Posts

Showing posts from June, 2016

పరోపకారం... భగవంతుని చేరే మార్గం.!

Image
పరోపకారం... భగవంతుని చేరే మార్గం.! భగవంతుడిని పొందడానికి ఎన్నో మార్గాలు వున్నాయి. వాటన్నిటిలో ‘సర్వభూత హితాభిలాష’ కూడా ఒకటి. ప్రతి ప్రాణిలోనూ భగవంతుడు కొలువై వుంటాడు. అందువల్ల సమస్త ప్రాణులకు హితాన్ని, సుఖాన్ని చేకూరుస్తూ వుంటే భగవంతుడిని సేవించినట్టే అవుతుంది. ఎవరి హృదయం అయితే పరుల హితాన్ని కోరుకుంటూ వుంటుందో వారికి లోకంలో దుర్లభమైనది ఏదీ వుండదని భక్త తులసీదాసు కూడా చెప్పాడు. స్కాంద పురాణంలో ఒకచోట ఇలా పేర్కొనబడింది. పరోపకరణం యేషాం జాగర్తి హృదయే సతామ్ నశ్యంతి విపదేస్తేషాం సంపదః స్యుః పదే పదే తీర్థస్నానైర్న సా శుద్ధిర్బహుదానైర్న తత్ఫలమ్ తపోభిరుగ్రైస్తన్నాప్య ముపకృత్యా యదాప్యతే ఏ సుజనుల హృదయంలో పరోపకార భావన జాగరూకమై వుంటుందో వారి ఆపదలన్నీ తొలగిపోతాయి. సంపదలెన్నో వారికి ప్రాప్తిస్తాయి. పరోపకారం వల్ల ప్రాప్తించే పవిత్రత అనేక పుణ్య తీర్థాలలో స్నానం ఆచరించినా ప్రాప్తించదు. అందువల్ల కలిగే పుణ్యఫలితం అధిక దానాలు చేసినా, తీవ్ర తపస్సు చేసినా కలుగదు. నిష్కామ భావనతో పరోపకారం చేయడం కోసం పాటుపడేవారికి భగవత్ప్రాప్తి కూడా కలుగుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. కృష్ణ భగవానుడు భగవద్గీత

మగవారూ - ఆడవేషాలూ .!

Image
మగవారూ - ఆడవేషాలూ .! . ఒకసారి 'ద్రౌపది వస్త్రాపహరణం' నాటకానికి వెళ్లాను.  దుశ్శాసనుడు ద్రౌపది చీరలు ఒలిచే దృశ్యం. చీరలు ఎంత మట్టుకు లాగాలో దుశ్శాసనుడికి తెలియదు. ఎంతవరకూ లాగించుకోవాలో ద్రౌపదికీ తెలియదు.  ఇద్దరూ కూడా చెడ తాగి ఉన్నారు. ద్రౌపది వేషం స్త్రీ వేసి ఉంటే జాగ్రత్త పడి వుండేది. కాని వేషం కట్టినది పురుషుడు కదా! 'వద్దు వద్దు' అని తెరచాటు నుండి కేకలు వేసినా దుశ్శాసనుడు ఆగలేదు - ద్రౌపది ఆపలేదు. . చివరికి ద్రౌపది వేషధారికి పైన 'రైక', క్రింద గావంచా మిగిలింది. నెత్తిపైన బోర్లించిన బుట్టలా సవరం ఒకటి! సృష్టికంతకు ఒక్కటే దిష్టిపిడతలా ద్రౌపది మిగిలింది.  పుట్టు గుడ్డి వేషం వేస్తున్న ధృతరాష్ట్రుడు కూడా ఆ దృశ్యం చూడలేక ఎవరి సహాయం లేకుండానే తెరచాటుకి పారిపోయాడు. తెర దించబోతే పడలేదు. ద్రౌపదికి నాటకం కాంట్రాక్టరుకి భయం వేసింది కాబోలు కిందకు ఉరికాడు. ద్రౌపది వేషధారి తను ఆడో, మగో మర్చిపోయి పురుషుల వైపుకు పరిగెట్టాలో, స్త్రీల వైపుకు పరిగెట్టాలో అర్థం కాక చివరికి స్త్రీల వైపు పరిగెట్టి వాళ్ల మధ్యన కూచున్నాడు. ఆడవాళ్లంతా తటాలున లేచిపోయి పాక కాలినంత హడ

మయూరం - నెమలి - మైలతుత్తం !

Image
మయూరం - నెమలి - మైలతుత్తం ! (Vvs Sarma గారికికృతజ్ఞలతో. ) . చాగంటి కోటేశ్వరరావుగారి ధర్మమా అని ఈరోజు నెమలిని గురించి ఆలోచనలు వచ్చాయి. మయూరం చాలా విచిత్రమైన పక్షి విశేషము. సంస్కృత సాహిత్యంలో అనేక నామాలు.  . । बर्हिणः २ बर्ही ३ नीलकण्ठः ४ भुजङ्गभुक् ५ शिखाबलः ६ शिखी ७ केकी ८ मेघनादानुलासी ९ । इत्यमरः प्रचलाकी १० चन्द्रकी ११ सितापाङ्गः १२ । इति शब्दरत्नावली ॥ ध्वजी १३ मेघानन्दी १४ कलापी १५ शिखण्डी १६ चित्पिच्छिकः १७ भुजगभोगी १८ मेघनादानुलासकः १९  . పురాణాలలో కూడా నెమలి ప్రసక్తి వస్తుంది. శ్రీకృష్ణుడు నెమలి ఈక ధరిస్తాడు. కార్తికేయుని వాహనం నెమలి. భారతంలో భీష్ముడు కృష్ణుని సుబ్రహ్మణ్య అని సంబోధిస్తాడు. ఆయన శిఖలో నెమలిఈక ఆయన కుమార తత్త్వానికి సంకేతం. మయూరః పుంలింగం. మయూరి స్త్రీ. నాట్య మయూరీ అనే వర్ణన సుపరిచితం. ఈ పక్షివైచిత్ర్యానికి కారణం రామాయణంలో ఇలా ఉంది  . प्रविष्टायां हुताशन्तु वेदवत्यां स रावणः  । पुष्पकन्तु समारुह्य परिचक्राम मेदिनीम् ॥ . వేదవతి అగ్నిప్రవేశం చేశాక రావణుడు పుష్పక విమానంలో భూమిని పరిభ్రమణం చేయడం ప్రారంభించాడు. .  ततो मरुत्तं नृपतिं यजन्त

మిత్రలాభము ! (నీతి చంద్రిక - పరవస్తు చిన్నయ సూరి )

Image
మిత్రలాభము !  (నీతి చంద్రిక - పరవస్తు చిన్నయ సూరి ) . "ధనసాధనసంపత్తి లేనివారయ్యు బుద్ధిమంతులు పరస్పర మైత్రి సంపాదించుకొని కాక కూర్మ మృగ మూషికములవలె స్వకార్యములు సాధించు కొందురు." అనిన రాజపుత్రులు విని "యే కార్యములు కాక కూర్మ మృగ మూషికములు సాధించెను? మాకు సవిస్తరముగా వినిపింపుఁ" డనిన విష్ణుశర్మ యిట్లని చెప్పఁదొడంగె. . గోదావరీతీరమందు గొప్ప బూరుగు వృక్షము గలదు. అందు నానా దిక్కులనుండి వచ్చి పక్షులు రాత్రి వసించుచుండును. ఒకనాఁడు వేకువ లఘుపతనకమను వాయసము మేలుకొని రెండవ యముని వలె సంచరించుచున్న కిరాతునిఁ జూచి "వఱువాత లేచి వీని మొగము చూచితిని. నేడేమి కీడు రాఁగలదో తెలియదు. వీడు వచ్చినచోట నిలువఁదగదు. జాగు చేయక యీచోటు విడిచిపోవలె"నని యత్నము సేయుచుండగా వాఁడా వృక్షమునకు సమీపమందు నూకలు చల్లి వల పన్ని పోయి చేరువ పొదలో దాఁగి పొంచి చూచుచుండెను. అనంతరము చిత్రగ్రీవుఁడను కపోతరాజు నింగిని సంచరించుచు నేలమీఁది నూకలు చూచి తనతోడి కపోతములతో నిట్లనియె: "ఈ నిర్జన వనమందు నూకలురా నిమిత్తమేమి? మన మీ నూకల కాశ పడరాదు. తొల్లి యొక తెరువరి కంకణమున కాశపడి పులిచేతఁ దగులుకొని మ

అయ్యలరాజు రామభద్రుడు!

Image
అయ్యలరాజు రామభద్రుడు! . అయ్యలరాజు రామభద్రుడు ఆంధ్ర భోజుడు,సాహితీ సమరాంగణ సార్వభౌముడు అయిన శ్రీ కృష్ణదేవరాయలు ఆస్థానములోని అష్ట దిగ్గజాలలో అయ్యలరాజు రామభద్రుడు కూడా ఒకరని అంటారు. ఈ విషయము పరిశోధనలో ఉంది. కానీ నిస్సంశయముగా వారికి సమకాలీనుడు. ఈయన ఈనాటి కడప జిల్లాకు చెందినవాడు. సుమారు 1500-1565ల కాలానికి చెందినవాడు.ఈయన అయ్యలరాజు వంశానికి చెందిన అయ్యలరాజు తిప్పయ్య గారి మనుమడు అని ఆరుద్ర గారు చెప్పారు. ఈ అయ్యలరాజు తిప్పయ్య గారే ఒంటిమిట్ట రఘువీర శతకకర్త. రామభద్రుడు వ్రాసిన "రామాభ్యుదయాన్ని" శ్రీకృష్ణదేవరాయలు అల్లుడైన అళియ రామరాయలు యొక్క మేనల్లుడైన గొబ్బూరి నరసరాజుకు అంకితమిచ్చాడు. ఈతను ఇంకా "సకలకథాసారానుగ్రహము" అనే సంస్కృత గ్రంధము కూడా వ్రాసాడు. కానీ ఆ గ్రంధము అలభ్యం. రామాభ్యుదయము రామాభ్యుదయము ఎనిమిది ఆశ్వాసాల ప్రబంధము. ఇందులో కొన్ని చమత్కారాలు ఉన్నాయి. దశరథుని పుత్రకామేష్ఠి సందర్భంలోని వ్యాకరణ ప్రస్తావన, శూర్ఫణక ముక్కు, చెవులు కోసింది లక్ష్మణుడు కాదని చెప్పడం ఇందులోని ప్రత్యేకతలు. ఈ కావ్యం వ్యాకరణ, అలంకార శాస్త్రానికి, చక్కని ఉదాహరణ. రామకథను ప్రబంధ కావ్యంగా వ్

మళ్ళీ నేర్చుకుందాం 3. జంటపదములు --

Image
మళ్ళీ నేర్చుకుందాం 3. జంటపదములు --  (కృతజ్ఞతలు..శ్రీ Vvs Sarma గారు.) ఏతావాతా...దానాదీనా.. తాడోపేడో...వాడి..వేడి,రాతకోతలు.. గిల్లికజ్జాలు, గంపగుత్తగా,ఒళ్ళూపై....,తిమ్మిని బమ్మిని.,. తాడూ బొంగరం, వావివరస, కన్నీరుమున్నీరు, .. ఆదరాబాదరా, కరాకండీ [కరాఖండీ], కన్నూమిన్నూ,  ఉబ్బితబ్బిబ్బు, తత్తరబిత్తర,  యిలాంటి జోడీలు జాడీలకొద్దీ ఉన్నాయి మనకి.. అయితే అవి యిలా ఎందుకు జతలు కట్టాయో చెప్పగలిగితే సంతోషం..కొన్నింటి అర్థాలూ తెలియవుగా మరి! రెండు అదే పదాలు వస్తే ఆమ్రేడితం అంటారు,  రెండు సంబంధం ఉన్న లేక లేని పదాలూ జంటగా వాడతారు, రెండూ అర్థం కలిగినవి వాడతారు, ఒకొక సారి ధ్వనికోసం వాడతారు,  నొక్కి చెప్పడానికి వాడతారు . 1. ఏతావాతా = ఏతావత్ అనేది సంస్కృతం శబ్దం = So much, so far ఏతావదుక్త్వా అని రామాయణంలోనూ భారతంలోనూ చాల సార్లు వస్తుంది. = ఇంతవరకు చెప్పి - అని అర్థం ఇది గోదావరిజిల్లా వాడుకలో ఏతావాతా అయింది. ఇంతకూ - అని అర్థం, ఏతావాతా చెప్పొచ్చేదేమంటే = ఇంతకూ చెప్పవచ్చేదేమంటే . 2. దానాదీనా = దాన్నీ దీన్ని = అదీ ఇది = మొత్తము మీఁద = on the whole , దానా దీనా పదిలక్షలు

వానవల్లప్పలు!

Image
. బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి .! (వానవల్లప్పలువానవల్లప్పలు.) . వానా వానా వల్లప్ప! వాకిలి తిరుగూ చెల్లప్ప! కొండమీది గుండురాయి కొక్కిరాయి కాలువిరిగె దానికేమి మందు? వేపాకు పసుపూ, వెల్లుల్లిపాయ, నూనె లోమడ్డి (నూనెమ్మ బొట్టు,) నూటొక్కసారి, పూయవోయి నూరి, పూటకొక్కతూరి. .. వల్లప్పా! వల్లప్పా! వాన కురుస్తున్న దంటుంది చెల్లెలు. బయటకుపోక చెల్లెలును వాకిట్లోనే ఆడుకోమంటాడు వల్లప్ప.  వానలో తిరిగితే కొండమీదినుండి (ఆకాశం నుండి) గుండురాళ్లు (వడగళ్లు) పడి కొక్కిరాయి (అల్లరి పిల్లవాడు) కాలు విరిగింది -  కాబట్టి వానలోకి పోవద్దని వల్లప్ప అంటే,  కాలు విరిగితే మందు ఏమిటని చెల్లెలు అడుగుతుంది. వేపాకు, పసుపు, వెల్లుల్లిపాయ నూనెలో మడ్డి - ఇవన్నీ కలిపి, నూటొక్క సారిపిండి (ఆవర్తితతైలము) ఆ తైలమునుపూట కొకసారి విరిగిన కాలుకు రాస్తే, కూడు కొంటుందంటాడు వల్లప్ప.

మల్లినేర్చుకుందాం..(2) !. (సుభాషితాల వంటి కొన్ని చాటువులు )

Image
మల్లినేర్చుకుందాం..(2) !. (సుభాషితాల వంటి కొన్ని చాటువులు ) - లోక వ్యవహారంలో తరచూ వాడబడుతూ,వినబడుతూ ఉండే ప్రసిద్దిచెందిన కొన్ని ( తెలుగు సామెతల వంటి) ప్రత్యేక సంస్కృత శ్లోక పాదాలని, వాటికి మూలమైన సంపూర్ణ శ్లోకాలను, చదివి ఆనందించండి. ఇవి అందరు తప్పక తెలుసుకోతగ్గవి. . సంస్కృత శ్లోక పాదాలు.-వాటి అర్థాలు. ౧. “ నానృషి: కురుతే కావ్యం” = ఋషి కానివాడు కావ్యం వ్రాయలేడు. ౨. “ ఋణాను బంధ రూపేణ” = ఋణం వల్లే బంధాలు యేర్పడతాయి. ౩. “ ధన మూల మిదం జగత్”= ఈ జగత్తు అంతా ధనంమీదే ఆధారపడి ఉంది. ౪. “ భార్యా రూపవతీ శత్రు:” = అందమైన భార్య శత్రువు ( క్షమించాలి) ౫. “ ఆలస్యాదమృతం విషం”= ఆలస్యం వల్ల అమృతం కూడా విషంఅవుతుంది ౬. “ యధారజా తథాప్రజా” = రాజు ఎలాగో ప్రజలు అలాగే. ౭. “ అతి సర్వత్ర వర్జయేత్” = ఏది అతిగా చేయకూడదు. ౮. “ ఉద్యోగం పురుష లక్షణం” ( పూర్వ కాలం)= ఉద్యోగం పురుషులకే ౯. “ కర్మానుగో గచ్చతి జీవ ఏకః” మరణించినపుడు కర్మ ఒక్కటే జీవుని వెంటవస్తుంది. ౧౦. “ న భూతో న భవిష్యతి” = గతంలో, భావికాలం లో కూడా ఉండదు. పై శ్లోక పాదాలు ఏ సందర్భంలో చెప్పబడ్డాయో ఆ శ్లోకాలని ఇప్పుడు వరుస

నీతి చంద్రిక - పరవస్తు చిన్నయ సూరి!

Image
నీతి చంద్రిక - పరవస్తు చిన్నయ సూరి! . గంగాతీరమందు సకలసంపదలు గలిగి పాటలీపుత్రమను పట్టణము గలదు. ఆ పట్టణమును సుదర్శనుఁడను రాజు పాలించుచుండెను. అతఁడొకనాఁడు వినోదార్థము విద్వాంసులతో సల్లాపములు జరుపుచుండఁగా  నొక బ్రాహ్మణుఁడు క. పరువంబు కలిమి దొరతన మరయమి యనునట్టి వీనియందొకఁడొకఁడే పొరయించు ననర్థము నాఁ బరఁగినచో నాల్గుఁ జెప్పవలయునె చెపుమా? క. పలు సందియములఁ దొలఁచును వెలయించు నగోచరార్థ విజ్ఞానము లో కుల కక్షి శాస్త్రమయ్యది యలవడ దెవ్వనికి వాఁడె యంధుఁడు జగతి\న్‌ అని ప్రస్తావవశముగాఁ జదివెను. ఆ పద్యములు రాజు విని చదువు లేక మూర్ఖులయి సదా క్రీడాపరాయణులయి తిరుగుచున్న తన కొడుకులఁ దలఁచుకొని యిట్లని చింతించె: . "తల్లిదండ్రులు చెప్పినట్టు విని చదువుకొని లోకుల చేత మంచివాఁడనిపించుకొన్నవాఁడు బిడ్డఁడు గాని తక్కిన వాఁడు బిడ్డఁడా? మూర్ఖుఁడు కలకాలము తల్లిదండ్రులకు దుఃఖము పుట్టించుచున్నాఁడు. అట్టివాఁడు చచ్చెనా తల్లిదండ్రులకు దుఃఖము నాఁటితోనే తీఱుచున్నది. కులమునకు యశము తెచ్చినవాఁడు పుత్రుఁడు గాని తల్లికడుపు చెఱుపఁ బుట్టినవాఁడు  పుత్రుఁడు గాఁడు. గుణవంతులలోఁ బ్రథమగణ్యుఁడుగా

మళ్లీ నేర్చు కుందాము !...(1)

Image
మళ్లీ నేర్చు కుందాము !...(1) . విభక్తులు వాక్యములోని వేర్వేరు పదములకు అన్వయము కలిగించు ప్రత్యయములను, పదములను విభక్తులందురు.  ఇవి రెండు పదముల మధ్య సంబంధము కలిగించును.  వీటినే విభక్తి ప్రత్యయాలు అని కూడా అంటారు.  ఈ విభక్తులు ఎనిమిది.  అవి: ప్రత్యయాలు విభక్తి పేరు 1. డు, ము, వు, లు--- ప్రథమా విభక్తి. 2. నిన్, నున్, లన్, గూర్చి, గురించి--- ద్వితీయా విభక్తి. 3. చేతన్, చేన్, తోడన్, తోన్--- తృతీయా విభక్తి. 4. కొఱకున్ (కొరకు), కై--- చతుర్ధీ విభక్తి. 5.వలనన్, కంటెన్, పట్టి--- పంచమీ విభక్తి. 6. కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్--- షష్ఠీ విభక్తి. 7.అందున్, నన్--- సప్తమీ విభక్తి. 8.ఓ, ఓరీ, ఓయీ, ఓసీ--- సంబోధనా ప్రథమా విభక్తి. ప్రథమా విభక్తి ! డు, ము, వు, లు -- ప్రథమా విభక్తి. పుంలింగాలయిన, మహద్వాచకాలయిన శబ్దాలకు "డు" వస్తుంది. ఉదా: రాముడు, కృష్ణుడు అమహన్నపుంసకములకు, అదంత శబ్దాలకు "ము" వస్తుంది. ఉదా: వృక్షము, దైవము ఉకారాంత శబ్దాలకు, గోశబ్దానికి "వు" వస్తుంది. ఉదా: తరువు, ధేనువు, మధువు, గోవు బహ

భోగినీ దండకము బమ్మెర పోతన!

Image
భోగినీ దండకము బమ్మెర పోతన! **సింగభూపాల వర్ణనము** శ్రీమన్మహామంగళాకారు నాకారలక్ష్మీకుమారున్‌ గుమారీమనోరాము రామాంబరీషాది రాజన్య రాజద్యశఃకాముఁ గామాహితక్షీరవారాశి తారేశ వాగీంద్ర నాగేంద్ర మందార కుందార విందాభ్ర కల్లోలినీకాశ విఖ్యాత సత్కీర్తి ముక్తావళీ భూషితాశాంగనాలోక సీమంతు సీమంతినీ మానసారామవాటీ వసంతున్‌ వసంతావనీనాథ సంసేవితాంచత్పదాంభోజు నంభోజరాజీ సుహృత్తేజుఁ దేజోజయప్రాభవోద్దాము నుద్దామజన్యావనీ భీము భీమప్రతాపానలాభీలజిహ్వాలి కీలావినిర్మూలితారాతి పాండ్యక్షమాపాల దుర్వారగర్వాటవీవారు వారాధిపోరుప్రభా భాసుర స్ఫార కల్యాణ దుర్వారు వారాశి వేలాపరీతావనీ భార ధౌరేయు ధౌరేయతారాతిరాజన్మహాబాహు బాహాకఠోరాసి ధారావినిర్భిన్న సోమాన్వయోత్పన్న భూభృత్సమూహున్‌ సమూహామహాశేముషీ కుంఠితాశేష శత్రుక్షమావల్లభున్‌ వల్లభామానసేచ్ఛాకలాదుర్లభున్‌ దుర్లభారిక్షమానాథ మత్తేభయూధంబులం జించి చెండాడు రాసింగమున్‌ సింగభూపాలు **సింగభూపాలునిఁ గాంచి భోగిని మోహించుట** భూపాలగోపాలగోపాలికాకృష్ణగోపాలు గోపాలదేవోత్సవ క్రీడలో మేడలో నుండి జాలాంతరాళంబులన్‌ వారయోషాతనూజాత విద్యానయోపేత సౌందర్య చాతుర్య విఖ్యాత చంచద్గుణోపేత భృంగాంగనాలబ్ధ కేళీ మహాహస

పోతన బోగినీ దండకం రాసిన మండపం.!

Image
పోతన బోగినీ దండకం రాసిన మండపం.! బమ్మెర పోతన గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. వీరు సంస్కృతములో ఉన్న బాగవతంను ఆంధ్రీకరించి తన జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసినాడు. .పోతన కొంతకాలం రాచకొండని పాలించిన పద్మనాయక రాజైన సర్వజ్ఙ సింగమ నాయకుడి ఆస్ధానంలో ఉండి “భోగినిదండకం” రాశాడు.  ఇక్కడ మీరు చూస్తున్న ఈ మండపం పేరు భోగినిమండపం…ఈ మండపంలో ప్రదర్శించబడిన భోగిని నృత్యాన్ని ఆదర్శంగా తీసుకుని సహజకవి అయిన  పోతన భోగినిదండకం ” కావ్యాన్ని రాసాడని ప్రతీతి.  నల్గోండ జిల్లాలోని రాచకొండ కోటలో ఉందీ మండపం.. . బాలరసాల నవ పల్లవ కోమల కావ్యకన్యకన్, కూళల కిచ్చియప్పుడు కూడు భుజించుటకన్న సత్కవుల్ హాలికులైననేమి. గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి నిజధారసుతొద్దర పోషణార్దమై….. తమ కావ్యాలను రాజులకు అంకితమిచ్చి వారిచ్చే కానుకలతో నీచపు కూడు తినడం కంటే మంచి కవులు నాగలి చేత పట్టి అడవుల్లో కందమూలాలు తింటూ భార్యా పిల్లలను పోషించటం నయం అని చెప్పిన పోతన ఒక చేత్తో హలం ,మరొక చేత్తో కలం పట్టి ఒక చేతితో పంటలను, మరొక చేత్తో సాహిత్యాన్ని పండించిన గొప

ఆదిత్య గీతాలు..కరుణశ్రీ.!

Image
ఆదిత్య గీతాలు..కరుణశ్రీ.! శుభోదయం.! కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు సూర్యభగవానుణ్ణి ప్రస్తుతిస్తూ ఆదిత్యగీతా లానే అందమైన పాటలను వ్రాశారు. ఒకప్పుడు ప్రభాత సమయంలో ఆకాశవాణి ద్వారా భక్తిరంజని లో మధురమైన గాయకుల గళాల్లో ఈ ఆదిత్య గీతాలు ఇంటింటా మారు మ్రోగుతూ జనాలను ఉత్తేజితులను చేస్తూ ఉండేవి. అటువంటి ఆదిత్య గీతాల్లో మణిపూస లాంటి ఒక గీతం ఇది. ఈ గీతం లో కవి చేసిన పద ప్రయోగం, కవిత్వంలోని అలంకార ప్రయోగం అనుపమానం. పల్లవి : అడుగడుగో దినరాజు చూడు - పాల కడలి తరగలపైన వెడలి వస్తున్నాడు - అడుగడుగో దినరాజు చూడు పొడుపు కొండలపైన కొలువు దీరిచినాడు - వెలుగుల యెకిమీడు - వేయి చేతుల రేడు అడుగడుగో... చరణం ౧. అందాల రేవెల్గు జోడు - అరవిందాల సావాసగాడు ... అందాల .. మందేహులను గెల్చి - సిందూర రుచి దాల్చి ... మందే .. కన్దోయికిని విందు - గావించు తున్నాడూ ... కందో .. అడుగడుగో... చరణం ౨. బంగారు కిరణాల వేల్పు - చిగురు చెంగావి మువ్వల్వ దాల్పు ... బంగారు .. రంగారు తొలి ప్రొద్దు - సింగార మది ముద్దు ... రంగారు .. పొంగారు సుషమా - తరంగాల సరిహద్దు ... పొంగారు .. అడుగడుగో... చర

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది!

Image
నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది! మాటల ఐంద్రజాలికుడు శేషేంద్ర...................-  . శేషేంద్ర వచన కవితా కళను గురించి చాల తక్కువే పరిశోధన జరిగిందని చెప్పాలి. శేషేంద్ర పద్యరచనా సామర్థ్యం గురించి నేను కాదు నన్నయకన్నా ప్రాచీనుడైన విశ్వనాథ సత్యనారాయణ అంతటి ప్రాచీన కవే చెప్పాడు. శేషేంద్ర లాగా పద్యం రాయగలిగిన వాడు తెలుగు దేశంలో నలుగురైదుగురు కూడా లేరని అన్నాడు.  ఆయన ఋతు ఘోష పద్య కావ్యం నాకు చాలా కాలం పారాయణ గ్రంథంలా ఉండేది. అంతటి పద్యరచనా కళను సొంత చేసుకున్న శేషేంద్ర వచన కవితలో కూడా చాలా మంచి ప్రయోగాలు చేశాడు. అంతే కాదు నేను ఎప్పుడూ అంటుంటాను అదేమంటే మామూలు వచనాన్ని అంటే కేవలం కమ్యూనికేషన్ కోసం అంటే విషయాన్ని చెప్పడానికి మాత్రమే పనికి వచ్చే వచనాన్ని రాస్తూ కూడా అలాంటి వాక్యనిర్మాణాలు చేస్తూ కూడా దాన్ని అద్భుతమైన కవితగా మార్చే శక్తి ఒక రసాయనిక చర్య అని అది ఒక కళ అద్భుత కళ. ఇదే వచన కవితాకళ. అయితే అలాంటి పరిణతి ఈ కాలానికి వచ్చింది. తొలి తరం వచన కవులు చాలా మంది అంతకు ముందు పద్యాలు గేయాలు రాసిన వారే. ఆనాటి వచన కవితల్లో అర్థగేయాల లాగా కనిపించేవి చాలా ఉంటాయి.  పాదాల విరుపును మార్చ

ద్రౌపది — ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్

Image
ద్రౌపది — ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ పరిచయం రాసిన వారు:--- శ్రీ జంపాల చౌదరి గారు. ( ఈ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడెమి బహుమతులు వచ్చాయి.) కురుక్షేత్ర యుద్ధం ఆఖరు దినాలలో ఒక ఉదయం ఈ కథ ప్రారంభమౌతుంది. యుద్ధం భీకర పర్యవసానాన్ని చూసి విచారపడుతున్న ద్రౌపది ఈ మారణహోమం జరగటంలో తన పాత్రను గురించి ఆత్మపరీక్ష చేసుకొంటూ ఉంటుంది. అంతకుముందురోజు ఉదయం ద్రౌపదిని నిద్రలేపిన నకులుడు ద్రౌపది కుమారులు ఐదుగురినీ రాత్రికి రాత్రే అశ్వత్థామ సంహరించిన విషయం చెపుతాడు. ఆ వార్త విన్న ద్రౌపది వివశురాలవుతుంది. యుద్ధభూమిలో సోదరుడి, పుత్రుల మృతశరీరాలను చూసిన ద్రౌపదికి దుఃఖంతో పాటు కోపంకూడా వచ్చింది. అశ్వత్థామను చంపి పగతీర్చుకొమ్మని తన భర్తలను నిలదీసింది. చంపటానికి వచ్చిన పాండుపుత్రుల చేతిలో ఓడిపోయిన అశ్వత్థామ క్షమాభిక్ష కోరి తన తలపై ఉన్న చూడామణిని కోసి ఇచ్చాడని తెలిశాక ఆమె కోపం చల్లారుతుంది. . ఆ తరువాత యుద్ధంలో చనిపోయిన బంధువులకు పాండవులు తిలోదకాలు సమర్పిస్తుండగా కర్ణుడికి కూడా తిలోదకాలివ్వమని కుంతి కోరుతుంది. కర్ణుడు తన జ్యేష్టకుమారుడన్న సత్యాన్ని బయటపెట్తుంది. ఈ విషయం విన్నవారంతా ఆశ్చ

లవకుశులు జననవార్త..శ్రీ రాముని అంతరంగం.!

Image
లవకుశులు జననవార్త..శ్రీ రాముని అంతరంగం.! . ఒకవైపు మణిదీపాలు, మరోవైపు కానుగ నూనెతో వెలిగించిన గాజు దీపాలు తోటలో అక్కడక్కడా కాగడాలు-వాటిని మించి గగనంలో కోటి దీపాల కాంతి ప్రసరిస్తున్న కలువలరేడు - ఎటువంటి బాధనైనా మరిపించే అందాలరాత్రిఅది. . రాముడొక్కడే అక్కడ కూర్చున్నాడు. అతని హృదయంలో ఒక నిస్తబ్దత ఆవరించి ఉన్నది. ఆలోచనలన్నీ గడ్డకట్టి మంచుకుహరంలో పడేసినట్లున్నాయి. నిద్రలో ఉలిక్కిపడి లేచిన కోయిల ఒక్కసారి ‘కుహూ’ అని అరచి మళ్లీ కళ్లు మూసుకుంది. గాలికి తోటలోని పరిమళాలు ముక్కుపుటాలకు చేరుతున్నాయి. హాయిగా ఉన్న వెనె్నల-జాబిల్లి-పూల సుగంధాలు-ఆత్మీయుల అనురాగ భాషణలు ఇవేవీ అతడిని తాకలేకపోతున్నాయి లోకంలో నూతనంగా పుత్రుడు జన్మించినపుడు ఏ తండ్రి అయినా పొందే అనుభూతిని  ఇప్పుడు తాను అనుభవిస్తున్నాడు. తనకు కవల పిల్లలా? ఎంత సంతోషం అన్పిస్తున్నది.  . వైదేహి గర్భమెంత శుభప్రదమైనది. ఇద్దరు బిడ్డలకు ఒకేసారి జన్మనిచ్చిన ఆ వుదరాన్ని తాకే అదృష్టం తనకు లేకుండా పోయింది.అతని హృదయంలో ఒక నిస్తబ్దత ఆవరించి ఉన్నది. ఆలోచనలన్నీ గడ్డకట్టి మంచుకుహరంలో పడేసినట్లున్నాయి.

ఉత్తర రామాయణంలో సీత.!

Image
ఉత్తర రామాయణంలో సీత.! తే. రమణి మరి కొంత వడి దాఁక రథము జూచు దరుణి మరి కొంత సేపు కేతనముఁ జూచు గాంత మరి మీద రథ పరాగంబుఁ జూచు బడఁతి మరి యంతటను వట్టి బయలు జూచు. . పై పద్యం కంకంటి పాపరాజు వ్రాసిన ఉత్తర రామాయణం లోనిది. . రాజాజ్ఞ తెలిపి, ఆమెను వదిలివేయడంతో తన పని పూర్తయిన లక్ష్మణుడు  “ దుఃఖిస్తూ నమస్కరించి, గంగ ఆవలి తీరంలో వుంచిన రథమెక్కి బయలుదేరిపోతాడు. అప్పుడు ఆ రథాన్ని చూస్తూ అలానే వుండిపోయింది సీత. నింద వలని బాధా, రాముని చర్యపట్ల దుఃఖమూ, హఠాత్తుగా జరిగిన పిడుగుపాటు లాంటి ఆఘాతం వలని దిగ్భ్రమా, భయమూ, ఈ అరణ్య మధ్యంలో ఒక్కసారిగా వదిలేసి పోయినారే దైవమా, అనే నిస్సహాయతా – ఆ నిమిషం వరకూ వున్న లక్ష్మణుడు కూడా వెళ్ళిపోతుండడంతో పై భావాలన్ని ఆమెను ఒక్కసారిగా ముప్పిరిగొనగా నిలువు గుడ్లతో లక్ష్మణుని రథం పోయిన వైపే చూస్తూ ఉండిపోయింది. రథం దూర దూరంగా వెళ్ళిపోతున్నది. ఆమె రథాన్నే చూస్తున్నది. క్రమక్రమంగా అది కనిపించకుండా పోయింది. ఇప్పుడు రథం పైన ఎగురుతున్న కేతనం మాత్రము కొంచెం కొంచెంగా కనిపిస్తున్నది. ఆమె కేతనము వైపే చూస్తున్నది. కేతనమూ కనుమరుగై పోయింది. గుర్రపు గిట్టలవల్లా, రథచక్రా

మిధునం - తెలుగు సినిమా!

Image
మిధునం - తెలుగు సినిమా! . శ్రీరమణ రచించిన “మిధునం” కధ ని సినిమా గా తీసిన తనికెళ్ళ ‘దశ’ భరణి గారి చిత్ర రాజములోని కొన్ని అధ్బుతమైన డైలాగులు,  . Ø దాంపత్యమూ - ధప్పళము (గుమ్మడికాయ ముక్కల పులుసు )....మరిగిన కొద్దీ రుచి" . Ø దొంగ బెల్లం ...దొంగ ముద్దు, అనుభవిస్తే కాని తెలియదు" . Ø అంతే కాని ఇప్పుడు? ప్రతీ వాడికి శంఖు చక్రాల్లా బీపీ, షుగరూ....!!! ఎందుకు రావు? నీళ్ళకి స్విచ్చి, నిప్పులకి స్విచ్చి, పచ్చడికి స్విచ్చి, పిండికి స్విచ్చి....ఆఖరికి ఆ స్విచ్చివేసుకోడానికి ఓపిక లేకుండా దానికి కూడా ఓ రిమోటు స్విచ్చి!!!!" . Ø మనిషిగా పుట్టడం సులువేనయ్యా...కాని మనిషిలా బ్రతకడమే కష్టం" . Ø ఒక్కడ్నో ఇద్దర్నో కంటా వనుకుని పెద్దవాడికి కృష్ణా అని పేరు పెట్టాను...ఏడాది తిరగకుండా పుట్టుకోస్తుంటే.. ప్రతీ సంవత్సరం పేర్ల కోసం ఎక్కడ అఘోరించడం అనీ.............ఇంకా నావల్లకాక...కేశవ నామాలు అందుకున్నా...!!" . Ø ఊరగా............ఊరగా....ఊరగాయ. కోరగా ....కోరగా.........కొబ్బరి" . Ø కలలు కన్న దేశానికి వెళ్ళాకా ...కన్న దేశం కలలోకి వస్తుంటుంది" .

శ్రీ ముని'మాణిక్యం' నరసింహారావుగారు-వారి కొన్నిహాస్యోక్తులు.!

Image
శ్రీ ముని'మాణిక్యం' నరసింహారావుగారు-వారి కొన్నిహాస్యోక్తులు.! . నరసింహారావు గారు బందరులో ఉపాధ్యాయుడిగా వుండేవారు.  ఆ రోజుల్లో బందరు ఒక సాహితీ కేంద్రం. పూర్వం ఉబ్బసానికి గాడిద పాలు నాటు మందుగా వాడే వారు. నరసింహారావు గారి అబ్బాయికి ఉబ్బస వ్యాధి వుండేది. ఒక రోజు, ఆయన స్కూల్ కి వెళ్ళుతూ,  భార్యతో 'ఏమోయ్! స్కూల్ నుంచి ప్యూనును పంపుతాను, వాడు గాడిద పాలు తెస్తాడు, ఒక చెంచా పిల్లవాడికి ఇవ్వు' అని అన్నారు. సాయంత్రము, స్కూల్ నుంచి రాగానే, ఏమోయ్ పిల్లవాడికి గాడిద పాలు ఇచ్చావా? అని అడిగారు.అప్పుడామె,'ఆ సంగతే మరచి పోయానండి, ఇప్పుడు మిమ్మల్ని చూస్తే గుర్తుకు వచ్చింది' అని వంటింట్లోకి వెళ్లి పోయింది.  ఇందులో ఇమిడిన హాస్యోక్తికి, భార్య సరస సంభాషణకు ఆయన ఎంతగా మురిసిపోయారో!! ఇది మనసులో వుంచుకొని, నరసింహారావు గారు, భార్యకు మంచి సరసమైన బాణం విసరటం కోసం ఎదురు చూస్తున్నారు.  ఆయన, కొంతకాలం కర్నూల్ లో కూడా ఉద్యోగము చేశారు. కర్నూల్ వచ్చిన కొత్తలలో, ఒక రోజు భార్యను పిలిచి, 'ఏమోయ్! కర్నూల్ ఎలా వుంది?' అని అడిగారు. అందుకు ఆమె.'ఏమి కర్నూల్ అండి బాబు! ఎక్కడ చూసి

కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి ఆంధ్ర కవితాకుమారి.!

Image
కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి ఆంధ్ర కవితాకుమారి.! . కవితా కుమారి జడయల్లి జడకుచ్చు లిడ "రాయప్రోలు" "త ల్లావజ్ఝల" కిరీట లక్ష్మినింప "పింగళి" "కాటూరి" ముంగురుల్ సవరింప దేవులపల్లి శ్రీ తిలక ముంప "విశ్వనాథ" వినూత్న వీథుల కిన్నెర మీట "తుమ్మల" రాష్ట్రగాన మ్మొనర్ప "వేదుల" "నాయని" వింజామరలు వేయ "బసవరాజు" "కొడాలి" పదములొత్త గీ. "అడవి" "నండూరి" భరతనాట్యములు సలుప "జాషువా" "ఏటుకూరి" హెచ్చరిక లిడగ నవ్యసాహిత్య సింహాసనమున నీకు ఆంధ్ర కవితాకుమారి "దీర్ఘాయురస్తు ! " x

అనుభూతి.!

Image
అనుభూతి.! శ్రీ ఉత్పల సత్యనారాయణాచార్యులు గారు ఒక భువనవిజయ సభలో చెప్పిన పద్యమిది.  ఒక అందమైన అమ్మాయిని చూస్తే, ఒక వేదాంతికి, ఒక నవయువకునికి , ఒక పిల్లవానికీ, అలాగే ఒక కవికీ, ఎలాంటి అనుభూతులు కలుగుతాయో -  ఒక పద్యంలో వర్ణించమన్నారతన్ని. అప్పుడతను ఆశువుగా చెప్పిన పద్యమిది: . ఒకనికి మట్టిదిమ్మవు, మరొక్కనికీ వపరంజిబొమ్మ, విం కొకనికి నమ్మవౌదు, మధురోహల ఊయలలూగునట్టి యీ సుకవికి యేమియయ్యెదవు సుందరి! యీ కవితాకళామయా త్మికజగతిన్ రసజ్ఝరుల దేల్చెడి ముద్దులగుమ్మవౌదువా! . వేదాంతికి మట్టిదిమ్మ, నవయువకునికి అపరంజిబొమ్మ,  పిల్లవానికి అమ్మ. ఎవరి మానసిక స్థితికి తగ్గట్టువారు స్పందిస్తారు.  ఈ పద్యంలో కవి స్పందనకున్న ప్రత్యేకత గమనించారా!  తక్కిన ముగ్గురికీ ఆమె ఒక వ్యక్తిగా నేరుగా ఒకో రకమైన అనుభూతిని కలిగిస్తోంది. కానీ కవికి ఆమె భౌతిక వ్యక్తిత్వంతో పనిలేదు.  కవితాలోకంలో రసజ్ఝరుల తేల్చే ఒక ప్రేరణ. అది శృంగార రసమైనా కావొచ్చు, వాత్సల్యమైనా కావచ్చు, మరేదైనా కావచ్చు! (చిత్రం.. రవివర్మ.. దమయంతి వనవాసం.)

మూడు యేడుపులు ..తెనాలి వారి వ్యాఖ్య !

Image
మూడు యేడుపులు ..తెనాలి వారి వ్యాఖ్య ! అల్లసానిపెద్దన అటు నిటుగా యేడ్చే.. అల్లసాని పెద్దన వ్రాసిన మనుచరిత్ర ప్రబంధం లోని వరూధిని ఏడుపు వర్ణన. . పాటున కింతు లోర్తురే కృపా రహితాత్మక నీవు త్రోవ ని  చ్చోట భవన్నఖాంకురాము సోకే కనుంగొనుమంచు జూపి య  ప్పాటల గంధి వేదన నెపంబిడి యేడ్చే కలస్వనంబుతో  మీటిన గబ్బి గుబ్బ చనుమిట్టల నశ్రులు చిందువందగాన్  . అర్థము:-- తనను ప్రేమించమని వేడుకుంటూ కాదంటే మీద పడి కౌగలించుకున్నవరూధినిని ప్రవరుడు తనచేతులతో త్రోసి వేశాడు.అప్పుడు ఆమె నీవు తోసి వేస్తేఆ దెబ్బకు ఆడవాళ్ళు ఓర్చుకుందురా?దయలేనివాడా నీవు త్రోసినప్పుడు నీ వేలి గోరు నాకు గ్రుచ్చుకొని గాయమయింది చూడు అని తన వక్షస్థలమును చూపి ఆ వరూధిని మధురమైన గొంతుతోవేదన అనే సాకు తో తన గోటి తో చిమ్మినకన్నీరు ఆమె వక్షస్థలము పై చింది పడుచుండగా యేడ్చేను. . ముక్కుతిమ్మన ముద్దు ముద్దుగా నేడ్చే... ముక్కుతిమ్మన వ్రాసిన "పారిజాతాపహరణము"లో సత్యభామ ఏడుపు వర్ణన . . ఈసున బుట్టి డెందమున హెచ్చిన శోకదవానలంబు చే గాసిలి యేడ్చే ప్రాణవిభు కట్టె దుటన్ లలితాంగి పంకజ  శ్రీ సఖ మైన మోము పయి చేల చెరంగిడి

మృత్యుదేవత

Image
మృత్యుదేవత శ్రీమహావిష్ణువు నాభికమలం నుంచి చతుర్ముఖ బ్రహ్మ జన్మించాడు. సృష్టికార్య నిర్వహణా భారాన్ని స్వీకరించాడు బ్రహ్మ. తొంభై నాలుగు లక్షల జీవరాసులను సృష్టించాడు. ఆ కాలంలో ప్రాణులకు మరణం లేదు. ఎందుకంటే.. సృష్టించడానికైతే బ్రహ్మ జన్మించాడు కానీ.. మరణకార్య భారాన్ని స్వీకరించడానికి ఎవరూ జన్మించలేదు. ఈ కార్యాన్ని స్వీకరించడానికి దేవగణాలలో ఎవరూ సంసిద్ధంగా లేరు. అందుచేత పుట్టకే కానీ.. చావు లేదు. బ్రహ్మ ప్రాణికోటిని సృష్టిస్తూనే ఉన్నాడు. భూదేవి ఎందరినైనా భరిస్తుందేకానీ, ఒక్క పాపిని కూడా భరించలేదు. మరణం లేని కారణంగా అసురుల దురాగతాలకు అంతులేకుండా పోయింది. ఇక భరించలేని భూదేవి, బ్రహ్మ దగ్గరకు వచ్చి,‘విధాతా..ఈ భూభారాన్ని సహించలేను కొంతకాలం ఈ సృష్టికార్యాన్ని ఆపుచెయ్యి’ అని అర్దించింది. బ్రహ్మదేవునకు భూదేవి కోరిక సమంజసంగానే తోచింది. కానీ తను సృష్టి ఆపడానికి లేదు. భూభారం ఎలా తగ్గించాలో ఆయనకు తోచలేదు. తన అసమర్థతకు తన మీద తనకే విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపానలజ్వాల సర్వ లోకాలనూ చుట్టుముట్టి బాధిస్తూంటే.. పరమశివుడు బ్రహ్మదేవుని దగ్గరకు వచ్చి శాంతించమని కోరాడు. బ్రహ్మదేవుడు అతి కష్టంమీద తన క్రో

ఉత్తమా యిల్లాలు ! యెంకి పాటలు నండూరి సుబ్బారావు!

Image
ఉత్తమా యిల్లాలు ! యెంకి పాటలు నండూరి సుబ్బారావు . ఉత్తమా యిల్లాలి నోయీ నన్నుసురుపెడితే దోస మోయీ నిదరలో నిను సూసి సెదిరెనేమో మనసు పొరుగు వోరంత నా సరస కురికారంట ఉత్తమా యిల్లాలి నోయీ ... . ఏలనే నవ్వంట ఏడుపేలే యంట పదిమంది ఆయింత పగలబడి నారంట ఉత్తమా యిల్లాలి నోయీ ... గాలెంట వోయమ్మ దూళెంట వోయమ్మ యిరుగు పొరుగోరంత యిరగబడి నారంట ఉత్తమా యిల్లాలి నోయీ ... . యీబూది వొకతెట్టె యీపిం కొకతె తట్టె నీలు సిలికే దొకతె నిలిపి సూసే దొకతె ఉత్తమా యిల్లాలి నోయీ ... సాటునుండే యెంకి సబకు రాజేశావ పదిమంది నోళ్ళల్లొ పడమంట రాశావ ఉత్తమా యిల్లాలి నోయీ ..

“కః పూర్వః” ..మాది నరసరావుపేట” !

Image
“కః పూర్వః”  ..మాది నరసరావుపేట”  ! .   పరాభవ నామ సంవత్సరంలో (1966) జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర భారతీస్వామివారి శిష్యవర్యులు శ్రీమదభినవ విద్యాతీర్థస్వామివరేణ్యులు చాతుర్మాస్యదీక్షావ్రతులై  ఉజ్జయినిలో ఉన్నప్పుడు ఉత్తరాదిలోని  పద-వాక్య-ప్రమాణ పారావార పారంగతులందఱూ వారి సన్నిధిసేవకై ఏతెంచిన తరుణం.  . ఆ రోజు ఉజ్జయినిలో విద్యార్థుల సంస్కృతభాషా వక్తృత్వప్రదర్శనం జరిగింది. ఆంధ్రదేశం నుంచి వచ్చిన ఒక పధ్నాలుగు – పదిహేనేళ్ళ పిల్లవాడు  తనవంతు రాగానే సంస్కృతంలో నిరర్గళమైన ధారాశుద్ధితో, ఉజ్జ్వలమైన తేజస్సుతో, మేఘగంభీరమైన కంఠస్వరంతో ఉద్దండపాండితీమండితంగా,  మధ్య మధ్య ఛందోమయవాణీభణితిపూర్వకంగా సర్వజనాహ్లాదకరంగా వక్తవ్యాంశాన్ని పురస్కరించుకొని ప్రసంగించాడు.  విద్వత్పరిషత్తు విభ్రాంతి చెంది, పెద్దలందఱూ నిండైన మనస్సుతో మెండైన ప్రశంసలుఉట్టిపడేకన్నులకాంతివెల్లువనుఆపిల్లవాడిపై వెల్లివిరియింపజేస్తున్నారు.రాంకవ పుస్తకాది ప్రోత్సాహక పురస్కారాలు పూర్తయిన తర్వాత,  శ్రీమదభినవ విద్యాతీర్థస్వాముల వారు ఆ పిల్లవాడికేసి చూస్తూ, “కా పూర్వః?” అని ప్రశ్నించారు. ఏది పూర్వం? సృష్టికంటె, సృష్ట్య

విక్రమోర్వశీయము!

Image
విక్రమోర్వశీయము! . విక్రమోర్వశీయము మహాకవి కాళిదాసు విరచిత సంస్కృత నాటకము.  ఇది పురూరవుడు అను రాజు మరియు దేవేంద్రుని ఆస్థాన నర్తకి అయిన ఊర్వశి ల ప్రణయగాథ.  ఈ నాటకములోని నాయకుడు పురూరవుడు అయినప్పటికీ,  చక్రవర్తి చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానములోని నవరత్నములలో ఒకడైన కాళిదాసు ఆయనపై గల ప్రేమ మరియు గౌరవ భావముచే  ఈ కృతికి ఆ పేరు పెట్టెనని కొందరి భావన. . ఊర్వశి, పురూరవుడు - రాజా రవివర్మ చిత్రం.