Posts

Showing posts from August, 2015

ఆరుద్ర - కూనలమ్మ పదాలు

Image
ఆరుద్ర - కూనలమ్మ పదాలు . ‘ఓ కూనలమ్మా' అనే చివరి పదంతో ముగిసే చిన్న చిన్న పద్యాలైన “కూనలమ్మ పదాలు”, అనే చిన్ని చిన్ని మాటల ఈటెల "ఆరుద్ర కూనలమ్మ పదాలు" ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించాయి.  కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించాయి. సరళంగా సామాన్యులకు సైతం అర్ధం కాగలిగేలా రాసిన ఈ పద్యాలలో అందమైన భావాలను కూడా మిళితం చేసి రాసాడు ఆరుద్ర. ఈ కూనలమ్మ పదంలోని అందమంతా తొలి మూడు పాదాల అంత్యప్రాసలే !  కూనలమ్మ అంటే పార్వతీ దేవి కూతుళ్ళయిన ఏడుగురు అక్కలకు కాపగు పోతురాజు భార్య.  . కొన్ని కూనలమ్మ పదాలు . సర్వజనులకు శాంతి స్వస్తి, సంపద, శ్రాంతి నే కోరు విక్రాంతి ఓ కూనలమ్మ ! . ఈ పదమ్ముల క్లుప్తి ఇచ్చింది సంతృప్తి చేయనిమ్ము సమాప్తి ఓ కూనలమ్మ ! . సామ్యవాద పథమ్ము సౌమ్యమైన విధమ్ము సకల సౌఖ్యప్రథమ్ము ఓ కూనలమ్మ ! . సగము కమ్యూనిస్ట్ సగము కాపిటలిస్ట్ ఎందుకొచ్చిన రొస్టు ఓ కూనలమ్మ ! . అరుణబింబము రీతి అమర నెహ్రు నీతి ఆరిపోవని జ్యోతి ఓ కూనలమ్మ ! . మధువు మైకము నిచ్చు వధువు లాహిరి తెచ్చు పదవి కైపే హెచ్చు ఓ కూనలమ్మ ! . తమిళం గురించి -

అల్లూరి సీతారామరాజు వేషం లో అన్నగారు. (1955 లో అనుకొన్నారు.)

Image
.అల్లూరి సీతారామరాజు వేషం లో అన్నగారు. (1955 లో అనుకొన్నారు.)

పిఠాపురం.!

Image
పిఠాపురం.! పిఠాపురాన్ని పూర్వం పీఠికాపురం అనేవారు. ఈ ఊరుకి అధిపతిపిఠాపురాన్ని పూర్వం పీఠికాపురం అనేవారు. ఈ ఊరుకి అధిపతి పీఠాంబ. ఈ పీఠాంబ విగ్రహం ఒకటి - ఒక చేతిలో బంగారు పాత్ర, వేరొక చేత బాగుగా పండిన ఉసిరి కాయ, మూడవ చేత త్రిశూలం, నాల్గవ చేత లోహ దండం ధరించి - నేటి పిఠాపురానికి సమీపంలో, నాలుగు వీధులు కలిసే కూడలిలో ఉండేదట. ఇటువంటి విగ్రహమే ఒకటి ఈనాడు కొత్తపేటలో కుమారస్వామి ఆలయంలో ఉంది. ఈ విషయాన్ని ప్రముఖ కవీశ్వరుడు శ్రీనాధుడు భీమేశ్వర పురాణం లో ఈ కింది విధంగా చెబుతాడు. "హాటక పాన పాత్రయును నారగ బండిన మాతులుంగమున్ ఖేటము లోహదండము నొంగి ధరియించి పురోపకంఠశృం గాటక భూమి భాగమున గాపురముండెది పీఠికాంబకుం గైటభదైత్యవైరిప్రియ కాంతకు మ్రొక్కె నతండు భక్తితోన్." పిఠాపురానికి ఉత్తర దిక్కున ఏలేరు అనే ఏరు ఒకటి ఉంది( ప్రస్తుతం దీనిని చెరుకుల కాలువ అని అంటున్నారు). ఈ ఏలేరుని "జగతి నెక్కడివేలేటి సాటి నదులు" అంటాడు శ్రీనాధుడు అలా అనేసి ఊరుకోకుండా- "ఏలేటి విరినీట నిరుగారునుంబండు ప్రాసంగు వరిచేలు పసిడిచాయ." అని చెబుతూ పిఠాపురం ప్రాంతం సస్యశ్యామలంగా ఉండేదని అ

భగవద్గీత సారాంశం 'నారాయణుడు'

Image
భగవద్గీత సారాంశం 'నారాయణుడు' అసలు భగవద్గీత కంతటికీ సమగ్ర సారమేమిటి అనేది అతి సులభంగా ఈ శ్లోకంలో చెప్పారు యామునాచార్యులు. స్వధర్మజ్ఞాన వైరాగ్య సాధ్యభక్త్యేకగోచరః నారాయణః పరం బ్రహ్మా గీతాశాస్త్రే సమీరితః భగవద్గీతకి సారాంశం నారాయణుడు అని ఒక్క అర శ్లోకంలో చెప్పేసారు గీతా సారాంశాన్ని. మరి ఎలాంటి నారాయణుడు అతడు, "స్వధర్మజ్ఞాన వైరాగ్య సాధ్యభక్త్యేకగోచరః" మేం నారాయణుని కోసం తపస్సు చేస్తాం, జపం చేస్తాం, యజ్ఞం చేస్తాం, యాగం చేస్తాం, మేం యోగం చేస్తాం. అంటే ఆయన యాగం వల్లనో యోగం వల్లనో లభించేవాడు కాదు. భక్తి వల్ల లభించు భగవంతుడు మనకి భగవద్గీతలో కనిపిస్తున్నాడు. భక్తి అంటే ఏమి ? ప్రేమ. ఎట్లాంటి ప్రేమ ? భగవంతుడి మీద నిష్కలంకమైన ప్రేమ. అంటే ప్రేమించి ఏమిస్తావు తిరిగి అడగకపోయేది ప్రేమ. మనం హోటలుకి వెళ్తే భోజనం పెట్టి ఇంత ఇవ్వు అనేది ప్రేమ కాదు. మూల్యం అడగకుండా ప్రతి ఫలాన్ని ఆశించకుండా చేసేదేదో దాన్ని ప్రేమ అంటాం. తల్లి తన పిల్లవాడిని వాడు రేపు పెద్దవాడై ఏదో ఉద్దరిస్తాడని ప్రేమ చేయదు. ప్రేమించ కుండా ఉండలేక తాను ప్రేమ చేస్తుంది, దాన్ని కదా మనం ప్రేమ అనేది. ఎదుర

హేమ కిరీటా య సహస్రాదిత్య తేజసే నమః !

Image
”హేమ కిరీటా య సహస్రాదిత్య తేజసే నమః ! . ఇంద్ర ధనస్సు ఉషః కాలం లోనిఆకాశ ప్రకృతే అది . అదే కిరీటం .కృష్ణ చతుర్దశి ,అమావాస్య ల మధ్య సంధి కాలం లో వచ్చే ఉషః కాలం ఇలానే ఉంటుందని విజ్ఞులు తెలియ జేస్తున్నారు . కార్తీక బహుళ చతుర్దశి సాక్షాత్తు శ్రీ దేవి స్వరూపమే .దీనినే ”రూప చతుర్దశి ”అంటారు . కిరీటం లోని చంద్ర రేఖ ఇంద్ర చాపం లా కనీ పిస్తోంది .కిరీటాన్ని కీర్తిస్తే ,శ్రీ దేవి ని కీర్తించి నట్లే .”హేమ కిరీటా య సహస్రాదిత్య తేజసే నమః !

శ్రావణ పౌర్ణమి విశిష్టత!

Image
శ్రావణ పౌర్ణమి విశిష్టత! . యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః | తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల || పై శ్లోకాన్నిపఠిస్తూ భార్య-భర్తకు సోదరి-సోదరునకు యుద్ధానికి వెళ్లే వీరునకు విజయ ప్రాప్తి కోసం ఈ రక్షాబంధనను కడతారు. శ్రీ మహావిష్ణువు శక్తిచే మహాబలుడు అయిన బలిచక్రవర్తిని బంధించినట్లుగా, ఓ రక్షాబంధనమా ! నీవు చలించక వీనికి రక్షణ కల్పించుము అని పై శ్లోకం అర్దం. దీనిలో రక్షాబంధనం అంటే సాక్షాత్తూ శ్రీ మహావిష్ణు శక్తేనని తెలియచెప్పే భావం ఇమిడి ఉంది. రాఖీ/రక్ష కట్టడం వలన కట్టినవారిక ి, కట్టించుకున్నవారికి రక్ష కలుగుతుంది. రాఖీ కట్టినందుకు బదులుగా సోదరుడు సోదరికి పసుపుకుంకుమలు, సారె ఇచ్చి ఆశీర్వదించాలి. . అన్నా చెల్లి అనుబంధం.రాఖి! … భారతీయ పురాణాలని అనుసరించి మృత్యు కారకుడైన యమధర్మరాజు ముంజేతికి ఆయన సోదరి యమున రాఖీ కట్టి, ఆయనని అమరుడిగా భాసిల్లమని ఆశీర్వదించడంతో ‘రక్షాబంధన’ సంప్రదా యం ఆరంభమైందని ప్రతీతి. . శిశుపాలిడి మరణానంతరం, శ్రీకృష్ణుడిని గాయపడిన చేతి వేలితో చూసిన ద్రౌపది తట్టుకోలేక, తన చీరె కొంగును చించి ఆయన ముంజేతికి కట్టుగా కట్టిందట. ఆమె ప్రేమతో కరిగిపోయిన

నానబోసిన సెనగలు !

Image
నానబోసిన సెనగలు ! . శ్రావణమాసంలో నోములు నోచుకునే వారు, నానబోసిన సెనగలు ను... ఇరుగు పొరుగువారికి, పిల్లలకు, పేరంటాలకు పంచుతారు. మొలకెత్తే సెనగల్లో పోషక విలువలు పుష్కలంగా వుంటాయి. వీటిలో " విటమిన్ - ఎ ", “ విటమిన్ -బి కాంప్లేక్స్", “ విటమిన్ - సి ", “ విటమిన్ - ఇ " వుంటాయి. ఈ విధంగా శ్రావణమాసం ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ప్రసాదిస్తుంది.

మరుపురాని పాత్ర ....గిరీశం!

Image
తెలుగు సాహిత్యంలో మరుపురాని పాత్ర ....గిరీశం నాతో మాట్లాడడమే ఒక ఎడ్యుకేషన్ అని బడాయికోరు కబుర్లు చెపుతూ, అందరినీ బురిడి కొట్టించి, చివరకు డామిట్‌! కథ అడ్డంగా తిరిగిందని మొహం చాటేసే దొంగ పెద్దమనుష్యులకు నిలువుటద్దం గిరీశం. మన వాళ్లుత్త వెధవాయిలోయ్ అంటూ స్వప్రయాజనాల కోసం ఇతరులను మోసపుచ్చి పబ్బంగడుపుకునే ఘరానా మనుష్యులకు ప్రతీక గిరీశం. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు అన్నట్టు, వేడకునో, బ్రతిమాలో, నవ్వించో, ఏడ్పించో సామ, దాన, భేద, దండోపాయాలుపయోగించి ఇతరులను లొంగపర్చుకునే లౌక్యుడు గిరీశం. గురజాడ అప్పారావు ఏ ప్రయోజనాన్ని ఆశించి కన్యాశుల్కం నాటకంలో ఈ పాత్రకు రూపకల్పన చేశాడో కానీ, ఇలాంటి మనష్యులు నేటి సమాజంలో కన్పిస్తూ తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే ఉన్నారు. గిరీశం గురజాడ సృష్టించిన హాస్య పాత్ర అంటే అందరూ ఒప్పుకోక పోవచ్చు. ప్రముఖ విమర్శకుడు ఆర్.ఎస్. సుదర్శనం మాటల్లో చెప్పాలంటే, “గిరీశం పాత్రలో హాస్య రసానుభూతి పొందాలంటే నీతి అనే కొలబద్దను తాత్కాలికం గా నైనా పక్కకు పెట్టాల్సిందే. అప్పుడే గిరీశం మాటలు, సమయస్ఫూర్తి, మనకు ఆహ్లాదం కలిగిస్తాయి.” పాశ్చాత్య సంస్కృతిని అలవాటు చేసుక

వరలక్ష్మీ నమోస్తుతే...వరలక్ష్మీ నమోస్తుతే.!

Image
వరలక్ష్మీ నమోస్తుతే...వరలక్ష్మీ నమోస్తుతే.! . "లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం. శ్రీ రంగథామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం ..లోకైక దీపాంకురాం శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవః .. బ్రహ్మేంద్ర గంగాధం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం.. వందేముకుందప్రియామ్" . శుక్రవారం పూటే వచ్చిన శ్రీ వరలక్ష్మీ వ్రత దినాన నిష్టతో లక్ష్మిదేవిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆ రోజున స్త్రీలు వరలక్ష్మి భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం. అందుచేత శుక్రవారం వచ్చిన శ్రీ వరలక్ష్మీ వ్రత పుణ్య దినాన్ని విశేషంగా జరుపుకుందాం..

- స్మైలింగు ఫేసు చిన్నది !

Image
మిత్రులారా!మణి ప్రవాళశైలిలోనే ఒక చిన్న టుమ్రీ! కం:- స్మైలింగు ఫేసు చిన్నది పైలా పచ్చీసు మేను ఫెళ ఫెళ లాడన్ స్టైలుగ నిలచెను బస్ కై సైలెంటయిపోవ ఆడియన్సుల హార్టుల్; (బాపు గారి బొమ్మ.)

స్థానబలిమి.....గజేంద్ర మోక్షం !

Image
స్థానబలిమి.....గజేంద్ర మోక్షం ! . నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగుబట్టు బైటకుక్క చేత భంగపడును స్థానబలిమిగాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ వినురవేమ! నీటి నుంచి బయటపడ్డ మొసలిని కుక్క కూడా బాధిస్తుంది. అదే నీళ్లలోని మొసలి ఏనుగును కూడా పీడించగలదు. ఈ అర్ధాన్ని తెలియచేసే పురాణగాథే భాగవతంలోని గజేంద్ర మోక్షం కథ. త్రికూట పర్వతం చుట్టు పక్కల, పర్వతం మీద దట్టమైన అరణ్యాలు లెక్కకు మించి ఉండేవి. అందు ఒకానొక అరణ్యంలో మదపుటేనుగుల సమూహం ఒకటి ఉండేది. ఆ గజమూహం స్వేచ్ఛగా అరణ్యాన విహరిస్తూ, చిన్న,చిన్న జలాశయాలలో నీటిని తమ తొండాలలో నింపుకుని, వీపులమీద జల్లుకుంటూ, పండ్లను, కాయలను తింటూ జీవిస్తుండేవి. ఆ ఏనుగు సమూహం యొక్క రాజు మిక్కిలి మదించినవాడై, గర్వంతో, అహంకారంతో విహరిస్తుండేవాడు. ఒకనాడు అరణ్యంలోని సరస్సులో తన పరివారంతో జలకాలాడటానికి ఆ గజేంద్రుడు ప్రవేశించగా, అచ్చటే ఉన్న మకరీంద్రుడు తన బలిష్టమైన దంతాలతో ఏనుగు కాళ్ళను పట్టుకున్నాడు. కరి భూచరజీవులన్నింటిలోకి పెద్దది. దాని పదఘట్టనతో అది జీవులను హతమార్చగలదు. బలమైన దంతాలతో పొడిచి, అతిశక్తివంతమైన తొండముతో చుట్టి విసిరివేసి చంపగలదు. క

‘లక్ష్మణదేవర నవ్వు’!

Image
‘లక్ష్మణదేవర నవ్వు’! _రచన: వెల్చేరు నారాయణరావు! నవ్వు నాలుగందాల చేటన్నారు. అంటే నాలుగు విధాల అని అర్థం. ఈ నాలుగూ ఏమిటో నాకు తెలీవు. కాని పాత కుటుంబాలలో ఆడవాళ్ళు నవ్వడం తప్పుగా భావించేవారు. ముఖ్యంగా మగవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆడవాళ్ళు నవ్వితే వాటికి వెంటనే తప్పు అర్థాలు వస్తాయని పెద్దవాళ్ళు ఆడపిల్లల్ని వారించేవారు. ఆమాటకొస్తే నవ్వడం విషయంలో మొగవాళ్ళక్కూడా ఈ అదుపులు ఉన్నాయని సుమతీశతకం చదివితే తెలుస్ తుంది. నవ్వకుమీ సభలోపల నవ్వకుమీ తల్లిదండ్రి నాథులతోడన్‌ నవ్వకుమీ పరసతితో నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ మొగవాళ్ళనుద్దేశించిన ఈ మాటకీ, ఆడవాళ్ళు నవ్వకూడదనే ఆ మాటకీ చిన్న తేడా ఉన్నట్టు కనిపిస్తుంది. ఆడవాళ్ళు నవ్వడం తప్పు. తప్పు అంటే ఆడవాళ్లుగా వాళ్ల శీలానికి కలిగే మచ్చ. మగవాళ్ళు నవ్వకపోవడం నీతి. నీతి అంటే లౌకిక వ్యవహారాల్లో ఇబ్బందులు తెచ్చుకోకుండా తెలివితేటలుగా వ్యవహరించే పద్ధతి. అంటే లౌక్యం. నవ్వు చాలా రకాలు: ఎవరితోనైనా కలిసి నవ్వడం, ఎవరినైనా చూసి స్నేహపూర్వకంగా నవ్వడం, వాళ్లపట్ల ఆకర్షితులై ఆ సంగతి సూచిస్తూ నవ్వడం, వాళ్ళని సంతోషపరచడానికి నవ్వడం, ఊరికే సరదాగా నవ్వడం,

శ్రీ మహా లక్ష్మి అమ్మ వారి బీజాక్షర మంత్రం!

Image
శ్రీ మహా లక్ష్మి అమ్మ వారి బీజాక్షర మంత్రం! ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్! రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః స్వాహా! . మహా లక్ష్మి కరుణా - రాగం మాధవ మనోహరి - తాళం ఆది , ముత్తుస్వామి దీక్షితార్! పల్లవి మహా లక్ష్మి కరుణా రస లహరి మామవ మాధవ మనోహరి శ్రీ అనుపల్లవి మహా విష్ణు వక్ష స్థల వాసిని మహా దేవ గురు గుహ విశ్వాసిని (మధ్యమ కాల సాహిత్యమ్) మహా పాప ప్రశమని మనోన్మని మార జనని మంగళ ప్రదాయిని చరణమ్ క్షీర సాగర సుతే వేద నుతే క్షితీశాది మహితే శివ సహితే భారతీ రతి శచీ పూజితే భక్తి యుత మానస విరాజితే (మధ్యమ కాల సాహిత్యమ్) వారిజాసనాద్యమర వందితే నారదాది ముని బృంద నందితే నీరజాసనస్థే సుమనస్థే సారస హస్తే సదా నమస్తే

తిరుమల వైభవం – అన్నమయ్యపదాలలో

Image
తిరుమల వైభవం – అన్నమయ్యపదాలలో శ్రీశైల గరుడాచల వేంకటాద్రి నాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యామ్ ఆఖ్యాం త్వదీయ వసతే రనిశం వదంతి శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ అచలం లేక అద్రి అంటే కొండ. శేషాచలం, గరుడాచలం, వేంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి అనే ఏడు పర్వతశ్రేణుల మధ్య, దేవతలు, మునులు, సిద్ధులు, కిన్నర, కింపురుషాదులు విహరించే బంగారు పుడమిపై, ‘గతులన్ని ఖిలమైన కలియుగమందును, గతి యీతడే చూపె ఘనగురుదైవము’ గా ఆ అఖిలాండనాయకుడు సప్తగిరీశుడై వెలుగొందుతున్నాడు. భూలోక వైకుంఠంగా ప్రసిద్ధిపొందిన ఈ తిరుమలగిరి ఒక్కొక్కయుగంలో ఒక్కొక్కపేరుతో ప్రభవించింది. కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం అంజనాచలమ్ ద్వాపరే శేషశైలతే కలౌ శ్రీ వేంకటాచలమ్ నామాని యుగభేదేన శైలస్యాస్య భవంతి హి. కృతయుగంలో వృషాద్రని, త్రేతాయుగంలో అంజనాద్రని, ద్వాపరయుగంలో శేషాద్రని, కలియుగంలో వేంకటాద్రని ఈ దివ్య క్షేత్రం బాసిల్లుతోంది. ఇక్కడి ప్రతి పర్వతానికి ఒక విశిష్టత, ఒక పురాణగాథ ఉన్నాయి. ‘వేం’ అంటే పాపాలు ‘కటః’ అంటే దహించేది. చూచిన తోడనే మనలోని పాపాలను నశింపచేసే క్షేత్రమే వేంకటాద్రి. ఆదిశేషుడే తన పదివేలతల

విదూషకుడి విషాదం..ప్రపంచ ప్రక్యాత నటుడు .. దర్శకుడు ... శ్రీ రాజకపూర్ !

Image
విదూషకుడి విషాదం..ప్రపంచ ప్రక్యాత నటుడు .. దర్శకుడు ...  శ్రీ రాజకపూర్ ! . జీవితం ఒక సర్కస్ అయితే, బాధలన్నీ గుండెమాటున దాచుకొని.. మోహంలో ఆ భావాలు కనపడకుండా రంగుపులుముకొని… ప్రేక్షకులని నవ్వించటమే ఓ జోకర్ చేయాల్సింది. . అతని జీవితంతో…పేదరికంతో..బాధలలో.. దేనితోను ప్రేక్షకులని సంబంధం లేదు. ఒక్కసారి జోకర్ పాత్ర ధరించాక మనం నిజంగా ఏడ్చినా అందరూ నవ్వుతారు. ఆది లోకం తీరు .. ప్రపంచం అనేది సర్కస్ నాటకరంగం అయితే.. ప్రతివాడు ఓ పాత్ర పోషించాల్సిందే. పుట్టేది ఇక్కడే చావాల్సింది ఇక్కడే. ఇదే స్వర్గం ఇదే నరకం. . . హాస్యం జీవిత వాస్తవాల మీద కళాకారుడు పరిచే పల్చటి తెర. అదిచిరిగిపోతే కళాకారుడి కళ్ళు వర్షిస్తాయి. అయినా ప్రేక్షకులు నవ్వుతూనే వుంటారు. అది “హాస్యం” కాదని కళాకారుడికి తెలుస్తూనే ఉంటుంది. కాని ప్రేక్శకులకి వినోదం ఒక అలవాటు. ఆ అలవాటుని కొనసాగిస్తారు. ఇదే రాజకపూర్ కళాఖండం “మేరా నామ్ జోకర్”.

తెలుగు సాహిత్యంలో మరుపురాని పాత్రలు అత్తగారు !

Image
తెలుగు సాహిత్యంలో మరుపురాని పాత్రలు అత్తగారు ! ఆ మాట అనగానే మనముందు గయ్యాళి సూర్యాకాంతం రూపం దర్శనమిస్తుంది. అది మన తప్పుకాదు. పరిస్థితుల ప్రభావం. అత్తగారనగానే కోడళ్లని వేపుకు తినే పాత్రలే మన మనసులో మెదలుతాయి గాని, “దొంగలెవరో, దొర్లెవరో మనకెట్లా తెలుస్తుంది? మా కాలంలో దొంగలైతే, నల్లగా నాపరాళ్లలాగ, పట్టుకుంటే చిక్కకుండా జారిపోయి పారిపోయేందుకు ఒంటినిండా నూనెరాసుకుని, దొంగతనాలకూ, దోపిళ్లకూ వస్తూండేవాళ్లు...,” అని అమాయకత్వం వెలిబుచ్చే ‘అత్తగారు’ కేవలం భానుమతి రామకృష్ణగారి ఊహల్ల ోనే ఉదయిస్తారు. కల్తీలేని భాష, భావాలు, భావనలతో తెలుగింటి అత్తగారు ఇలాగే ఉండాలని అందరూ ఆశించి, ఆకాంక్షించే అపురూప సృష్టి భానుమతి అత్తగారు. ఈ అత్తగారిలో కనబడే వ్యక్తిత్వమల్లా కాలదోషం పట్టని ఆచారాలు, అలవాట్లు, నమ్మకాలు, కట్టుబాట్లు వీటన్నింటిని పేనివుంచే చాదస్తము. ఇది వాస్తవికతకు ఎంతో దగ్గరైన ప్రాత. ప్రతి వీథిలోనూ రామాలయం ఉన్నట్లే, ప్రతీ ఇంట్లోనూ ఒక అత్తగారు తప్పనిసరి. తాపట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే ఆవిడ మనస్తత్వం, కోడలిని, ఇంటిని కూడా తన చెప్పుచేతల్లో ఉంచుకోగలిగే నేర్పరితనం, నిమ్మకాయెంతో

నేర్చుకుందాం ..(7)...“న భూతో న భవిష్యతి” !

Image
నేర్చుకుందాం ..(7)...“న భూతో న భవిష్యతి” ! . ఏదైనా గొప్ప సంఘటన జరిగి నపుడు, పెద్ద కష్టం వచ్చినపుడు, గొప్ప వ్యక్తులవిషయంలోను పై వాక్యం ‘ గతంలో కాని, భావిలో కాని లేదు’ లేక చూడ లేదు అన్న సందర్భంలో వాడుతాము . దీనిని కవి హాస్యంగా ఒక లోభి (పిసినారి) విషయంలో చెప్పిన ‘చాటువు యిది’ . “ కృపణేన సమో దాతా ‘ నభూతో నభవిష్యతి’/ అస్ప్రుసన్నేవ విత్తాని యః పరేభ్యః ప్రయచ్ఛతి”// . “ కృపణుడు అనగా పిసినారి. పిసినారి కంటే మించిన దాత ఏ కాలంలోనూ ఇంకొకడు ఉండడు. ఎలా అంటే -వాడు బ్రతికినన్నిరోజులు ఖర్చుపెట్టకుండా, ధనాన్నితాక కుండా, దాచిఉంచి మరణించాక ఇతరులకి ఒప్ప చేపుతాడు.” అందుకనే పిసినారితో సమానమైన దాత “ భూతకాలంలో కాని, భవిష్యత్తు లో కాని” ఉండడు. అని వ్యగ్యంగా కవిచేప్పిన వాక్కు. అందరూ అలా ఉండకుండా బ్రతికి ఉన్నపుడే దానం చేయాలి అని సుభాషితకారుడి సూచన.

కన్నబిడ్డలు...

Image
కన్నబిడ్డలు . (బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి ) . కొడుకుల్లు పుట్టన్ని కడు పేమి కడుపు? కుల ముద్ధరించన్ని కొడు కేమి కొడుకు? కన్నకానుపులెల్ల కడుచక్కనయితె, కన్నుల్ల పండుగే కన్నతల్లికిని. * * * లాభమ్మ లాభమ్ము ఏమి లాభమ్ము? కొడుకులను గంటేను కోటి లాభమ్ము. గోరంతదీపమ్ము కొండలకు వెలుగు, గోపాలకృష్ణమ్మ గోవులకు వెలుగు. మాడంతదీపమ్ము మేడలకు వెలుగు, మారాజు అబ్బాయి మాకళ్ల వెలుగు. * * *

సుమ గారి పద్యం!

Image
సుమ గారి పద్యం! . ఈ పద్యము చదువుటకు హృద్యముగా ఉండును కానీ నోరు తిరుగక మొదట చాలా అవస్థ పడవలిసి వచ్చును. మన తెలుగు టి వి లో పనిచేయు సుమ గారు ఆవిడ మలయాళీ అయిననూ సునాయాసముగా ఈ పద్యము చెప్తూ వుంటే నాకు చాలా ఆశ్చర్యమేసింది. . అల్లసాని పెద్దన వ్రాసిన 'మనుచరిత్ర'ప్రబంధములో యిదిచాలా ప్రసిద్ధమైన పద్యము. . అట జని కాంచె భూమిసురుడంబర చుంబి శిరస్సర ఝరీ పటల ముహుర్ముర్లుటద భంగ తరంగ మృదంగ నిస్స్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్ కటక చరత్క రేణు కరకంపిత సాలము శీత శైలమున్ . . తా:--భూమిసురుడు=బ్రాహ్మణుడైన ఆ ప్రవరుడు, చని=పోయి, అటన్=అక్కడ, అంబర చుంబి=ఆకాశమును తాకుచున్న,శిరః= పర్వత కొనలనుండి ప్రవహించు చున్న, ఝరీ పటల=సెలయేళ్ల సమూహము నుండి ముహుర్ముర్ =మాటిమాటికీ లుటత్=దోర్లుచున, అభంగా=అడ్డులేని, తరంగ=తరగ లనెడి, మృదంగ=మద్దెలల యొక్కనిస్స్వన=ధ్వని చే, స్ఫుట=వెలువడు చున్న, నటనానుకూల=నాట్యమునకు తగినట్టుగా,పరిఫుల్ల=పురివిప్పిన కలాప=పించములు గల ,కలాపిజాలముల్=నెమల్ల సమూహములు కలదానిని,కటక=పర్వత మధ్య ప్రదేశమున,చరత్=సంచరించుచున్న,కరేణు=ఆడు ఏనుగుల యొక్క కర=తొండములచే

అజంతా గుహలు!

Image
అజంతా గుహలు! .మహారాష్ట్ర లోని అజంతా గుహలు రాతి శిల్పకళ ను కలిగిన గుహ నిర్మాణాలు. ఇవి సుమారుగా క్రీ.పూ. రెండవ శతాబ్దము నకు చెందినవి. ఇక్కడి శిల్ప చిత్ర కళలు బౌద్దమత కళకు చెందినవి. [1] మరియు 'విశ్వజనీయ చిత్రకళలు'.[2] . ఔరంగాబాద్ జిల్లా లోని మహారాష్ట్రలో నెలకొని ఉన్న అజంతా గుహలు మనకు వారసత్వంగా అందిన అపురూపమైన చారిత్రక సంపద. ఇవి సుమారుగా క్రీ.పూ. రెండవ శతాబ్దం నాటివని చెబుతారు. ఇక్కడ కనబడుతున్న చిత్రకళలో ఎక్కువ భాగం బౌద్ధ మతానికి చెందినవి. గుహల లోపల అద్భుతమైన నిర్మాణ సౌందర్యం కన బడుతుంది. అజంతా గ్రామము బైట ఉన్న ఈ గుహలు 1983 నుండి యునెస్కో (UNESCO) వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశం గా పరిగణించబడుతున్నాయి. ఔరంగాబాద్‌ జిల్లాలోని అజంతా గ్రామానికి వెలుపల ఈ గుహలు ఉన్నాయి. దట్టమైన అడవుల మధ్య గుర్రపు నాడా ఆకారంలో ఉన్న కొండపై ఇవి నెలకొని ఉన్నాయి. 56 మీటర్ల ఎత్తులోని పర్వతాల మీద ఇవి పడమర నుండి తూర్పునకు వ్యాపించి ఉన్నాయి. .శిల్పకళ! గుహలను బుద్ధిజానికి సంబంధించిన శిల్పకళను దాచుకున్న కళా నిలయాలుగా వర్ణించవచ్చు. కొన్ని శిల్పాలు తెరవాడ సంప్రదాయంలో కిరీటం, పాదముద్రలు మాత్రమే ఉంటాయి. మరికొన్ని మహ

కొలువు1 (కొలువు గూర్చి మూడు సుమతి పద్యాలు .)

Image
కొలువు1 (కొలువు గూర్చి మూడు సుమతి పద్యాలు .) . అడిగిన జీతం బియ్యని మిడిమేలపు దొరను గొల్చి మిడుగుట కంటెన్ వడిగల ఎద్దులఁ గట్టుక మడి దున్నుక బ్రతుకవచ్చు మహిలో సుమతీ ! . ఓ సుమతీ.! సమయానికి జీతమివ్వక పోగా అవసరమొచ్చిందని అడిగినా జీతం ఇవ్వని మిడిసిపాటు గల యజమానిని సేవించడం కంటే మంచి ఎడ్ల జతను కూర్చుకొని , వ్యవసాయం చేసుకొని బ్రతకడమే ఉత్తమమైన పని. . అడియాస కొలువుఁ గొలువకు గుడిమణియము సేయబొకు కుజనుల తోడన్ విడువక కూరిమి సేయకు మడవినిఁ దోడరయకొంటి నరుగకు సుమతీ ! . ఓ మంచి బుద్ధిగలవాడా! ఒక మాట అనుకోకుండా ఎంతో కొంత ఇస్తారులే అనో , ఎప్పటికో అప్పటికి శాశ్వతమౌతుందనో ఆశ పడి ఉద్యోగం లో చేరడం , దేవాలయాధికారిగా పెత్తనం చేయడం , చెడ్డవారి తో స్నేహం చేయడం , అడవి లో తోడులేకుండా ఒంటరి గా ప్రయాణం చేయడం అనేవి మంచివి కావు . అనగా బుద్ధిమంతుడు ఆచరించ దగ్గవి కాదు .. అధరము గదలియుఁ గదలక మధరములగు భాష లుడిగి మౌనవ్రతుడౌ నధికార రోగపూరిత బధిరాంధక శవముఁ జూడఁ బాపము సుమతీ ! . ఓ సుమతీ ! పెదవి కదిలీ కదలనట్లు అంటే మాట వినబడీ వినబడనట్లు మాట్లాడుతూ , మౌనాన్ని పాటిస్తూ , అధికారమనే రోగము చే నిండిన అధికారిని చూడటం చెవిటి ,గుడ్డి శవా

శ్రీశ్రీ ప్రతిజ్ఞ గేయానికి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుగారి పేరడీ!

Image
శ్రీశ్రీ ప్రతిజ్ఞ గేయానికి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుగారి పేరడీ! . అవాకులన్నీ, చవాకులన్నీ మహారచనలై మహిలో నిండగ, ఎగబడి చదివే పాఠకులుండగ విరామ మెరుగక పరిశ్రమిస్తూ, అహోరాత్రులూ అవే రచిస్తూ ప్రసిద్ధికెక్కె కవిపుంగవులకు, వారికి జరిపే సమ్ మానాలకు బిరుదల మాలకు, దుశ్శాలువలకు, కరతాళలకు ఖరీదు లేదేయ్! అలాగే- నేను సైతం తెల్లజుట్టుకు నల్లరంగును కొనుక్కొచ్చాను నేను సైతం నల్లరంగును తెల్లజుట్టుకు రాసిదువ్వాను యింతచేసి, యింత క్రితమే తిరుపతయ్యకు జుట్టునిచ్చాను.

కొన్ని సరదా పేరడీలు....

Image
కొన్ని సరదా పేరడీలు.... అక్కరకురాని బస్సును చక్కగ సినిమాకురాక సణెగెడు భార్యన్ ఉక్కగ నుండెడు ఇంటిని గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ! . తినదగు నెవ్వరు పెట్టిన తిని నంతనె వెళ్లిపోక తిని తిట్టదగున్ తిని తిట్టి వెళ్లిపోయెడు మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ! . అరవదాని చీర ఆరుబారులునుండు పార్సిపడతి చీర పదికి మించు చీరగొప్పదైన శీలంబు గొప్పదా విశ్వదాభిరామ వినురవేమ! . ఇంజనీరు కోర్సు ఇంగిలీసుననేడ్చి ఇంటి చుట్టు కొలత నీయలేడు బట్టి చదవుకంటె వట్టి చాకలిమేలు విశ్వదాభిరామ వినురవేమ!

ఎస్. నటరాజన్ (శారద) వర్ధంతి సందర్భంగా – ..

Image
17 ఆగస్టు – ఎస్. నటరాజన్ (శారద) వర్ధంతి సందర్భంగా – .. శ్రీ ఎస్. నటరాజన్ – కలం పేరు శారద. 1924లో తమిళునాడులో పేద బ్రహ్మణ కుటుంబంలో పుట్టి, పొట్ట కూటికై 12 వ ఏట తెనాలి వచ్చి, హొటల్‌లో సర్వర్‌గా జీవితం మొదలు పెట్టాడు. మొదట తెలుగు మాట్లాడడం నేర్చుకొని, 13వ ఏట తెలుగు వ్రాయడం, చదవడం నేర్చుకొని , 22వ ఏట తెలుగులో స్వంతంగా రచనలు చేసాడు. మూర్చరోగంతో బాధ పడుతూ, రోజంతా గొడ్డు చకిరి చేస్తూ, రాత్రి గుడ్డి కిరసనాయిల్ దీపం వెలుతురులో తెలుగులో రచనలు చేసాడు. 100 దాకా సాంఘిక, డిటెక్టివ్ కధలు, మంచీ-చెడు, అపస్వరాలు వంటి ఒక డజన్ నవలలు, ఇంకా నాటికలు, వ్యంగ్య రచనలు చేసి, కొడవటిగంటి, చలం, గోపిచంద్, శ్రీశ్రీ వంటి లబ్దప్రతిష్టుల మన్ననలు పొందాడు. అనారోగ్యంతో, ఆకలి దప్పులతో జీవితాంతం పోరాడుతూ 17-08-1955 న 31 ఏళ్ళ చిన్న వయసులోనే కన్నుమూసాడు. .. తెలుగు సాహితీ వీధుల్లో ఎప్పటికీ చెరిగిపోని తన పాద ముద్రలు విడిచి వెళ్ళిపోయిన తెలుగు వాడు కాని తెలుగు రచయిత ఎస్. నటరాజన్ (శారద). . శారద రాసిన మంచి చెడు అపస్వరాలు . ఆంధ్ర పత్రికలో సేరయాలుగా వచ్చేవి .. అపస్వరాలు విశ్వనాథ వారిని దృష్టి లో పెట్టుకొని రాస

పసుపులేటి కన్నాంబ !

Image
పసుపులేటి కన్నాంబ ! . పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లో 1912 లో జన్మించిన కన్నాంబ ఆనాటి నావెల్ నాటక సమాజంలో పదమూడు సంవత్సరాల వయస్సులో బాల పాత్రలు వేస్తూ తొలిసారిగా నాటక రంగ ప్రవేశం చేసింది. తన నాటకరంగానుభవంతో 1935లో హరిశ్చంద్ర తెలుగు చలన చిత్రంలో ' చంద్రమతిగా అడుగు పెట్టింది. ఆ తర్వాత ద్రౌపదీ వస్త్రాపహరణంలో "ద్రౌపది"గా అధ్బుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలను, ప్రశంసలను అందుకుంది. ద్రౌపదీ వస్త్రాపహరణం, హరిశ్చంద్ర, పాదుక, చంద్రిక, కనకతార, పల్నాటి యుద్ధం, గృహలక్ష్మి , అనార్కలి, దక్షయజ్ఞం , తోడికోడళ్ళు, కృష్ణ కుచేల, తదితర చిత్రాలు ఆమె నటించిన ముఖ్యమైనవి. ఎం.జి.రామచంద్రన్, ఎన్.ఎస్.రాజేంద్రన్, శివాజీగణేశన్, నాగయ్య, పి.యు. చిన్నప్ప, నందమూరి తారక రామారావు, తదితర అగ్రశ్రేణి నాయకుల సరసన ఎన్నో చిత్రల్లో ఆమె నటించింది. సుమారు 150 పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలలో తనదైన శైలిలో అద్వితీయంగా నటించి గొప్ప నటీమణిగా కీర్తి గడించింది. నవరసాలను సమర్థవంతంగా అవలీలగా పోషించగల అద్భుత నటీమణి కన్నాంబ . కన్నాంబ భర్త కడారు నాగభూషణం, ఇద్దరూ కలసి ' రాజరాజేశ్వరీ ' చిత్ర నిర్మాణ సంస్థను స

ఎల్. ఆర్. ఈశ్వరి !

Image
ఎల్. ఆర్. ఈశ్వరి ! ఎల్. ఆర్. ఈశ్వరి నేపధ్య గాయని. ఈమె మద్రాసు లో ఒక రోమన్ కాథలిక్  కుటుంబంలో జన్మించింది. ఈమె పూర్తి పేరు "లూర్డ్ మేరీ".  ఆమె బామ్మ హిందూ కావడంతో "రాజేశ్వరి" అని పిలిచేవారు.  తమిళ చిత్ర నిర్మాత ఎ.పి.నటరాజన్ ఈమె పేరును సినిమాల కోసం టూకీగా  ఎల్. ఆర్. ఈశ్వరి గా మార్చాడు. ఈమె తమిళం, తెలుగు, కన్నడం, మళయాళం, హిందీ, తుళు మరియు ఆంగ్ల భాషలలో కొన్ని వేల పాటల్ని పాడింది. ఈమెను మొదటగా కె.వి.మహదేవన్ గుర్తించి, "నల్ల ఇడత్తు సంబంధం" (1958) అనే తమిళ సినిమాలో మొదటిసారిగా సోలోగా పాడే అవకాశాన్ని ఇచ్చాడు. అయితే ఆ చిత్రం విఫలం కావడంతో ఆమెకు గుర్తింపు రాలేదు. కాని "పాశమలార్" (1961) సినిమాతో ఆమెకు మంచి గాయనిగా పేరొచ్చింది. తర్వాత కాలంలో ఆమె ఎక్కువగా చెళ్ళపిళ్ళ సత్యం దర్శకత్వంలో తయారైన ఎన్నో క్లబ్ సాంగ్స్ మరియు ఐటమ్ నంబర్లకు పాడారు.  ఈమె ఎక్కువగా జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్క్ స్మిత మొదలైన నాట్యకత్తెలకు పాడేవారు. వీరే కాకుండా విజయలలిత, లక్ష్మి, సరిత వంటి యువ నటీమణులకు కూడా తన గళాన్ని దానం చేసారు. ఈమె వ్యక్తిగత జీవితం మాత్రం విషాద

ఏ రోడ్డు చరిత్ర చూచినా, ఏమున్నది గర్వకారణం !

Image
మాచిరాజు దేవీప్రసాద్ గారు శ్రీశ్రీ కవితలకు కట్టిన పేరడీలు చూడండి... . ఏ రోడ్డు చరిత్ర చూచినా, ఏమున్నది గర్వకారణం రహదార్ల చరిత్ర సమస్తం, దూళిధూసర పరిన్యస్తం. రహదారి చరిత్ర సమస్తం, యాతాయత జన సంయుక్తం రహదారి చరిత్ర సమస్తం, పథిక వాహన ప్రయాణ సిక్తం అంటూ కొనసాగించి – భూంకార గర్జిత దిగ్భాగం, చక్రాంగ జ్వలిత సమస్తాంగం రహదారి చరిత్ర సమస్తం, పైజమ్మాలను పాడుచేయడం అని చెపుతారు.

ఛందమామ కధ.! బ్రహ్మహత్యా పాతకం ఎవరికి చుట్టుకుంటుంది?

Image
ఛందమామ కధ.! బ్రహ్మహత్యా పాతకం ఎవరికి చుట్టుకుంటుంది? [భట్టి విక్రమాదిత్యుల కథ ] . విక్రమార్కుడు మళ్ళీ భేతాళుణ్ణి బంధించాడు. భేతాళుడు మళ్ళీ మరో కథ ప్రారంభించాడు. ఒకప్పుడు ‘అవినాశి’ అనే నగరం ఉండేది. (వినాశం లేనిది అని ఆ పేరుకి అర్ధం.) ఆ నగరంలో దేవనాధుడు అనే బ్రాహ్మణుడుండే వాడు. అతడి కొక కుమారుడు, అర్జున స్వామి. అతడు రూపవంతుడూ, గుణవంతుడు. అతడికి యుక్త వయస్సు వచ్చాక తండ్రి దేవనాధుడు, ఎన్నో ఊళ్ళు వెది కి తగిన కన్యని తెచ్చి వివాహం చేసాడు. ఆ పిల్ల పేరు అనామతి. ఆమె అర్జునస్వామికి రూపంలోనూ, గుణంలోనూ తగిన భార్య. తీయని మాటలూ, చక్కని చేతలూ గలది. యువ దంపతులని చూసిన ఎవరైనా… వారు ఒకరి కొకరు తగి ఉన్నారనే వారు. గువ్వల జంట వంటి ఆ యువజంట, ఎప్పుడూ కలిసి మెలిసి ఉండేవాళ్ళు. ఏ పని చేసినా కలిసి చేసేవాళ్ళు. క్షణమైనా ఒకరినొకరు ఎడబాయక ఉండేవాళ్ళు. వారి తీరుని చూసి అందరూ ముచ్చట పడే వాళ్ళు. ఇలా ఉండగా…ఓ నాటి రాత్రి… చల్లగాలి వీస్తొందని భార్యభర్తలిద్దరూ, పెరట్లో మల్లెపందిరి ప్రక్కనే మంచం వేసుకు పడుకున్నారు. అది వెన్నెల రాత్రి! అర్జునస్వామి, అనామతి ఆరుబయట ఆదమరిచి నిదురిస్తున్నారు. ఆ సమయంలో ఆకాశం

జరుక్ శాస్త్రి పేరడీలు !

Image
- - జరుక్ శాస్త్రి పేరడీలు ! జరుక్ శాస్త్రి అనే జలసూత్రం రుక్మిణీనాధశాస్త్రి గారు పేరడీకి కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. విశ్వనాథ సత్యనారాయరణ, దేవులపల్లి, శ్రీశ్రీ ఇలా ఒకరేంటి ఆధునిక కవులందరి కవితలకుఅలవోకగా పేరడీలు చేసి, పేరడీలను ప్రజల నాల్కులపైకి తెచ్చారు. మచ్చుకు శ్రీశ్రీ ‘అద్వైతాన్ని’ జరూక్ శాస్త్రి ‘విశిష్టాద్వైతం’గా ఎలా మలిచారో చూడండి. . ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే అనురాగపుటంచుల చూస్తాం ఆనందపు లోతులు తీస్తాం (శ్రీశ్రీ మహాప్రస్థానం) . ఆనందం అంబరమైతే అనురాగం బంభరమైతే అనురాగం రెక్కలు చూస్తాం ఆనందం ముక్కలు చేస్తాం. (జరుక్ శాస్త్రి పేరడీ) . ఇక శ్రీశ్రీ ‘నేను సైతా’నికి వచ్చిన పేరడీలు లెక్కకు లేవు. జరూక్ శాస్త్రి శ్రీశ్రీ కవితలలో ప్రసిధ్ది చెందిన పంక్తులకు చెప్పిన పేరడీలు గమనించండి – . నేను సైతం కిళ్ళీకొట్లో పాతబాకీ లెగర గొట్టాను నేను సైతం జనాభాలో సంఖ్య నొక్కటి వృద్ధి చేశాను ఇంకా, . ఏ కాకి చరిత్ర చూచిన ఏమున్నది గర్వకారణం ప్రపంచ మొక సర్కస్ డేరా (ప్రపంచమొక పద్మవ్యూహం) కవిత్వమొక

స్వతంత్రతా భ్రాతృత్వాలు సమతా మా సదాశయాలు!

Image
స్వతంత్రతా భ్రాతృత్వాలు సమతా మా సదాశయాలు! . మాదీ స్వతంత్రదేశం లలితగీతాన్ని రచించినది స్వరపరచినది డా. బాలాంత్రపు రజనీకాంతరావుగారు. బిలహరి రాగం ఆది తాళంలో (కహరువా తాళం హిందూస్తానీలో) కూర్చారు. టంగుటూరి సూర్యకుమారి గానం చేయగా ఎంతో ప్రాచుర్యం పొందింది. పాట సాహిత్యo పల్లవి: మాదీ స్వతంత్ర దేశం - మాదీ స్వతంత్ర జాతి భరతదేశమే మా దేశం - భారతీయులం మా ప్రజలం || మాదీ స్వతంత్ర దేశం || చరణం 1: వింధ్య హిమవత్ శ్రీనీలాదుల సంధ్యారుణిత నవాశలు మావి గంగా గోదావరీ సహ్యజా తుంగ తరంగిత హృదయాల్ మావి || మాదీ స్వతంత్ర దేశం|| చరణం 2: ఆలయమ్ముల శిల్పవిలాసం ఆరామమ్ముల కళాప్రకాశం మొగల్ సమాధుల రసదరహాసం మాకు నిత్యనూతనేతిహాసం || మాదీ స్వతంత్ర దేశం || చరణం 3: అహింసా పరమో ధర్మ: సత్యం వద ధర్మం చర ఆది ఋషుల వేదవాక్కులు మా గాంధీ గౌతముల సువాక్కులు || మాదీ స్వతంత్ర దేశం || చరణం 4: స్వతంత్రతా భ్రాతృత్వాలు సమతా మా సదాశయాలు