవకాశం. పరధర్మమంటే విదేశాలకు వెళ్ళడమో లేదా మతం మారి , ఇంకో మతాన్న్న

హనుమంతుని గంధ, సింధూర విశేషం!

Image
- హనుమంతుని గంధ, సింధూర విశేషం!- శ్రీ రామ పాద సేవా దురంధరుడు, రామ భక్తీ సామ్రాజ్యాధిపతి అయిన శ్రీ హనుమంతుడు అయోధ్యలో శ్రీ రామ పట్టాభిషేకాన్ని పరమ వైభవంగా జరి పించాడు. రామ ప్రభువు సీతామాతను ప్రేమించినంతగా తనను ప్రేమించటం లేదని తనను దూరంగా ఉంచుతున్నాడని మనసులో భావించాడు. రాత్రి వేళల్లో తనను అసలు రాముని వద్ద ఉండనివ్వటం లేదు. తనను ఎందుకు ఉపేక్ష చేస్తున్నారో అర్ధంకావటం లేదు. తన కంటే సీతామాతలో అధికంగా ఏముంది? ఆమెనే అంత ఆత్మీయంగా దగ్గరే ఉంచుకోవటానికి కారణమేమిటో ఆ ఆజన్మబ్రహ్మచారికి ఏమీ తెలియక తల్లడిల్లుతున్నాడు. జానకీ దేవి పాపిడిలో యెర్రని సిందూరపు బొట్టు కనిపిస్తోంది. ఆ యెర్రబొట్టుకు రాముడు ఆకర్షితుడయ్యాడేమోనని అనుమానం వచ్చింది. ఆ సింధూరమే తన కొంపముంచి శ్రీరాముడిని సీతాదేవికి అతి సమీపంగా ఉంచుతోందని భ్రమపడ్డాడు. శ్రీ రామ విరహాన్ని ఒక క్షణం కూడా సహించలేని దుర్భర వేదనకు గురి అయ్యాడు. దీని సంగతేమిటో తేల్చుకోవాలని శ్రీ రాముడి దగ్గరకే, వెళ్లి చేతులు జోడించి "రామయ్య తండ్రీ! మా తల్లి సీతా మాత శిరస్సు మీద ఉన్న పాపిట లో సింధూరం ఉంది. దానికి కారణం ఏమిటో వివరించండి'' అని ప్రార్ధించాడ

సొగసు చూడతరమా !

Image
సొగసు చూడతరమా ! - అరుగు మీద నిలబడీ నీ కురులను దువ్వే వేళ చేజారిన దువ్వెనకు బేజారుగ వంగినపుడు చిరుకోపం చీర కట్టి సిగ్గును చెంగున దాచి పక్కుమన్న చక్కదనం పరుగో పరుగెత్తినపుడు ఆ సొగసు చూడతరమా… నీ సొగసు చూడతరమా… . పెట్టీ పెట్టని ముద్దులు ఇట్టే విదిలించికొట్టి గుమ్మెత్తే సోయగాన గుమ్మాలను దాటు వేళ చెంగు పట్టి రారమ్మని చెలగాటకు దిగుతుంటే తడిబారిన కన్నులతో విడువిడువంటునప్పుడు విడువిడువంటునప్పుడు ఆ సొగసు చూడతరమా… నీ సొగసు చూడతరమా…

సీతమ్మ మా-అమ్మ శ్రీ రాముడు మా తండ్రి!

Image
బాలమురళి గాత్రం.! https://www.youtube.com ( /watch?v=hUnZz4vd-ro .) సీతమ్మ మా-అమ్మ శ్రీ రాముడు మా తండ్రి . వాతాత్మజ సౌమిత్రి వైనతేయ రిపుమర్దన ధత-భరతాదులు సోదరులు మాకు ఓ మనసా (సీత) వాత-ఆత్మజ సౌమిత్రి వైనతేయ రిపు-మర్దన ధత భరత-ఆదులు సోదరులు మాకు ఓ మనసా (సీత) పరమేశ వసిష్ఠ పరాశర నారద శౌనక శుక సురపతి గౌతమ లంబోదర గుహ 1సనకాదులు ధర నిజ భాగవతాగ్రేసరులెవరో వారెల్లరు2 వర త్యాగరాజునికి పరమ బాంధవులు మనసా (సీత)

అసలు వేదమనగానేమి ?

Image
అసలు వేదమనగానేమి ? - వేదమంటే ’ జ్ఞానము ’ అని అర్థము. పరమాత్మ , జీవులు , దేవతలు , ప్రకృతి , ధర్మము మొదలగు విషయములను గురించిన జ్ఞానము. అతి పవిత్రమై , అత్యంత ప్రామాణికమై , మన ధర్మములు , దర్శనము , సమాజము మొదలగు వాటిపై అంతిమ నిర్ణయమును చెప్పు అధికారమున్న గ్రంధమే వేదమని చెప్పవచ్చును. అది అతీంద్రియ సత్యములను తెలియగోరు అందరు సాధకుల పవిత్ర గ్రంధము. వేదమను పదము , ’ జ్ఞానము ’ అథవా ’ పొందుట ’ యను అర్థమును ఇచ్చు ’ విద్ ’ అను ధాతువు నుండీ ఏర్పడ్డ శబ్దము. - || వే॒దేన॒ వై దే॒వా అసు॑రాణాం వి॒త్తం వేద్య॑మవిన్దన్త॒ తద్వే॒దస్య॑ వేద॒త్వమ్ || - అనే తైత్తిరీయ సంహితలోని ఈ మంత్రము వలన ఈ విధముగా తెలియుచున్నది: అసురులు పొందిన , మరియు ఉపయోగించనున్న ద్రవ్యములను దేవతలు దేనివలన తెలుసుకొని పొందినారో , అది వేదము. - వేదమంటే జ్ఞానము మాత్రమే కాదు. అది , మానవుడు కాంక్షించు అనేక విషయములను అతనికి తెచ్చి ఇవ్వగల సామర్థ్యము కలిగినది. || ఇష్ట ప్రాప్త్యనిష్ట పరిహారయోః అలౌకికం ఉపాయం యో గ్రంధో వేదయతి స వేదః || - కోరిన ఇష్టములను పొందుటకును , కీడు ను తప్పించుకొనుటకును గల అలౌకిక ఉపాయమును తెలుపు గ్రంధమే వేద

మోహముద్గరః -భజ గోవిందం.! ( ఆది శంకరాచార్య) శ్లోకం - 11.

Image
- మోహముద్గరః -భజ గోవిందం.! ( ఆది శంకరాచార్య) శ్లోకం - 11. - మా కురు ధన జన యౌవన గర్వం  హరతి నిమేషాత్కాలః సర్వం| మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా|| - శ్లోకం అర్ధం : ధనము, పరివారము, యోవ్వనము కలవని గర్వముతో ఉండకుము. క్షణములో వీటినన్నిటిని కాలము హరించును . ఇదంతయు మాయామయమని, మిథ్యయని, అశాశ్వతమని  గ్రహించి జ్ఞానివై పరబ్రహ్మమును పొందుము. . తాత్పర్యము :  ఈ ప్రపంచములో అందరికన్నా నీకు మొదటి శత్రువు గర్వము. ఎప్పుడు మనసున గర్వము చేరినదో, అపుడే మనిషికి పతనము ప్రారంభమైనదని అర్ధము. గర్వము అజ్ఞానమునకు సూచన.  గర్వము కలిగిన వ్యక్తి తాను ధనవంతుడిననో, అందగాడిననో, పదవిలోనో- పలుకుబడిలోనో ఉన్నతుడననో, లేక జ్ఞానిననో, మంత్రోచ్ఛారణలో దిట్టననో ఊహించుకొని, ఊహాగానాలు చేసుకొని,  స్త్రీ, జ్ఞాన, వృద్ధులు అన్న తారతమ్యములు మరిచి, అందరినీ అవమానిస్తాడు.  ఈ అజ్ఞానమునకు కారణము అసంపూర్ణత. కావున గర్వమును సంపూర్ణముగా నశింప చేసి, పరతత్వమును సరిగా అర్థము చేసుకొని పరమాత్మునిలో ఆత్మని ఐక్యము చేసి పరమ పదము సాధించుము.

సౌందర్య లహరి! (శ్రీ శంకర భగవత్పాద విరచితము) శ్లోకము (33)

Image
- శుభం -సౌందర్య లహరి! (శ్రీ శంకర భగవత్పాద విరచితము) శ్లోకము (33) - స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిద మాదౌ తవమనో ర్నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగ రసికాః, భజన్తి త్వాం చింతామణి గుణనిబద్ధాక్ష వలయాః శివాగ్నౌ జుహ్వన్తః సురభిఘృత ధారాహుతిశతైః !! - ఓ నిత్య స్వరూపిణీ ! నీ మంత్రానికి ముందు కామ రాజ బీజం, భువనేశ్వరీ బీజం, లక్ష్మీ బీజం (మూటినీ ఐం హ్రీం శ్రీం ) కలిపి నిరవధిక మహాభోగ రసికులు చింతా మణులనే రత్నాల తో కూర్పబడిన అక్ష మాలలను చేతుల్లో ధరించిన వారై శి వాగ్నిలో కామ ధేనువు యొక్క నేతి ధారలతో అనేక ఆహుతుల చేత హోమం చేస్తూ నిన్నుసేవిస్తూన్నారు. - ఓం శివాభినామధేయాయైనమః ఓం శ్రీవిద్యాయైనమః  ఓం ప్రణవార్థస్వరూపిణ్యైనమః

పూలమ్మి పాట :-

Image
శుభోదయం !                                          -:పూలమ్మి పాట :- పూలమ్మి పాట.) బొడ్డెమ్మ బొడ్డెమ్మ ఉయ్యాలో.. నీ బిడ్డ పేరేమీ ఉయ్యాలో నీ బిడ్డ నీళ్ల గౌరి ఉయ్యాలో.. నీ బిడ్డ నీళ్లు పోసే ఉయ్యాలో నిత్యం నీళ్లు పోసి ఉయ్యాలో.. నిత్యమల్లె చెట్టేసే ఉయ్యాలో నిత్యమల్లె చెట్టూకు ఉయ్యాలో.. ఏడే మొగ్గలు ఉయ్యాలో ఏడు మొగ్గలకు ఉయ్యాలో.. ఏడు విత్తుల పత్తి ఉయ్యాలో ఆ పత్తి తీసుకుని ఉయ్యాలో.. సాలోనికిస్తే ఉయ్యాలో సాలోడు నేసేనే ఉయ్యాలో.. నెలకొక్కపోగు ఉయ్యాలో దిగెనే ఆ చీర ఉయ్యాలో.. దివిటీల ఆ చీర ఉయ్యాలో...

అందరూ స్త్రీలు ఉండే రాజ్యానికి రాణి.

Image
ప్రమీలార్జునీయము.! . మహాభారతంలో ప్రమీల అందరూ స్త్రీలు ఉండే రాజ్యానికి రాణి. ఈ రాజ్యంలో స్త్రీలే పరిపాలకులు మరియు యుద్ధ వీరులు.  ఎంతటి బలమైన వారైన వీరితో ఓడిపోయేవారు.  ధర్మరాజు చేస్తున్న రాజసూయ యాగాశ్వం వీరు బంధించారు.  అందులకు అర్జునుడు వారితో యుద్ధం చేయడానికి వెళతాడు. చివరికి ఆమెను వివాహం చేసుకుంటాడు.

ప్రమీలార్జునీయము.!

Image
ప్రమీలార్జునీయము.! . మహాభారతంలో ప్రమీల అందరూ స్త్రీలు ఉండే రాజ్యానికి రాణి. ఈ రాజ్యంలో స్త్రీలే పరిపాలకులు మరియు యుద్ధ వీరులు.  ఎంతటి బలమైన వారైన వీరితో ఓడిపోయేవారు.  ధర్మరాజు చేస్తున్న రాజసూయ యాగాశ్వం వీరు బంధించారు.  అందులకు అర్జునుడు వారితో యుద్ధం చేయడానికి వెళతాడు. చివరికి ఆమెను వివాహం చేసుకుంటాడు.

తెలుగు భాష మేటి భాష!

Image
-తెలుగు భాష మేటి భాష! - అల్లరి చెయ్యమంటే తెలుగు వాళ్ళ తర్వాతే అండి.  జొన్నవిత్తుల గారి పద్యాల బాణీలో వ్రాసిన ఈ పారడి పద్యాలు . - పూతరేకులరిసె పూర్ణాలు బొబ్బట్లు కాకినాడ కాజ కజ్జికాయ బాదుషాలు జాంగ్రి పాయసమ్ముల కన్న తీయనైన భాష తెలుగు భాష! . మిసిమి బంగినపల్లి మామిడుల రుచులు తాటిముంజలు మేటి సీతాఫలాలు మెరయు చక్కెరకేళి మాధురులకన్న తీయనైనది నా భాష తెలుగు భాష! . పెసర పిండి పైన ప్రియమగు నల్లంబు దాని పైన మిర్చి దద్దరిల్ల  జీల కర్ర తోడచేర్చిన ఉప్మాకు  సాటి తెలుగు భాష మేటి భాష . స్వర్గ మందు దొఱకు చప్పని అమృతంబు తాగ లెక సురులు ధరణి లొన  ఆంధ్ర దెశమందు ఆవిర్భవింతురు  ఆవ కాయ కొఱకు నంగలార్చి. . కూర్మి తోడ తెచ్చి గోంగూర యాకులు రుబ్బి నూనె మిర్చి ఇంపు తోడ  కారమింగువలను తగిలించి తిను వాడు  ఘనుడు తెలుగు వాడు కాదె భువిని . ఆట వెలది యనిన అభిమానమెక్కువ తేట గీతి యనిన తియ్య దనము సీస పద్యమనిన చిత్తమ్ము రంజిల్లు కంద పద్యమెంత సుందరమ్ము .

మోహముద్గరః -భజ గోవిందం.! ( ఆది శంకరాచార్య) - శ్లోకం - 10.

Image
_ మోహముద్గరః -భజ గోవిందం.! ( ఆది శంకరాచార్య) - శ్లోకం - 10. - వయసి గతే కః కామవికారః  శుష్కే నీరే కః కాసారః| క్షీణే విత్తే కః పరివారో జ్ఞాతే తత్త్వే కః సంసారః|| - శ్లోకం అర్ధం : వయసు మళ్ళిన వానికి కామ వికార మెక్కడిది?  నీరు ఎండిపోయిన యెడల అది చెరువు ఎలా అవుతుంది?  అట్లే, ధనము లేనప్పుడు పరివార మెట్లుండును?  తత్వము అనుభూతమైన తర్వాత సంసార బంధము ఏముండును? . తాత్పర్యము : తనువులో శక్తి నశించి, నడుము వంగి, ఇంద్రియముల పటుత్వము తగ్గినపుడు కామ వికారాలు తగ్గుటలో విచిత్రమేమి?  దేహ పటుత్వము నశించినపుడు, నరములలో నీరసము వచ్చినపుడు కామ క్రీడలపై ఆసక్తి నశించుట సహజము.  నీరన్నియు ఎండిపోయిన పిమ్మట యిక చెరువనేది ఎక్కడ?  అనగా, అశక్తుడవైనపుడు కామ క్రీడలయందు అనాసక్తుడ వగుటలో గొప్ప యేమి?  వయసులో ఉన్నప్పుడు, మనో వికారములను అదుపు చేసి పరమాత్మునిపై లగ్నము చేసినవాడు గొప్పవాడు.  అనగా, ఎప్పుడో వృద్ధాప్యములో అన్ని అంగములు ఊడినపుడు, వాటిపై అయిష్టత గలిగినను, మనసు మాత్రము ఇంకా వాటి వెనుకే పరుగులిడుచుండును.  వయసులో ఉన్నప్పుడే ఆత్మ నిగ్రహము పొందిన, శరీరము మనసు స్వాధీనములో ఉండ

'ఝణక్ ఝణక్ పాయలబాజే '!

Image
-                        'ఝణక్ ఝణక్ పాయలబాజే '! - ''ఝణక్ ఝణక్ పాయలబాజే 'అంటే ఒక అద్భుత దృశ్య కావ్యం. శాంతారాం తీసిన ఆణిముత్యాలలో ఒకటి . గోపి కృష్ణ కథక్ నృత్యం ఒక కల్కి తురాయి .అందులో వసంత దేశాయ్ సంగీతంలో అన్ని పాటలు బాగుంటాయి ... ఈ పాటలో రతి మన్మధుల నృత్యం చాలా బాగుంటుంది.నేను 1955 విజయవాడ లీలామహల్ లో చూసాను.నాకు తెలిసినంత వరకు ఎప్పుడు ఇంగ్లీష్ సినిమాల ఆడు హాల్ అదే మొదటి హిందీ సినిమా . - https://www.youtube.com/watch?v=Zy73MGPEBTc

ఇంకా చావని మానవత్వం.!

Image
- ఇంకా చావని మానవత్వం.! . ఇంటికి వెడుతున్నా నడుచుకుంటూ  . దారిలో ఒక కరంటు స్థంభానికి ఒక కాగితం కట్టి ఉంది .  . "దయచేసి చదవండి " అని రాసి ఉంది . ఖాళీ గానే ఉన్నాను కదా అని దగ్గరకు వెళ్లి చూశాను .  . . " ఈ రోడ్డులో నేను నిన్న ఒక 50 రూపాయల నోటు పారేసుకున్నాను . నాకు కళ్ళు సరిగా కనబడవు . మీకు దొరికితే దయచేసి ఈ ఎడ్రెస్ దగ్గరకు తెఛ్చి ఇవ్వగలరు, దయచేసి ఈ సహాయం చెయ్యండి " అని రాసి ఉంది . . . నాకు ఎందుకో ఆ ఎడ్రెస్ ఉన్న చోటుకు వెళ్ళాలి అనిపించింది . అడ్రెస్ గుర్తుపెట్టుకున్నాను . . అది ఆ వీధి చివరన ఉన్న ఒక పూరి పాక . దగ్గరకు వెళ్లి పిలిస్తే పాక లో నుండి ఒక వృధ్ధురాలు వచ్చింది . ఆమె కు కళ్ళు సరిగా కనబడటం లేదు .ఆ పాకలో ఆమె ఒక్కర్తే ఉంటోంది అని అర్ధం అయ్యింది . చేతి కర్ర సహాయం తో తడుము కుంటూ బయటకు వచ్చింది  . . "ఏమీ లేదమ్మా ! నువ్వు పోగొట్టుకున్న 50 రూపాయల నోటు నాకు కనబడింది . అది ఇఛ్చి పోదామని వచ్చాను " అన్నాను  . . . ఆమె ఏడుస్తోంది .  . "బాబూ ! ఇప్పటికి ఇలా దాదాపు 50-60 మంది వఛ్చి ఒక్కొక్కరూ ఒక 50 రూపాయలు ఇస

చందమామ రావో జాబిల్లి రావో - అన్నమయ్య కీర్తన!

Image
- చందమామ రావో జాబిల్లి రావో - అన్నమయ్య కీర్తన! - చందమామని చిన్న పిల్లలకి చూపించి చందమామ రావే జాబిల్లి రావే అని తల్లి పాడి లాలించడం అనాదిగా మన సంప్రదాయంలో ఉంది. ఈ చందమామ పాట ఏనాడో అన్నమయ్య మనకోసం రచించి పెట్టాడు. కాలక్రమేణా ఈ చందమామ పాట సాహిత్యంలో కొన్ని మార్పులు వచ్చాయి కానీ మాత్రుక మాత్రం అన్నమయ్య పాటే. . చందమామ రావో జాబిల్లి రావో మంచి కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో . నగుమోము చక్కని యయ్యకు నలువ బుట్టించిన తండ్రికి నిగమము లందుండే యప్పకు మా నీల వర్ణునికి జగమెల్ల నేలిన స్వామికి ఇందిర మగనికి ముగురికి మొదలైన ఘనునికి మా ముద్దుల మురారి బాలునికి . తెలిదమ్మి కన్నుల మేటికి మంచి తియ్యని మాటల గుమ్మకు కలికి చేతల కోడెకు మా కతల కారి ఈ బిడ్డకు కుల ముద్ధించిన పట్టెకు మంచి గుణములు కలిగిన కోడెకు నిలువెల్ల నిండు వొయ్యారికి నవ నిధుల చూపుల జూసే సుగుణునకు . సురల గాచిన దేవరకు చుంచు గరుడుని నెక్కిన గబ్బికి నెరవాది బుద్ధుల పెద్దకు మా నీటు చేతల పట్టికి విరుల వింటి వాని యయ్యకు వేవేలు రూపుల స్వామికి సిరిమించు నెరవాది జాణకు మా శ్రీ వేంకటేశ

హాస్యమేవ జయతే!

Image
- హాస్యమేవ జయతే! - అనగనగా ఒక అడవి. దానిలో ఒక చిరుత, ఒక గాడిద చాలాకాలం వాదించుకున్నాయి చిరుత అంటుంది - ఆకాశం నీలంగా ఉంటుందీ దానికి గాడిద - కాదు ఆకాశం నల్లగా ఉంటుందని - వితండ వాదం చేస్తుంది. ఇద్దరూ విషయంతేలక మృగరాజు సింహంగారి దర్బారుకు వెడతారు ఇద్దరి వాదనలు విన్నతరువాత సింహం తీర్పు ఇస్తుంది.. - చిరుతను కారాగారంలో వేయండి. గాడిదను సగౌరవంగా పంపండి. చిరుత లబలబ లాడుతూ చెబుతుంది - మృగరాజా నేను సత్యమే చెబుతున్నానని నాకు తెలుసు.సింహం= నిన్ను శిక్షిస్తున్న అందుకు కాదు. గాడిద సంగతి తెలియదానీకు. బుద్ధిలేక దానితో వాదించి నందుకు నీకు ఈ శిక్ష.  ఉదాహరణకు మోదీ ఎప్పుడైనా కేజ్రివాల్ తొ వాదనకు దిగారా?

గిరీశం గడుసు భాష!

Image
- - గిరీశం గడుసు భాష! - గిరీశం రాకతో మొదలై.. గిరీశం పోకతో ముగిసే నాటకం కన్యాశుల్కం. ఆ నాటకంలోని దాదాపు అన్ని ముఖ్యపాత్రలతోనూ గిరీశం 'ఇంటర్ యాక్ట్' అయాడు. ఆయా సందర్భాల్లో గిరీశం వాడిన భాష.. అందులోని వైవిధ్యం గురించి కొంత చర్చిస్తే గురజాడవారికి 'పాత్రోచితమైన భాష' మీదున్న సాధికారికతను గూర్చి ప్రాథమిక స్థాయి అవగాహన ఏర్పడొచ్చు. - గిరీశం పుట్టుకతో వైదీకి బ్రాహ్మణుడు. పట్నవాసం అతగాడి బాడీ లాంగ్వేజీ.. భాషల్లో మార్పు తెచ్చింది. భాషావిషయికంగా చూస్తే గిరీశం నోట ఇంగ్లీషు పలుకుబళ్లు ధారాళంగా దొర్లుతుంటాయి. అంత్యప్రాసాదులతో ఆంగ్లపద్యాలను ఆశువుగా దంచేస్తుంటాడు. ఏకాంతంలో ఉన్నప్పుడు స్వగతంలో చెప్పుకొనే భాష పాత్ర నిజ నైజాన్ని పట్టిస్తుందని మనస్తత్వవేత్తల భావన. నాటకం ప్రథమాంకం ప్రథమ సన్నివేశంలోనే గిరీశం తత్వాన్ని పరిచయం చేస్తారు గురజాడ. 'పూర్రిచ్చర్డు చెప్పినట్లు పేషెన్సు వుంటేగాని లోకంలో నెగ్గలేం. యీలా డబ్బు లాగేస్తే ఇదివరకు ఎన్ని పర్యాయములు ఊరుకుంది కాదు(పూటకూళ్లమ్మ). వెంకుపంతులుగారి కోడలుకి లవ్ లెటర్ రాసినందుకు ఎప్పుడో ఒహప్పుడు సమయం కనిపెట్టి మనకు దేహశుద్ధి చే

మోహముద్గరః -భజ గోవిందం.! ( ఆది శంకరాచార్య) - శ్లోకం - 9

Image
మోహముద్గరః -భజ గోవిందం.!-( ఆది శంకరాచార్య) - శ్లోకం - 9 - సత్సంగత్వే నిః సఙ్గత్వం  నిఃసఙ్గత్వే నిర్మోహత్వం| నిర్మోహత్వే నిశ్చలతత్త్వం నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః|| - శ్లోకం అర్ధం : జ్ఞానులైన సజ్జనులు సాంగత్యము వలన సంసార బంధములు విడిపోవును.  బంధములు విడిపోయిన అజ్ఞానమూలకమైన మోహము పోవును. మోహము నశించినచో నిశ్చలమగు పరిశుద్ధ తత్వము గోచరమగును. అది తెలిసినపుడు జీవన్ముక్తి కలుగును. తాత్పర్యము : సజ్జన సాంగత్యము వలన నీకు ప్రాపంచిక విషయముల గురించి నిజము తెలియును. దాని వలన వానిపై వ్యామోహము నశించును.  దాని ఫలితముగా నీకు అజ్ఞానము అంతరించును. అజ్ఞానము అంతరించిన హృదయములో ఏకాగ్రత కలిగి, భగవంతునిపై మనసు నిలుచును. దాని ఫలితముగ నీకు ముక్తి చేకూరును.  కావున సత్ సంగములకు వెళ్ళుట, సత్ పురుషులను  కలయుట చాలా ముఖ్యము. సువాసన గల వనములో నడచిన, ఆ సువాసన నీకు లభించినట్లే, సాధు సాంగత్యము వలన మంచి చేకూరును.  గురువులు, పెద్దలు, ప్రజ్ఞావంతులను గౌరవించుచూ, వారి సేవ చేయుచూ, వారి సాంగత్యములో మంచిని తెలుసుకొని, మాయను వీడి, భగవన్ ముఖముగా మనసు మళ్ళించి విముక్తి బడయుము.

సౌందర్య లహరి! (శ్రీ శంకర భగవత్పాద విరచితము) . శ్లోకము (31)

Image
శుభం  - సౌందర్య లహరి! (శ్రీ శంకర భగవత్పాద విరచితము) . శ్లోకము (31) - చతుష్షష్ట్యా తన్త్రైస్సకల మతిసన్ధాయ భువనం స్థితస్తత్తత్సిద్ధి ప్రసవ పరతన్త్రైః పసుపతిః,  పునస్త్వన్నిర్బన్ధా దఖిలపురుషార్థైకఘటనా స్వతన్త్రం తే తన్త్రం క్షితితల మవాతీతరదిదమ్ !! - అమ్మా ! భగవతీ ! పశుపతి అరవైనాలుగు విధాలైన మహామాయా శంబరాది తంత్రాలను ఈ భూమండలం లో ప్రవేశ పెట్టాడు. సకల సిద్ధి ప్రదాయకము, ఐహిక  ఫల ప్రదాయికాలు ఐన యీతంత్రాల ద్వారా సకల ప్రపంచాన్నిమోహింపజేసి మిన్న కున్నాడు.  మళ్ళా నీ నిర్బంధంతో ధర్మార్థ కామ మోక్షా లనే పురుషార్థాలను ప్రసాదించేదైన నీ తంత్రాన్ని , శ్రీ విద్యా తంత్రాన్ని ఈ లోకాని కొసగాడు. - ఓం స్వధాయైనమః ఓం ప్రత్యంగిరాంబికాయైనమః ఓం ఆర్యాయైనమః -

ఇది...ఓ...కొడుకు...కథ*..!

Image
-ఇది...ఓ...కొడుకు...కథ*..! మనం అందరం బాగా ఎదిగిపోయాం...! మన ఫ్రెండ్ మనకి కాల్ చేసి బయటకు రమ్మంటే మనం అనే మాట.... "రేయ్..మామ..మా..బాబు (నాన్న) ఉన్నాడ్రా ఇంట్లో.. బయటకు వచ్చానో మా బాబు సావగోట్టేస్తాడు...రా.. నాన్న ని నాన్న అని పిలవలేకపోతున్నాం.. ఒక్కొకరు ఒక్కో పేరు పెడుతున్నారు తండ్రికి. “నాన్న” అనే ఈ రెండు అక్షరాల పదం విలువ ఇప్పుడు మనకి తెలియదు. నాన్న చనిపోయాక తనని స్మశానానికి తీసుకెళ్ళే దార్లో... ఒక చోట నాన్న బాడీ ని నేలపై ఉంచి కొడుకుని తండ్రి చెవులో నాన్న..నాన్న..నాన్న అని మూడు సార్లు పిలవమంటారు. కొడుకు రెండు సార్లు బాగానే పిలుస్తాడు.. మూడోసారి మాట రాదు. గుండెలో బాధ,గొంతులో తెలియని నొప్పి, కళ్ళల్లో నీళ్ళు. ఎందుకంటే...ఆ కొడుకు తండ్రితో నాన్న అని పిలిచేది అదే ఆఖరిసారి. ఇంకెప్పుడు వాడు నాన్నతో నాన్న అని అనలేడు.. ఆ పిలుపు తనకి Just Half Second మాత్రమే పట్టిింది...కానీ... ఆ Half Second లో వాడికి మొత్తం కళ్ళముందు కనిపించేది..మాత్రం... “మనం స్కూల్ లో Fan కింద కూర్చుని చదువుకోడం కోసం నాన్న ఎండలో నిలబడి కష్టపడి చేసిన పని కనిపిస్తుంది. మనకి కొద్దిగ

వాస్కో డి గామా. డి గామాచెయ్యడము !

Image
వాస్కో డి గామా. డి గామాచెయ్యడము ! - మేము చినప్పుడు... వాస్కో డి గామా. డి గామా. .. వాస్కో వాస్కో డి గామా. డి గామా. .. వాస్కో వాస్కో డి గామా. డి గామా. .. వాస్కో వాస్కో డి గామా. డి గామా. .. వాస్కో వాస్కో డి గామా. డి గామా. .. వాస్కో వాస్కో డి గామా. డి గామా. .. వాస్కో వాస్కో డి గామా. డి గామా. .. వాస్కో వాస్కో డి గామా. డి గామా. .. వాస్కో వాస్కో డి గామా. డి గామా. .. వాస్కో వాస్కో డి గామా. డి గామా. .. వాస్కో వాస్కో డి గామా. డి గామా. .. వాస్కో వాస్కో డి గామా. డి గామా. .. వాస్కో .... అంటూ గట్టిగాచదివేవాళ్ళం... దాంతోఅందరుఎంతబాగాచదువు కుంటున్నారు అనిపొగిడేవారు...  కాని మేము ఏమి చేస్తున్నామో కిటిలొంచి ఏమి చూస్తున్నామో  ఇంట్లో వాళ్ళు చూసేవాళ్ళుకారు.

శ్రీ సదాశివబ్రహ్మేంద్ర కీర్తనలలో అద్వైతా మృతం ఆత్మ బోధ!

Image
- -శ్రీ సదాశివబ్రహ్మేంద్ర కీర్తనలలో అద్వైతా మృతం  ఆత్మ బోధ! - స్థిరతా నహి నహి రే, మానస స్థిరతా నహి నహి రే॥ చరణము(లు): తాపత్రయ సాగర మగ్నానాం దర్పాహంకార విలగ్నానామ్‌॥ విషయపాశ వేష్టిత చిత్తానాం విపరీతజ్ఞాన విమత్తానామ్‌॥ పరమహంసయోగ విరుద్ధానాం బహు చంచలతర సుఖబద్ధానామ్‌॥. - భావం ——ఈ కీర్తన లో మనసుకు స్థిరత్వం అనేది లేదు  అని రూడ్డీ గా తెలియ జేశారు .-ఎవరికి లేదు ? అని విచారించారు . - ”మనసా !తాపత్ర్యాలలో మునిగిన వారికి , అహంకార దర్పాన్ని పట్టుకొని వ్రేలాడే వారికి , విషయ వాంచలు అనే తాళ్ళతో బద్ధులైన మనసు కల వారికి , చంచల మైన సుఖాల కోసం అర్రులు చాచే వారికి  ఎన్నడు మనశ్శాంతి లభించదు ”అని  నిర్ద్వందంగా చెప్పారు . - https://www.youtube.com/watch?v=LSc3uoZfNp8&feature=share

కళావిలాసినీ ! (కరుణశ్రీ కవిత )

Image
కళావిలాసినీ ! (కరుణశ్రీ కవిత ) . చూచెదవేలనో ప్రణయ సుందరి, కాటుక కళ్ళలోని యా . లోచనలేమిటో హరిణ లోచని నీ చిరునవ్వులోని సం . కోచములెందుకో కుసుమ కోమలి నీ మధురాధరమ్ములో . దాచుకొనంగ నేటికి సుధామయ సూక్తి కళావిలాసినీ! . -- . మనదాంపత్యము సత్యమౌ ప్రణయ సామ్రాజ్యమ్ములో లోతులన్ . గనియెన్ సాగెను భాగ్యనౌక కవితా కాళిందిలో నవ్య జీ . వన బృందావన దివ్యసీమ విహరింపన్ రమ్ము నే కొల్ల గొం . దును నీ కోమల బాహు బంధనములందున్ కోటి స్వర్గమ్ములన్ -- . భావోద్యానమునందు కొత్త వలపుం పందిళ్ళలో కోరికల్ . తీవెల్ సాగెను పూలు బూచెను రసాద్రీ భూత తేజమ్ముతో . నీవే నేనుగ నేనెనీవుగ లతాంగీ ఏకమై పోదమీ . ప్రావృణ్ణీ రద పంక్తి క్రింద పులకింపన్ పూర్వ పుణ్యావళుల్ -- (చిత్రం -వడ్డాది పాపయ్య గారు .)

మోహముద్గరః -భజ గోవిందం.! ( ఆది శంకరాచార్య) - -శ్లోకం - 8

Image
మోహముద్గరః -భజ గోవిందం.! ( ఆది శంకరాచార్య) - -శ్లోకం - 8 కా తే కాంతా కస్తే పుత్రః  సంసారో యమతీవ విచిత్రః| కస్య త్వం కః కుత ఆయాతః తత్త్వం చింతయ తదిహ భ్రాతః|| - శ్లోకం అర్ధం : ఓ సోదరా! నీ భార్య ఎవరు? ఎవడు నీ పుత్రుడు? వారికిని, నీకును గల సంబంధమేమి? నీవు ఎవరవు? ఎక్కడనుండి వచ్చితివి? ఈ సంసారమే అతి విచిత్రమైనది. ఈ తత్వమును బాగా ఆలోచించి తెలుసుకొనుము. - తాత్పర్యము : ఓయి సుమతీ! కొంత ఆలోచించుము.  ఆత్మ స్వరూపులమైన మనమందరమూ ఈ జన్మలో అమ్మ, నాన్న, భార్య, భర్త, పుత్రుడు, కూతురు, బంధువులు అన్న బంధములతో జీవించుచున్నాము.  నీవు పుట్టక ముందు నీ తల్లిదండ్రులతో ఏమి నీకు సంబంధము? అలాగే నీకు పుట్టిన బిడ్డలతో వారి జన్మకు ముందు నీకేమిటి సంబంధము? పెండ్లాడక ముందు నీ భార్య ఎవరు, నీవెవరు?  ఈ భవ బంధములేవి పుట్టుక మునుపు లేవు, మరణము తరువాత ఉండవు.  కనుక ఈ బంధములు శాశ్వతములు అని నమ్మి వ్యామోహములో పడి చింతనొందకుము. ఈ బ్రతుకు ఒక మాయా నాటకము, అందులో పాత్రలము మనము, నాటకము ఆడునంత వరకు మన పాత్రల బాంధవ్యములు వేరు.  అదే విధముగా ఈ జీవన్నాటకము కూడా. అది నిజమని భ్రమించకుము. ఆ భ్రమలో ఉన్నంత వర

శుభం -సౌందర్య లహరి! (శ్రీ శంకర భగవత్పాద విరచితము) . శ్లోకము (30)

Image
శుభం -సౌందర్య లహరి! (శ్రీ శంకర భగవత్పాద విరచితము) . శ్లోకము (30) - స్వదేహోద్భూతాభిర్ఘృణి భిరణిమాద్యాభి రభితో నిషేవే నిత్యే త్వా మహమితి సదాభావయతి యః, కిమాశ్చర్యం తస్య త్రిణయన సమృద్ధిం తృణయతో మహా సంవర్తాగ్ని ర్విరచయతి నీరాజనవిధిమ్ !! - ఓ ఆద్యంతాలు లేని మాతా ! భక్తుల చే సేవించబడే దానవైన తల్లీ ! నీ దేహం నుంచి జనించిన కాంతుల చేనైనా అణిమాది అష్టసిద్దులతో అంతటా ఆవరించ బడిన నిన్ను నేనని (నువ్వేనేనని) ఏసాధకుడు ధ్యానిస్తూ న్నాడో త్రినయనుడని పేరుగల సదాశివుడి నిండు ఐశ్వర్యాన్ని తృణీకరించే ఆ సాధకుడికి మహా ప్రళయ కాలంలో జ్వలించిన అగ్ని నీరాజనం గావించు తోంది. ( శ్రీ దేవితో తాదాత్మ్యం పొందిన సాధకుడు శ్రీ దేవియే. ఆమెకు ప్రళయాగ్ని నీరాజనం.) - ఓం సరస్వత్యైనమః ఓం విరజాయైనమః ఓం స్వాహాయైనమః -

పలుకే బంగారమాయెనా కోదండపాణి

Image
కీర్తి శేషులు మంగళపల్లి వారి మధుర స్వరం .! . పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి కలలో నీ నామస్మరణ మరవ చక్కనిసామి పలుకే బంగారమాయెనా కలలో నీ నామస్మరణ మరవ చక్కనిసామి పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే బంగారమాయెనా ఎంత వేడిన గాని సుంతైన దయ రాదు ఎంత వేడిన గాని సుంతైన దయ రాదు పంతము సేయ నే నెంతటి వాడను తండ్రి పలుకే బంగారమాయెనా పంతము సేయ నే నెంతటి వాడను తండ్రి పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే బంగారమాయెనా శరణాగతత్రాణ బిరుదాంకితుడవు గాద శరణాగతత్రాణ బిరుదాంకితుడవు గాద కరుణించు భద్రాచల వర రామదాస పోష పలుకే బంగారమాయెనా కరుణించు భద్రాచల వర రామదాస పోష పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి కలలో నీ నామస్మరణ మరవ చక్కనిసామి పలుకే బంగారమాయెనా కలలో నీ నామస్మరణ మరవ చక్కనిసామి పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే బంగారమాయెనా! https://www.youtube.com/watch?v=QlrikrgOA0E

యోగి సదా శివ బ్రహ్మేంద్ర సరస్వతి !

Image
- యోగి సదా శివ బ్రహ్మేంద్ర సరస్వతి ! - సదా శివ బ్రహ్మేంద్ర సరస్వతి అంటే  మనకు గుర్తు వచ్చేది ఈ కీర్తన. మానస సంచర రే బ్రహ్మణి-మానస సంచర రే॥ జీవిత విశేషాలు మోక్ష సోమసుందర అవధాని, పార్వతి అనే తెలుగు దంపతులకు సదాశివ జన్మించారు. ఆయన తొలి పేరు శివరామకృష్ణ. 17 ఏటనే వివాహమైంది. 17 - 18 శతాబ్దాల మధ్య తమిళనాడులోని కుంభకోణంలో జీవించారు. మరో ఇద్దరు ప్రముఖ హిందు ఆధ్యాత్మిక వేత్తలు శ్రీధర వేంకటేశ అయ్యాళ్, శ్రీ బోధేంద్ర సరస్వతి వేదపాఠశాలలో సదాశివకు సహచరులు. సత్యాన్వేషణకై ఇంటిని వదిలి వేశారు. సన్యాసం స్వీకరించిన తరువాత దిగంబరంగా, అర్ధనగ్నంగా పరధ్యాన స్థితిలో తిరిగేవాడు. విపరీత వైరాగ్యంతో సమాధి స్థితిలో ఉండేవాడుపరమహంస యోగనంద "ఒక యోగి ఆత్మకథ" లో ఆయన జీవ సమాధి ఉదంతాన్ని సంగ్రహంగా ప్రస్తావించడం జరిగింది. ఆయన ఆత్మ విద్యా విలాసం వేరిట ఒక అద్వైత గ్రంథాన్ని కూడా రచించారు.ఆయన జీవించి ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలను చేసాడని ప్రతీతి. వాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని మాత్రమే ఈ కింద ఉదహరించడం జరింగింది. ఒకసారి కావేరి నది ఒడ్డున ఉన్న మహధనపురంలో కొంత మంది పిల్లలు అక్కడికి వంద మైళ్ల దూరం

"అఖిలాండేశ్వరి, చాముండేశ్వరి" ! (భక్తికి సంస్కృతానికి సంబంధం-వేటూరి.)

Image
- - "అఖిలాండేశ్వరి, చాముండేశ్వరి" ! (భక్తికి సంస్కృతానికి సంబంధం-వేటూరి.) . సప్తపది చిత్రంలో "అఖిలాండేశ్వరి, చాముండేశ్వరి" అనే పాట. అందులో మూడు చరణాలలో ముగురమ్మలను వర్ణిస్తూ వేటూరి వ్రాసారు. ఇది కూచిపూడి సంప్రదాయంలో వచ్చిన పాట. ఇది చిత్రంలో వినియోగించడం జరిగింది . "కొన్ని శబ్దాలు చూస్తుంటే వేటూరి మాత్రమె చెయ్యగలరు అనిపిస్తోంది. ఉదాహరణకు శర్వార్ధగాత్రి, సర్వార్థ సంధాత్రి -- ఈ అందం, పైగా శిల్పరచన అంతా చూస్తుంటే వేటూరి గారిదే అనిపిస్తోంది.  అలాగే మొదటి చరణంలో పార్వతి, రెండవ చరణంలో మహాలక్ష్మి, మూడవ చరణంలో సరస్వతి గురించి చెప్పి నాలుగవ చరణంలో సమన్వయం చేస్తూ తీసుకురావడంలో ముగురమ్మల మూలపుటమ్మ స్వరూపాన్ని ఆవిష్కరిస్తూ చేసిన అద్భుతమైన రచన . ఇది వేటూరి శైలే. వేటూరి పండిత-పామర జనరంజకంగా పాటలు వ్రాస్తారు అని అందరికీ తెలిసిన విషయానికి మరొక రుజువు.  . శర్వార్ధగాత్రి అంటే శర్వుడి (శివుడి) శరీరంలో సగభాగం అని,  సర్వార్థ సంధాత్రి అంటే అన్ని పనులనూ నేరవేర్చే శక్తి అని. పార్వతీ దేవికి ఇది ఎంత అందమైన వర్ణన? సరస్వతీ దేవిని వర్ణిస్తూ సరససాహిత్య