శ్రీ కృష్ణుని రసికత, వాచాలత...

శ్రీ కృష్ణుని రసికత, వాచాలత...

ధర్మరాజు పట్టబిషేకం తరువాత శ్రీ కృష్ణుడు ద్వారకకు చాల కాలం తరువాత 

తిరిగి వస్తాడు.

తనుకు ఉన్న 16,108 పత్నులకు తమ భర్త తమ ఇంటికే మొదట వచ్చేడు అని 

తల పిస్తాడు. అదే కృష్ణ మాయ....

పతి నాయింటికి మున్ను వచ్చె, నిదె నా ప్రాణేశుఁ డస్మద్గృహా-

గతుడయ్యెన్ ...

అప్పుడు కృష్ణుడు ఒక భామ ఇంటికి ముందు వెళితే

వేరొకతె లోఁ గుందునో, సుకరాలాపములాడదో, సొలయునో,

సుప్రీతి వీక్షింపదో 

అని శంకించి

ప్రకటాశ్చర్య విభూతిఁ జొచ్చె బహురూప వ్యక్తుడై

ఒకే సారి అందరి ఇళ్ళలో ప్రవేశించి,

వారిని కుశల ప్రశ్నలు వేస్తున్నాడు।

ఎలాగంటే,

సీసము:

తిలకమేటికి లేదు తిలకినీ తిలకమా? పువ్వులు దురుమవా పువ్వుఁ బోడి?

కస్తూరి యలదవా కస్తూరికా గంధి? తొడవులు దొడువవా తొడవుతొడవ?

కలహంస బెంపుదే కలహంస గామిని? కీరముఁ జదివింతె కీరవాణి?

లతలఁ బోషింతువా లతికా లలితదేహ? సరసి నోలాడుదే సరసిజాక్షి?

ఆటవెలది:

మృగికి మేతలిడుదె మృగశాబలోచన? గురులనాదరింతె గురువివేక?

బంధుజనుల బ్రోతె బంధుచింతామణి? యనుచు సతుల నడిగె నచ్యుతుండు

మనసెరిగి మాట్లాడడమంటే ఇదే!

ఏ భామకి దేనియందు మక్కువో గ్రహించి ఆమె taste ని ప్రశంసిస్తూనే

ప్రోత్సహిస్తున్నాడు, ధర్మం హెచ్చరిస్తున్నాడు।

ఇవన్నీ, మనసు నొచ్చుకోకుండా।

బంధుజనుల బ్రోతె బంధు చింతామణీ?

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!