Posts

Showing posts from August, 2020

❤️🔻🌹-మన పెద్దబాలశిక్ష. పుట్టుక కధ .-🌹🔻❤️

Image
❤️🔻🌹-మన పెద్దబాలశిక్ష. పుట్టుక కధ .-🌹🔻❤️ . #నేటివుల(అప్పటి ప్రజల ) విద్యావిధానంలో లోపం ఉందని తెలుసుకుని ,.ఆనాటి మద్రాసు గవర్నరు సర్ తామస్ మన్రో 1822 జూలై రెండో తేదీన ఒక యీ దస్తు కోరారు .అందులో ఇలా వుంది : ‘రాజ్యాలను సంపాదించాక మనం భౌగోళికంగా సర్వేలు చేయించాము .దేశంలో పండే పంటల ఆరాలు తీశాము. వనరుల గురించి భోగట్టాలు రాబట్టాము.జనాభా లెక్కలు గుణించాము.అంతేగాని నేటివుల విద్యావిధానం గురించి తెలుసుకోడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు.' నేటివులలో మన విశ్వాసాలకు భంగం కలగకుండా వారి విద్యావిధానంలో మార్పులను తీసుకు రావాలి అప్పటి దాకా తమ సివిల్ సర్వెంట్ల చదువు కోసమే పుస్తకాలను రాయించిన ప్రభువులు నేటివుల కోసం ప్రాథమిక గ్రంథాలను రాయించాలని అనుకొన్నారు. 1832 లో మేస్తర్ కుళులో (Clu Low) అనే తెల్లదొర, తన ఆశ్రితుడైన #పుదూరు చదలవాడ సీతారామశాస్త్రిగారి చేత ‘బాలశిక్ష ‘అనే గ్రంథాన్ని రచింపచేశాడు. వీరి రచనా ప్రణాళికను చాలా జాగ్రత్తగా కుర్రవాళ్ళ గ్రహణశక్తిని దృష్టిలో వుంచుకొని గ్రంథకర్త రూపొందించాడు. ఇటువంటి పుస్తకం కోసమే ఆవురావురమంటూ ఎదురు చూస్తున్న దేశం దీనిని రెండు చేతులా ఆహ్వానించింది.#vva . 1856లో అంటే

❤️-భగవద్గీత సారాంశం నారాయణుడు-❤️

Image
                                      ❤️-భగవద్గీత సారాంశం నారాయణుడు-❤️ #నారాయణః పరం బ్రహ్మా గీతాశాస్త్రే సమీరితః", అంటే భగవద్గీతలో #నారాయణుడే పరమ దైవము అని చెప్పబడి ఉంది. అదేంటి మాకు నారాయణుడు గొప్ప వాడని తెలుసును , అయితే భగవద్గీతలో ఎక్కడా నారాయణుడు అనే పేరు కనిపించదు కదా అంటే నారాయణ అంటే ఏమిటి తెలియాలి, పరం బ్రహ్మ అంటే ఏమిటి తెలియాలి. సంస్కృతంలో బ్రహ్మ అంటే పెద్దది, మిగతా వాటిని తనంతట చేయునది.. మరి ఈ పరం బ్రహ్మ ఎక్కడ ఉంటాడు ? అంటే భగవద్గీత చెప్పేప్పుడు మధ్యలో తన విరాట్ రూపాన్ని చూపించాడు. విశ్వరూపాన్ని పదకోండవ అధ్యాయంలో చూపించాడు. ఆ రూపంలో తాను అన్నింటా లోన ఉంటాడని పదవ అధ్యాయంలో చెప్పాడు. అన్నింటా బయట ఉంటా అంటే అన్నింటినీ తనలో కలిగి ఉన్నాను అనేది పదకొండవ అధ్యాయంలో చెప్పాడు. ఇలా లోన బయట ఉండేవాణ్ణి నారాయణుడు అంటారు. సంస్కృతంలో 'ర' అంటే నశించునవి. 'నర' అంటే నశించనివి. ఈ ప్రపంచంలో కనిపించేవి మార్పు చెందుతూ ఉంటాయి కానీ నశించవు. అందుకే వీటిని వస్తువు అంటాం, అంటే అవి ఎక్కడో ఎదో ఒక రూపంలో 'వసతి' ఉంటాయి, కానీ నశించడం అనేది జరగదు. కాబట్టి అలాంటి వస్తువులని కలిగిన ఈ

❤️మరచి పోలేని మహానటుడు నూతన్ ప్రసాద్❤️

Image
  💥నూటొక్క జిల్లాల అందగాడుగా ప్రసిద్ధి చెందిన నూతన్ ప్రసాద్ (డిసెంబర్ 12, 1945 - మార్చి 30, 2011) అసలు పేరు తడినాధ వరప్రసాద్. 1970వ, 80వ దశకములో తెలుగు సినిమా రంగములో ప్రసిద్ధి చెందిన హాస్య నటుడు, ప్రతినాయకుడు.. #నూతన్ ప్రసాద్ 1945, డిసెంబర్ 12న కృష్ణా జిల్లా కైకలూరులో జన్మించాడు. బందరులో ఐటిఐ చదివిన ప్రసాద్, నాగార్జునసాగర్, హైదరాబాదులో ఉద్యోగాలు చేశాడు..#vva ఎచ్ఎఎల్ లో ఉద్యోగం చేస్తున్న సమయంలో రంగస్థల నటుడు, దరశ్శకుడైన భాను ప్రకాష్ పరిచయం అయ్యాడు. భాను ప్రకాష్ స్థాపించిన ‘కళారాధన’ సంస్థ తరపున ప్రదరర్శించిన ‘వలయం’, ‘ గాలివాన’, ‘కెరటాలు’ వంటి నాటకాలు ద్వారా నూతన్ ప్రసాద్ నాటకరంగానికి పరిచయమయ్యాడు. ఎ.ఆర్.కృష్ణ దర్శకత్వంలో మాలపల్లి 101 సార్లు ప్రదర్శించాడు.. 1973 లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి అక్కినేని నాగేశ్వరరావు నటించిన అందాల రాముడు చిత్రంతో చిత్రరంగ ప్రవేశము చేశాడు. ఆ తరువాత నీడలేని ఆడది మొదలైన చిత్రాలలో నటించినా, ఈయనకు తొలి గుర్తింపు ముత్యాల ముగ్గు చిత్రంలో రావుగోపాలరావుతో పాటు ప్రతినాయకునిగా నటించడముతో వచ్చింది. ఈ చిత్రము విజయముతో తదుపరి అనేక చిత్రాలలో ప్రతినాయకుని పాత్రలు వచ్చాయ

🔻-వినోదయ వారి కన్యాశుల్కం చిత్రం .🔻

Image
#అభినవ ఆంధ్ర సాహితీ వైతాళికుడు, తెలుగు కథకు ఆద్యుడు గురజాడ అప్పారావు గారు (21-09-1862 & 30-11-1915)పూర్తిస్థాయి వాడుక భాషలో రాసిన తొలి తెలుగు నాటకం ‘కన్యాశుల్కము’. ప్రపంచ నాటకాల్లో కన్యాశుల్కానికి ఒక ప్రముఖ స్థానం ఉంది. ఒక సమకాలీన సాంఘిక సమస్యను తీసుకొని, సభ్యసమాజంలో ఎదురయ్యే సామాన్య జనం నుండి పాత్రలను తీసుకొని రాసిన నాటకమిది. ఇందులో ప్రతి పాత్ర తనదంటూ ఒక మరుపురాని హాస్యభరిత కావ్యాన్ని ఆవిష్కరించింది. బాల్యవివాహాలు, కన్యాశుల్కము వంటి సాంఘిక దురాచారాలు, హేయమైన మానవ నైజాల వంటి సంక్షుభిత సమాజ సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరిస్తూ సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన నాటకం ‘కన్యాశుల్కము’. ఇంగ్లిషు, ఫ్రెంచి, రష్యన్‌, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో అనువాదానికి నోచుకున్న కన్యాశుల్కము, వివిధ నాటక సమాజాల ద్వారా కొన్ని వేల సార్లు ప్రదర్శితమైంది. #VVA  #వినోదా సంస్థ అధినేత డి.యల్‌ నారాయణ ‘కన్యాశుల్కం’ సినిమాను పి.పుల్లయ్య నిర్దేశికత్వంలో సినిమాగా నిర్మించారు. ఈ సినిమా 65 సంవత్సరాల క్రితం... అంటే 1955, ఆగస్టు 26న విడుదలైంది. తొలివిడత ‘రష్‌’లో ప్రేక్షకాదరణ లభించకపోకపోయినా తరువాతి కాలంలో విడుదలైన ప్రతిసారీ కాసుల

🔻💥🚩అంజలీ దేవి .🚩💥🔻

Image
❤️అభినవ #సీతమ్మగా పేరొందిన అంజలీదేవి (ఆగష్టు 24, 1927 - జనవరి 13, 2014) 1950-75 తరానికి చెందిన తెలుగు సినిమా నటీమణి, నిర్మాత. ఆమె అసలు పేరు అంజనీ కుమారి.ఆమె నర్తకి కూడా. అంజలీ దేవి భర్త పి.ఆదినారాయణరావు.ఆమెకు ఇద్దరు కుమారులు. 1936లో రాజా హరిశ్చంద్రలో అంజలీదేవి చిన్న పాత్రతో పరిచయమైంది. ఆ తరువాత కష్టజీవిలో నాయికగా నటించింది. ఆ తరువాత పల్లెటూరి పిల్ల, రేచుక్క, సంఘం, జయసింహ, సంతోషం, జయం మనదే, చరణదాసి, పాండురంగ మహాత్మ్యం, శోభ, రాజనందిని, బాలనాగమ్మ, రాణీ రత్నప్రభ, భట్టి విక్రమార్క, సతీ సులోచన, శాంత, భీష్మ, స్వర్ణమంజరి, లవకుశ, పరువు ప్రతిష్ట, వారసత్వం, నిర్దోషి, శ్రీ కృష్ణ తులాభారం, డాక్టర్ ఆనంద్, భలే మాస్టారు, పలనాటి యుద్ధం, బడి పంతులు,#VVA లవకుశలో ఎన్.టి. రామారావు సరసన నటించిన సీత పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ పాత్ర అప్పటి గ్రామీణ మహిళలను బాగా ప్రభావితం చేసింది. ఆమె కొన్ని గ్రామాలను సందర్శించడానికి వెళితే కొంతమంది ఆమెను నిజమైన సీతాదేవిగా భావించి మోకరిల్లిన సందర్భాలున్నాయని 1996లో ఒక వార్తా పత్రిక ముఖాముఖిలో పేర్కొన్నారు సువర్ణసుందరి, అనార్కలిలో ఆమె నటన మన్ననపొందింది. దాదాపు 500 తెలుగు

🔔గోవిందా అంటే అర్థం ఏంటో తెలుసా?🔔

Image
          🔔గోవిందా అంటే అర్థం ఏంటో తెలుసా?🔔 కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల గోవింద నామస్మరణతో సప్తగిరులు మారుమోగుతాయి. ఏడుకొండలవాడా వేంకటరమణ గోవిందా.. గోవిందా అంటూ భక్తులు ఆ గోవిందుడి నామాలను స్తారు. శ్రీవారి దర్శనానికి ఎదురుచూసే భక్తుల గోవింద నామస్మరణతో ఆలయంలో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఇంతకీ భక్తులు గోవిందుడి తలచుకోవడంలో ఆంతర్యం ఏంటి? ఆ పేరు ఎలా వచ్చింది? ఎందుకు అలా అంటారో తెలుసుకోవాలంటే ద్వాపర యుగం నాటి నాటి కథను తెలుసుకోవాలి. గోకులంలోని ప్రజలు ఇంద్రుడిని పూజించుకునేందుకు సిద్ధపడుతుంటే వారిని కృష్ణుడు వారిస్తాడు. తత్ఫలితంగా గోకులవాసులపై ఇంద్రుడు ఆగ్రహిస్తాడు. ఇంద్రుడు తన కోపాన్ని ప్రదర్శించి వారిపై ఉరుములు, పిడుగులతో కూడిన భీకర వర్షాన్ని కురిపిస్తాడు. భయంకరమైన తుపాను నుంచి గోకులవాసులతోపాటు గోవులను కాపాడేందుకు గోవర్థనగిరిని తన చిటికెన వేలుతో శ్రీకృష్ణుని ఎత్తి పట్టుకుంటాడు. దీంతో ఇంద్రుడి గర్వం నశించి స్వయంగా ఆ పరంధాముని దర్శించి క్షమాపణ కోరేందుకు వెళతాడు. ఆ సమయంలో కృష్ణుని చెంతకు కామధేనువు కూడా వస్తుంది. తన బిడ్డలైన గోవులను రక్షించిన కృష్ణుని పట్ల కృతజ్ఞత వ్యక్తం చేస్తూ తన పాలతో అభిషే

❤️🔻🙏🏿వినాయక జననం .🙏🏿🔻❤️

Image
                     ❤️🔻🙏🏿వినాయక జననం .🙏🏿🔻❤️ ✍🏿 కవిత -తరణికంటి సూర్యలక్ష్మి. అగడ్తల: 🐘 సీ! (1) *ఆ! పసుపు ముద్ద తోడ పార్వతి జేసెను ముద్దు లొలుకు బొమ్మ ముద్దు గొలుప ఆయు వులను బోసె అమ్మ ఆ బొమ్మకు అద్రి సుతకు బిడ్డ ఆ గణపతి! (2) *ఆ! కావ లుంచె అంబ గడప నుండ మనుచు అంత లోనె ఈశు డరుగు దెంచె ఈసు జూసి బిడ్డ ఈశ్వరు నెదురించ శివుడు వుగ్రు డగుచు శిరము దుం చె! (3) *ఆ! ఉగ్ర రూపు దాల్చి దుర్గ విజ్రం బించ ఉమను పరమ శివుడు వూరడించి గజము ఖమును దెచ్చి గణపతి మెడబెట్టె గజము ఖుడని బిలువ గ, గణపతిని! (4) *ఆ! విఘ్న నాయ కుడుగ విష్నూలు దొలగించు అవని దైవ మనగ అంబ సుతుడు కార్తి కేయు, అన్న, కాలకంఠు తన య ఎలక వాహ నంబు ఎక్కి దిరుగు! (5) *ఆ! విష్ను నాయ కుడుగ విఘ్నాలు తొలగించి విజయ సాధ నెంబు వీలు పడగ ఎల్ల జనుల కెల్ల ఎన్నోవ రములిచ్చు అభయ గణప తయ్య ఆదు కొనును! 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

❤️🔻🙏🏿వినాయక పూజ కథ 🙏🏿🔻❤️

Image
                            ❤️🔻🙏🏿వినాయక పూజ కథ 🙏🏿🔻❤️  #పార్వతీదేవి  నలుగుపిండితో సృష్టించిన బాలునికి బ్రహ్మ ప్రాణమిస్తాడు. గుమ్మం వద్ద కాపలా ఉంచిన బాలుని ఈశ్వరుడు  పొరపాటున వధించి, పార్వతీదేవి కోరికపై అతనికి గజముఖం అతికించి ప్రాణం పోసి గణాధిపత్యం ప్రసాదిస్తాడు. పుట్టినరోజునాడు ఆనందంతో నృత్యం చేస్తున్నవినాయకుని  చూసి చంద్రుడు పరిహసించగా వినాయకుడు కోపంతో చంద్రుని ముఖం చూసినవారు నిందలపాలవుతారని శపమిస్తాడు. నారదునితో  సహా దేవతల ప్రార్ధనపై తన జన్మ దినం ఐన చవితినాడు తనని పూజించినవారికి చంద్రుని చూసినా నిందలు రావని, అలా పూజించేవారు చవితినాడు చంద్రుని చూస్తే నిందలపాలు కారని శాప పరిహారం తెలియచేస్తాడు. ఆనాటినుంచి సమస్త లోకాలవారు వినాయక చవితి (భాద్రపద శుద్ధ చవితి) నాడు వినాయక పూజ చేసి తరిస్తుంటారు. #ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడు  వినాయక చవితినాడు పొరపాటున పాలల్లో చంద్రుని ప్రతిబింబం చూస్తాడు. అపవాదు వస్తుందని భయపడుతున్న శ్రీ కృష్ణుని రుక్మిణి  స్వాంతన పలుకుతుంది. సత్రాజిత్తు సూర్య భగవానుని గూర్చి తపస్సు చేసి శమంతక మణిని వరం గా పొందుతాడు. సత్రాజిత్తు) కుమార్తె సత్యభామ  శ్రీ కృష్ణుని ప్రేమిస్తు

మరచిపోలేని హశ్య నటుడు పద్మనాభం.🚩🚩 💥

Image
  బసవరాజు పద్మనాభం. (20-08-1931& 20-02-2010) 👉బసవరాజు వెంకట పద్మనాభ రావు... అంటే ఎవరో అనుకోవచ్చు. కానీ హాస్యనటుడు పద్మనాభం అంటే ఇట్టే గుర్తుపడతారు. విచిత్రమైన ముఖ కవళికలతో, వినూత్నమైన శరీర భాషతో, విలక్షణమైన సంభాషణ శైలితో దశాబ్దాల పాటు సినీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి, దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన నటుడిగా గుర్తింపు పొందారు. నిర్మాతగా, దర్శకుడిగా కూడా గుర్తుండిపోయే సినిమాలను అందించారు. 1931 ఆగస్టు 20న కడప జిల్లా సింహాద్రిపురంలో పుట్టిన పద్మనాభానికి చిన్నప్పటి నుంచీ నాటకాల పిచ్చి. పద్నాలుగేళ్లకే గూడవల్లి రామబ్రహ్మం తీసిన ‘మాయాలోకం’ సినిమాతో వెండితెరకు పరిచయమై దాదాపు 400 సినిమాల్లో నటించారు. ఎనభై మందికి పైగా దర్శకులతో పనిచేశారు. స్నేహితుడు వల్లం నరసింహారావుతో కలిసి ‘రేఖ అండ్‌ మురళి ఆర్ట్స్‌’ సంస్థను స్థాపించి నాటకాలు వేసేవారు. రేఖ నరసింహారావు కుమార్తె అయితే, మురళి పద్మనాభం కొడుకు. వీరిద్దరి పేరుతో స్థాపించిన ఈ సంస్థ ద్వారానే ఎనిమిది సినిమాలను పద్మనాభం నిర్మించారు. ప్రఖ్యాత గాయకుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యాన్ని ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ చిత్రం ద్వారా పరిచయం చేసిన ఘనత పద్మనాభాని

🚩🚩🚩కాంతం కథలు.🚩🚩🚩

Image
                         🚩🚩🚩కాంతం కథలు.🚩🚩🚩 ✍🏿కాంతం కథలు మునిమాణిక్యం నరసింహారావు రాసిన హాస్య ప్రధానముగా సాగే కథలు. ఇవి తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి గాంచాయి. *ఈ కథల్లో కాంతం అచ్చమైన తెలుగింటి ఇల్లాలు. పేదబడిపంతులు భార్య. భర్త అంటే ఇష్టం. అదే సమయంలో పాపం ఆయన కేమీ తెలీదని, ఆయన అమాయకత్వంపై బోలెడు సానుభూతి కురిపిస్తుంటుంది. ఆమె తన భర్తను వేళాకోళం చేస్తుంది, కించపరచదు. ఆమె అపహాస్యం వెనుక భర్త అంటే అంతులేని ఇష్టం. సగటు తెలుగు మహిళ కాంతం అని చెప్పవచ్చు. *ఒకసారి విశ్వనాథ సత్యనారాయణ మునిమాణిక్యాన్ని ముట్నూరి కృష్ణారావు దగ్గరకు తీసుకువెళ్లి పరిచయం చేస్తుంటే ఆయన వెంటనే కాంతం భర్త కాదూ అన్నాడట. ఈ ఉదాహరణ తెలుగునాట కాంతం ఎంత ప్రసిద్ధి చెందిందో తెలియజేస్తుంది.[ *కాంతం కథల్లో ఆయన నిజజీవితంలో జరిగిన సంభాషణలు స్ఫూర్తిగా రాసేవాడు. ఉదాహరణకు ఆయన ఓ సారి భార్యని పిలిచి నా కలం కనపట్లేదు,వెతికి పెట్టమంటే ఆవిడ వంటింట్లోనుంచి నాకు అట్లకాడ కనపడడం లేదు కాస్త వెతికిపెట్టండి అందంట. *ఎంత కోపంలో ఉన్నా నవ్వించగల మంచి మాటకారి. మాటకుమాట ఎదుటవారు నొచ్చకోకుండా బదులు చెప్పగల నేర్పరి. ఒకరోజు భర్త, మీ చెల్లెలు ఒక కోతి మీ

🚩🚩🚩కస్తూరి శివరావు.🚩🚩🚩

Image
                        🚩🚩🚩కస్తూరి శివరావు.🚩🚩🚩 ✍🏿కస్తూరి శివరావు ప్రముఖ తెలుగు నటుడు. నాటకరంగం, సినిమా రంగంలో ప్రముఖుడు. తెలుగు సినీ రంగంలో తొలి స్టార్ కమెడియన్ గా పరిగణింపదగినవాడు. తెలుగు సినీ హాస్యనటుల్లో ప్రముఖులైన రేలంగి, రమణారెడ్డి, రాజబాబు ల కన్నా ముందు తరం వాడు. టాకీ చిత్రాలు రంగప్రవేశం చేయక ముందు మూకీచిత్రాలకి వ్యాఖ్యానం చెప్పేవాడు. *శివరావు 1913లో మార్చి 6న కాకినాడలో జన్మించాడు. తండ్రి ఉపాధ్యాయుడు. చిన్నతనంలో చదువుమీద తప్ప మిగతా అన్నింటిలో ఆసక్తి చూపించేవాడు. హార్మోనియం లాంటి పలు వాయిద్యాలు వాయించేవాడు. మంచి గాత్రంతో పద్యాలు, పాటలు పాడేవాడు. శివరావు తండ్రి దగ్గర చదువుకుని సినీ రంగంలో అడుగు పెట్టిన సి. పుల్లయ్యను సంప్రదించి తన కొడుకును దారిలో పెట్టమన్నాడు. *వరావు నాటకాల్లో హాస్యపాత్రలు ధరించాడు. పద్యాలూ, పాటలూ బాగా పాడేవాడు. హాస్యం మార్కుతో వున్న పాటలు గ్రామ ఫోన్‌ రికార్డులుగా ఇచ్చాడు. వరవిక్రయం (1939) సినిమాలో చిన్న వేషం వేసాడు శివరావు. చూడామణి (1941) సినిమాలో అతడు వేసిన మంగలిశాస్త్రి అనే వేషం జనం దృష్టిలో పడ్డాఅడు. తర్వాత తర్వాత అక్కడా అక్కడా చిన్నా, చితకా వేషాలు వేసిన

🔻దండం -– చేపాటికర్ర🔻

Image
                           🔻దండం -– చేపాటికర్ర🔻 *విశ్వామిత్రాహి పశుషు కర్దమేషు జలేషు చ అంధ్యే తమసి వార్ధక్యే దండం దశ గుణం భవేత్‌.* ✍🏿దండం దశగుణం భవేత్ అంటే ఈ దండం ఆ దండం కాదు ,అంటే..నమస్కారం కాదు! ఇక్కడ దండం అంటే కర్ర. కర్ర పది రకాలుగా ఉపయోగ- పడుతుందని సుభాషితకారుని వచనం. **అంటే పక్షులు, కుక్కలు, అమిత్రులు (జాలమిత్రులు కానివారు), పాముల, పశువులబారినుండి తప్పించుకోడానికి, బురదలో, నీటిలో, అందత్వం ప్రాప్తించినప్పుడు, చీకటిలో నడుస్తున్నప్పుడు కర్రసాయం పది విధాలు అని.** ఇలా పదిరకాలుగా కర్రను ఉపయోగిస్తామని చెప్పే.... సంప్రదాయికంగా వస్తున్న శ్లోకం..ఇది! 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

ఎల్. ఆర్. ఈశ్వరి నేపధ్య గాయని.!

Image
🚩భలె భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్-ఎల్. ఆర్. ఈశ్వరి ! ❤️ ✍🏿 ఎల్. ఆర్. ఈశ్వరి నేపధ్య గాయని. ఈమె మద్రాసు లో ఒక రోమన్ కాథలిక్ కుటుంబంలో జన్మించింది. ఈమె పూర్తి పేరు "లూర్డ్ మేరీ". ఆమె బామ్మ హిందూ కావడంతో "రాజేశ్వరి" అని పిలిచేవారు. తమిళ చిత్ర నిర్మాత ఎ.పి.నటరాజన్ ఈమె పేరును సినిమాల కోసం టూకీగా ఎల్. ఆర్. ఈశ్వరి గా మార్చాడు. ఈమె తమిళం, తెలుగు, కన్నడం, మళయాళం, హిందీ, తుళు మరియు ఆంగ్ల భాషలలో కొన్ని వేల పాటల్ని పాడింది. ఈమెను మొదటగా కె.వి.మహదేవన్ గుర్తించి, "నల్ల ఇడత్తు సంబంధం" (1958) అనే తమిళ సినిమాలో మొదటిసారిగా సోలోగా పాడే అవకాశాన్ని ఇచ్చాడు. అయితే ఆ చిత్రం విఫలం కావడంతో ఆమెకు గుర్తింపు రాలేదు. కాని "పాశమలార్" (1961) సినిమాతో ఆమెకు మంచి గాయనిగా పేరొచ్చింది. *తర్వాత కాలంలో ఆమె ఎక్కువగా చెళ్ళపిళ్ళ సత్యం దర్శకత్వంలో తయారైన ఎన్నో క్లబ్ సాంగ్స్ మరియు ఐటమ్ నంబర్లకు పాడారు. ఈమె ఎక్కువగా జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్క్ స్మిత మొదలైన నాట్యకత్తెలకు పాడేవారు. వీరే కాకుండా విజయలలిత, లక్ష్మి, సరిత వంటి యువ నటీమణులకు కూడా తన గళాన్ని దానం చేసారు. *ఈమె వ్యక్తిగత

🔻🙏🏿కృష్ణం వందే జగద్గురుం .🙏🏿🔻 :

Image
  🙏🏿కృష్ణం వందే జగద్గురుం .🙏 ❤అనగనగా ఒక రాజు... ఆ రాజుకి ఏడుగుకొడుకులు...కథ: (ఈ కధ (పరమా)అర్ధం విశ్లేషణ శ్రీ గరికిపాటి ). ♦**అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. ఏడుగురు కొడుకులు వేటకు వెళ్ళారు. ఏడు చేపలు తెచ్చారు. ఏడు చేపల్ని ఎండ పెట్టారు. ♦అందులో ఒకచేప ఎండలేదు. చేప చేప ఎందుకు ఎండలేదు. గడ్డిమేటు అడ్డమొచ్చింది. గడ్డిమేటా... గడ్డిమేటా ఎందుకు అడ్డమొచ్చావ్... ఆవు మెయ్యలేదు. ఆవా ఆవా ఎందుకు మెయ్యలేదు... గొల్లవాడు మేపలేదు. గొల్లవాడా... గొల్లవాడా ఎందుకు మేపలేదు... అమ్మ అన్నం పెట్టలేదు. అమ్మా... అమ్మా ఎందుకు అన్నంపెట్టలేదు. ♦పిల్లవాడు ఏడిచాడు. పిల్లవాడా... పిల్లవాడా ఎందుకు ఏడిచావు... చీమ కుట్టింది. చీమా చీమా ఎందుకు కుట్టావ్... నా బంగారు పుట్టలో వేలుపెడితే కుట్టానా... అన్నది. ♦*రాజుగారు అంటే మనిషి. ♦ఏడుగురు కొడుకులు అంటే మనలోని సప్త థాతువులు. ♦వేటకు వెళ్ళటము అంటే జీవనము సాగించటము. జీవితము అనే వేట. ♦ఏడు చేపలు అనగా మనల్ని పీడించే సప్త వ్యసనాలు (కామము, వేట, జూదము, మద్యపానము, వాక్పారుష్యము (కఠినంగా, పరుషంగా మాట్లాడటం), దండపారుష్యము (కఠినముగా దండించుట), అర్థదూషణము (థనమును దూబారాగా ఖర్చుచేయు