Posts

Showing posts from November, 2013

కృష్ణుని వేదుకుతో రాధా....

Image
కృష్ణుని వేదుకుతో రాధా.... నల్లని వాడు పద్మ నయనంబుల వాడు కృపా రసంబు పై జల్లెడు వాడు మౌళి పరి సర్పిత పింఛము వాడు నవ్వు రా జిల్లెడు మోము వాడొకడు చెల్వల మాన ధనంబు దెచ్చెనో  మల్లియ లార మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే ?!! (పోతనామాత్యుడు)

సిరాశ్రీ గారి సమీక్ష....కాళిదాసు ...

Image
సిరాశ్రీ గారి సమీక్ష కాళిదాసు గురించి నేను చిన్నప్పుడు విన్న ఒక విషయం చెప్పాలి. అమ్మవారి కటాక్షం లభించడానికి ముందు కాళిదాసు అమయాకంగా ఉండేవాడట. అక్కినేని నటించిన కాళిదాసు సినిమాలో కూడా అదే చూపించారు. ఆ రోజుల్లో ఒక ఊరి పడచు అతన్ని చూసి అస్తి కస్చిత్ వాక్ విశేషః? అని అన్నదట. అంటే "అసలు నీకు కొంచెమైనా మాట్లాడగలిగే విషయం ఉందా" అని. కొన్నాళ్ళకు అమ్మవారి కరుణతో గతం అంతా మర్చిపోయి మహాకవి అయిపోయాడని ఐతిహ్యం. గతం మర్చిపోయినా కాని 'అస్తి, కస్చిత్, వాక్' అనే ఆ పడచు పలికిన ఆ మూడు పదాలు మస్తిష్కంలో ఉండిపోయాయట. ఆ పదాలు అలా ఎందుకు తలలో ఆడుతున్నాయో తెలియలేదట. ఏదైతెనేం..ఆ మూడు పదాలతో మూడు కావ్యాలు మొదలెట్టేసి రాసేసాడు.  అస్తి...తో 'అస్త్యుత్తరస్యాం దిశ దేవతాత్మా...' అంటూ కుమారసంభవం 'కస్చిత్..తో..'కస్చిత్ కాంతా విరహ గురుణా..' అంటూ మేఘ సందేశం 'వాక్' ..తో..'వాగర్ధావివ సంపృక్తౌ...' అంటూ రఘు వంశం రాసేసాడు.

ధూమకేతువు........ గురుజాడ వారి కవిత.

Image
ధూమకేతువు........ గురుజాడ వారి  కవిత. "ధూమకేతువు కేతువనియో మోము చందురు డలిగి చూడడు? కేతువా యది? వేల్పులలనల కేలి వెలితొగ కాంచుమా ! దూరబంధువు యితడు భూమికి; దారి బోవుచు చూడవచ్చెను -- డెబ్బ దెనుబది యేండ్ల కొకతరి నరుల కన్నుల పండువై

గురుజాడ అప్పారావు గారి ముత్యాలు.

Image
ముత్యాల సరాలు (గురుజాడ అప్పారావు గారి ముత్యాలు..) చూడు మునుమును మేటివారల మాట లనియెడు మంత్రమహిమను జాతి బంధములన్న గొలుసులు జారి సంపద లుబ్బెడన్ యెల్ల లోకము వొక్కయిల్లై, వర్ణ భేదములెల్ల కల్లై వేల నెరుగని ప్రేమబంధము వేడుకలు కురియ మతము లన్నియు మాసిపోవును; జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును; అంత స్వర్గ సుఖంబు లన్నవి యవని విలసిల్లున్ తోటికోడలు దెప్పె, పోనీ; సాటివా రోదార్చె, పోనీ; మాటలాడక చూచి నవ్వెడి మగువ కేమందున్ ! తోడుదొంగని అత్తగారికి తోచెనేమో యనుచు గుందితి; కాలగతి యని మామలెంతో కలగ, సిగ్గరినై చాలునహ ! మీ చాకచక్యము చదువుకిదె కాబోలు ఫలితము ! ఇంత యగువని పెద్ద లెరిగిన యింగిలీషులు చెపుదురా ? కట్టుకున్నది యేమికాని; పెట్టి పొయ్యక పోతె, పోనీ; కాంచి పెంచిన తల్లిదండ్రుల నైన కనవలదో ? తూర్పు బల్లున తెల్లవారెను; తోకచుక్క యదృశ్యమాయెను; లోకమందలి మంచి చెడ్డలు లోకు లెరుగుదు

ఏమతం గొప్పది?

Image
ఏమతం గొప్పది? By - Virabhadra Sastri Kalanadhabhatta కవిపాదుషా బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పువ్వాడ శేషగిరిరావుగారు నాకు గురు తుల్యులు.  ఒకసారి వారు క్లాసులో తెలుగు పాఠం చెప్తూవుండగా ఒకకుర్రాడు లేచి “మేష్టారూ! ఏ మతం గొప్పదండి?" అని అడిగాడు.  రావుగారు ఇల్లా అన్నారు " ఇప్పుడు నేను ఒక చిన్న కధ చెప్తాను. "  ఒక పల్లెలో ఒక రైతు, భార్య నివశిస్తున్నారు. ఒక రోజు అతని భార్య వంటచేసి, మూటకట్టుకొని పొలంలోకి తీసుకువచ్చి ఒక చెట్టునీడలో కూర్చొని, భర్తను భోజనానికి రమ్మని పిలిచింది. రైతు కాళ్ళూచేతులూ కడుక్కొని వచ్చి భార్య ముద్దలు చేసి పెట్తూవుంటే తింటున్నాడు. ఆమెకూడా భర్తకు ఒక ముద్ద పెట్టి తనో ముద్ద తింది.  ఆతర్వాత కాస్సేపు భార్య తొడపైన తలపెట్టుకొని రైతు సేద తీర్చుకున్నాడు. అతని తలను గోముగా నిమురుతూ “ మామా! మనం చచ్చిపోయాక మళ్ళీ జన్మలో కూడా ఇలాగే భార్యాభర్తలలా పుట్టాలని వుంది. అలా పుట్టడానికి వీలవుతుందా?" అంది.  దానికి రైతు “అవునే! నాకూ అలానే అనిపిస్తూవుంది. మళ్ళీ జన్మలోకూడా మనం భార్యా భర్తలలా పుట్తామంటావా? ఏమో! ఈ విషయం పంతులుగార్ని అడగాలి " అన్నాడు.  “ఇ

సంగీతమయం సమస్తం.

Image
సంగీతమయం సమస్తం   తెలుగు సినిమాకి భావయుక్తంగా పాట ఎలా పాడాలో, పద్యం ఎలా చదవాలో నేర్పిన మహాభావుడు నాగయ్య. తాను పోషించిన పాత్ర ' పోతన ' లాగే తనకంటూ ఏమీ మిగుల్చుకోలేకపోయిన ధర్మాత్ముడు నాగయ్య. సినిమావాళ్ళంటే జులాయిలు, వ్యభిచారులు అనే అపప్రధను పోగొట్టి గౌరవాన్ని తెచ్చిపెట్టిన నటుడు నాగయ్య. 1965 లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ బిరుదు పొందిన తొలి తెలుగు సినిమా నటుడు నాగయ్య. ' నా యిల్లు ' చిత్రం తర్వాత నిర్మించిన ' భక్త రామదాసు ' ఆయన్ని ఆర్థికంగా మరింత కృంగదీసింది. అనేక కష్టాలకు ఓర్చి నిర్మాణం పూర్తి చేసి విడుదల చేసినా ఆర్థికంగా విజయవంతం కాకపోవడం ఆయన్ని మరిన్ని కష్టాలలోకి నెట్టింది. అందుకే ఆయన తన అనుభవాలను వివరిస్తూ ......... " నా జీవితం ఇంకొకరికి గుణపాఠం. నేను నేర్చుకున్న నీతిని అందరికీ వెల్లడిస్తూ నేర్చుకోమని విన్నవిస్తున్నాను. దానధర్మాలు చెయ్యండి. తనకు మాలిన ధర్మాలు చేయకండి. అందరినీ నమ్మకండి. అందరూ మంచివాళ్ళే అనుకోవడం పెద్ద పొరబాటు. మేకవన్నె పులులేవరో తెలుసుకుని వాళ్ళని వేరు చేయండి. మీ మంచితనాన్ని, సహృదయతను వినియోగించుకునే వాళ్

'అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా'.

Image
దూరాన ఎక్కడో వినిపిస్తోంది 'అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా'. ఎన్టీఆర్ గారి అద్భుతమయిన నటనతో పాటు నేటి మన సూపర్ రాజకీయనాయకులు కూడా గుర్తుకు వచ్చేస్తున్నారు. ఏంటో మరి అంతా వింతగావుంది! మనం తెచ్చుకున్న పిన్నమ్మ మా పిన అమ్మ .... ఎందుకు వింటుంది.

"ఉమ్మడి కుటుంబం"

Image
"ఉమ్మడి కుటుంబం" "ఉమ్మడి కుటుంబం" లో..ఉమ్మడి అన్న పదంలోనే ఆ దగ్గరితం ఉంది. తాత, నానమ్మ, పెదనాన్న, పెద్దమ్మ, పిన్ని, బాబాయ్, అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, వదిన, బావగారు, మరిది, మరదలు, అబ్బో.. ఎన్ని భాంధవ్యాలు, ఎన్ని అల్లికలు, ఇంట్లో ఎవరికీ ఏ చిన్న సమస్య వచ్చినా తమదిగా భావించి ఆ చిక్కుముడిని విప్పుకునే వారు.  జరుగుతున్న కాలంతో పాటు నాన్నగారి తరం వచ్చేసరికి "చిన్న కుటుంబం చింతలేని కుటుంబం" అనే కొటేషన్ తో ఇద్దరు పిల్లలు చాలు అనుకునే రోజులవి.. అయినా తాత నానమ్మల మురిపాలు దొరికాయి, వాళ్ళ సంరక్షణలో పెరిగే అదృష్టం దొరికింది.  ప్రస్తుతం.. ఎలక్ట్రానిక్ యుగం.. పరుగులమయం.. భార్యాభర్త మాట్లాడుకోటానికి సమయం ఉండదు, అమ్మానాన్నలంటే.. మోయలేని బరువులు. సూటిగా చెప్పాలంటే.. వ్యర్థ పదార్ధాలు. అతి కష్టం మీద ఒక్క బిడ్డ చాలు.. అనుకుంటూ.. వాళ్ళని పెంచటానికి కూడా డే కేర్ లని ఆశ్రయిస్తూ ముక్కుపచ్చలారని పసివాళ్ళ ఆలనాపాలనా చూసుకోలేని తల్లితండ్రులు ఏమి సాధించాలని అలా పరుగులు పెడుతున్నారు? తల నెరిసిన సమయంలో వాళ్ళు జీవితంలోకి తొంగి చూసుకుంటే.. అనుభూతులకి అర్ధం తెలియన

"సంతోషాల సంబరాల కుటుంబం."

Image
"సంతోషాల సంబరాల కుటుంబం." తాతా నానమ్మల నుంచి పిల్లలు దూరం అవుతున్నారు నిజమే కానీ.. చిగురించే మొగ్గలాంటి వారి మనసులు పాడు చేయకుండా.. "పెద్దల పట్ల గౌరవాన్ని చూపించటం మనం ఎప్పుడు వాళ్ళకి నేర్పుతూ ఉండాలి.. మమతల మకరందాల మందారాలతో అల్లుకున్న కుటుంబం మనిషి "సంతోషాల సంబరాల కుటుంబం."

"శంకరశ్శంకరస్సాక్షాత్"

Image
"శంకరశ్శంకరస్సాక్షాత్"  అని ప్రపంచమంతా ఆదిశంకరులను పరమశివుని స్వరూపంగా భావించింది. "ఒక సాధారణ మానవదేహం భరించటానికి సాధ్యం కానంత ప్రతిభా పాటవాలు, అపార మేధాసంపత్తి, జ్ఞానతేజం ఆయనలో ఉన్నాయి.  అందుకే ఆయన ప్రాణాన్ని ఆ దేహం కేవలం 32 సంవత్సరాలు మాత్రమే వహించగలిగింది" అన్నారు ఒక సభలో శృంగేరీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భారతీతీర్థస్వామి. 

అన్నమయ్య 'పద’ సేవ

Image
అన్నమయ్య 'పద’ సేవ ------------------------ గోవింద గోవిందయని కొలువరె గోవిందాయని కొలువరె పాండవవరదా అని పాడరె అండజవాహను కొనియాడరె కొండలరాయనినే కోరరె దండితో మాధవునినే తలచరే జనులు పాండవవరదా అని పాడరె పాండవులను శ్రీ కృష్ణుడు ఆదుకొన్న సందర్భాలు ఒకటా రెండా ! శ్రీ కృష్ణుడు లేని పాండవులు మొక్కలు కాలేని విత్తనాలు. పాండవులను తీర్చి దిద్దింది కృష్ణుడు. కృష్ణుడు నిర్యాణము చెందినప్పుడు అర్జునుడు ఏడుస్తూ చెప్పిన ఈ పద్యం సుప్రసిద్ధం. ''మన సారధి/మన సచివుడు, మన వియ్యము, మన సఖుండు, మన బాంధవుడున్ , మన విభుడు, గురుడుదేవర మనలను దిగనాడి చనియె మనుజాధీశా!'' అర్జునుడు ద్రౌపదిని పెండ్లాడింది కృష్ణుని కటాక్షం వల్ల. ఇంద్రుని నుండి గాండీవాన్ని గ్రహించింది కృష్ణుని వల్ల. పాండవులు రాజసూయ యాగం చేయగలిగింది కృష్ణుని సహాయం వల్ల. పాంచాలి మనం కాపాడాడు. ముక్కోపియైన దుర్వాసుని శాపంనుండి రక్షించాడు. అర్జునునికి పాశుపతాస్త్రం ఇప్పించాడు. ఇలా కృష్ణుడు చేసిన సహాయాలు ఎన్నెన్నో. అందుకే కవి పాండవవరదా అని పాడరె అన్నాడు.

“HANUMAT KALYANAM” (Hanuman’s Marriage) ..

Image
“HANUMAT KALYANAM” (Hanuman’s Marriage) ..By D.Subrhamanya prasd. In his childhood, the boons granted by the gods made Hanuman invincible. He became very mischievous. His pranks irritated many. He did not spare the sages even. He would pounce on them and tear their dress. He would throw fruit and leaves, perched atop trees. They bore with him patiently being aware of his future. One day a sage was very much disturbed by Hanuman. The sage went into a rage and cursed Hanuman: “ May you forget your strength with which you have caused us so much of pain”. The curse changed the life of Hanuman altogether. He became very calm and inert. The change pained the sages. They altered the curse on him. They blessed him thus: “If any one reminds you of your strength, you would recognize your strength and abilities and succeed”. This boon chastened Hanumantha. He became a well-behaved child and an epitome of virtuousness. Hanuman was growing older. His mother told him: “Son! It is tim

మహాప్రభో తమరు నన్ను తిట్టారా?

Image
--ఈ కథ సినెమాగా తీస్తే నేను అడుక్కుతినాల, ఓ వూరు వూరంతా పస్తుండి నాకు ముష్టెయ్యాల్సొస్తుంది. అరే ఇన్నాళ్ళనుండి సూత్తన్నాను. సినిమాకు పనికొచ్చే ఒక కథ కూడా సెప్పలేనోడివి నువ్వేం కవివయ్యా అసలు. నేనొక గొప్ప కథ సెప్తాను ఇనుకో.మధ్య తరగతి ఎదవనాయాలా. మహాప్రభో తమరు నన్ను తిట్టారా? లేదు సినిమా పేరు చెప్పా--ఆ పేరు తిట్టులా ఉంది మహాప్రభో --పేరులో తిట్టుంటేనే సినిమా హిట్టవుద్దయ్యా తెర లెగవంగానే ఈరో ఒక కాఫీ ఓటల్కు ఎల్తాడు. సర్వర్ రాగానే ఈరో ఏమున్నాయి అని అడిగాడు. అప్పుడు సర్వరు "ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, గారె, మషాలా గారె, ఉప్మా, కిచిడీ, పెసరట్టు, మినపట్టు, రవ్వట్టు, మషాలా అట్టు, బాత్తు, టమేటా బాత్తు, బోండా, బజ్జీ, మైసూరు బజ్జీ, మిరపకాయ బజ్జీ, అరిటికాయ బజ్జీ, తమలపాకు బజ్జీ, లడ్డు, బందరు లడ్డు, రవ్వ లడ్డు, మిఠాయి, పీచు మిఠాయి, బందరు మిఠాయి, బొంబాయి మిథాయి, కలకత్తా మిఠాయి, జాంగ్రీ, పాలకోవా,హల్వా, మైసూరు పాకు, అమలాపురం కాజా, భీమవరం బాజా, పెద్దాపురం కూజా" ఉన్నాయంటాడు. అప్పుడు ఈరో "అట్టు తే" అన్నాడు అప్పుడు సర్వరు " యే అట్టు? పెసరట్టా, మినపట్టా, రవ్వట్టా, మషాలా అట

Tongue Twister from గజేంద్ర మోక్షణం.

Image
Tongue Twister from గజేంద్ర మోక్షణం అడిగెదనని కడు వడిఁ జను- నడిగిన దను మగుడనుడుగడని నడయుడుగున్ వెడవెడ చిడిముడి తడఁ బడ  నడుగిడు; నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్ గజేంద్ర మోక్షణ ఘట్టం. భర్తగారు ఎక్కడికో హడావుడిగా పరిగెడుతున్నారు.  లక్ష్మి తటపటాయింపు ఆమె అడుగుల్లో కనబడుతోందని పోతన యీ పద్యంలో పదాలలో చూపించారు.  ఇది 'సర్వలఘు కంద పద్యం'. `ఎక్కడికి వెళ్తున్నారు?' అని అడుగుదామని తొందరగా ముందుకెళ్తుంది. అడిగినా వెనుకకి పొమ్మంటారని వెనుకకు జంకుతుంది. ఇలా అటూ యిటూ ఆగి, వెళ్ళి, తడబడుతూ అడుగులేస్తోంది. పైకి చదివితే ఈ పద్యం అందం బయటపడుతుంది.

శ్రీ కృష్ణుని రసికత, వాచాలత...

Image
శ్రీ కృష్ణుని రసికత, వాచాలత... ధర్మరాజు పట్టబిషేకం తరువాత శ్రీ కృష్ణుడు ద్వారకకు చాల కాలం తరువాత  తిరిగి వస్తాడు. తనుకు ఉన్న 16,108 పత్నులకు తమ భర్త తమ ఇంటికే మొదట వచ్చేడు అని  తల పిస్తాడు. అదే కృష్ణ మాయ.... పతి నాయింటికి మున్ను వచ్చె, నిదె నా ప్రాణేశుఁ డస్మద్గృహా- గతుడయ్యెన్ ... అప్పుడు కృష్ణుడు ఒక భామ ఇంటికి ముందు వెళితే వేరొకతె లోఁ గుందునో, సుకరాలాపములాడదో, సొలయునో, సుప్రీతి వీక్షింపదో  అని శంకించి ప్రకటాశ్చర్య విభూతిఁ జొచ్చె బహురూప వ్యక్తుడై ఒకే సారి అందరి ఇళ్ళలో ప్రవేశించి, వారిని కుశల ప్రశ్నలు వేస్తున్నాడు। ఎలాగంటే, సీసము: తిలకమేటికి లేదు తిలకినీ తిలకమా? పువ్వులు దురుమవా పువ్వుఁ బోడి? కస్తూరి యలదవా కస్తూరికా గంధి? తొడవులు దొడువవా తొడవుతొడవ? కలహంస బెంపుదే కలహంస గామిని? కీరముఁ జదివింతె కీరవాణి? లతలఁ బోషింతువా లతికా లలితదేహ? సరసి నోలాడుదే సరసిజాక్షి? ఆటవెలది: మృగికి మేతలిడుదె మృగశాబలోచన? గురులనాదరింతె గురువివేక? బంధుజనుల బ్రోతె బంధుచింతామణి? యనుచు సతుల నడిగె నచ్యుతుండు మనసెరిగి మాట్లాడడమంటే ఇదే! ఏ భామకి దేనియందు మక్కువో గ్ర

ప్రాస.....అంటే ఇలా ఉండాలి..

Image
ప్రాస.....అంటే ఇలా ఉండాలి.. మెచ్చిన మచ్చిక గల్గిన యిచ్చిన నీవచ్చు గాక యిచ్చ నొరులకున్ చిచ్చు కడి గొనగ వచ్చునె చిచ్చర చూపచ్చు వడిన శివునకు దక్కన్ ? పిల్లలకి తెలుగు పట్ల ఉత్సాహం, మక్కువ, ఆసక్తి, కలగాలంటే ఇలాంటి పద్యాలు వారి ఎదురుగా పెద్దలు పైకి బిగ్గరగా చదవాలి, నేర్చుకోవాలి.  అచ్చ తెలుగు పదాలతో నింపిన ఈ పోతన భాగవత పద్యం, హాలాహల భక్షణ అయిన తరువాత చెప్పబడినది. మచ్చిక = ప్రేమ ఇచ్చ = ఇష్టమయినది ఒరులకున్ = ఇతరులకి చిచ్చు కడి = అగ్గి ముద్ద కొనగవచ్చునె = తీసుకోవచ్చా ? చిచ్చర చూపు = అగ్ని నేత్రం అచ్చువడిన = stamp లాగా పడిన శివునకు దక్కన్ = శివుడికి తప్ప
Image
రాముణ్ణి గుర్తు చేసే సీత ఆకృతి అశోక వనంలో హనుమకి కనబడిన సీత ఆకృతి రాముణ్ణి స్ఫురింప జేసిందని శ్రీ విశ్వనాథ సత్యనారాయణ వారి అద్భుత కల్పన, వారి 'రామాయణ కల్పవృక్షం' కావ్యంలోనిది:. ఆకృతి రామచంద్ర విరహాకృతి, కన్బొమ తీరు స్వామి చా- పాకృతి, కన్నులన్ ప్రభు కృపాకృతి, కైశికమందు రామ దే- హాకృతి, సర్వ దేహమునయందున రాఘవ వంశ మౌళి ధ- ర్మాకృతి, కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ణ యట్లుగాన్ ఆదర్శ దాంపత్యమంటే, ఆయన్ని చూస్తే ఆవిడా గుర్తుకు రావాలి, ఆమెను చూస్తే అయన గుర్తుకు రావాలి, వారి ఇంటి మర్యాద గుర్తుకి రావాలి.

బ్రతుకు ఇంతేనులే....

Image
పసి తనపు మనో రధం ... వెన్నెల నీడ ఆయీ పోయెను లే... బ్రతుకు ఇంతేనులే.... http://www.youtube.com/watch?v=i3uJnr1LmxM

విశ్వదాభిరామ యిసుకలో తేమ

ఫణి ప్రసన్న కుమార్:-  అనగ యనగ రాగమతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తియ్యనుండు చేశి చేశి జాబు చేదౌను నిజమయా విశ్వదాభిరామ యిసుకలో తేమ 

సాపుటేరుపై సరదా పద్యం...(కామేశ్వర రావు భైరవభట్ల )

Image
సాపుటేరుపై సరదా పద్యం...(కామేశ్వర రావు భైరవభట్ల ) కాపీపేసుటు చేసిచేసి పలు ప్రోగ్రాముల్ లిఖించున్ మరిన్ మాపున్‌దోపును బగ్గులెన్నొ తుదకుం బ్రాప్తించు స్థానోన్నతుల్ ఆపై దొంతరదొంతరల్ వరడుపత్రాళుల్ మరింకెన్నొ సొం పౌ పీపీటులు గళ్ళపొత్తములు తయ్యార్ చేయుచున్ గాలమున్ దీపిన్ బుచ్చును సాపుటేరు బ్రతుకింతేకాదటోయ్ చూడగన్! దీనికి టీకా టిప్పణి: కాపీ - Copy, పేసుటు - Paste, ప్రోగ్రాము - Program, మాపున్ - fix, దోపున్ - insert, బగ్గు - bug, వరడుపత్రం - Word Document, పీపీటి - PPT(PowerPoint) (బహువచనం పీపీటులు), గళ్ళపొత్తం/గళ్ళపుస్తకం - Excel Workbook, సాపుటేరు - Software. ఇంతకన్నా దీని అర్థం వివరించాల్సిన అవసరం లేదనుకుంటా! ఏ పనీ యిచ్చిన గడువులోపల పూర్తి చేసే అలవాటు బొత్తిగా సాపుటేరు వాళ్ళకి లేదనే విషయం, పద్యం నాలుగు పాదాల్లో పూర్తికాక అయిదవ పాదానికి సాగడం ద్వారా ధ్వనింపజేసానని పద్యాన్ని "లోనారసి"న సారమతులు గ్రహించిగలరు. 

నను మెడబట్టి గెంటితివి...

Image
నను మెడబట్టి గెంటితివి... నను మెడబట్టి గెంటితివి నాటకరంగముపైకి, చేత కా దని బతిమాలుకొన్న వినవైతివి, కన్నులు విప్పి సభ్యులన్ గనుగొనినంత కాళ్ళు వడకన్ దొడగెన్ - సరికొత్త నర్తనం బనుకొని చప్పటుల్ జరిచిరందరు, చాల్ తెరదింపుమో ప్రభూ! ఈ పద్యం కరుణశ్రీగారి "అమర్ ఖయాం"లోది. ఇదో తమాషా సన్నివేశం! కవి దేవునితో మొరబెట్టుకుంటున్నాడు. పద్యం సులభంగానే అర్థమవుతోంది కదా, వివరించాల్సిన పనిలేదు. జీవితాన్నో లోకాన్నో నాటకరంగంతో పోల్చడం పాత విషయమే. ఈ పద్యంలో ఉన్న ప్రత్యేకతంతా, వద్దు మొఱ్ఱో అంటున్నా దేవుడు తనని నాటకరంగంపైకి మెడబట్టి గెంటాడనడం. ఆ తర్వాత, ఎదురుగా ఉన్న సభ్యులని చూసి యితని కాళ్ళు వణుకుతూ ఉంటే ఆ ప్రేక్షకులేమో అదేదో కొత్త నాట్యమనుకొని చప్పట్లు కొట్టడం. భలే తమాషా అయిన ఊహ కదూ. తమాషాగా కనిపించినా, చాలా లోతున్న ఊహ. మామూలుగా - లోకం నాటకరంగం, మనుషలందరూ నటులు అనే పోలికలో ఆంతర్యం ఈ జగత్తంతా మిథ్య అని, జీవితమంతా కనిపించని శక్తి మన చేత ఆడిస్తున్న నాటకమని చెప్పడం. ఇక్కడ విషయం అది కాదు! ఇక్కడ కవికి తాను నటుడిని కానని తెలుసు. నటించాలన్న కోరికా లేదు. కాని, యితరులు తనని నటుడనుకుంటున్న

A golden piece by Sailaja Mithra..

Image
చీకటి కోసం  రాత్రి దాక వేచి ఉండక్కర్లేదు  కళ్ళు మూసుకుంటే చాలు ! వెన్నెల కోసం  పౌర్ణమి దాక ఎదురు చూడక్కర్లేదు  గుండెలో ప్రేమ ఉంటే చాలు ! ప్రకృతి మనిషి లోనే ఉంది  అలంకృతి మనసు లోనే దాగుంది ! A golden piece by Sailaja Mithra..  

స్త్రీలు గాజులు ఎందుకు ధరించాలి.?

Image
స్త్రీలు గాజులు ఎందుకు ధరించాలి.? బాలికలను, వివాహం అయిన స్త్రీలను లక్ష్మీ స్వరూపంగా గౌరవించడం మన సంప్రదాయం. లక్ష్మీత్వంగల మంగళ ద్రవ్యాలుగా పసుపు, కుంకుమ, పూలు, గాజులు సూచించారు. ఈ మంగళ ద్రవ్యాలను ధరించడం వలన లక్ష్మీ ప్రదమైన చిహ్నాలు మరింత పెరుగుతాయి. అంతేగాక, లక్ష్మీని అంటే స్త్రీని కాపాడవలసిన బాధ్యత కూడా వుందని స్త్రీకి రక్షణ కూడా కల్పించడమ్ జరిగింది. అంతేకాక గాజులు ధరించడం ఆరోగ్యప్రదమైనది. అక్యుపంక్చర్ సూత్రాలు దీనిని సమర్ధిస్తున్నాయి.

శివుడట శివమట

Image
Sankisa Sankar శివుడట  శివమట శివమంటె శుభమట ఇదెక్కడి వింతో ధూర్జటట, అక్కడ  అఘాంతక గంగట! పాప పుణ్యాల  మథనపు చలనోత్పత్తి నెత్తినట! జాలినిండిన రెండు కనులట ఇదెక్కడి వింతో , నుదుటిన నిప్పంటి  మూడో కన్నట!! శివమంటే శుభమట, మరి మెడలో కాలనాగట! మిత్తిని మ్రింగినాడట  మరి మర్త్యులకెందుకీ మరణ హేలట?! శివుడట, శివమంటే శుభమట!  కరమున పుఱ్ఱెట ! ఇదెక్కడి వింతో యాచకుంజేతిన శూలమట! వేషమట వెఱ్ఱి నృత్యమట! దిగంబరుడట, కానీ అమ్మకి  సగమిచ్చినాడట!  ఇదెక్కడి వింతో తిరిగేది శ్మశానమట  కానీ ఊరంతా ముప్పది ముక్కోటి సేవకగణమట! శబ్దాలన్నీ  వాడి రూపాలట, పైగా వరదుడట, ఇదెక్కడి వింతో, వాడిచ్చేది నిశ్శబ్దమట! అవునులే  నా అఙానంతో నిరాకారమైన శివమంటి శివుడికి రూపమిస్తే అంతేనట! ( శివుడంటె శివమే, శివమంటే శివుడే, వాడిచ్చేదంతా శుభమే!! నమః శివాయ)

పుణ్య తిధులలో నదీ స్నానానికి వెళ్ళినప్పుడు....

Image
పిప్పలాద సముత్పన్నే! కృత్యే లోక భయంకరీ |  సైకదం తే మయా దత్తం ఆహారార్తం ప్రకల్పితం | ఇచ్చిన స్లోకం, మట్టిని ఒంటికి రాసుకుంటూ చెప్పుకోవాల్సినది అనుకుంటా...స్నానానికి ముందు, మట్టిని నదిలో వదుల్తూ చెప్పవలసిన మంత్రం. మ్రుత్తిక అనే ఒక రాక్షసి నదీ-సముద్ర తీరాలలో ఉంటుంది. ఆ రాక్షసికి, స్నానం చేయడానికి వచ్చే వారి ఫలాన్ని ఆహారంగా తినే వరం ఉంది. అందువలన, పుణ్య తిధులలో నదీ స్నానానికి వెళ్ళినప్పుడు, నదిలోకి దిగే ముందు, కొద్దిగా మట్టి(లేదా రాయి)ని తీసుకొని, మంత్రంతో (సమంత్రకంగా) నదిలో విదిచిపెట్టాలి - అలా చేస్తే, మన నదీ స్నాన ఫలాన్ని ఆ రాక్షసి తినదు. రాబోయే కార్తీక పౌర్ణమికి మనం నదీ లేదా సముద్ర స్నానానికి వెల్తాం కనుక.

కార్తీక పౌర్ణమి.....

Image
కార్తీక పౌర్ణమి..... కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమికి విశిష్టత ఎక్కువ. కార్తీక పౌర్ణమినాడు నమక, చమక, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడౌతాడని పురాణాలు చెబుతున్నాయి. కార్తీకపౌర్ణమి రోజు తులసికోటలో తులసి మొక్కతోపాటు ఉసిరికొమ్మ(కాయలతో) పెట్టి తులసి చెట్టుపక్కన రాధాకృష్ణుని విగ్రహాన్ని వుంచి పూజిస్తే యువతులు కోరుతున్న వ్యక్తి భర్తగా వస్తాడని ప్రతీతి. ఈ కార్తీకపౌర్ణమి రోజున ఉసిరికదానం చేయడం వల్ల దారిద్యం తొలగిపోతుంది. ఈ రోజు లలితాదేవిని సహస్రనామాలతో పూజిస్తే ఆ దేవి మనకు సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది. ఈ కార్తీకపౌర్ణమి రోజున దీపారాధన చేయడంవల్ల శివుని అనుగ్రహం కలుగుతుందని, ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా పుణ్యం కలుగుతుందని పూర్వీకులు చెబుతుంటారు.

అరి జూచున్ హరి జూచు

Image
మ. అరి జూచున్ హరి జూచు జూచుకములం దందంద మందార కే సరమాలామకరందబిందుసలిలస్యందంబు లందంబులై తొరుగం బయ్యెద కొం గొకింత దొలగం దొడ్తో శరాసారమున్ దరహాసామృతపూరముం గురియుచుం దన్వంగి కేలీగతిన్ (పై పద్యం ఉత్తర హరివంశ కావ్యం లోనిది. నాచన సోమనాథుడు రచించినది. చాలా ప్రసిద్ధమైన పద్యం.) శ్రీకృష్ణుడు నరకాసురునిపై యుద్ధానికి పోతూ తోడుగా సత్యభామను గూడా తీసుకువెళతాడు. నరకాసురుని రాజధానిని చేరీ చేరగానే పట్టణానికి రక్షగా ఉన్న రాక్షసులందరినీ చంపి, ఆ తరువాత ఇతర రాక్షస వీరులు రాగా వారితోనూ యుద్ధం చేస్తూ, మూర్ఛ పోయి, సేదదీరి లేచి సత్యభామతో, నువ్వూ సంగ్రామాన్నే కోరావు గదా, ఇప్పుడు అవసరం వచ్చింది. ఇదిగో శార్ఙ్గము అంటూ తన ధనుస్సును ఆమె చేతికి ఇస్తాడు. ఇది ఆమె నరకాసురునితో యుద్ధం చేసేటప్పుడు ఆమె సంరంభాన్ని వర్ణిస్తూ చెప్పిన పద్యం. ఇటు శత్రువును చూస్తూ, అటు ప్రియుని చూస్తూ ఏకకాలంలో వీరాన్నీ, శృంగారాన్నీ ప్రదర్శిస్తున్నది. ఆమె అటు అరిని (శత్రువుని) చూస్తున్నది. అతని మీద బాణ పరంపర కురిపిస్తున్నది. ఇటు హరిని చూస్తున్నది. అతనిపై చిరునవ్వులను చిందిస్తున్నది. ఈ రెండు పనులూ ఒక హేలావిలాసంగా నిర్వహిస్తున్నది.

పాండురంగ మాహాత్మ్యము ..

శా. ప్రారంభించిన వేదపాఠములకున్ బ్రత్యూహ మౌనంచునో ఏరా తమ్ముడ! నన్నుఁ జూడఁ జనుదే వెన్నాళ్ళనోయుండి చ క్షూరాజీవ యుగమ్ము వాఁచె నినుఁ గన్గోకున్కి మీ బావయున్ నీరాకల్ మదిఁ గోరు జంద్రు పొడుపున్ నీరాకరంబుంబలెన్.. (పై పద్యం తెనాలి రామకృష్ణుని పాండురంగ మాహాత్మ్యము అనే ప్రబంధపు తృతీయాశ్వాసం లోనిది. ) ఏరా తమ్ముడూ, మా ఇంటికి రావడమే మానేశావు. నీకోసం నేనూ, మీ బావా కళ్ళు కాయలు కాచేట్టు ఎన్నో రోజుల్నించీ ఎదురు చూస్తున్నాము, నెలపొడుపు కోసం సముద్రం ఎదురు చూస్తున్నట్లు. కొత్త వేదపాఠాలేమైనా ప్రారంభించావా? వాటికి ఆటంకం కలుగుతుందనా రావడం మానేశావు. నిన్ను చూసి ఎంత కాలమయిందో గదా! అంటూ ప్రారంభించింది. ఆత్మీయతను చూపిస్తూనే ఎంతో సున్నితంగా ఎత్తిపొడుస్తూ, వాడి మనస్సు విరగకుండా మొదలు పెట్టింది. ఎంతో సహజంగా, మనోహరంగా, సాంసారికంగా, ఆత్మీయంగా వున్నది గదా ఈ దృశ్యం. ఇంత చక్కని ఛాయాచిత్రాలతో, ఎంతో ప్రతిభతో నిగమశర్మ అక్కను తెలుగు సాహిత్యంలో చిరంజీవిని చేశాడు రామకృష్ణ కవి. అక్క ఇక ఉపదేశం ప్రారంభించింది.

హాయిహాయిగా ఆమని సాగే....

Image
హాయిహాయిగా ఆమని సాగే..... 1957 సంవత్సరంలో వచ్చిన ‘సువర్ణ సుందరి’ సినిమాలోని ఈ పాట గురించి ప్రముఖ కథకుడు, సంగీత విమర్శకుడు ‘భరాగో’ అన్న మాటలు గుర్తు తెచ్చుకోటం సమంజసం. “సోయగాలను విరజిమ్ముకుంటూ హాయిహాయిగా సాగిన ఈ ఆమని పాటలో కవితాస్పర్శ, ఆ మాటల పొందిక రామకృష్ణశాస్త్రిగారిని పదే పదే గుర్తుకు తెస్తుంది.(ఈ రాగమాలిక రచన సముద్రాల అని కొన్ని చోట్ల రాసారు!) ఈ సినిమా హిందీలోకి వెళ్ళినపుడు లతామంగేష్కర్, మహమ్మద్ రఫీలు ఇదే రాగాలను, ఇవే స్వరాలలో మరింత కర్ణపేయంగా ఆలపించగా, ఒక దక్షిణాత్య సినీ సంగీత దర్శకుడికి ఒక సినిమా పాట తొలిసారిగా జాతీయ స్థాయి అవార్డును సాధించి పెట్టిన సంగతిని గుర్తుంచుకొని ఆ పునాది తెలుగు పాటదే కదా అని మనం గర్వపడాలి.” నాలుగు రాగాలు వరుసగా: సోహిని, బహార్, జోన్‌పూరి, యమన్ ఈ పాటలోని ఒక్కొక్క చరణానికి వాడుకోబడ్డాయి. పాట ఎత్తుగడ సోహినీలో ప్రారంభం అవుతుంది. చరణానికి, చరణానికి మధ్య కూడా సోహిని రాగంలోని స్వరాలతో మొదలై ఇతర రాగాల్లోకి పాట నడుస్తుంది. రెండవ చరణం ‘ఏమో తటిల్ల..’ బహార్ రాగంలోనూ, మూడవ చరణం ‘చూడుమా చందమామ..’ జోన్‌పూరిలోనూ, ఆఖరి చరణం ‘కనుగవ తనియగా… యమన్ రాగంతో పాట పూర్తి అ

నిజం ...

Image

ఆడ జన్మ....

Image

ముద్దు గారె...

Image
ముద్దు గారె... ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు  తిద్దరాని మహిమల దేవకి సుతుడు ||ముద్దు||  అంత నింత గొల్లెతల అరచేత మాణికము  పంతమాదే కంసుని పాలి వజ్రము  కాంతుల మూడు లోకాల గరుడపచ్చబూ  చెంతల మాలోనున్న చిన్న కృష్ణుడు ||ముద్దు||  రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము  మితి గోవర్ధనపు గోమేధికము  సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము  గతియై మమ్ము గాచేటి కమలాక్షుడు ||ముద్దు||  కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము  యేలేటి శ్రీ వేంకటాద్రి యింద్రనీలము  పాలజలనిధిలోన బాయని దివ్యరత్నము  బాలునివలె దిరిగీ బద్మనాభుడు ||ముద్దు|| 

జీవితం...

Image

దేవుడు ...

Image

ఆమె పాడితే ..పగలే వెన్నెల... జగమే ఉయ్యాల...

Image
 ఆమె పాడితే ..పగలే వెన్నెల... జగమే ఉయ్యాల... జన్మ దిన శుభాకాంక్షలు...సుశీలమ్మకు ..http://www.youtube.com/watch?v=Uspk9IWpiDI

ఒంటరితనంలో....

Image
    ఒంటరితనంలోనూ, గెలుపూ, ఓటమిలోనూ సదా నిలిచి ఉండేది స్నెహితుడే! కళ్ళల్లో నీరు నిలిచినపుడు ఒక స్నేహహస్తం తడికన్నుల్ని తుడుస్తుంది. ఆపదలు ఎదురైనప్పుడు అది అభయహస్తమై చేయి పట్టి నడిపిస్తుంది. కంటికి రెప్పలా కాపాడేది, కలిమిలోనూ లేమిలోనూ వీడకుండా తోడైఉండేది నిజమైన నెస్తమే! అవసరానికి ఆదుకునే మిత్రుడు దెవుడిచ్చిన వరం. "యది సుహృద్దివ్యౌషధై: కింఫలం" ఒకటే ఔషధాల అవసరం లేదనేది బర్తృహరి సుభాషితం.           ఆనాటి సమాజం తనను ఉపేక్షించి వెలివేస్తే- తనకో గుర్తింపు, ఉనికీ కలిగించిన దుర్యోదనుడి శ్రేయం కోసం కర్ణుడు తుది శ్వాస వరకూ జీవించాడు.           చాలా సంవత్సరాల తరవాత కనిపించిన బాల్యమిత్రుడైన కుచేలుడి కాళ్ళు కడిగి నెత్తిమీద చల్లుకున్నాడు కృష్ణుడు.           అలా కర్ణుడు, కృష్ణుడు స్నేహానికి ప్రతిరూపాలుగా నిలిచారు నేటికీ. 

Divine quotes.....

Image
Divine quotes.. Singing the glory of the Lord is highly sacred. When you sing the Names of the Lord (Namasmarana), the snakes of bad qualities will come out. Namasmarana is like the piped musical instrument (Nadhaswaram), that attracts the snakes of evil qualities and draws them out and away from you. You must repeat the Lord’s Name in order to get rid of your negativities. Sing unto Him from the depth of your hearts, without any inhibition, with total dedication. Only then you can experience divine bliss. Today the Universe is facing a lot of problems due to lack of this habit. Young or old, rich or poor, educated or otherwise, everyone must do Namasmarana. Make this habit the very breath of your life. Let each and every cell of your body be filled with the Divine Name. Nothing else can give you the bliss, courage and strength you derive from singing the Lord’s Glory. Geetha beti

కొత్త బంగారులోకం....

Image
కొత్త బంగారులోకం....(Courtesy:- Srinivasrao Bhandaru) పొద్దున్నే పెడితే టీవీ లేదు. కరెంటు వుంది. ఈ కేబుల్ వాడికి చెప్పాలి. సెట్ అప్ బాక్స్ గుడ్డూ అంటూ వేలకువేలు పట్టుకుపోయాడు కాని టీవీ ఎప్పుడూ అంతే. ఇరవై నాలుగ్గంటలు వెధవ చాకిరీ వెధవ చాకిరీ అనుకుంటున్నదేమో తెలియదు. ఒక ఛానల్ వస్తే ఇంకో ఛానల్ గుర్రు బర్రు. పిక్చర్ ట్యూబ్ పగిలిపోతున్నట్టు ఒకటే చప్పుళ్ళు. డిజిటల్ క్వాలిటీ ప్రసారాలు అంటూ చేసిన ప్రచారాలు అంతటితోనే సరి. ఎవడో ఈ బాక్సులు తయారుచేసేవాడు బాగుపడివుంటాడు. డిజిటల్ సంగతి సరే వెనకే బాగావుండేదని అంతా అనేవారే కాని అడిగేవాడు లేడు. అదే సర్కారు ధైర్యం. టీవీ లేకపోతే పోయింది. ఈ సెల్ ఫోనుకేమొచ్చింది. వూరికే చెవికోసిన మేకలా అరుస్తుండేది. ఇవ్వాళ ఏమిటి ఇలా మూగనోము పట్టింది. చార్జ్ అయిపోయిందా అంటే అదీ లేదు. ఏవైందబ్బా! సెల్ ఫోను సరే అసలు నాకేమైంది. చుట్టూ ప్రపంచం చిత్రంగా మారిపోతోంది. రేడియోలో వెంకటేశ్వర సుప్రభాతం కమ్మగా వినబడుతోంది. హాల్లో ఓ మూల బల్లపై, వృద్ధాశ్రమంలో సీనియర్ సిటిజన్ లాగా ఇన్నాళ్ళు మౌనంగా పడున్న లాండ్ లైన్ ఫోను గణ గణా మోగుతోంది. వరండాలోకి వెళ్ళి చూస్తే అందరి ఇళ్ళ పైకప

భర్తుహరి సుభాషితాలు..

Image
భర్తుహరి సుభాషితాలు..