Posts

Showing posts from May, 2017

జానపద సాహిత్యంలో సీత !

Image
జానపద సాహిత్యంలో సీత ! (రచన: ఆచార్య పి. జ్యోతి ఈ మాట .జనవరి 2007» వ్యాసాలు). భూదేవి సీతమ్మను అత్తవారింటికి పంపుతూ బంగారు గిన్నెలో పాలు నెయ్యి పోసి సీతమ్మ చేయిముంచి వరుసగా రామునికి కౌసల్య, సుమిత్ర, కైకమ్మలకు శాంతమ్మకు అప్పగింతలు చేసింది. కౌసల్యతో వదినరో నాపుత్రి ఇదివప్పగింత పదిలంబుగా దీని బాగా చూడమ్మ పాలు కాచగ లేదు బాల మా వదినరో నెయ్యి కాచగ నేరదు నెలత సుమి మదినా నేర్పుగా చెప్పు సీత మీదమ్మా అని చెప్పింది. లోకంలో తమ కూతుళ్ళ స్వభావం ఎటువంటిదైనా తళ్ళులు వాళ్ళను వెనుకేసుకు రావడం కనిపిస్తుంది. కానీ భూదేవి అట్లాంటి తల్లికాదు. కనుకనే బుద్ధులెరుగదు మంకు బుద్ధులే గాని బుద్ధి వచ్చిన దాక దిద్దుకో వదినా అని చెప్పి “దాని పంపి నేను తాళలేనని” బాధపడింది. ఇంకా సీతమ్మతో పొద్దోయి పొరుగిళ్ళ బోకమ్మ సందలడి చాకింటి కెళ్ళబోకమ్మ వీధిలో తలకురులు విప్పబోకమ్మ పదుగురిలో పన్నెత్తి నవ్వబోకమ్మ మందిలో కన్నెత్తి చూడబోకమ్మ అని ఎన్నో సాంఘిక కట్టుబాట్లను చెప్పింది. అటువంటి కట్టుబాట్లు ఏ రకంగానైనా, ఏ సాహిత్యంలోనైనా పురుషునికి చెప్పినట్లు కనిపించదు. ఇటువంటిదే అప్పగింతలకు సంబంధించిన పాట

మృదుపదాల మేస్త్రి దేవులపల్లి కృష్ణశాస్త్రి!

Image
మృదుపదాల మేస్త్రి దేవులపల్లి కృష్ణశాస్త్రి! . పాటల లోకంలో విరిసిన పారిజాతం దేవులపల్లి.  ఆయన 1897లో రామచంద్రపాలెంలో జన్మించినప్పట్నించీ-  . -''ఆకులో ఆకునై, పూవులో పూవునై,  కొమ్మలో కొమ్మనై, నునులేత రెమ్మనై''-  మాటల ముత్యాలతో తెలుగు వాగ్గేయకారుల్ని మించిన అందాల్ని తెలుగు పాటలకు అందించారు.  . ఆయన బ్రహ్మ సమాజవాది.  కనిపించే ప్రతి రాయికీ, ప్రతి రప్పకీ,  బొమ్మకీ, శిలకీ మొక్కవద్దని చాలా స్పష్టంగానే అన్నారు.  . ''ప్రతి కోవెలకూ పరుగిడకు  ప్రతి బొమ్మకు కైమోడ్చకు...''  . ఆయన ''ప్రభు! ప్రభు! ప్రభు! దీనబంధు, ప్రాణేశ్వర దయాసింధు...'' అంటూ ఈశ్వరుడిని ఎలా వేడుకొన్నారో హైదరాబాదులో ఉన్న తరుణంలో సాయంత్రం వేళ నమాజు విని అల్లాను అలాగే వేడుకొన్నారు.  . ఖుదా! నీదే అదే పిలుపు  ఖుదా! నీదే సదా గెలుపు  . కృష్ణశాస్త్రి ఏ విషయంమీద పాట రాసినా ప్రతి మాట లయాత్మకంగా అందులో ఒదిగి పోతుంది.  . ''ముందు తెలిసెనా, ప్రభు ఈ  మందిర మిటులుంచేనా...''  . ఆయనొస్తాడని ముందు తెలిస్తే భక్తుడు అన్నీ సిద్ధం చేసి

"కన్యాశుల్కం బీభత్స రస ప్రధానమైన విషాదాంత నాటకం" - శ్రీ శ్రీ!

Image
"కన్యాశుల్కం బీభత్స రస ప్రధానమైన విషాదాంత నాటకం" - శ్రీ శ్రీ! . తెలుగు భాష లో ప్రధమ శ్రేణిని నిలిచే పది పుస్తకాలలో 'కన్యాశుల్కా'నికి ప్రధమస్థానం ఇస్తాను. ప్రపంచపు నూరు గొప్ప పుస్తకాలలో 'కన్యాశుల్కం' ఒకటి. కన్యాశుల్కం నాటకానికి సాటి రాగల రచన భారతీయ సాహితంలో మృచ్చకటికం తప్ప మరోటి లేదు" - శ్రీశ్రీ

పోతనగారి రుక్మిణి!!

Image
పోతనగారి రుక్మిణి!! . అంకిలి సెప్ప లేదు, చతురంగ బలంబుల తోడ నెల్లి యో పంకజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్ జయించి, నా వంకకు వచ్చి, రాక్షసవివాహమునన్ భవదీయ శౌర్యమే యుంకువ సేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొనిపొమ్ము! వచ్చెదన్. (Satyanarayana Piska గారి వివరణ.) ఈ పద్యములో శ్రీకృష్ణుడు తనను చేపట్టవలసిన విధానాన్ని రుక్మిణి విన్నవిస్తున్నది. పంకజనాభుడవూ, పురుషశ్రేష్ఠుడవూ అయిన ఓ కృష్ణా! నీవు అడ్డు చెప్పేందుకు కారణమేమీ లేదు. రథ, గజ, తురగ, పదాతి చతురంగబలములతో నీవు విచ్చేసి, శిశుపాల జరాసంధులను జయించి, నా వద్దకు వచ్చి, క్షత్రియోచితమైన రాక్షసవివాహ పద్ధతిలో నన్ను పరిగ్రహించి తీసికొని వెళ్ళు. నేను నీ వెంట వస్తాను. ఇదీ ఈ పద్య భావము. (మగధ చక్రవర్తియైన జరాసంధుడు తన కూతుళ్ళు ఇద్దరిని కంసునికి ఇచ్చి వివాహం చేశాడు. తన అల్లుడు కంసుని హతమార్చిన శ్రీకృష్ణునిపై పగతో ఉన్నాడు. ఇతడు శిశుపాలునికి, రుక్మి కి మిత్రుడు.) విష్ణుమూర్తి పద్మనాభుడు. ఈ విశ్వాన్ని సృజించిన సృష్టికర్తయైన బ్రహ్మదేవుని యొక్క జన్మస్థానము విష్ణుమూర్తి బొడ్డులో నుండి మొలిచిన కమలము. నాభి నుండి ఆరంభమైన ఆలోచన, సంకల్పము స్థిరమైనవి, అమోఘమ

దేవదాసు!

Image
దేవదాసు! . ఎంత దూరం నాయనా?”  ఈ డైలాగ్ వినగానే గుండె లోతుల్లోంచి దుఃఖం ఫెటిల్లున పగిలిన శబ్దం కంటి చివరి నుంచి వరదై చెంప మీదకు జారక పోతే అది దేవదాసు సినిమానే కాదు, వాడు నాగ్గాడే కాదు.  తన మరణం తనకు సమీపంలో దర్శనమిస్తున్న ఆ చివరి క్షణాల్లో దేవదా పార్వతిని ఒక్క సారి, ఒకే ఒక్క సారి చూడాలని తపించే క్షణాలు దేవదాసు తో మమేకమై పార్వతి కోసం ఏడవని ప్రేక్షకుడెవరు తెలుగు నాట? ఒక మహా దృశ్య కావ్యం అంటే ఇదేనా?  ఎప్పటికీ చెరిగి పోని ముద్రను గాఢంగా మనో ఫలకంపై చిత్రించేదేనా?

భార్యలను "ఒసే" అని పిలవడం .!

Image
భార్యలను "ఒసే" అని పిలవడం .! (శ్రీ తుర్లపాటి కుటుంబరావుఆత్మకథవిషయపేజీలు నుండి.) . నా వివాహమైన తరువాత కూడా నా భార్యను "ఏమండీ!" అని సంబోధించే వాడిని! ఎందువల్ల నంటే, ఆమె నాకు పెళ్లికి పూర్వమే పరిచయం అయింది. అప్పుడు సహజంగా ఆమెను మీరు, ఏమండీ! అని సంబోధించేవాడిని. ఔను! పెళ్లికి పూర్వం ఏమండీ! అని పిలిచిన వ్యక్తిని పెళ్లి కాగానే "ఒసేయ్! ఏమేవ్‌!" అని పిలవాలా? ఏమి! పెళ్లి కాగానే స్థాయి, విలువ, గౌరవం పెరగాలి కాని, తగ్గిపోవాలా? అది పురుషాధిక్యతా మనస్తత్వం కాదా? అంతకాలం "ఏమండీ!" అని పిలిచి, మూడు ముళ్లుపడగానే భార్యకు బానిసత్వం, భర్తకు "బాస్‌ తత్వం" రావాలా? ఈ ఆలోచనే ఆమెను "ఏమండీ!" అని పిలిపించింది!

ఉత్తరకుమారుడు!

Image
ఉత్తరకుమారుడు! . "భీష్మద్రోణ కృపాది ధన్వినికరా భీలంబు దుర్యోధన గ్రీష్మాదిత్య పటుప్రతాప విసరాకీర్ణంబు శస్ర్తాస్త్ర జా  లోష్మస్ఫార చతుర్విధోజ్వల బలత్యుగ్రం బుదగ్రధ్వజా  ర్చిష్మత్వాకలితంబుసైన్యమిదియే జేరంగ శక్తుండనే . . ఈ పద్యం విరాటపర్వం,చతుర్ధాశ్వాసంలో ఉత్తరకుమారుడు కురుసైన్యాన్నిచూసి భయ భ్రాంతుడైన సందర్భంలోది. . గుక్కతిప్పకుండా చక్కటి ఉచ్చారణతో ఈ పద్యం చదివితే , పద్యం తాలూకు వాచ్యార్ధం పూర్తిగా తెలియకముందే , ఈ పద్యానికి మూలభావం మనకు స్ఫురిస్తుంది. ఆ మూలభావం గొప్ప అబ్బురంతో , అడ్మిరేషన్ తో కూడిన భయం. . “శస్త్రాస్త జా లోష్మస్ఫార చతుర్విధోజ్వల బలత్యుగ్రం బుదగ్రధ్వజార్చిష్మత్వాకలితంబు” అనేసరికి , . ఆ మేఘగర్జనలాంటి సమాసపు ప్రౌఢ గంభీర శబ్ద సౌందర్యానికి అబ్బురపడతాం.అంటే వాచ్యార్ధం స్ఫురించే లోపే మూలభావన-రూట్ ఫీలింగ్ మన అనుభూతిలోకి వస్తుంది. ఇది ఆ పద్యం/కవి గొప్పదనం . అంతేకాక యుద్ధభూమి పై వ్రాసిన పద్యం ”శార్దూలం”లో వ్రాయటం లో కూడా చక్కటి ఔచితి వుంది. . నా చిన్నప్పుడు మాకు తెలుగు ఎంతబాగా వచ్చో పరీక్ష చేయటానికి మా నాన్నగారు ఈ పద్యపాదాలు డిక్టేట్ చ

యాక్సిడెంట్ !

Image
" మిస్టర్ మూర్తి! ఈ ఇంటర్వ్యూ లో మీకిది ఆఖరు ప్రశ్న, గతంలో మీరు రైల్లో ప్రయాణిస్తుండగా యాక్సిడెంట్ ఏదైనా జరిగిందా?" " ఎస్ సార్! జరిగింది. ఒక సారి అరకు రూట్‌లో సొరంగం వచ్చినప్పుడు నా ముందున్న అమ్మాయికి బదులుగా పొరబాటున వాళ్ల నాన్నగారికిచ్చాను" "ఏమిటిచ్చారు? " "ప్రేమ లేఖ" "తరువాత ఏమైందీ" " అయిదు నిమిషాలు తరువాత చెంప చెళ్ళుమంది, శివలింగపురం ప్లాట్ ఫారమ్ పై పడ్డాను

మిమ్మల్నెక్కడో చూసినట్టుంది!

Image
మిమ్మల్నెక్కడో చూసినట్టుంది! . సార్...! మిమ్మల్నెక్కడో చూసినట్టుంది అసలు మీది ఏ ఊరు...? "పల్లంకుర్రు..." "నిజమా! అరె మాదీ పల్లంకుర్రే.." "మీది ఏ వీధి...?" "బ్యాంకు వీధి" "అలాగా...! మాదీ బ్యాంకు వీధే..." "మీ ఇల్లెక్కడ...?" "బ్యాంకుకి ప్రక్కన. మరి మీ ఇల్లు..." "అరె...! మాదీ బ్యాంకు పక్కనే ఉన్న డాబాలో పై అంతస్తు..." "అరె...మాదీ అంతే...! పై అంతస్తే" ఈ సంభాషణ విన్న మూడోవ్యక్తి చిరాగ్గా "అదేమిటయ్యా! మీ ఇద్దరివీ ఒకే ఊరు, ఒకే వీధి, ఒకే ఇల్లు అంటున్నారు. ఎప్పుడూ ఒకర్నొకరు చూసుకోలేదా?" అన్నాడు. "భలేవారే! ఎందుకు చూసుకోమూ...? మేమిద్దరం అన్నదమ్ములం. ఎంతసేపటికీ బస్సురావట్లేదని టైంపాస్ కోసం ఇలా మాట్లాడుకుంటున్నాం అంతే...!" అంటూ అసలు విషయం చెప్పారు ఆ ఇద్దరిలో ఒకరు.

పొలిపదం! (వడ్డాది వారి చిత్రం.)

Image
పొలిపదం! (వడ్డాది వారి చిత్రం.) . ఒలియో ఒలియా ఒలియా వేలుగలవాడా రారా పొలిగాడా . ఊరికి ఉత్తరాన ఊడల మఱ్ఱి ఊడలామఱ్ఱిక్రింద ఉత్తముడిచేతికె ఉత్తముడి చెబికెలో రత్నాలపందిరి రత్నాల పందిట్లో ముత్యాలకొలిమి గిద్దెడు ముత్యాల గిలకలా కొలిమి అరసోలముత్యాల అమరినా కొలిమి సోలెడుముత్యాల చోద్యాల కొలిమి తవ్వెడు ముత్యాల తరచినా కొలిమి మానెడు ముత్యాల మలచినా కొలిమి అడ్డెడు ముత్యాల అలచినా కొలిమి తూముడు ముత్యాల తూగెనే కొలిమి చద్ది అన్నముతినీ సాగించు కొలిమి ఉడుకు అన్నముతిని ఊదెనే కొలిమి పాల అన్నముతిని పట్టెనే కొలిమి ఊదేటి తిత్తులు ఉరుములామోలు వేసేటి సంపెట్లు పిడుగులామోలు లేచేటి రవ్వలు మెరుపులామోలు చుట్టున కాపులు చుక్కలామోలు నడుమకమ్మరిబిడ్డ చంద్రుణ్ణి బోలు ...

అరుణాస్పదపుర వర్ణనము!

Image
అరుణాస్పదపుర వర్ణనము! (మను చరిత్రము ప్రథమాశ్వాసము. అల్లసాని పెద్దనామాత్యుడు) మ.  వరణాద్వీపవతీ తటాంచలమున\న్‌ వప్రస్థలీ చుంబితాం బరమై, సౌధసుధాప్రభా ధవళిత ప్రాలేయరుఙ్మండలీ హరిణంబై, యరుణాస్పదం బనఁగ నార్యావర్తదేశంబున\న్‌ బుర మొప్ప\న్‌, మహికంఠహార తరళస్ఫూర్తి\న్‌ విడంబింపుచు\న్‌. 49 సీ.  అచటి విప్రులు మెచ్చ రఖిలవిద్యాప్రౌఢి, ముది మది దప్పిన మొదటివేల్పు నచటి రాజులు బంటు నంపి భార్గవు నైన, బింకానఁ బిలిపింతు రంకమునకు నచటి మేటి కిరాటు లలకాధిపతి నైన, మును సంచిమొద లిచ్చి మనుప దక్షు లచటి నాలవజాతి హలముఖాత్తవిభూతి, నాదిభిక్షువు భైక్షమైన మాన్చు  తే. నచటి వెలయాండ్రు రంభాదులైన నొరయఁ గాసెకొంగున వారించి కడపఁగలరు నాట్యరేఖాకళాధురంధరనిరూఢి నచటఁ బుట్టిన చిగురుఁ గొమ్మైనఁ జేవ.

లావొక్కింతయు లేదు !

Image
లావొక్కింతయు లేదు ! . విడ్డూరం కాకపోతే లావు ఒకింత ఎక్కడైనా ఉంటుందా? . ఉంటే లావు, లేకపోతే సన్నం అంతే కానీ . ఒకింత’ లావు చూడాలంటే నడుము దగ్గర తడుముకోండి . ఒకింత కూడ లేకపోవడం ఉంటుంది – జీరోసైజని  (పోతన గారి పద్యం ...వడ్డాది వారి చిత్రం.)

పోతనామాత్యుని ..భాగవత పద్యాము.!

Image
పోతనామాత్యుని ..భాగవత పద్యాము.! . "నంద తపఃఫలంబు ,సుగుణంబుల పుంజము , గోపకామినీ బృందము నోముపంట ; సిరి విందు ; దయాంబుధి ; యోగి బృందముల్ డెందములందు గోరెదు కడింది నిధానము సేర వచ్చె నో సుందరులార రండు చని చూతము కన్నుల కోర్కి దీరగన్" . రోహిణీ నక్షత్రం . గోపాలకృష్ణుని పుట్టిన దినం . కమ్మని కస్తూరి తావులు పుడమి అంతా అల్లుకున్నాయి . మనసు ఆనంద పరవశమయింది . తటాలున మా అమ్మ జ్ఞాపకం వచ్చింది . చిన్నప్పుడు గోరుముద్దలు పెడుతూ నేర్పించిన పద్యం జ్ఞప్తికి వచ్చింది . శ్రీకృష్ణుడు మధురానగరానికి వస్తున్నాడు . సరస సంగీత శృగార చక్రవర్తి , సకల భువనైక చారుమూర్తి తమ నగరానికి వస్తున్నాడని తెలిసిన మధురానగర మనోహారిణుల మనసులు ఆనంద పరిప్లుతాలయినాయి .పరమాత్మ దర్శనమిస్తే హృదయం ఝల్లుమనదా ! శ్రీయుతమూర్తియై కరుణ చిందే చూపులతో శ్రీకృష్ణ పరమాత్మ మధురానగరంలో ప్రవేశించాడు . శ్యామలాంగుడు అల్లనల్లన అడుగులిడుతూ కనిపించాడు , ఆ పట్టణంలో నివసించే రమణులకు . స్వామిని చూచిన ఆ భామినులు ముగ్ధులైపోయారు . తమ స్నేహితులను స్వామిని చూడమని అహ్వానిస్తున్నారు : . “నందుడు చేసిన తపస్సుకు ఫలితంగా లభించిన మాధవుడితడ

సౌందర్య దర్శనమ్ ! .

Image
సౌందర్య దర్శనమ్ ! . కాళిదాస మహాకవి కావ్య త్రయాన్ని నాటక త్రయాన్ని రచియించి కవితాప్రియుల కానంద సంధాయకుఁ డైనాడు. ముఖ్యంగా నాటక త్రయంలో అతడు దర్శించిన, దర్శింపఁ జేసిన నాయికా సౌందర్యం నాన్యతో దర్శనీయమైనది. మాళవికాగ్నిమిత్రమ్ విక్రమోర్వశీయమ్ , అభిజ్ఙాన శాకుంతలము లుగా  చెప్పబడే ఆనాటక త్రయంలో ఒక్కొక నాటకంలో ఒక్కొక విధమైన నాయికలను యెంచుకున్నాడు.  మాళవిక కేవలం అదివ్య. మానవకాంత.  విక్రముడు పురూరవుడు వలచిన ఊర్వసి దివ్య . శకుంతల  వీరి సౌందర్యములను వర్ణించు పట్టుల వినూత్నమైన వివిధ పధ్ధతుల ననుసరించినాడు. ముందుగా దివ్యా దివ్య సౌందర్య విభ్రాజిత యగు శకుంతలా సౌందర్యాన్ని వర్ణించిన తీరుతెన్నులను బరిశీలింతము. దుష్యంతుడు వేటకై వచ్చి యలసి కణ్వాశ్రమమునకు అరుదెంచెను. అట బాలపాదపములకు నీరువోయుచున్న మువ్వురు కన్నియలను జూచెను. ఆమువ్వురిలో నొకతె వినూత్న సౌందర్యవతి. మానవకాంత వలె యగుపడలేదు.కాకున్న బుష్యాశ్రమ నివాసమేల? వల్కల ధారణమేల? అపూర్వమీ సౌందర్యముగదా! యనిమనంబున నెంచుచు తనలో తానిట్లను కొనెను. నీజమునకీమాటలు ఆపాత్రమాటున దాగిన కాళిదాస మహా కవివేగదా! శ్లో: సరసిజ మనువిధ్ధం శైవలేనాపి రమ్యం /

‘’హస్త సాముద్రికం ‘’

Image
-హస్తరేఖాల ను బట్టి జాతకం చెప్పటాన్ని  ‘’సముద్రుడు ‘’అనే అయన రాశాడు  .అప్పటి నుంచి దానికి ‘’హస్త సాముద్రికం ‘’అనే పేరోచ్చిందిట .

ఐహికాముష్మికసాధన!

Image
ఐహికాముష్మికసాధనసామర్థ్యం కలుగుతుంది.  కనుక వీలయితే మూల శ్లోకాలతో , కనీసం ఈ తెలుగయినా రోజుకొకసారి చదివి మననం చేయాలి.  ప్రశ్నలన్నీ శిష్యుడు అడిగినవీ జవాబులన్నీ గురువుగారు చెప్పినవీగా తెలుసుకోవాలి: 1. భగవన్, గ్రహించవలసినదేమిటి? గురువాక్యం. . 2. వదలవలసినదేమిటి? చేయరాని పని. . 3. గురువెవరు? తత్త్వం తెలిసి ఎల్లపుడూ శిష్యునికి మేలు చేయటానికి సంసిద్ధుడయి ఉండేవాడు. . 4. బుద్ధిమంతుడు త్వరపడి చేయవలసినదేమిటి? సంసారం = జననమరణ చక్రం విరగగొట్టటం.  . 5. ముక్తి తరువుకు విత్తనం ఏమిటి?  కర్మాచరణం వల్ల (కలిగిన చిత్త శుద్ధి ద్వారా) లభించే తత్త్వజ్ఞానం. . 6. అన్నింటికంటె పథ్యమైనదేది?  ధర్మం. . 7. ఈ లోకంలో శుచి అయినవాడెవ్వడు? పరిశుద్ధమైన మనస్సుకలవాడు. . 8. పండితుడెవరు? ఆత్మానాత్మ వివేకం కలవాడు. . 9. ఏది విషం? గురువులను అవమానించటం. . 10. సంసారంలో సారమైన దేమిటి? అనేకులు అనేకవిధాలుగా ఆలోచించి నిర్ణయించినదే. . 11. మానవులకు అన్నింటికంటె ఇష్టమైన దేమిటి? తనకు మేలుచేసుకొనటానికీ ఇతరులకుపకారం చేయటానికీ నిరంతరం పూనుకొనే జన్మ. . 12. మద్యంలా మత్

చిన్నప్పుడు!

Image
చిన్నప్పుడు! . చిన్నప్పుడు మా మేనమామ ఇంటికి వెళ్తే వాళ్లకి ఆవులూ గేదెలూ ఉండేవి.  గొడ్లను తోలుకుని పొలాలకు వెళ్లేవాళ్లం. చెరువుల్లో దిగడం,  తామరాకుల్లో భోజనాలు, మా అత్తయ్యా వాళ్లు నట్టింట్లో చల్ల చిలుకుతుండేవాళ్లు. ఆవు పేడతో వాకిట్లో కళ్లాపి చల్లేవాళ్లు.  ఆవు పేడ కచ్చిక చాలా మృదువుగా ఉండేది. దాంతో పళ్లు తోముకుంటూ ఆ వాసన అనుభవిస్తూ. కళ్లాపి వాసన, చల్ల చిలుకుతున్నప్పుడు వచ్చే తోడు పెరుగు వాసన.. ఈ మూడు వాసనలూ ఏకకాలంలో అనుభవించాం.  ఇవాళ ఎవరికి తెలుసు ఇవన్నీ?  అవన్నీ అనుభవిస్తే కల్పనా శక్తి పెరుగుతుంది.  ఎంత భాషాజ్ఞానం ఉన్నా కల్పనాశక్తికి, అనుభూతి పొందడానికి  ఈ తరానికి ఏముంది?  హైలైట్ మా మేన మామ కూతురు..  . అపార్టుమెంట్లలో ఉంటూ ఇప్పుడు ఎవరూ సూర్యోదయం సూర్యాస్తమయం చూడట్లేదు!

"స్వామి అండ్ ఫ్రెండ్స్...పోలేరమ్మబండ కతలు’

Image
" స్వామి అండ్ ఫ్రెండ్స్...పోలేరమ్మబండ కతలు’ . ‘మాల్గుడి ఎండలో ఒక విశేషం ఉంది. దాని గురించి ఆలోచించినవారికే అది హాని చేస్తుంది’ అని మొదలవుతుంది in Father's Room presence అనే కథ ‘స్వామి అండ్ ఫ్రెండ్స్’లో.పదేళ్ల స్వామికిగాని, అతడి ఖరీదైన స్నేహితుడు రాజంకుగానీ, వీపున గూటం మోస్తూ దాంతో ఎవడి నెత్తయినా పగలగొడతాను అని బెదిరిస్తూ తిరిగే మణికిగానీ ఆ ఎండంటే లెక్కే లేదు. అది వారి పాలిటి తెల్లని డేరా. మల్లెల షామియానా. ఇంకా చెప్పాలంటే ‘చామీ’ అని ప్రేమగా పిలిచే నానమ్మ మెత్తటి ఒడి.మాల్గుడి పట్టణ దాపున, సరయూ నది వొడ్డున ఈ పిల్లలు, వాళ్ల అల్లరి దేశ సంపద మాత్రమే అయ్యిందా? ప్రపంచానికి మురిపెం కాలేదూ? భారతదేశం అంటే బట్లర్లు, ఇంగ్లిష్ అక్షరమ్ముక్కరాని బంట్రోతులు అనుకునే వలసపాలన రోజుల్లో, ప్రపంచంలో సాహిత్యాన్ని ఇంగ్లిష్ అనే కొలబద్ద పక్కన నిలబెట్టి కొలుస్తున్నరోజుల్లో ఏకకాలంలో ముగ్గురు భారతీయ రచయితలు లండన్‌వారి అచ్చులను హల్లులను ఈ మట్టినీటిలో తడిపి, ఈ గోధూళి దారుల్లో దొర్లించి, ఈ సంస్కారాలతో స్నానం చేయించి, శుభ్రమైన ధోవతీలు చుట్టి లోకానికి చూపించారు. ముల్క్‌రాజ్ ఆనంద్, రాజారావ్, ఆర్.కె.నా

సీతాపతి సంసారానికి చిచ్చుపెట్టిన చాకలితిప్పడి పాట!!

Image
సీతాపతి సంసారానికి చిచ్చుపెట్టిన చాకలితిప్పడి పాట!! రామాయణం రసవద్భరితమైన కమనీయ కావ్యం. అందులో సీతా పరిత్యాగ ఘట్టం అంత కరుణరసప్లావితమైన ఘట్టం మరొకటి ఉండదు. లోకాపవాదానికి భయపడి శ్రీరాముడు సీతను పరిత్యజించడానికి పూనుకుంటాడు. రామో విగ్రహాన్ ధర్మః అంటారు. మూర్తీభవించిన ధర్మమే రాముడు.ప్రజలను పాలించే రాజు ధర్మంతప్పకూడదని రాముడు నమ్మాడు. ధర్మంకోసం ప్రాణప్రదమైన భార్యను వదులుకున్నాడు. ఎంతో అన్యోన్యంగా ఉండే సీతారాములను ఈ విధంగా విడదీయడానికి కారణమైన ఒక గొప్ప సంఘటన-రాజ్యంలోని ఒక చాకలివాడు శ్రీరాముడి గురించి చేసిన ఒక వ్యాఖ్యానం. ధర్మాన్ని పాటించే రాజుగా రాముడు సీతా పరిత్యాగం చేసి తీరవలసిన సందర్భాన్ని కల్పించారు వాల్మీకి. ఈ సన్నివేశాన్ని ఎంతో జాగ్రత్తగా, రామాయణంలోని మూలకథకు భంగం కలగకుండా చక్కగా చిత్రించారు లవకుశ సినిమాలో. ఊరికే ఒక చాకలి ఒక మాట అన్నట్టు చూపించినా ప్రేక్షకులకి తెలుస్తుంది. కానీ చాకలి పాత్రను, అతని భార్య పాత్రను కథలో ప్రముఖంగా తీసుకువచ్చి హాస్యం పుష్కలంగా పండించి క్రమంగా కరుణరస ఘట్టంలోకి తీసుకువెళ్తారు. చిత్రదర్శకులు, సంగీత దర్శకుడు, అభినయం చేసిన నటులు అందరి ప్రతిభతో చక్కని

Suvarna Sundari Songs - Hayi Hayiga - ANR,Anjali Devi

Image
. ‘సువర్ణ సుందరి’ కి షష్టి పూర్తి.! హాయిహాయిగా ఆమని సాగే..... 1957 సంవత్సరంలో వచ్చిన ‘సువర్ణ సుందరి’ సినిమాలోని ఈ పాట గురించి ప్రముఖ కథకుడు, సంగీత విమర్శకుడు ‘భరాగో’ అన్న మాటలు గుర్తు తెచ్చుకోటం సమంజసం. “సోయగాలను విరజిమ్ముకుంటూ హాయిహాయిగా సాగిన ఈ ఆమని పాటలో కవితాస్పర్శ, ఆ మాటల పొందిక రామకృష్ణశాస్త్రిగారిని పదే పదే గుర్తుకు తెస్తుంది.(ఈ రాగమాలిక రచన సముద్రాల అని కొన్ని చోట్ల రాసారు!) ఈ సినిమా హిందీలోకి వెళ్ళినపుడు లతామంగేష్కర్, మహమ్మద్ రఫీలు ఇదే రాగాలను, ఇవే స్వరాలలో మరింత కర్ణపేయంగా ఆలపించగా, ఒక దక్షిణాత్య సినీ సంగీత దర్శకుడికి ఒక సినిమా పాట తొలిసారిగా జాతీయ స్థాయి అవార్డును సాధించి పెట్టిన సంగతిని గుర్తుంచుకొని ఆ పునాది తెలుగు పాటదే కదా అని మనం గర్వపడాలి.” నాలుగు రాగాలు వరుసగా: సోహిని, బహార్, జోన్‌పూరి, యమన్ ఈ పాటలోని ఒక్కొక్క చరణానికి వాడుకోబడ్డాయి. పాట ఎత్తుగడ సోహినీలో ప్రారంభం అవుతుంది. చరణానికి, చరణానికి మధ్య కూడా సోహిని రాగంలోని స్వరాలతో మొదలై ఇతర రాగాల్లోకి పాట నడుస్తుంది. రెండవ చరణం ‘ఏమో తటిల్ల..’ బహార్ రాగంలోనూ, మూడవ చరణం ‘చూడుమా చందమామ..’ జోన్‌పూరిలోనూ, ఆఖరి చరణం ‘కనుగవ త

నువ్వు అచ్చం రంభలా ఉన్నావు!

Image
ఏంటీ వెధవ పని, అడుక్కునే వాడికెవరైనా రూపాయో, రెండో వేస్తారు. నువ్వు పది రూపాయలు వేశావేంటి?” కోపంగా అన్నడు భర్త . “నువ్వు అచ్చం రంభలా ఉన్నావు అన్నాడు వాడు. పాతికేళ్ళనుంచి కాపురం చేస్తున్నా ఎనాడైనా ఈ విషయం  కనిపెట్టారా మీరు? ఒక్కసారి చూడగానే గ్రహించాడువాడు”  అన్నిది కామేశ్వరి.

నా పరువు తియ్యకండి!

Image
మధ్యాహ్నం భార్య భర్తలిద్దరూ  భోజనం చేయగానే,  భర్త తినడం అయిపోయాక  వాష్ బేసిన్ దెగ్గరికి వెళ్లి  ప్లేట్ కడుగుతుండగా.... . #భార్య😡 :: నా పరువు తియ్యకండి.  🔥 మనమున్నది ఇంట్లో కాదు హోటల్ లో😡  😂😂😂😂😂😂

జీవిత చక్రం !

Image
ఫోటోలో మన జీవిత చక్రం సూక్ష్మం గా తెలిపారు ఏనుగు మన పూర్వ జన్మ కర్మ నీటి లోని సర్పాలు ముందు ముందు వచ్చే కర్మలు చెట్టు కొమ్మ మన ప్రస్తుత జీవన కాలం తెలువు ఎలుక ఉదయం నలుపు ఎలుక రాత్రి ఇలాంటి ప్రమాద కరమైన పరిస్థితులలో మనిషి పైనుంచి కింద పడుతున్న తేనె చుక్కలను రుచి చూస్తున్నాడు. అంటే కేవలం క్షణికానందం.. దేవుడు అతన్ని కాపాడడానికి చూస్తున్నాడు, కానీ దేవుడిని పట్టించుకోకుండా తేనె రుచిలను ఆస్వాదిస్తూ ఉన్నాడు

గోరింట పూచింది కొమ్మలేకుండా

Image
గోరింట పూచింది కొమ్మలేకుండా  మురిపాల అరచేత మొగ్గ తొడిగింది! . మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు  గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు  . సింధూరంలా పూస్తే చిట్టి చేయంతా  అందాల చందమామ అతనే దిగివస్తాడు . పడకూడదమ్మా పాపాయి మీద  పాపిష్టి కళ్ళు కోపిష్టి కళ్ళు  . పాపిష్టి కళ్ళల్లో పచ్చాకామెర్లు  కోపిష్టి కళ్ళల్లో కొరివిమంటల్లు  . గోరింట పూచింది కొమ్మలేకుండా  మురిపాల అరచేత మొగ్గ తొడిగింది

శ్రీ భమిడిపాటి కామేశ్వరరావుగారి జెంతెల్ మాన్ !

Image
శ్రీ భమిడిపాటి కామేశ్వరరావుగారి జెంతెల్ మాన్ ! (బాగు .. బాగు నుండి కొన్ని పంక్తులు ) . "...నాగరికత అబ్బి, జెంటిల్ మెన్ అనగా పెద్దమనిషిఅవడానికి సర్వవిధములా పెరుగుతూన్న నన్ను ఈన ఇంతడౌన్‌రైటుగా ఇన్సల్ట్ చేయుట చూచి ఎటులఊరుకొనుట? దేర్‌ఫోర్ తమషా బికేమ్‌కసి.  చదువుకోనివాడు ఏదేనాచేస్తే తప్పు. అదే చదువుకున్నవాడు చేస్తే పామరులకి తప్పులా కనిపించినా దానిగర్భంలో గొప్పప్రిన్సిపల్ ఉందని సమర్థించి, తప్పుకాదని స్థాపించి, అదిఒకవేళ నలుగురికీ భర్జించకపోతే కాంట్ హెల్ప్ అనగా సహాయము చేయలేము అని చెప్పిపారేసినెగ్గొచ్చు...

ఐహికం..ఆముష్మికం.!

Image
ఐహికం..ఆముష్మికం.! (విశ్వనాథ సత్యనారాయణ గారి నవల ' దేవతల యుద్ధం ' నుంచి) . . “నాటకం వాడికి రూపాయి ఇచ్చి టికెట్టు కొంటే వాడు  సంతోషిస్తాడా? దానం అనుకుంటాడా? ఇవన్నీ నీ సంతోషం కోసం చేసే పనులు. నీ వనుభవించే ఆ సంతోషం ఒక దర్జా కోసం, ఒక ఠీవి కోసం, ఒక బడాయి కోసం కలిగే సంతోషం.  ఈ డబ్బు పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళ మనసు ఎలా ఉంటుంది?  వాళ్ళ మనసంతా ద్రవీభూతం అవుతుంది. వాని సంసారం పరిస్థితి ఎట్లంటిది అంటే వాడికి నీవిచ్చిన నాలుగు రూపాయలకు వాడి వళ్ళు కోసి ఇచ్చినా నీ యందలి కృతజ్ఞత తీర్చుకోలేనేమో అనిపించేది. అప్పుడు వాడి మనసులో కలిగే ఆర్ద్రత లౌకికమైనది కాదు. నీకు ప్రత్యుపకారం చేద్దాం అనేది కాదు. ఇది ఐహికమైనది కాదు. ఆధ్యాత్మికమైనది. నీవు ఉద్యోగస్తులకి డబ్బిస్తే వాళ్ళు నీకు ఐహికంగా యెట్లా ఉపయోగపడతారో ఆ ఉపయోగాన్ని ఎలా వాంఛిస్తావో అల్లా అధ్యాత్మికమైనది ఒకటి ఉంది అని నీవు విశ్వసించి దాన్ని వాంఛిస్తే ఈ పేదవాళ్ళకు ఆ డబ్బు ఇస్తావు” . ఒకటి ఐహికం, రెండు ఆముష్మికం. ఈ రెండు చెరి సగంగా మానవుడిలో .ఉంటాయి.  పూర్వ సంఘ వ్యవస్థ ఐహికానికి జీవయత్రకు కావలసిన వెల కట్టి ఆముష్మికానికి ఎక్కువ వెల కట

ఆ రోజులలో నిర్భయ ద్రౌపది !

Image
- ఆ రోజులలో నిర్భయ ద్రౌపది ! . విరాటపర్వంలో కీచకవధ ఉపకీచకుల వధ జరిగి  ఆవార్త దావానంలా చెలరేగింది..  ఊరిలోవారందరూ ఈవిషయం గురించే చర్చించుకుంటున్నారు. . గంధర్వులట. అర్ధరాత్రి చిమ్మ చీకటిలో ఒక స్త్రీ కోసం (సైరంద్రి అనుకుంటారు అందరు. - ద్రౌపది ఎవరికీ తెలియదు)  ఆమె భర్తలైన గంధర్వులు కీచకుడిని ముద్దలా చేసి వింతగా చంపారట! చేతులు, కాళ్ళు, తలా డొక్కలోకి చొప్పించి ఒక గుండ్రని అకారంలా మార్చారట!  ఆహా ఆమె సౌందర్యం కోసం కీచకుడు ఆశించి ఇలా దిక్కుమాలిన ప్రేతంలా తయారయ్యాడు.  పరస్త్రీ వ్యామోహం కూడదని వారించిన వినకుండా మృత్యువుని ఆహ్వానించాడు. పరస్త్రీ పొందు వలన లక్ష్మి పోతుంది, పరస్త్రీ పొందు ఆపేక్షిస్తే ధర్మం పోతుంది,  శక్తి పోతుంది, అష్ట సిద్దులు నశిస్తాయి,  సర్వ శక్తులు కరిగిపోతాయి. జీవితమే అంధకారం అవుతుంది.  కుటుంబం విచ్చిన్నమౌతున్ది.  శత్రువులు పెరుగుతారు.

"ఎన్నాళ్లకొచ్చావె వానా......." ఆడవాళ్ళ అక్కసు !!

Image
శుభోదయం .! . "ఎన్నాళ్లకొచ్చావె వానా......." ఆడవాళ్ళ అక్కసు !! ఓ వర్షమా!!...వాతావరణాన్ని మరీ ఇంత రొమాంటిక్ గా మార్చకు!! మేము మునిపటిలా... హాయిగా వర్షం లో తడుసు కుంటూ... పాటలు పాడు కుందుకు లేదు !!.... వర్షం వచ్చిందంటే చాలు మా భర్తలు మమ్మల్ని వంటింట్లో కి వెళ్లి .... .చ్చక్కటి కాఫీ,వేడి వేడి పకోడీలు చేసి తీసుకుని రమ్మని పుర్మాయిస్తారు!! ............................... మగవాడి మూగ భాష !! ఓ వర్షమా!!...వాతావరణాన్ని మరీ ఇంత రొమాంటిక్ గా మార్చకు!! మునుపటిలా , "చిటపట చినుకులు పడుతూ వుంటె.....చెలికాడే నా సరసన్ వుంటె..."  పాటని వూహించుకున్దుకు కూడా మాకు పర్మిషన్ లేదు!! ...వర్షం వచ్చిందంటే చాలు మా భార్యలు మమ్మల్ని..... మెడ మీదకి వెళ్లి , ............ .............................. .................... ............................ ఆరేసిన బట్టలు ,వడియాలు అర్జెంట్ గా తెచ్చెయ్య మంటారు!!

మొట్ట మొదటి రైల్ రోడ్డు!

Image
 మొట్ట మొదటి రైల్ రోడ్డు! . భారత దేశంలో మొట్ట మొదటి రైల్ రోడ్డును నిర్మించింది బ్రిటీష్ వాళ్ళు అని అంత అనుకుంటారు. కాని వాస్తవానికి, ఇండియన్ రైల్వే అసోసియేషన్ నిర్మించింది ఇద్దరు భారతీయులు. వారే జగన్నాథ్ శంకర్‌సేథ్ మరియు జంషేడ్‌జీ జీజీభోయ్. 1845లో మొదటి రైల్ ప్రయాణం ముంబై నుండి థాణే వరకు కొనసాగింది. గమ్య స్థలానికి చేరుకోడానికి దాదాపు 45 నిమిషాలు పట్టింది.

నత్తలొస్తున్నాయి జాగ్రత్త! .

Image
నత్తలొస్తున్నాయి జాగ్రత్త! . నత్తలొస్తున్నాయి జాగ్రత్త మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన ఒక సైన్సు ఫిక్షన్ నవల.  తన ప్రదేశంలో లేని, దొరకని జంతువునో, జీవినో మనిషి తన సరదా కోసమో లేక అవసరార్థమో మరో ప్రదేశం నుంచి తెచ్చుకుంటే కలిగే అనర్థాలని, జరగబోయే ప్రమాదాలని ఆసక్తికరంగా తెలిపుతుంది  ఈ నవల. 1953లో అమెరికాలో రాక్షస నత్తలతోనూ, ఆస్త్రేలియాలో పిచ్చుకలతోనూ, కుందేళ్ళతోనూ నిజంగా ఇలాంటి పరిస్థితులే ఏర్పడటమూ; మానవ ప్రయత్నాలతో సమస్యలు పరిష్కారమై సాధారణ పరిస్థితులు నెలకొనటమూ జరిగిందని కూడా ఈ నవల చెపుతుంది. . కెన్యాలో భారత రాయబారిగా పనిచేసిన ఉత్తమ్ సింగ్ కి అక్కడ అందరూ బాగా ఇష్టంగా తినే రాక్షసనత్తమాంసం తినటం అలవాటవుతుంది. పదవీ కాలం ముగిశాక, ఆ దేశం నుంచి భారతదేశానికి వస్తూ, కస్టమ్స్ అధికారుల కన్నుగప్పి ఒకే ఒక్క రాక్షసనత్తని తనతో తెచ్చుకుంటాడు. ఆ నత్త భారతదేశానికి అతనితోపాటు చేరుకున్నాక అనుకున్నట్లే 3౦౦ గుడ్లు పెడుతుంది. అందులో తన ఆహారానికి అవసరమైనన్ని గుడ్లు మాత్రమే ఉంచుకుని మిగిలిన అన్నిటినీ నిర్దాక్షిణ్యంగా నాశనం చేసేస్తాడు. ఎందుకంటే, రాక్షసనత్త గుడ్డు ఒక్క రోజులోనే పిల్ల కాగలదు. ఇలా పి

రహస్యం..... మల్లాది వెంకట కృష్ణమూర్తి చిన్నకధలు

Image
రహస్యం..... మల్లాది వెంకట కృష్ణమూర్తి చిన్నకధలు ఒక ఋషి అడవుల్లో చాలా సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసి గొప్ప విద్యలు చాలావాటిని సాధించాడు. ఒకనాడు ఆయన అడవిలో ఒక పెద్ద చెట్టుకింద ధ్యానంలో కూర్చొని ఉండగా హోరు గాలితో కూడిన వాన ఒకటి, మొదలైంది. అలా మొదలైన వాన చాలా సేపు కొనసాగింది. వానలో తడవకుండా ఉండాలని ఋషి చాలా ప్రయత్నించాడు. దగ్గర్లోనే ఉన్న పొదలచాటుకు వెళ్ళాడు. తను కూర్చున్న చెట్టు మొదలుకు అంటిపెట్టుకుని, ముడుచుకు కూర్చున్నాడు. ఎంత చేసినా వాన చినుకులను ఆయన జయించలేకపోయాడు. బాగా తడిసిపోయాడు. వాన చాలాసేపు కురిసింది. ఆయన వేసుకున్న ఉత్తరీయం శరీరం మొత్తాన్ని పూర్తిగా కప్పటంలేదు కూడాను, అందువల్ల అసలే శుష్కించిన ఆ ఋషి శరీరం వణకడం మొదలుపెట్టింది. చాలాసేపు జోరుగా కురిసిన తరువాత వాన ఆగిపోయింది. గాలి కూడా తగ్గింది. అడవంతా నిశ్శబ్దం ఆవరించింది. పారే వాననీటి శబ్దాలు స్పష్టంగా వినబడుతున్నాయి. ఆ సమయానికే, పశువులు కాసే పిల్లవాడొకడు, ఋషి కూర్చున్న చెట్టు ముందునుండి పోతున్నాడు. మేపడం కోసం తను అడవికి తోలుకొచ్చిన పశువులను, వాడు ఊరి వైపుకు తోలుకుపోతున్నాడు. అతని దుస్తులు ఏమాత్రం తడిసిలేవు. పొడిపొడ

బాపు చేతుల్లో ఝాలు వారిన బొమ్మల్లెన్నో. !

Image
బాపు చేతుల్లో ఝాలు వారిన బొమ్మల్లెన్నో. ! . .ఏ రూపం దిద్దుకున్న, ప్రతి బొమ్మకి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. చాల మటుకు, బొమ్మలు నవ యవ్వనంలో చక్కటి శరీర పౌష్టవంతో ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యమ్ బొమ్మ ఆరణాల తెలుగు ఆడపడుచులా ఉంటుంది. ప్రతి బొమ్మ తనకు తానే సాటి అన్నట్టుగా ఉంటుంది.  అన్ని బొమ్మలు కూడా ఒకే రేఖతో గీసినట్టుగా ఉంటాయి. అందుకే బాపు, బాపునే . బాపు బొమ్మలకే జీవం వస్తే  ఎంత బాగుంటాయో కదా అనిపిస్తాయి.

పోతనామాత్యుని ... శ్రీమహాలక్ష్మి !

Image
పోతనామాత్యుని ... శ్రీమహాలక్ష్మి ! . హరికిన్‌పట్టపురాణి, పున్నెముల ప్రోవర్థంబు పెన్నిక్క చం దురు తోబుట్టువు భారతీ గిరిసుతలతోనాడు పూబోడితా మరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించునిల్లాలు భా సురతన్ లేములువాపు తల్లి సిరి యిచ్చున్ నిత్యకళ్యాణముల్ . ప్రతిపదార్థం: హరికిన్, పట్టపురాణి, పున్నెముల, ప్రోవు, అర్థంబు, పెన్నిక్క, చందురు, తోబుట్టువు, భారతీ, గిరి, సుతలతోన్, ఆడు, పూబోడి, తామరలందు, ఉండెడి, ముద్దరాలు, జగముల్, మన్నించున్, ఇల్లాలు, భాసురతన్, లేములు, బాపు, తల్లి, సిరి, ఇచ్చున్ నిత్య కళ్యాణముల్ భావం:  విష్ణుమూర్తికి పట్టపుదేవి, శ్రీదేవి, పుణ్యాలరాశి, సిరిసంపదల పెన్నిధి,  చంద్రుని సోదరి, సరస్వతిపార్వతులతో ఆడుకునే పూవు వంటి శరీరం కలది,  తామరపూలలో నివసించేది, ముల్లోకాలలోనూ పూజలు అందుకునే పూజనీయురాలు, వెలుగు చూపులతో దారిద్య్రాన్ని తొలగించే తల్లియైన శ్రీమహాలక్ష్మి...  మాకు నిత్యకల్యాణాలను అనుగ్రహించుగాక.

కృష్ణుడికి సత్యభామ అంటే అంత భయమా.! .

Image
కృష్ణుడికి సత్యభామ అంటే అంత భయమా.! . నిజంగా కృష్ణుడికి సత్యభామ అంటే అంత భయమా. జగన్నాటక సూత్రధారి ముందు ఎవరి నాటకాలు మాత్రం చెల్లుతాయి చెప్పండి. ఈ విషయాన్ని మన తిమ్మన్న వారు బాగుగా గ్రహించారు. అందుకే.... పారిజాత పుష్పం విషయంలో... శ్రీకృష్ణున్ని తన్నే దాకా వచ్చింది మన సత్యభామ. ఆ వెంటనే శ్రీకృష్ణుడి చేత ఈ పద్యం చదివించారు... .. నను, భవదీయ దాసుని మనంబున నెయ్యపుఁగింకఁ బూని తా చిన యది నాకు మన్ననయ! చెల్వగు నీ పదపల్లవంబు మ త్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నే ననియెద! అల్క మానవుగదా యికనైన అరాళకుంతలా! . "నేను నీ దాసుణ్ణి. నీవు ప్రణయకోపముతో తన్నటం కన్నా, నేను కోరుకోదగిన భాగ్యం యేముంటుంది చెప్పు? ఇదిగో గగుర్పొడిచి నా శరీరం యెలా ముళ్ళపొదలా వుందో చూడు. ఈ ముళ్ళు గుచ్చుకుంటే అమ్మయ్యో! ఇంకేమైనా వుందా! మెత్తని నీ పాదాలు గాయపడవూ! అందుకే యింతసేపటినించీ బతిమాలుకుంటున్నాను. అలకమాను" అని ఈ పద్యం అర్థం. . అంత వరకూ బాగానే ఉంది. చివర్లో అరాళ కుంతలా... అంటూ సంభోదింపజేశారు.  అసలు ఇక్కడ సన్నివేశం ఏంటి.... ఈ సమయంలో... దట్టమైన కురులు కలదానా.... అని సంబోధించాల్సిన

వచ్చెను నీ కోసమే .. వగలు తెచ్చెను నీ కోసమే

Image
శుభరాత్రి ! . వచ్చెను నీ కోసమే ..  వగలు తెచ్చెను నీ కోసమే  అందుకో అందుకో అందాల రాజా! (ఒక పాత సినిమా పాట.) సినిమా పేరు చెప్పండి ?