Posts

Showing posts from January, 2018

వివేకచూడామణి ! (2వ భాగం .)

Image
వివేకచూడామణి ! (2వ భాగం .) - శ్రీ ఆదిశంకరులు, ఈ వివేకచూడామణిలో దృశ్యప్రపంచ మిథ్యాతత్త్వం గురించి, బ్రహ్మ నిజతత్త్వం గురించి, జీవ బ్రహ్మైక్య భావం గురించి, బ్రహ్మతత్వాన్ని స్వానుభవ పూర్వకంగా తెలుసుకోవటానికి అవసరమైన సాధనల గురించి వివరంగా చెప్పారు.  - కాలం, దేశం, కారణం : ఈ రెండు రకాలైన ప్రపంచాలకు కాల, దేశ, కారణ నియమాలు ఉన్నాయి. ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు? అనే ప్రశ్నలు సదా పుడుతుంటాయి. ఈ మూడుప్రశ్నలు కాల, దేశ, కారణాలకు సంబంధించినవి. బాహ్యాంతర ప్రపంచమంతా, ఈ మూడిటి సంయోగ ఫలితమే అని చెప్పవచ్చు. ఉదయం తూర్పున ఉన్న సూర్యుడు, సాయంత్రం పడమరలో ఉంటాడు. ప్రొద్దు, సాయంత్రం కాలాన్ని తెలియచేస్తాయి; తూర్పు, పడమర దేశాన్ని తెలియచేస్తాయి. ఈ ఉదయాస్తమయాలను స్వాభావికమని మనసు ఒప్పుకోదు. దాని వెనకాల ఉన్న కారణం తెలుసుకోవాలనుకుంటుంది. ఎందువల్ల అనే ప్రశ్న పుడుతుంది. దానికి సమాధానం దొరికే వరకు మనసుకు శాంతి ఉండదు - ఎందువల్ల - ‘మనం భూమిమీద ఉన్నాం కాబట్టి, భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నది కాబట్టి, సూర్యుడు తానున్న చోటనే కదలకుండా ఉన్నందువల్ల, (ఈ మూడు ప్రశ్నలే కాక ‘ఎవరు’ ఏమిటి?’ అనే ప్రశ్న సాధారణంగా ఎదురవ

వివేకచూడామణి (1) .

Image
వివేకచూడామణి (1) . - శ్రీ ఆదిశంకరులు, ఈ వివేకచూడామణిలో దృశ్యప్రపంచ మిథ్యాతత్త్వం గురించి, బ్రహ్మ నిజతత్త్వం గురించి, జీవ బ్రహ్మైక్య భావం గురించి, బ్రహ్మతత్వాన్ని స్వానుభవ పూర్వకంగా తెలుసుకోవటానికి అవసరమైన సాధనల గురించి వివరంగా చెప్పారు.  - దృశ్యప్రపంచం : మనకందరకి పుట్టినప్పటినుంచి చనిపోయేవరకు – అన్ని వేళలలో, ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులపై ఒక నిర్దిష్ట జ్ఞానం ఉంటుంది. కనబడే ప్రతి వస్తువునకు ఒక రూపం, ఒక పేరు ఉంటుంది. పేరు తెలిస్తే రూపం ఊహించవచ్చు. రూపం చూసినప్పుడు పేరు జ్ఞాపకం వస్తుంది. ఏ రూపానికైనా పేరు లేకపోతే, ఏదో ఒక పేరు పెట్టి, ఆ పేరుతో దాని గురించి చెప్తాం. ఈ సూత్రం, కనిపించే వస్తువులేకే కాక, వినిపించే శబ్దాలకు, నాలుకకు తెలిసే రుచులకు, ముక్కుకు తెలిసే వాసనలకు, శరీరానికి తగిలే స్పర్శలకు వర్తిస్తుంది. పంచేంద్రియాలకు అనుభవమయ్యే వివిధ గుణాలకు (స్పర్శలకు) ఆ గుణాలు గల వస్తువులకు వేరు వేరు పేర్లు పెట్టి వ్యవహరిస్తుంటాం. ఆ పేరుతో ఆ గుణాలుగల వస్తువును నిర్దేశించగలుగుతాం. ‘కుర్చీ కుడి పక్కన ఉన్న బల్ల మీద ఉన్న ఎర్రని పుస్తకం తీసుకురా’, అని చెప్పినప్పుడు, ఆ గదిలో ఎన్ని వస్తువులు ఉ

ముద్ద బంతి పూవు లో మూగ కళ్ళ ఊసులకు యాభయ్యేళ్ళు !!

Image
ముద్ద బంతి పూవు లో మూగ కళ్ళ ఊసులకు యాభయ్యేళ్ళు !! - (31-1-1964న విడుదలై నేటికీ తెలుగు వారి హృదయాల్లో ఆడుతోంది) ఆ తరానికి చెందిన ప్రేక్షకుల్ని అడగండి 'మూగమనసులు' గురించి ఎన్నో చెబుతారు. మధురమైన జ్ఞాపకాల్ని పంచుకొంటారు. ఆ జ్ఞాపకాల్లో గోదావరి గట్టు .. ఆ గట్టు మీద చెట్టు ..చెట్టు కొమ్మన పిట్ట.. పిసరంత పిట్టమనసులో దాగున్న మొత్తం ప్రపంచం ఇవన్నీ మనకి కనిపిస్తాయి.  అల్లరి పిల్ల గౌరి. అమ్మాయిగారు రాధ, పదవ నడిపే గోపి - ఈ ముగ్గురూ మూగమనసులతో చెప్పే ఊసులూ, బాసలూ మన హృదయాలు వినిపిస్తాయి. గోపి మరి జన్మ ఎత్తి , తన తో పాటు మళ్ళీ జన్మించిన రాధను ప్రేమించి పెళ్లి చేసుకొని , హనీ మూన్ కోసం గోదావరి మీద లాంచీ లో ప్రయాణిస్తూ "ఈ నాటి ఈ బంధమేనాటిదో .." అని పాట అందుకుంటే ప్రేక్షకులు సైతం మరో జన్మ ఎత్తిన ఫీల్ తో ఆ పాటను ఎంజాయ్ చేసారు.  గత జన్మలో సుడిగుండం లో తమ పడవ మునిగి పోయిన సంఘటన గుర్తుకొచ్చిగోపి కలవర పడితే హాల్లో జనం ఆత్రుత పడ్డారు. పడవ నడుపుతూ అమ్మాయి గారికి గోపి పాట నేర్పినప్పుడు సావిత్రి తో పాటు ప్రేక్షకులంతా మూకుమ్మడి గా "నా పాట నీ నోట పలకాల సిలకా "అంటూ శ్రుతి

సుందరకాండ విశిష్టత !

Image
సుందరకాండ విశిష్టత ! - ఆంజనేయుని సుందర రూపానికి దృశ్య మాలిక సుందరకాండ.  ఇది రామాయణంలో ఐదవ కాండ. సుందరకాండను "పారాయణ కాండ" అని కూడా అంటారు.  హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునికి తెలియజెప్పుట ఇందులో ముఖ్యాంశాలు. సుందరకాండకు ఆ పేరు ప్రతిపాదించడానికి అనేక కారణాలున్నాయి. తరచి చూస్తే, ఈ సుందరకాండ లో సుందరం కానిది ఏది లేదని చెప్పవచ్చు. శబ్ధ, అర్ధ మరియు రస సౌందర్యముల మేలుకలయిక సుందరాకాండ. భగవానునికి విష్ణుసహస్రనామములలో ‘సుందరు’ అని నామము కలదు. అలాగే అమ్మవారికి ‘సుందరి’ అని పేరు కలదు. సుందరుడు అనగా ఆనందము కలిగించువాడని అర్ధము.  సుందరే సుందరో రామః సుందరే సుందరీ కథః సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపిః సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం? అనగా,సుందరుడైన రామచంద్రమూర్తిని వర్ణిస్తున్నది కావున ఇది సుందరకాండ. సుందరమైన కథను చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన సీతను గురించి చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన అశోకవనాన్ని వర్ణిస్తున్నది కావున సుందరకాండ. సుందరమైన అంత్యాను ప్రాసలతో ఉపమాలంక

పెద్దనామాత్యుని నాయిక వరూధిని !

Image
పెద్దనామాత్యుని నాయిక వరూధిని.! . "మృగమదసౌరభవిభవ ద్విగుణిత ఘనసార సాంద్ర వీటీగంధ స్థగితేతర పరిమళమై మగువ పొలుపుఁ దెలుపు నొక్క మారుతమొలసెన్".! . “కస్తూరి, పచ్చ కర్పూరపు పరిమళాల తాలూకు చిక్కటి సౌరభము  ఇతర సువాసనలను కప్పివేస్తూ, ఒకానొక అమ్మాయి జాడను తెలిపే  గాలితెమ్మెర … అలా …వీచిందిట!” . పెద్దనామాత్యుని స్వారోచిషమనుసంభవం కావ్యంలో నాయిక వరూధిని అనే అప్సరసను పరిచయం చేసే సందర్భంలో ఆమె గురించిన మొట్టమొదటి పద్యం అది. . (వడ్డాది పాపయ్య గారి వరూధిని.)

అగ్నిమీళే పురోహితమ్‌' -భగవంతుడు !

Image
అగ్నిమీళే పురోహితమ్‌' -భగవంతుడు ! . భారతీయ తత్వ దర్శనం ప్రకారం భగవంతుడు ఎక్కడో వేరే లోకంలో ఒక రూపంతో ప్రత్యేకంగా ఉండడు. భారతీయ దైవానికి ఒక ప్రత్యేకమైన పేరు కూడా లేదు. అటువంటి దైవం గురించి ఎవరో ఒక మనిషి లేదా ప్రవక్త చెప్పలేదు. నేను చెప్పిందే నిజమని ఎవరూ చెప్పలేదు. దైవాన్ని ఎవరికి వారే తెలుసుకోమన్నారు. ఒక భారతీయుడు అఖండ ప్రకృతిలో ఉన్న అనంతమైన శక్తిలో దైవాన్ని దర్శిస్తాడు. అందుకే వేదాల్లో మొదటిదైన ఋగ్వేదంలో మొదటి సూక్తం 'అగ్నిమీళే పురోహితమ్‌' అంటూ అగ్నిని స్తుతించడంతో ప్రారంభమవుతుంది. భారతీయ దైవాలు మిగిలిన మతాల్లోలాగా కేవలం ఊహాత్మకం (Abstract) కాదు. అంటే ఎవరో చెప్పారు కాబట్టి నమ్మడం కాదు. ఎక్కడో ఒక గ్రంధంలో రాసారు కాబట్టి మనం కూడా ఉన్నారనే భావన చేయడం కాదు. కళ్ళెదురుగా ఉండే వాస్తవం. అదే ప్రకృతి దర్శనం. భారతీయ సంస్కృతిలో ప్రధానంగా పూజలందుకొనే శివుడు, విష్ణువు, దుర్గ వంటి వారందరూ కూడా ప్రకృతి శక్తులే.

ఉదయ రాగం - - వానే తాయి... తాయిరే యశోద. ని వానే తాయి. తాయి రే యశోద ని వానే తాయి..

Image
Morning Raga .... ఉదయ రాగం ! నాకు చాల ఇష్టం .. మణి శర్మ నిజం గా మనకు ఉన్న మంచి రత్నం .. my fav fusionsong forever... - తాయి రే యశోద ని వానే తాయి - రచన పరమపూజ్య శ్రీ స్వామి జగద్విఖ్యాత. తాయి రే యశోద ని --- వానే తాయి... తాయిరే యశోద. ని వానే తాయి. తాయి రే యశోద ని వానే తాయి.. మధుకర వన్-ధన –గోపికర చన్-ధన గోపి మనో-ధన ని వానే తాయి. హరి --- గోపిమనోహర-- ని వానే తాయి  హరి --- గోపిమనోహర-- ని వానే తాయి. గోకుల బృందాఆఆఆఆఆఆ గోవింద చంద్రాఆఆఆఆఆఆ తాయి రే యశోద ....ని వానే తాయి. ( 2 ).  హరి ---- తాయి రే ----యశోద ని వానే తాయి. హరి ---- తాయి రే ----యశోద ని వానే తాయి. మురళీ మనోహరా – ఆనంద సుందరాఆఆఆఆ తాయి రే యశోద ---ని వానే తాయి. హరి---- తాయి రే ----యశోద ని వానే తాయి. ( 2 ) " తాయి రే తాయి - మే వానే " తాయి రే తాయి - నే వానే తాయి రేరేరేరేరేరేరేరేరేరేరే ఆమ్మ తాయి రేరేరేరేరేరేరేరేరేరేరే తాయి రేరేరేరేరేరేరేరేరేరేరే .... ఓ " ఆమ్మ " ( తా .... యి .....రేరేరేరేరేరేరేరేరేరేరే ) తాత్పర్యము: -- ఓ మాతా యశోదా! దయయుంచి రావమ్మా! వచ్చి

అయ్యప్ప' -

Image
అయ్యప్ప' - ( రాజా రవి వర్మ చిత్రం .) - హరివరాసనమ్ విశ్వమోహనమ్ హరిదధీశ్వరమ్ ఆరాధ్యపాదుకమ్ అరివిమర్దనమ్ నిత్యనర్తనమ్ హరిహరాత్మజమ్ దేవమాశ్రయే శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా - అయ్య (= విష్ణువు), అప్ప (= శివుడు) అని పేర్ల సంగమంతో 'అయ్యప్ప' నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలైలో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు.  శబరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోనే "కుళతుపుళ"లో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు.  "అచ్చన్ కోవిల్"లో పుష్కల, పూర్ణ అనే దేవేరులసమేతుడైన అయ్యప్పను పూజిస్తారు - ఇరుముడి- - రెండు అరలువున్న మూట. భక్తులు దీనిని నెత్తిన పెట్టుకుని, మోసుకుపోతుంటారు. ఇరుముడిలో1. నేతితో నింపిన కొబ్బరికాయ 2. రెండు కొబ్బరి కాయలు 3. వక్కలు 4. తమలపాకులు 5. నాణాలు 6. పసుపు 7. గంధంపొడి 8. విభూతి 9. పన్నీరు 10. బియ్యం, 11. అటుకులు, 12. మరమరాలు, 13. బెల్లం/అరటిపళ్ళు 14. కలకండ 15. అగరువత

నమ్మితే నమ్మండీ-నవ్వితే నవ్వండి.!

Image
నమ్మితే నమ్మండీ-నవ్వితే నవ్వండి.! - మన తెలుగును యింగ్లీసోడు కాపీ చేశాడని, ఇంగ్లీషుకు తల్లి,తండ్రి తెలుగేనని అంటున్నారు శంకరనారాయణగారు. మీరు నమ్మితే నమ్మండీ -నవ్వితే నవ్వండి. యింగ్లీషువాడు boy బాయ్ అని కలవరిస్తాడు  అది మన అబ్బాయి నుంచి పుట్టిందే. 'మనిషి' అనే దాన్ని వాళ్ళు man she గా మార్చి వాడుకుంటున్నాడు .బైరన్నని బైరన్ అంటున్నాడు, అలకసుందరుడిని మార్చి అలెగ్జాండర్అన్నాడు, మన తలారి స్వాములను టయిలర్ సామ్యుల్అనిపెట్టుకున్నాడు .మన 'నరము' అనే పదమే 'nerve'గా మారింది. యింగ్లీషువాడి సొమ్మేం పోయింది? ఎప్పుడూ చలికి వణుకుతూ సరిగ్గా పలకడం చేతకాక తెలుగు భాషను పీకి పాకాన పెట్టాడు తెల్లవాడి తాడుతెగా మన'త్రాడు'నుthreadగామార్చేసుకున్నాడు. మన 'కాసు'ను cashగా చేసుకున్నాడు.' ఎవ్వని చె జనించు ఆంగ్ల మెవ్వని లోపలనుండు లీనమై '.అని పాడుకుంటే చాలు పదహారణాలఆంధ్రుడు ఆరడుగుల తెలివెన్నెల తెలుగువాడు కనిపిస్తాడు. యిలా చెప్పడం యింగ్లీషు వాడి చెవిలో పువ్వులు పెట్టడం అంటారా? మన పువ్వులోనుంచి పుట్

కృష్ణార్జునుల స్నేహం -సుభద్రా పరిణయం! (విజయవిలాసం-కర్త చేమకూరవేంకటకవి. )

Image
కృష్ణార్జునుల స్నేహం -సుభద్రా పరిణయం! (విజయవిలాసం-కర్త చేమకూరవేంకటకవి. ) క్లుప్తంగా కథ: ద్వారకనుండి గదుడనేవాడు పాడవులను దర్శించటానికి వస్తాడు. ఆప్పుడు అర్జునునితో శ్రీకృష్ణుని చెల్లెలైన సుభద్ర సౌందర్యన్ని వర్ణిస్తాడు. కానన్ సుభద్రకున్ సమంబు గాఁగ నే మృగి విలో కనన్ ; నిజంబు గాఁగ నే జగంబునందుఁ జూచి కా కానన్ దదీయ వర్ణనీయ హావభావ ధీ వయః కన న్మనోఙ్ఞ రేఖ లెన్నఁగాఁ దరంబె గ్రక్కనన్? . ఆమె అద్భుత సౌందర్యాన్ని గురించి విన్న అర్జునుడు ఆమెపై మరులుకొంటాడు. పాండవులు తమలో తాము ఒక నియమాన్ని ఏర్పరచుకున్నారు. అదేమిటంటే ద్రౌపతి ప్రతి సంవత్సరం ఒక్కొక్కరి వద్ద ఉండేటట్టుగానూ ఆ సమయంలో మిగిలిన వారు వారి ఏకాంతతకు భంగం కలిగించ రాదని, ఒకవేళ అలా భంగం కలిగించితే వారు ఒక సంవత్సరకాలం దేశాటన చేయ్యాలని నియమం. ఒక వృద్ధ బ్రాహ్మణుని గోసంరక్షణార్ధం అర్జునుడు ఆ నియమాన్ని ఉల్లంఘించి అన్నగారైన ధర్మరాజు మందిరంలో ఉన్న తన శస్త్రాస్త్రాలను తెచ్చుకొని నియమ భంగం చేస్తాడు. నియమోల్లంఘన జరిగింది కాబట్టి అర్జునుడు భూప్రదక్షిణకి బయలుదేరతాడు. అన్నగారు వారించినా ఒప్పుకోలేదు. ఆ సాకుతో ద్వారకకు వెళ్ళి సుభద్రని చేప

నటి కృష్ణకుమారి కన్నుమూత!

Image
నటి కృష్ణకుమారి కన్నుమూత! - హీరోయిన్‌ కృష్ణకుమారి - అన్ని విధాలా అందకత్తె. తర్వాతి రోజుల్లో అభినయానికి కూడా పేరు తెచ్చుకున్నా, అప్పట్లో అందర్నీ ఆకట్టుకున్నవి ఆమె అందచందాలే. అదే గుర్తు చేస్తూ వ్యాఖ్యలు సాగాయి. వంపుసొంపులు వుంటే చాలు హీరోయిన్లకు అద్భుత అభినయం అక్కరలేదని (సినీ)జనుల అభిప్రాయం అనే వెక్కిరింత యిప్పటికీ వర్తిస్తుంది. -అలనాటి అందాల నటి, నాటి దక్షిణాది సూపర్ స్టార్లందరి సరసనా హీరోయిన్ గా నటించిన కృష్ణకుమారి(84) కన్నుమూశారు.  - కృష్ణకుమారి రాజమండ్రికి చెందిన వారు. అయితే వారి కుటుంబం పశ్చిమబెంగాల్ లోని నైహతీకి వలస వెళ్లింది. కృష్ణకుమారికి మరో వెటరన్ నటి షావుకారు జానకి అక్క వరస అవుతుంది. ‘నవ్వితే నవరత్నాలు’ అనే సినిమాతో కృష్ణకుమారి తొలిసారి తెరపై అగుపించారు. ఆ తర్వాత అనేక విజయవంతమైన సినిమాల్లో నటించారు. ‘పాతాళభైరవి’లో ఆమె గంధర్వకాంతగా కనిపిస్తారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, రాజ్ కుమార్, శివాజీగణేషన్, జగ్గయ్య తదితర నాటి స్టార్ల సరసన ఆమె హీరోయిన్ గా నటించారు. తెలుగులో సుమారు 130 సినిమాల్లో నటించిన కృష్ణకుమారి, తమిళంలో ముప్పై సినిమాల వరకూ నటించారు. వివాహానంతరం ఆ

గోరుతొ పోయెదానికి......గొడ్డలి ఎందుకు!!

Image
గోరుతొ పోయెదానికి......గొడ్డలి ఎందుకు!! "డాక్టర్!..నేను మంచం మీద పడుకున్నప్పడు, నా మంచం కింద ఎవరో వున్నట్టు అనిపిస్తొంది చాల ఇబ్బందిగా వుంది...దయచేసి నన్ను కాపాడండి !! అన్నాడు మన "జగ నారాయణ షూన్యం" !! . "ఏం ఫర్వా లెదు...నేనున్నానుగా ..... ఇది చాలా ప్రమాదకరమైన రోగం .....రూ. 2,00,000 అవ్వుద్ది ... డబ్బు తీసుకుని రేపు రా !!" అన్నాడు కార్పొరేట్ ఆసుపత్రి పెద్ద దాక్టర్ ధనంజయరావు . ""జగ నారాయణ షూన్యం" !! ..నొరెళ్లబెట్టా డు !! . 20 రోజుల తరువాత ధనంజయరావు కి మన  " "జగ నారాయణ షూన్యం" కనిపించాడు,  రోడ్దుమీద "ఏం వోయ్ .....మళ్లీ రాలెదు...ఎలా వుంది నీ రోగం" అన్నడు. "ఆయ్ ...తగ్గిపోనాదండి " అన్నడు మన " "జగ నారాయణ షూన్యం" ... "అవునా ..ఎలా " అన్నడు డాక్టర్ . "ఆయ్....మా పక్కింట్లొ కార్పెంటర్ వున్నాడండి ....వాడికి నా రొగం గురుంచి చెప్పానండి ....ఓస్ ..ఇంతెనా ...అని, నా మంచం కోళ్లు 4 కోసెసాడండి ...అప్ప టినుండి నాకు బానే వుందండి .... రూ.50 పుచ్చు కున్నా

వెంగళప్ప - అల్లవుద్దీన్ దీపం !

Image
వెంగళప్ప కి సముద్రం ఒడ్డున అల్లవుద్దీన్ దీపం దొరికింది. రాచ్చసుడు "ఎదైనా 3 వరాలు కోరుకో మరి" అన్నాడు . మనవాడు వెర్రెక్కిపోయాడు !!! "నాకు పేద్ద ...కారు కావా లి"...."వాకే" అన్నాడు రాచ్చసుడు . "రెందో కోరిక??" వూం !!...నాకు పేద్ద బంగళా , భోళ్డు డబ్బూ , భోళ్డు బంగారం ...కావాలన్నాడు .." సరే, మూడవ కోరిక కూడా కోరుకొ, నేను వళతాను" అన్నాడు రాచ్చసుడు . ఇంకా....ఇంకా...ఏమిటంటంటే ...నన్ను కాలేజి అమ్మా యి లు అందరూ "లైక్" చెయ్యాలి అన్నాడు . "ఓస్ అంతేనా ...సరే " అని మన రాచ్చసుడు వెంగళప్ప ని "క్యాడ్బర్రిఎ చాక్లేట్" కింద మార్చేసి మాయమైపోయాడు!!.

శుభరాత్రి - సుభాషితం !

Image
శుభరాత్రి - సుభాషితం ! - కురుక్షేత్రంలో కౌరవులందరూ పోయారని తెలిసిన గాంధారి కోపంతో ఊగిపోతూ కృష్ణుడి దగ్గరకెళ్ళి కృష్ణా.... '' ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా '' '' నీ కడుపు మంట చల్లారిందా '' అన్నది. '' నేనేం చేశాను '' అన్నాడు కృష్ణుడు. '' చేయాల్సిందంతా చేసి.... నా కుమారులందరినీ చంపి .....నేనేం చేశానని అమాయకంగా అడుగుతున్నావా ''. అన్నది ఆవేశంతో ఊగిపోతూ. '' నీ పిల్లలు చనిపోవడానికి కారణం నేను కాదు '' అన్నాడు కృష్ణుడు. '' అంటే కారణం నేనా '' కళ్ళలో నిప్పులు కురిపిస్తూ అడిగింది గాంధారి. '' ముమ్మాటికీ నువ్వే '' అన్నాడు కృష్ణుడు. '' నేనా? ఎలా? '' గాంధారి మొహంలో ఆశ్ఛర్యం. '' ధృతరాష్ట్రుడు పుట్టు గుడ్డి. నీకు నీ భర్త మీద ఉన్న ప్రేమతో జీవితాంతం కళ్ళకు గంతలు కట్టుకుని ఆయనతో కాపురం చేశావు. వందమంది పిల్లల్ని కన్నావు గానీ ఆ పిల్లలు ఎలాంటి వాతావరణంలో పెరుగుతున్నారు? వాళ్ళేం చేస్తున్నారు? అని ఒక్కనాడైనా వాళ్ళను పరిశీలించావా? వాళ్ళు తోటి వార

మురిపించే అందాలే అవి నన్నే చెందలే.! (అభిసారిక ... )

Image
మురిపించే అందాలే అవి నన్నే చెందలే.! (అభిసారిక ... ) కొన్ని (అంది, అందని)అందాలను, అందమైన అనుభవాలను ఎంత మర్చిపోదామన్నా మర్చిపోలేం. చిన్ననాటి జ్ఞాపకాలు అమ్మచేతి గోరుముద్దలు కన్నెపిల్లల వాలు చూపులు తొలిరాత్రి తమకాలు. ఇలా, మధురమైన కొన్ని సంఘటనలు వాటి తాలుఖు జ్ఞాపకాలు, అజన్మాంతం మన స్మృతి పథంలో మెదులుతూ అనునిత్యం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఇటువంటి మధురమైన జ్ఞాపకాల్లో తోలిరేయిది ఓ మధుర ప్రస్థానం. ఏదో జరుగుతుందని మరేదో జరగబోతుందని ఇంకేదో జరగాలని ఓ కన్నెపిల్ల పడే ఆరాటం. తన కన్నుల్లలోని తమకం. విచ్చుకునే పెదవులు, బిగుసుకునే నడుము, నాట్యమాడే ఊహలు wowww ఆ అందం... ఆ ఆరాటం... ఆ అతిశయం,  అంతా ఇంతా కాదు. నిజానికి ప్రతీ స్త్రీ జీవితంలోను ఇదో మధురమైన సన్నివేశం. తనువు మనసు ఏకమై, తమకంలో తరించిపోయే భావావేశం అప్పటివరకు ఆమో వికసిస్తున్న  గులాబీ మాత్రమే. విచ్చుకుంటున్న ఆమె (పూ)రేఖులకు పరిపూర్ణమైన యవ్వన, సుఖాన్ని... రుచి చూపించే తియ్యని రేయది. పొద్దుతిరుగుడు పువ్వులాగా మగడి, కౌగిలింతలో ముడుచుకు పొయ్యే మతైన క్షణమది. తాకిళ్ళతో మొదలై,  తను మథనంతో వేడేక్కి ఇరు స్పర్శల

-నవ్వు నవ్వించు - నవ్వుతూ జీవించు - -

Image
-నవ్వు నవ్వించు - నవ్వుతూ జీవించు - - *సందేహం* జోక్! అనుకున్న ప్రకారం శేషు, భవాని పార్క్ లో కలుసుకున్నారు. "నేను రాత్రంతా మన గురించి ఆలోచించి ఓ నిర్ణయానికొచ్చాను భవానీ..." అన్నాడు శేషు. "ఏమిటది...? త్వరగా చెప్పు...?? అంది భవాని. "మనిద్దరం కలసి కొన్ని రోజులు ఎక్కడైనా గడుపుతాం. ఒక వేళ అప్పుడు మనకు సరిపడదనీ, పొరబాటు చేశామనీ అనుకుంటే ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు..." అన్నాడు శేషు ఆవేశంగా. "ఆలోచన బాగానే వుంది కాని ఆ తర్వాత పొరబాటును ఎవరు పెంచుకుంటారు?" అనుమానంగా అడిగింది భవాని. ..... .... *మందుబాబు* జోక్ దేవదాసు బాగా తాగేసి ఇంటికొచ్చాడు. అర్ధరాత్రి కావడంతో భార్యకు అనుమానం రాకుండా, వాసన తెలియకుండా ఓ అద్దం ముందు నిలబడి నోటికి ప్లాష్టర్ అతికించి వెళ్ళి పడుకున్నాడు. పొద్దున్నే భార్య వచ్చి "మీరు రాత్రి బాగా తాగొచ్చారా?" అనడిగింది. "అబ్బే...నేనసలు తాగలేదు..." అన్నాడు దేవదాసు. "మరి ఈ ప్లాస్టర్ ఎవరు అతికించారు...?" కోపంగా అడిగింది అద్దానికి అతికించి ఉన్న ప్లాష్టర్ చూపిస్తూ. ---

రసానుభూతి!

Image
- శుభోదయం -రసానుభూతి! - "రమ్యాణివీక్ష్య మధురాంశ్చ నిశమ్యశబ్దాన్ పర్యుత్సుకీ భవతి యత్సుఖితోపి జంతుః తచ్చేతసా స్మరతి నూనమబోధపూర్వం భావ స్థిరాణి జననాంతర సౌహృదాని! (కాళిదాసు, దుష్యంతుని నోట పలికించిన శ్లోకమిది.) .. ఒక రమ్యమైన దృశ్యాన్ని చూసినప్పుడో, మధురమైన సంగీతాన్ని విన్నప్పుడో, మనిషి ఆనందం పొందుతూనే, ఒకోసారి ఏదో తెలియని వేదనకు లోనవుతాడు. అలాంటి సందర్భాలలో, మనసు లోతులలో దాగిన యే పూర్వజన్మ స్మృతులో, అనుభూతులో, తనకి తెలియకుండానే ఉత్తేజితమవుతాయి కాబోలు! రసానుభూతిని యింతకన్నా రమ్యంగా వర్ణించే పద్యం మరొకటి నాకు తెలీదు! -

నా హృదయమందు! (దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి ఊర్వశి” నుంచి.)

Image
నా హృదయమందు! (దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి ఊర్వశి” నుంచి.) నా హృదయమందు … నా హృదయమందు విశ్వవీణాగళమ్ము భోరుభోరున నీనాడు మ్రోతవెట్టు; దశదిశాతంత్రులొక్క సుధాశ్రుతిని బె నంగి చుక్కలమెట్లపై వంగి వంగి నిలిచి నిలిచి నృత్యోత్సవమ్ముల చలించు. వెలుగులో యమృతాలొ తావులొ మరేవొ కురియు జడులు జడులు గాగ, పొరలి పారు కాలువలుగాగ, పూర్ణకల్లోలములుగ; కలదు నాలోన క్షీరసాగరము నేడు! దారిదొరకని నా గళద్వారసీమ తరగహస్తాల పిలుపుతొందర విదల్చు! మోయలేనింక లోకాలతీయదనము! ఆలపింతు నానందతేజోంబునిధుల! ప్రేయసి! చలియింపని నీ చేయి చేయి కీలింపుము చలియించెడు నా కంఠము నిలిచి నిలిచి పాడగా! ఊర్వశి! ఊర్వశి! నాతో ఊహాపర్ణాంచలముల ----------------------------

కోహం రండే?

Image
కోహం రండే? - కాళిదాసు గురించి తెలియని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఉపమాలంకార ప్రయోగంలో ఆయనకి ఆయనే సాటి. అందుకే ఆయన గురించి చెప్పేటప్పుడు "ఉపమా కాళిదాసః" అంటారు. కాళిదాసు గురించి ఎన్నో కధలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన విక్రమాదిత్యుని నవరత్నాలలో ఒకడని కొంతమందీ, భోజ రాజు ఆస్థానంలో ఉండేవాడని కొంతమందీ అంటారు. భోజ రాజు ఆస్థానంలో కాళిదాసు తో పాటు భవభూతి, దండి అని ఇద్దరు కవులు ఉండేవారు. ఈ ముగ్గురూ ఎవరికి వారే సాటి. అలాంటిది ఒకసారి వాళ్ళ ముగ్గురిలో ఎవరు గొప్ప అనే చర్చ బయల్దేరింది, విషయం చినికి చినికి గాలి వానై భోజ రాజు దగ్గరకు వెళ్ళింది. ఆయన కూడా ఈ విషయంలో ఓ నిర్ణయానికి రాలేక చేతులెత్తేసాడు. ఇక మనం ఆ కాళీ మాతనే అడిగి తెలుసుకుందాం అని ముగ్గురూ కాళీ మాత ఆలయానికి బయలుదేరారు,కాళిదాసు నాలుక పై బీజాక్షరాలు వ్రాసి ఆయని కవిగా తీర్చిదిద్దింది సాక్షాత్తూ ఆ కాళీ మాతే. తప్పకుండా నేనే గొప్ప కవి అని తీర్పు చెప్తుంది అని మనసులో అనుకుంటూ ఆనందపడసాగాడు కాళిదాసు. ముగ్గురూ ఆలయానికి చేరుకుని తమ వివాదాన్ని నివేదించి అమ్మ ఏం చెప్తుంద

దాశరథీ శతకము ! -

Image
దాశరథీ శతకము ! - దాశరథీ శతకము శ్రీరాముని ప్రస్తుతిస్తూ కంచర్ల గోపన్న 17వ శతాబ్దంలో రచించిన  భక్తి శతకము. ఈ శతకానికి దాశరథీ కరుణాపయోనిధీ అనే మకుటం అన్ని పద్యాలలో చివరగా వస్తుంది. దాశరథీ అనగా దశరథుని పుత్రుడైన శ్రీరాముడు. గోపన్న ఆత్రేయస గోత్రుడు . కాంమాంబ యాతని తల్లి, తండి... లింగన మంత్రి. దాశరథీ శతకం లోని పద్యాలు . అమృతపు తునకలు ,  పాల తారికలు , పూతరేకులు పనసతొనలు వంటి  ఈ పద్యాల మాధుర్యం తెలిసిన ఈ వయసు లో ఆ నాటి చేష్టలు పసితనపు తప్పిదాలు కాక మరేమిటి అనిపిస్తుందిప్పుడు. 1. శ్రీ రఘురామ ! చారు తులసీదళదామ ! శమక్షమాదిశృం గారగుణాభిరామ ! త్రిజగన్నుత శౌర్యరమాలలామ ! దు ర్వార కబంధరాక్షసవిరామ ! జగజ్జన కల్మషార్ణవో త్తారక నామ ! భద్రగిరి దాశరథీ ! కరుణాపయోనిధీ! ఓ రామచంద్రా ! దయాసముద్రుడా ! అందమైన తులసీదళమాలలను ధరించినవాడా ! శాంతి , ఓర్పు మొదలైన సద్గుణముతో శోభించువాడా !. ముల్లోకములచేత కొనియాడబడెడి శౌర్యలక్ష్మీ సమేతుడా ! దుర్వారపరాక్రముడైన కబంధాసురుని పరిమార్చినవాడా ! లోకములందలి సమస్త జనులను పాపసముద్రమునుండి తరింపచేయు తారకనాముడా ! భద్రగిరి యందు కొలువుతీరిన దశరధకుమారా !

వశిష్ఠుని విందు !

Image
వశిష్ఠుని విందు ! - విశ్వామిత్రుడు చాలా కాలం రాజ్యం చేశాడు. ఒకరోజు ఒక అక్షౌహిణి సైన్యంతో వేటకై వెళ్ళి, అలసి, వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి చేరుకొంటాడు. కుశల ప్రశ్నలు, అర్ఘ్యపాద్యాదులు అయ్యాక, విశ్వామిత్రుడు సెలవు తీసుకోబోగా, వశిష్ఠ మహర్షి తన ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతాడు. అప్పుడు విశ్వామిత్రుడు "మీ దర్శనం వల్ల, అర్ఘపాద్యాదుల వల్ల ఇప్పటికే సంతుష్టుడనయ్యాను. కాబట్టి సెలవు ఇప్పించవలసింది" అని అంటాడు. కానీ వశిష్ఠుడు ఆతిథ్యం తీసుకోమని బలవంతపెట్టడంతో, విశ్వామిత్రుడు అంగీకరిస్తాడు. వశిష్ఠుడు తన హోమధేనువు, కామధేనువు సంతతికి చెందినదీ అయిన శబల అనే గోవును పిలిచి మహారాజుకు, ఆయన సైన్యానికి వారివారి ఇచ్ఛానుసారం పదార్ధాలు తయారు చేసి, విందు చెయ్యమంటాడు. వశిష్ఠుని ఆజ్ఞ మేరకు శబల సైనికుల ఇష్ఠాలను గ్రహించి, ఆ మేరకు వారికి నచ్చిన పదార్థాలు సృష్టించి, అతిథి సత్కారాలు చేస్తుంది.

ఆర్.కె.నారాయణ్ !

Image
ఆర్.కె.నారాయణ్ ! - ఆర్.కె. నారాయణ్ గా సుప్రసిద్ధుడైనా రాసిపురం కృష్ణస్వామీ అయ్యర్ నారాయణస్వామి (అక్టోబర్ 10, 1906 – మే 13, 2001) ఒక భారతీయ రచయిత. ఆయన భారత దేశములోని ఒక కాల్పనిక పట్టణములో ఉన్న మనుషులు, వాళ్ల వ్యవహారాల గురించి ధారావాహిక  నవలలు వ్రాసాడు. ఆంగ్ల భాషలో భారతసాహిత్య రంగం యొక్క ప్రారంభ దశకు చెందిన ముగ్గురు గొప్ప రచయితలలో అయన ఒకడు. ముల్క్ రాజ్ ఆనంద్ మరియు రాజా రావు మిగిలిన ఇద్దరు. ఆంగ్ల భాషలో భారతీయ సాహిత్యాన్ని ప్రపంచానికి తెలియ చేసిన వ్యక్తిగా ఆయినకు పేరు ఉంది. భారత దేశానికి చెందిన ఆంగ్లభాష నవల రచయితలలో అతి గొప్పవారిలో ఒకరిగా అయిన భావించబడుతున్నాడు. తన గురువు మరియు మిత్రుడైన గ్రహం గ్రీన్ సహాయంతో నారాయణ్ వెలుగులోకి వచ్చారు. ఆయన వ్రాసిన మొదటి నాలుగు పుస్తాకాలను ప్రచురించడానికి ప్రచురణకర్తలను ఒప్పించడంలో గ్రహం గ్రీన్ ముఖ్య పాత్ర పోషించారు. వీటిలో స్వామీ అండ్ ఫ్రెండ్స్ , ది బాచేలర్ అఫ్ ఆర్ట్స్ , ది ఇంగ్లీష్ టీచర్  అనే మూడు సగం-స్వీయచరిత్ర పుస్తకాలు ఉన్నాయి. 1951 సంవత్సరపు అత్యుత్తమ అసలైన నవలగా పేరొందిన  ది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ మరియు  సాహిత్య అకాడెమీ పురస్కారం గెల