అయ్యలరాజు రామభద్రుడు!

అయ్యలరాజు రామభద్రుడు!

.

అయ్యలరాజు రామభద్రుడు ఆంధ్ర భోజుడు,సాహితీ సమరాంగణ సార్వభౌముడు అయిన శ్రీ కృష్ణదేవరాయలు ఆస్థానములోని అష్ట దిగ్గజాలలో అయ్యలరాజు రామభద్రుడు కూడా ఒకరని అంటారు. ఈ విషయము పరిశోధనలో ఉంది. కానీ నిస్సంశయముగా వారికి సమకాలీనుడు. ఈయన ఈనాటి కడప జిల్లాకు చెందినవాడు. సుమారు 1500-1565ల కాలానికి చెందినవాడు.ఈయన అయ్యలరాజు వంశానికి చెందిన అయ్యలరాజు తిప్పయ్య గారి మనుమడు అని ఆరుద్ర గారు చెప్పారు. ఈ అయ్యలరాజు తిప్పయ్య గారే ఒంటిమిట్ట రఘువీర శతకకర్త. రామభద్రుడు వ్రాసిన "రామాభ్యుదయాన్ని" శ్రీకృష్ణదేవరాయలు అల్లుడైన అళియ రామరాయలు యొక్క మేనల్లుడైన గొబ్బూరి నరసరాజుకు అంకితమిచ్చాడు. ఈతను ఇంకా "సకలకథాసారానుగ్రహము" అనే సంస్కృత గ్రంధము కూడా వ్రాసాడు. కానీ ఆ గ్రంధము అలభ్యం.

రామాభ్యుదయము

రామాభ్యుదయము ఎనిమిది ఆశ్వాసాల ప్రబంధము. ఇందులో కొన్ని చమత్కారాలు ఉన్నాయి. దశరథుని పుత్రకామేష్ఠి సందర్భంలోని వ్యాకరణ ప్రస్తావన, శూర్ఫణక ముక్కు, చెవులు కోసింది లక్ష్మణుడు కాదని చెప్పడం ఇందులోని ప్రత్యేకతలు. ఈ కావ్యం వ్యాకరణ, అలంకార శాస్త్రానికి, చక్కని ఉదాహరణ. రామకథను ప్రబంధ కావ్యంగా వ్రాయటమనేది గొప్ప ప్రయోగం. దాన్ని విజయవంతంగా పూర్తి చేయటం రామభద్రుడికే చెల్లింది. కాని పాత్ర పోషణ పట్ల కొంత అశ్రద్ధ అనేదీతని బలహీనత. కాని ఇందులో ఆయన రామరాజభూషణుడు అనబడే భట్టుమూర్తి కన్న నయము, అనేది పండితుల అభిప్రాయము. అశోకవనంలో ఆంజనేయస్వామి సీతమ్మ వారికి శ్రీరాముని ముద్రిక ఇచ్చినపుడు సీతమ్మ అన్న మాటలను రామభద్రుడు 14 పద్యాలుగా వ్రాశాడు. ఆ పద్యాలే రామాభ్యుదయానికి సొబగులద్దాయి అని పండితుల అభిప్రాయము.

రామాభ్యుదయము లోని అలంకార ప్రత్యేకతలకు క్రింద ఉదహరించిన పద్యము చక్కని ఉదాహరణ.ఈ పద్యము 7వ ఆశ్వాసము లోని 75 వ కంద పద్యము. ఇందులో విభీషణుడు రావణునికి నీతి చెప్తున్నప్పటిది.

:పరుషోక్తి బాధ చూడకు,

పరిణామ సుఖముచూడు, బ్రతికెద వసురే

శ్వర! మందు చేదుచూడకు, పెరిగిన

తెవులడగ జూడు పెద్దతనానన్!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!