ఎస్. నటరాజన్ (శారద) వర్ధంతి సందర్భంగా – ..


17 ఆగస్టు – ఎస్. నటరాజన్ (శారద) వర్ధంతి సందర్భంగా –
..
శ్రీ ఎస్. నటరాజన్ – కలం పేరు శారద.
1924లో తమిళునాడులో పేద బ్రహ్మణ కుటుంబంలో పుట్టి, పొట్ట కూటికై 12 వ ఏట తెనాలి వచ్చి, హొటల్‌లో సర్వర్‌గా జీవితం మొదలు పెట్టాడు. మొదట తెలుగు మాట్లాడడం నేర్చుకొని, 13వ ఏట తెలుగు వ్రాయడం, చదవడం నేర్చుకొని , 22వ ఏట తెలుగులో స్వంతంగా రచనలు చేసాడు.
మూర్చరోగంతో బాధ పడుతూ, రోజంతా గొడ్డు చకిరి చేస్తూ, రాత్రి గుడ్డి కిరసనాయిల్ దీపం వెలుతురులో తెలుగులో రచనలు చేసాడు. 100 దాకా సాంఘిక, డిటెక్టివ్ కధలు, మంచీ-చెడు, అపస్వరాలు వంటి ఒక డజన్ నవలలు, ఇంకా నాటికలు, వ్యంగ్య రచనలు చేసి, కొడవటిగంటి, చలం, గోపిచంద్, శ్రీశ్రీ వంటి లబ్దప్రతిష్టుల మన్ననలు పొందాడు.
అనారోగ్యంతో, ఆకలి దప్పులతో జీవితాంతం పోరాడుతూ 17-08-1955 న 31 ఏళ్ళ చిన్న వయసులోనే కన్నుమూసాడు.
..
తెలుగు సాహితీ వీధుల్లో ఎప్పటికీ చెరిగిపోని తన పాద ముద్రలు విడిచి వెళ్ళిపోయిన తెలుగు వాడు కాని తెలుగు రచయిత ఎస్. నటరాజన్ (శారద).

. శారద రాసిన మంచి చెడు అపస్వరాలు . ఆంధ్ర పత్రికలో సేరయాలుగా వచ్చేవి ..

అపస్వరాలు విశ్వనాథ వారిని దృష్టి లో పెట్టుకొని రాసేడు అనెవారు.

మంచి చెడు లో పద్మ భాస్కర ల పాత్రలు .. విశ్వనాథ వారి చెలియలకట్ట గుర్తు చేస్తాయి .. విరి డిటెక్టివ్ నవల పలకల వెండి గ్లాసు కూడా చదివెను.. అబ్బో ఏనాటి కాలం మాట ...

విరే రాసిన ఏకాకి అసంపూర్ణం అనుకుంటా ..

వింజమూరి

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!