Posts

Showing posts from October, 2015

ఏదీ తనంతతానే ఎప్పటికీ రానేరాదు...

Image
శుభోదయం.! ఏదీ తనంతతానే ఎప్పటికీ రానేరాదు కటువైన సత్యాన్నీ కఠోరమైన పరిశ్రమనూ సొంతం చేసుకున్నప్పుడే అనూహ్య విజయాలు లభిస్తాయి!  కృషితో లభించిన విజయానికి ఆనందం అర్ణవం ఔతుంది!  ఆహ్లాదం అంతరిక్షంలా విచ్చుకొంటుంది!

భక్తి కవితా చతురానన బమ్మెర పోతన - డాక్టర్‌ సి. నారాయణరెడ్డి గారు.

Image
భక్తి కవితా చతురానన బమ్మెర పోతన - డాక్టర్‌ సి. నారాయణరెడ్డి గారు. . "పలికెడిది భాగవతమఁట పలికించు విభుండు రామభద్రుండఁట; నేఁ పలికిన భవహర మగునట; పలికెద వేఱొండుగాథఁ బలుకఁగ నేలా?" నాలుగు పలుకులను ప్రాసస్థానంలో చిలికి తన పులకలు వెలార్చుకొన్నాడు. అయితే భాగవతరచన అంతంత మాత్రాన జరిగేదికాదు. ఈ "సహజ పాండిత్యు"నికి అది తెలియదా? అదీ విన్నవించుకొన్నాడు. "భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు శూలికైనఁ దమ్మి చూలికైన విబుధజనుల వలన విన్నంత కన్నంత తెలియ వచ్చినంత తేటపఱుతు." భాగవతం తెలుసుకోవడం, తెలిసింది తెలుపుకోవడం చిత్రమట! నిజమే, రామాయణం అలలా సాగిపోయే మనిషి కథ. భారతం భిన్న లౌకిక ప్రవృత్తుల సంఘర్షణ వ్యథ. భాగవతం స్థూలదృష్టికి కృష్ణలీలాపేటిక, విష్ణుభక్తుల కథావాటిక. సూక్ష్మంగా పరిశీలిస్తే అది మధ్యమధ్య ఎన్నెన్నో విప్పలేని వేదాంతగ్రంథులున్న మహాగ్రంథం. ఆ ముడులు విప్పడం హరునికీ, విరించికీ దుష్కరమే! మరి ఆ భాగవత రహస్యం ఆ భగవంతునికే తెలియాలి. భారం అతనిపై వేసి వ్యాసభాగవతవ్యాఖ్యాత అయిన శ్రీధరుణ్ణి ఆలంబనం చేసుకుని తెలియవచ్చినంత తేటపరచినాడు ఈ వినయశీలుడు. ఈ తేటపరచటం ఏ

తులసి మొక్క ప్రాధాన్యత!

Image
తులసి మొక్క ప్రాధాన్యత ! భారతీయ సంస్కృతిలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. తులసిలేని హిందువుల ఇల్లు ఉండదు. తులసి లక్ష్మీ స్వరూపం. అసలు తులసి మొక్కకు ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు? తులసి ప్రత్యేకత ఏమిటి? మన పూర్వీకులు దేనినైనా పూజించండి అంటే, అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. మనకు అవి తెలియవి, అంతే. తులసి గురించి ఒక నాలుగు మాటలు చెప్పుకుందాం. మాములు మొక్కలు, చెట్లు ఉదయం మొత్తం కార్బన్-డై-ఆక్సయిడ్ పీల్చుకుని, ఆక్సిజెన్ వదులుతాయి, రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్వన్-డై-ఆక్సైడ్ మొత్తాన్నీ పర్యావరణంలోనికి విడిచిపెడతాయి. కానీ తులసి మాత్రం రోజులో 22 గంటల పాటు ఆక్సిజెన్ (ప్రాణవాయువు) ను విడిచిపెడుతుందని మన భారతీయుల పరిశోధనలో తేలింది. వృక్షజాతిలో మరే మొక్కకు ఈ ప్రత్యేకత లేదు. తులసి ఔషధగని. తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతారు. తులసి కున్న ఘాటైనవాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు, దోమలు, పాములు రావు. అందుకే మనం సంప్రదాయంలో ఇంటి ముందు, వెనుకా కూడా తులసిమొక్కను పెట్టి పూజించమన్నారు, ఫలితంగా ఇంట్లోకి పాములు రాకుండా ఉంటాయి.

కవికుల గురువు – కాళిదాస మహా కవి !

Image
కవికుల గురువు – కాళిదాస మహా కవి ! .  కాళికా దేవి దాసుడిని అని చెప్పుకొనే కాళిదాస మహా కవి గొప్ప సంస్కృత నాటక కర్త ,కావ్య సృజన శీలి ,వ్యాస ,వాల్మీకుల తర్వాతి స్థానాన్ని ఆక్రమించుకొన్న మహా కవి .ఈ మహాను భావుడి కాలాన్ని కూడా సరిగ్గా ఇప్పటికీ తేల్చలేక పోయారు .ఐదవ శతాబ్ది వాడని అనుకుంటారు .అభిజ్ఞాన శాకుంతలం నాటకం తో విశ్వ వ్యాప్త కీర్తి నార్జించిన వాడు .ఉపమా కాళిదాసస్య అనే టాగ్ ఉన్న కవి . కుమార సంభవ కావ్యం లో హిమాలయ సౌందర్యాన్ని అత్యద్భుతం గా కీర్తిన్చాడుకనుక హిమాలయ సానువులలో ఉండే వాడేమో నని కొందరి ఊహ .మేఘదూతం కావ్యం లో ఉజ్జయిని ని కమనీయం గ చెప్పాడుకనుక ఉజ్జయిన వాసుడని మరి కొందరి అభిప్రాయం .రఘు వంశ కావ్యం లో కలింగ రాజు హేమాన్గదుడి గురించి రాశాడు కనుక కలింగ వాసి అని ఇంకొందరి అనుమానం .లక్ష్మీధర కల్లా అనే పరిశోధకుడు వీరికి భిన్నం గా కాశ్మీరుకు చెందిన వాడని చెప్ప్పాడు .అధిక సంఖ్యాకుల మనోభావం ప్రకారం కాళిదాస మహాకవి ఉజ్జయిని ప్రాంతం వాడే .ఒక రాజ కుమారిని వివాహం చేసుకొని ,చదువేమి లేక పోవటం తో సవాలు గా కాళికా దేవిని ప్రసన్నం చేసుకొని నాలుక పై బీజాక్షరాలు రాయించుకొన్న అదృష్ట వంతుడు .దానితో

అసామాన్యుడు విశ్వనాథ.!

Image
అందరూ ప్రయాణించే దారిలో ప్రయాణం చాలా సులభం.  కొత్తదారి కనుక్కోవటం చాలా కశ్టమ్. కానీ, పాత దారిలో ప్రయాణిస్తూ, ఆ దారిని కొత్త పుంతలు తొక్కించటం సామాన్యులకు సాధ్యమ్ కాదు.  అలాంటి అసామాన్యుడు విశ్వనాథ. . ఆయనను కుల తత్వ వాది అనేవారెందరో  అనేక సందర్భాలలో ఇతర కులాల పైన ద్వెఅశాన్ని, తక్కువ కులాలవారి పైన చులకనను,  స్వకులం వారి పైన ప్రేమను బహిరంగంగా చూపారు. అయితే, విశ్వనాథ వైపు వేలు చూపించి, ద్రుశ్టిని తమ వైపు నుంచి మళ్ళించుకున్నారు. మన దేశం లో కుల భావనకు అతీతంగా ఎవ్వరూ లేరు.  కానీ, అందరో విశ్వనాథ వారి వల్ల తమ నేరాన్ని కప్పిపుచ్చుకోగలుగుతున్నారు. చివరికి, జాశువా కూడా, మతం మారినా కులం మారలేదని వాపోయాడు.  క్రీస్తును ఆశ్రయించినా, మాలా క్రీస్తు వేరు, మాదిగ క్రీస్తు వేరు అని ఖండికలు రాసి,  వేదనను వెళ్ళ గ్రక్కుకున్నాడు. కాబట్టి, విశ్వనాథను తిట్టటం మాని ఆయన సాహిత్యం గురించి. తెలుసుకుని,  చదివి ఎవరికి వారు నిర్ణయించుకోవాలి.  . x

అప్పిచ్చి ఋణ రమణుడి ఋణం తీర్చుకోండి!

Image
అప్పిచ్చి ఋణ రమణుడి ఋణం తీర్చుకోండి! . ధర్మరాజుగారికో రోజున రోఖం కావలసివచ్చి వేళకు జతపడక భీమసేనుడిని కుబేరుడి దగ్గరకు పంపాడుట అప్పు తెమ్మని. తీరా అతను అందాకా వెళ్ళి అడిగే సరికి కుబేరుడేమో మీ అన్న వడ్డీ ఇస్తాడా మరి అన్నాడట. రణరంగంలోనే తప్ప ఋణరంగంలో ప్రభావశాలిగాని భీముడు ఠంగున జవాబివ్వలేక మళ్ళీ భూలోకం వచ్చేసి, అన్నా వినమని కధ చెప్పాడు. వడ్జీ పుచ్చుకోకపోతే మనం అప్పు పుచ్చుకోము అని చెప్పు అని కబురంపాడు  ధర్మరాజు ఎందుకైనా మంచిదని.  కుబేరుడు అప్పు ఇచ్చాడు. వడ్డీ వద్దనీ అన్నాడు. ఇది అప్పు ఇచ్చే వారి మీద బాగా పనిచేసే ట్రిక్కు.... . ఋ మణుడు రాసిన ఋణోపదేశం అనే మహాసందేశాత్మక కథనుండి  ఊరికే ఇలాటి ఋణట్రిక్కులు నేర్చుకుంటే ఫలించవని ఋమణు గురవుల ఉవాఛ....  ఇది మీకు చేర్చిన వాడికి కనీసం ఓ ఫైవు అప్పిచ్చి ఋణ రమణుడి ఋణం తీర్చుకోండి.... మీ కోసం మీ ఋణోదయం

ఊహా సుందరి.!

Image
ఊహా సుందరి.! (నాది కాదు నెట్ లో దొరికింది.) కలల్లోనే తిరుగుతూ కవ్వించే నా రాణి కనుల ముందుకు వచ్చి వలపుల వర్షించదేమి? ఊయల నడకలననుసరించు తన వాలుజడ ఊహలలో నను ఎక్కించెను అందాల మేడ మచ్చలేని జాబిలివంటి ఆమె వదనం చూడగనె వెలవెల బోయెను ఆ నందనవనం కలువల కంటగింపైన ఆ గాజుకనులు నా కనులలో పుట్టించెను మెరుపుల చెమక్కులు చెలినెపుడూ అంటిపెట్టుకు ఉండే వెండి నవ్వులు రాల్చును ధరపై మేలిముత్యాల రాశులు తన పెదవులపైనే తలదాచుకున్నఆ ఎరుపు చూడగ ఆ గులబీలకు అసూయ గొలుపు ఎన్నెన్నో అందాలు కలిగినది ఈ లోకం దీన్ని మించినది తన అందమున్న ఆ ఊహాలొకం వన్నె చిన్నెల నా చెలి దిగిరాగా ఈ లోకం వెలవెలబోదామరి తానులేని ఆ కలలలోకం

జరీ అంచు తెల్లచీర ! (రావిశాస్త్రి గారి కధ.)

Image
జరీ అంచు తెల్లచీర ! (రావిశాస్త్రి గారి కధ.) . జరీ అంచు తెల్లచీర ని కట్టుకోవాలనే కోరిక విశాలాక్షి అనే అమ్మాయికి పదేళ్ళ వయసులో కలిగి ఆమెతో పాటు ఎదిగి తండ్రి పేదరికం వల్ల తీరని కోరికయి గగన కుసుమంగా మారింది. తండ్రి నెత్తురే ఖరీదుగా చెల్లించడానికి సిద్ధపడినా ఆ చీర ఖరీదుకు సరిపోకపోవడాన్ని జీర్ణించుకోలేక పోయింది. ఆమె వేదనను, ఆ వేదనలోని తీవ్రతను రావిశాస్త్రి ఇలా వర్ణిస్తారు. . ఇది మెరుపు లేని మబ్బు ఇది తెరిపి లేను ముసురు  ఇది ఎంతకీ తగ్గని ఎండ ఇది ఎప్పటికీ తెల్లవారని చీకటి రాత్రి ఇది గ్రీష్మం  ఇది శిశిరం ఇది దగ్ధం చేసే దావానలం . ఇది చుక్కల్ని రాల్చేసే నైరాశ్యం ఒక్కటి ఒక్కటే సుమండీ ఒక్క జ రీ అం చు తె ల్ల చీ ర విశాలాక్షి మనసులోని విచారాన్ని, నిరాశని వెల్లడిస్తూ,  పరస్పర విరుద్ధమయిన అర్థాలను ఇచ్చే పదచిత్రాలతో, చిన్న వాక్యాలతో సాగిన ఈ రచన విశాలాక్షి పాత్రలోని వేదనను పాఠకుడికి కూడా పంచుతాయి.

మ " గుణింతంతో ఓ అందమైన కంద పద్యం !

Image
మ " గుణింతంతో ఓ అందమైన కంద పద్యం ! . మామా మోమౌ మామా మామా! మి మ్మోమ్మో మామ మామా మేమా మే మోమ్మము మి మై మే మేమే మమ్మోము మోము మిమ్మా మామా!! ఈ పద్యానికి అర్థం చూద్దామా. మా = చంద్రుని మా = శోభ మోమౌ = ముఖము గల మామా = మా యొక్క మా = మేథ మిమ్ము, ఒమ్ము = అనుకూలించును మామ మామా = మామకు మామా ఆము = గర్వమును ఏమి+ఒమ్మము = ఏమి ఒప్పుకోము మిమై = మీ శరీరము మేము ఏమే = మేము మేమే మమ్ము,ఓముము+ఓముము =కాపాడుము,కాపాడుము ఇమ్ము+ఔము = అనుకూలమగుమా చంద్రుని వంటి ముఖముగల దేవా! మా బుద్ధి మీకు అనుకూలించును. గర్వపడక నిన్ను మేము అంగీకరింతుము. సశరీరివై మాకు అనుకూలముగా నుండి మమ్ము కాపాడుమని అర్థం. ఏకాక్షర నిఘంటువులు చూస్తే కాని ఇలాంటి పద్యాలు అర్థం కావు. కాని చదువుతుంటే సరదాగా ఉంటాయి. x

నిగమ శర్మ అక్క !

Image
నిగమ శర్మ అక్క ! .  (ఆచార్య చొప్పకట్ల సత్యనారయణ గారు.) తెలుగు సాహిత్యంలో కొన్ని పాత్రలు అక్షర రూపాన్ని సంతరించుకున్నాయి.  అలాటి పాత్రలలో నిగన శప్మ అక్కగారి పాత్ర చిరస్మరణీయం!  తెనాలి రామకృష్ణుడా పాత్రను తీర్చిదిద్దిన విధానమట్టిది.  ప్రబంధయుగంలో వెలసిన గ్రంధాలలో అపురూపమైనది పాండురంగ మాహాత్మ్యం..  నిగమ శర్మోపాఖ్యానము అందొక కథ. పరమ నిష్ఠారిష్టుడును, మహాపండితుడును, శ్రోత్రియ బ్రాహ్మ ణోత్తముని కొమరునిగాృనిగమశర్మ యుదయిచయించెను.వేదాది సర్వ విద్యలను నేర్చెను.ఉపవీతుడైన యనంతరము వివాహితుడయ్యెను.  విధివశమున వానికి దుర్జన సాంగత్యమలవడెను. దానివలనృసర్వభ్రష్ఠుడయ్యెను. జూదమాడుట,వ్యభిచరించుట, పానము, యిత్యాది సర్వదుర్గుణముల కేలిక యయ్యెను. ఈవ్యసనములకు వలసిన ధనమునకై యింటనే చౌర్యమారంభించెను.  మాన్యములను తెగనమ్మసాగెను."భ్రష్టస్య కావాగతిః" యనురీతిగా సంచరించుచుండెను. తల్లి యిదియంతయు నెరింగియు పుత్ర వ్్యామోహమున భర్త కెరిగింపకుండెను. వారి భ్రష్టాచారములు మితిమీరిన దశలో పాపమాగృహస్థునకు పుత్ునివిషయము,యితరులవన నెరింగెను. ఆబ్రాహ్మణగృహస్తునకు అంతకుమున్

ముస్లిము చరిత్రలు

Image
ముస్లిము చరిత్రలు హిందూదేశమునందు చరిత్ర రచన మహమ్మదీయుల ఆగమనముతో ప్రారంభమయినది. మహమ్మదీయులకు చరిత్రాభిమానము మెండు; కావున వారు మొదటినుండియు చరిత్ర రచనకు పూనుకొని పెక్కు చరిత్ర గ్రంథములను రచించిరి; కాని అవి దేశ చరిత్రలు కావు; అవి యన్నియు మహమ్మదీయ రాజ్యముల యొక్కయు, మహమ్మదీయ రాజవంశముల యొక్కయు చరిత్రములు. కావున వానియందు ఆ రాజ్యములకును రాజవంశములకును సంబంధించిన విషయములు మాత్రమే వర్ణింపబడినవి. వానిలో దేశ ప్రజలనుగూర్చి కాని, హిందూ రాజ్యములను గూర్చికాని ప్రస్తావము ఉండదు. మరియు మతాభిమానము పెంపున మహమ్మదీయ చరిత్రకారులు హిందువులనుగూర్చి కాని, హిందూ రాజ్యములనుగూర్చి కాని విధిలేక చెప్పవలసివచ్చినపుడు ఉన్నది ఉన్నట్లు చెప్పక, సత్యమును కప్పిపుచ్చి, తమ యాధిక్యమును స్థాపించుకొనుటకు విషయమును తారుమారు చేసి చెప్పుదురు; కావున ఆధునిక దృష్టితో దేశ చరిత్రము రచియించునప్పుడు వానియందలి విషయములను చక్కగ పరిశీలించి కైకొనుట యుక్తము. క్రీ. శ. 14 శతాబ్ద ప్రారంభమునుండియు దక్షిణ భారతమున మహమ్మదీయుల ప్రాబల్యము అధికము కాజొచ్చినది. అప్పటినుండియే మహమ్మదీయ చరిత్రలలో దక్షిణ హిందూ రాజ్యముల ప్రస్తావము కానవచ్చును. ఈ చరిత్రలలో

పాకుడురాళ్ళు!

Image
పాకుడురాళ్ళు! . పాకుడురాళ్ళు రావూరి భరద్వాజ విశిష్టమైన నవలా రచన. చలనచిత్ర పరిశ్రమను వస్తువుగా చేసుకొని తెలుగులో వెలువడిన మొట్టమొదటి నవల పాకుడురాళ్లు. భరద్వాజ దీనికి మాయ జలతారు అని నామకరణం చేశాడు. అయితే శీలా వీర్రాజు పాకుడురాళ్లు అనే పేరు పెట్టాడు. మల్లంపల్లి సోమశేఖరశర్మ, ముదిగొండ సుబ్రహ్మణ్యశర్మ ల ప్రోత్సాహంతో రావూరి భరద్వాజ తాను అంతకుమునుపే వ్రాసిన 'పాలపుంత' అనే ఓ పెద్ద కథని పాకుడురాళ్లు నవలగా వ్రాశాడు. ఈ నవల మూడు సంవత్సరాలపాటు కృష్ణా పత్రిక లో ధారావాహికగా వెలువడినది. ఈ పాకుడురాళ్లు నవలపై శ్రీకృష్ణదేవరాయ, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగాయి.[ఈ నవల రాసినందుకు రావూరికి 2013 లో సాహిత్యంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. . సినిమా ఓ రంగుల ప్రపంచం. లక్షలాదిమంది తమని తాము వెండి తెర మీద చూసుకోవాలని కలలు కంటూ ఉంటారు. కానీ ఆ కల నెరవేరేది ఏ కొద్ది మందికో మాత్రమే. పేరు ప్రఖ్యాతులు, వద్దన్నా వచ్చి పడే డబ్బు, సంఘంలో గౌరవ మర్యాదలు, పలుకుబడి. ఇవన్నీ తెచ్చిపెట్టగల శక్తి సినిమా అవకాశానికి ఉంది. అందుకే, సినిమాలన్నా, సినిమా వాళ్ళన్నా ఆసక్తి చూపించని వాళ్

కల భాషిణి యంద చందాలు!

Image
కల భాషిణి యంద చందాలు!  .  ప్రబంధయుగంలో కవులు ఒకరినిమించినవారు మరొకరు.హేమాహేమీలు. వారిలో పింగళిసూరనయొకడు. . కలభాషిణి సూరన సృష్టించిన యొక యందారభరణి!  విటజనహృదయమనోహారిణి. ద్వారకా నగరమునందలి యొకవేశ్య!  ఆపాత్రను కళాపూర్ణోదయంలో పరిచయంచేస్తూ,కవియీపద్యంవ్రాశాడు. దీన్ని చదువుకొని తరువాత తీరికగా ఆమెయందం యెంతమనోహరమైనదో ఊహించుకోండి అంటాడుకవిగారు.  మరిమీరు వింటారా ఆపద్యం? యిదిగో- .  ఉ: కూకటి వేణితో కురులు కూడకమున్నె, కుచ ప్రరోహముల్ పోకల తోటి సామ్యమును పొందకమున్నె, నితంబ సీమకున్  వ్రేకఁ దనంబొకింత ప్రభవింపక మున్నె, బ్రసూనబాణు డ  ర్రాకల బెట్టె, దా నరవ నామెత బాలికకై విటావళిన్; .  బాల్యం గడచి యవ్వనంలో అడుగు మోపక మున్నే విటజనాన్ని  ఆకలభాషిణీ సౌందర్యం కలవర పరుస్తోన్నదట! వెలయాలుగదా యెవరికి వారు ముందుగా నామెపొందుకోసం తపన పడుతున్నారట. యింతకీ ఆమెపరిస్థితి యేమిటీ? అనేప్రశ్నకు కవి చెప్పే సమాధానమే యీపద్యం! .  " ఆమెశిరోజములు సిగను చుట్టుకొనుటకు తగినరీతిగాలేవట. చూచుకములా(చనుమొనలు) పోకలయమతైనాలేవట! స్తనములేపుగా పెరుగ లేదని చెప్పుట. పిరుదులు విశాలముగా నెదుగలేదట! సామాన్యమ

దసరా పద్యాలు!

Image
దసరా పద్యాలు! . దేవీ నవరాత్రులను దసరా పండగలుగా పిలుస్తారు. పూర్వపు రోజుల్లో దసరా సెలవలప్పుడు ఉపాధ్యాయులు తమ తమ పాఠశాలలో చదువుకునే బాల బాలికలను వెంటబెట్టుకుని గ్రామం లోని ఇంటింటికీ వెళ్ళే వారు, గృహస్తులను ఆశీర్వదంచేవాళ్ళు.. పిల్లలు కొత్త బట్టలు వేసుకుని చేతుల్లో విల్లంబులు పట్టుకుని అయ్యవారి వెంట వెళ్ళే వారు. ఈ అంబులను గిలకలు అంటారు. వీటిని సంధించి వదిలితే, ఎదుటి వారి మీద పూలూ ఆకులు పడేవి. బడి పిల్లలు అలా ఊరంతా తిరుగుతూ పాటలు, పద్యాలు పాడేవారు. వీటినే దసరా పద్యాలు అంటారు. దసరా పద్యాలు చాలా సులభంగా, వీనులకు విందుగా ఉంటాయి. మచ్చుకు కొన్ని పద్యాలు చూడండి పద్యం 1 ఏ దయా మీ దయా మా మీద లేదు, ఇంత నిర్లక్ష్యమా ఇది మీకు తగదు, దసరాకు వస్తిమనీ విసవిసలు పడక చేతిలో లేదనక అప్పివ్వరనక పావలా.. .అర్ధయితే ...పట్టేది లేదు, ముప్పావలా అయితే ముట్టేది లేదు, హెచ్చు రూపాయయితే పుచ్చుకుంటాము, అయ్య వారికి చాలు ఐదు వరహాలు పిల్ల వారికి చాలు పప్పు బెల్లాలు జయీభవా...దిగ్విజయీభవా పద్యం 2 రాజాధిరాజ శ్రీ రాజ మహరాజ రాజ తేజోనిధీ రాజ కందర్ప రాజకంటీరవా రాజ మార్తాండ రాజ రత్నాకరా రాజకు

మన్మధ పూజావిధానం! (ఆచార్య చొప్పకట్ల సత్యనారయణ గారు.)

Image
మన్మధ పూజావిధానం!  (ఆచార్య చొప్పకట్ల సత్యనారయణ గారు.) ఆంధ్ర ప్రబంధాలలో మన్మధోపాలంభనం విన్నాం.చూశాం.కానీ మన్మధ పూజావిధానం గురించి యెవ్వరూ ప్రస్తావించలేదు. ఆలోటు తీర్చనెంచారు కాబోలు ,మన రామరాజ భూషణుడు వారివసుచరిత్రలో మన్మధపూజను సాంగోపాంగంగా కావ్యనాయిక గిరికచే నిర్వహింపజేశారు. అపూర్వమైన ఆవిశేషాన్ని మీముందుంచాలని నాయీ ప్రయత్నం.సమాహితులై చిత్తగించండి! గిరిక వసురాజును ప్రధమపరిచయంలోనే ప్రేమిస్తుంది. ఆయనేమో వచ్చినట్లేవచ్చి ఆమెచ్తిత్తంలో ముద్రవైచి రాజధానికి వెడలిపోయాడు. అక్కటితోఃఆమెకు విరహం ప్రారంభమయ్యింది. ఉపశమనంకోసం వన విహారానికి వెళుతుంది. ఆవసంతశోభలు, ఆమలయమారుతం, వగైరా వగైరా ఆమెబాధను మరింతగా పెంచుతాయి. దాంతో చెలికత్తెలు కర్తవ్యోపదేశంచేశారు. మన్మధపూజ చేయమని. అందుకామె యుపక్రమించింది. ఉ: గొజ్జగి మంచునం దడిపిఁగూర్చిన పుప్పొడి తిన్నెమీద, లా  మజ్జక కాయమాన లసమాన విమానముక్రింద నొక్క పూ  సెజ్జ ఘటించి, యందొక కుశేశయ కర్ణిక నుంచి, యందు సం  పజ్జలజేక్షణాసుతుని భావమువ్రాసి ,కురంగనాభికన్; పూజకు కావలసిన యేర్పాట్లు చేశారు.యిలా! మంచుతోగూడిన గులాబీలనీటితో(పన్నీటితో)పుప్పొడితడిపి, పూజావేదిక త

నేను మనిషిని...

Image
నేను మనిషిని...  -నాని  నేను మనిషిని...  కొన్ని కోట్ల వీర్యకణాలను గెలిచి అమ్మ కడుపులో చోటు సంపాదించుకున్నవాడిని...  వెచ్చని గదిలో నవమాసాలు విశ్రాంతి తీసుకొని పుడుతూనే ఏడ్చిన అమాయకుడిని...  పలకా బలపం చేతబట్టుకుని వేళ్ళు అరిగేలా శ్రమించే విద్యార్ధిని...  నేను మనిషిని...  అమ్మ మీద ప్రేమ, నాన్నంటే భయం సమపాళం లో కలిగి ఉన్న మిశ్రమాన్ని...  అంతులేని ఆశలకు, అవధుల్లేని ఆలోచనలకు ఎల్లప్పుడూ ఆశ్రయమిచ్చే ఆశ్రమాన్ని...  ఆనందం,బాధ అనే రెండు కత్తులనూ హృదయమనే ఒకే ఓర లో సర్దిపెట్టుకోగల సమర్ధుదిని...  నేను మనిషిని...  నింగీ నేల కలవనివని తెలిసినా కలిసినట్టు చూపించే కళ్ళచేత మోసపోయే వెర్రివాడిని...  సమస్థ ప్రపంచాన్నీ ఐదంగుళాల వస్తువులో పెట్టి జేబులో వేసుకొని తిరిగే బుధ్ధిశాలిని...  కొన్ని విషయాలు తప్పని తెలిసినా తప్పక చేసే అశక్తుడిని...  నేను మనిషిని...  ఏరి కోరి వచ్చిన కన్నెపిల్లలో కన్నతల్లిని చూసుకుని మురిసిపోయే పసివాడిని...  భగవంతుడిచ్చిన రోజులో సగం ఉద్యోగానికీ సగం కుటుంబానికీ ప్రతి రోజూ పంచే త్యాగజీవిని...  జనన మరణాల మధ్య బ్రతుకు పడవలో పయనిస్తూ అనేక

పండితారాధ్య చరిత్రము.!...... (పాల్కురికి సోమనాథుఁ డు)

Image
పండితారాధ్య చరిత్రము.! (పాల్కురికి సోమనాథుఁ డు) . పండితారాధ్య చరిత్రము లో యక్షగానము లన్నపేరుగల దృశ్యరచనలు వర్ణిస్తోపాల్కురికి సోమనాథుఁ డిట్లు చెప్పినాడు: .... "భ్రమరులు జాళెముల్‌ బయనముల్‌ మెఱసి రమణఁ బంచాంగపేరణి యాడువారు ప్రమథపురాతన పటుచరిత్రములు క్రమమొంద బహునాటకము లాడువారు లలితాంగ రసకళాలంకారరేఖ లలవడ బహురూప మాడెడువారు * * * అమరాంగనలు దివి నాడెడు మాడ్కి నమరంగ గడలపై నాడెడువారు ఆ వియద్గతి యక్షులాడెడు నట్టి భావన మ్రోకులపై నాడువారు భారతాది కథలు చీరమఱుఁగుల నారంగ బొమ్మల నాడించువారు కడు నద్భుతంబుగఁ గంభసూత్రంబు లడరంగ బొమ్మల నాడించువారు నాదట గంధర్వ యక్షవిద్యాధ రాదులై పాత్రల నాడించువారు"  

తెనాలి వారి కవితా విన్యాసం! ________________________

Image
తెనాలి వారి కవితా విన్యాసం! ________________________ విన్నవేయైనా కొన్ని మరల మరల వినాలనిపిస్తుంది. అందులో మనవికటకవి తెనాలి రామకృష్ణుని కవితా విన్యాస మొకటి. వెనక రాజులూ రాజ్యాలూ ఉండేవి.కళాపోషణ కారణంగానో, లేక సాహిత్యాభిమానమో గాని, యానాటి రాజులు కవి, పండడిత పోషణం చేస్తూఉండేవారు.కొందరుకవులు,పండితులు యెవరో యొకప్రభువునాశ్రించి వారికొల్వులో ఉండేవారు.మరికొందరు అలాకాక నానారాజ సందర్శనంచచేస్తూ వారిసత్కార మందుతూ తమ సాహిత్య జైత్రయాత్ర కొనసాగించేవారు. అలాంటివారితోనే అప్పుడప్పుడు చిక్కుల్రేర్పడుతూ ెఉండేవి.అహంకార పూరితులై విర్రవీగే కవిపండితులకు,అప్పుడప్పుడు శృంగభంగం జరుగుతూెఉండేది. అలాంటి సంఘటనే యొకసారి రాయల సభలో జరిగింది. దానిని వారెలా యెదుర్కొన్నారో మన మిప్పుడు తెలిసికొందాం. "ప్రగడ రాజు నరసరాజనే" గొప్ప పండితుడు ఒకనాడు రాాయల సభకు వచ్చాడు.రాయలకు నమస్కరించి,"ప్రెభూ నేనెరుగని గ్రంధములేదు, యేపద్యమునకైనను సునాయాసముగా నర్ధమును జెప్పగలను. మీయాస్థానమున పెద్దనాది కవీంద్రులు కలరుగదా వారెవరైన నాతో వాదముచేయగల

సుగ్రీవవిజయము యక్షగానము ... ( పీఠిక- శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి)

Image
సుగ్రీవవిజయము యక్షగానము ... ( పీఠిక- శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి) . శ్రీమద్రామాయణమునఁ గల కథాఖండములలో సుగ్రీవవిజయకథ యొక కండపట్టు. అత్యల్ప కాలమున వడివడిగా గంటలలో నడచిన యీకథపట్టు రామలక్ష్మణులు, హనుమంతుఁడు, సుగ్రీవుఁడు, వాలి, అంగదుఁడు, తార అను కథాపాత్రముల శీలపు మేలిమినొఱసి మెఱుఁగు తఱుగులు చూపిన యొఱగల్లనఁ దగినది. తెలుగున గుత్తెనదీవిరామాయణాదు లగు రామాయణ గేయకృతులలో నీసుగ్రీవవిజయపుఁ గథపట్టు చాలహృద్య రచనములతో నున్నది. "ఎంతపనిచేసితివి రామా! నిన్ను నేమనందును సార్వభౌమా! చెంతకిటు రాలేక చెట్లనో దాగుండి వింతమృగమునుగొట్టు విధమాయెనాబ్రదుకు!" ఇత్యాది గేయములను పలువురు పాడుచుందురు. ఈ రుద్రకవి సుగ్రీవవిజయమునుగూడ స్త్రీ వృద్ధ పామరాదులు పలువురు పాడుచుందురట! ఆయా పాత్రముల పాటలు తత్తద్వేషధారులు వచ్చి పాడునట్లును తక్కిన సంధివచనాదులు ఒక్కరిద్దఱు సూత్రధార ప్రాయులు పఠించునట్లును, నీసుగ్రీవవిజయము వీథియాటగా నాడబడుచుండెడిది. ప్రాచీన సంస్కృతనాటకరచయితలు భాసభవభూత్యాదు లీ సుగ్రీవ విజయౌచిత్యమును దమ నాటకములలో విమర్శించిరి. శ్రీరాముని శీలమును శ్రీవాల్మీకి రామాయణ

తెలుగు యతి - తిరుగు మతి! .

Image
శ్రీ కామేశ్వర రావు భైరవభట్లగారు. . తెలుగు యతి - తిరుగు మతి! . "మళ్ళీ ఇన్నాళ్ళకి ఇ న్నేళ్ళకి పద్యాలు రాయుటిది యెట్లన్నన్ పళ్ళూడిన ముసిలిది కు చ్చిళ్ళన్ సవరించినట్టు సిరిసిరిమువ్వా!" నాకింకా పళ్ళు ఊడలేదు కానీ ఉన్నవాటిని ఊడగొట్టుకొనేందుకు ....

విశ్వనాథ గారి ..కిన్నెరసాని.!

Image
కిన్నెరసాని.అంటే ఒక వాగు గోదావరి నదికి పాయ... కాని కవులు ఒక అందం అయిన అమ్మాయి గా వర్ణిస్తారు! నిజమేనంటారా.... విశ్వనాథ గారి ..కిన్నెరసాని.! . కిన్నెర నడకలు కరిగింది కరిగింది కరిగింది కరిగింది కరిగి కిన్నెరసాని వరదలై పారింది తరుణి కిన్నెరసాని తరకల్లు కట్టింది పడతి కిన్నెరసాని పరుగుల్లు పెట్టింది కదిలింది కదిలింది కదిలింది కదిదింది కదిలి కిన్నెరసాని వొదుగుల్లుపోయింది సుదతి కిన్నెరసాని సుళ్ళుగా తిరిగింది ముదిత కిన్నెరసాని నురుసుల్లు గ్రక్కింది నడచింది కడరాళ్ళు గడచింది పచ్చికల్‌ తడసి కిన్నెరసాని సుడులలో మొరసింది జడిసి కిన్నెరసాని కడలందు వొరిసింది సుడిసి కిన్నెరసాని జడలుగా కట్టింది కరగగా కరగగా కాంత కిన్నెరసాని తరగచాలుల మధ్య తళతళా మెరిసింది నురుసుపిండులతోడ బిరబిరా నడిచింది ఇసుక నేలలపైన బుసబుసా పొంగింది కదలగా కదలగా కాంత కిన్నెరసాని పదువుకట్టిన లేళ్ళకదుపులా తోచింది కదలు తెల్లని పూలనదివోలె కదిలింది వదలు తెల్లనిత్రాచు పడగలా విరిసింది నడవగా నడవగా నాతి కిన్నెరసాని తొడిమ యూడిన పూవు పడతిగా తోచింది కడుసిగ్గుపడు రాచకన్నెలా తోచింది బెడగుబోయిన రత్న పేటిలా తోచింది ప

హట్స్ ఆఫ్ కృష్ణశాస్త్రి గారూ ...

Image
 ఎన్ని శతాబ్దాలైనా నిజం ఇదే ... ఈ పాటలో లాంటిదే .. ... పనుల వత్తిడిలో బడలిన ...రేడు... కి .. ప్రియురాలి ఒడి కంటే విశ్రాంతి / ఉల్లాసం ఇచ్చే మత్తు మందు / అదృష్టం ... ఉంటుందా ... ప్రియుని విశ్రాంతి కోసం గాలిని శాసించాలనుకొనే ప్రియురాలి .. ఊహే... వాహ్ ...మధురానుభూతి ... హట్స్ ఆఫ్ కృష్ణశాస్త్రి గారూ ... సడిసేయకో గాలి సడిసేయబోకే సడిసేయకో గాలి సడిసేయబోకే బడలి ఒడిలో రాజు పవ్వళించేనే సడిసేయకే రత్నపీఠిక లేని రారాజు నా స్వామి మణికిరీటము లేని మహరాజు గాకేమి చిలిపి పరుగులు మాని కొలిచిపోరాదే సడిసేయకే ఏటి గలగలకే ఎగిరి లేచేనే ఆకు కదలికలకే అదరి చూసేనే నిదుర చెదరిందంటే నే నూరుకోనే సడిసేయకే పండు వెన్నెల నడిగి పాన్పు తేరాదే నీడ మబ్బుల దాగు నిదుర తేరాదే విరుల వీవన పూని విసిరిపోరాదే సడిసేయకో గాలి సడిసేయబోకే బడలి ఒడిలో రాజు పవ్వళించేనే సడిసేయకో గాలి సినిమా : రాజమకుటం (1960) రచన: దేవులపల్లి కృష్ణ శాస్త్రి సంగీతం :మాస్టర్ వేణు గానం : పి.లీల https://www.youtube.com/watch?v=LlFJWGpIBLA

సైంధవుడు లేదా జయధ్రదుడు !

Image
సైంధవుడు ! సైంధవుడు లేదా జయధ్రదుడు(సంస్కృతం:जयद्रथ) మహాభారత ఇతిహాసంలో కౌరవులకు చెల్లెలైన దుస్సల కి పతి. జయధ్రదుడు సింధు దేశాన్ని పరిపాలిస్తుండేవాడు. సింధు దేశాన్ని పరిపాలించేవాడు కాబట్టి సైంధవుడు అయ్యాడు. . ఇతఁడు పాండవులు వనవాసము చేయుకాలమున తాను ఒక రాచకూఁతురును వివాహము చేసికొని వారు ఉన్న వనముగుండ తన పట్టణమునకు పోవుచుండి ఆశ్రమమున ఏకాకియై ఉండిన వారిపత్ని అగు ద్రౌపదిని చూచి వారులేకుండుట తెలిసి బలాత్కారముగా పట్టి తన రథముమీఁద పెట్టుకొని పోవుచు ఉండెను. ఇంతలో ఈవర్తమానమును ఎఱిఁగి పాం డవులు వచ్చి వీనిని చక్కఁగ మర్దించి అవమానించి పంపిరి. అంతట వీఁడు దానికి ప్రతికారము చేయ సమకట్టి ఉగ్రతపము సలిపి అర్జునుఁడు తక్క తక్కిన పాండవులను ఒక్కదినమున జయించునట్లు వరము పడసి భారతయుద్ధము జరుగునపుడు పాండవులను పద్మవ్యూహము భేదించిన అభిమన్యునికి తోడుపడకుండ అడ్డగించి గెలుపుకొనెను. కనుక పదుగురు యోధులు ఒక్కటిగాచేరి అభిమన్యుని చంపిరి. ఆవృత్తాంతము సంశప్తకులతో పోరాడపోయి ఉండిన అర్జునుఁడు విని ఆమఱునాడు సూర్యుఁడు అస్తమించునంతలో సైంధవుని తల నఱకుదును అని ప్రతిజ్ఞచేసి ఆప్రకారము నడపెను. మఱియు ఇతఁడు అర్భక

అపరాజితా శమీపూజ !

Image
శుభోదయం! . అపరాజితా శమీపూజ: శమీ శమతే పాపం శమీ శతృ వినాశనం అని మంత్రంతో శమీ(జమ్మి) వృక్షమును పూజించ వలెను. అపరాజితాదేవిని పూజించి ఊరుపొలిమేరను దాటి సీమోంల్లంఘనము చేయవలెను. గ్రామమునకు ఈశాన్యంగా చేసి, అపరాజితా దేవిని ఈ విధముగ పూజించాలి: మధ్యే అపరాజితాయై నమః ఇత్యవరాజితామావాహ్య తద్దక్షిణే క్రియా శ్క్యైనమః ఇతి జయాం నామతః ఉమాయైనమః ఇతి విజయామా వాహ్మ అపరాజితా యైనమః జయాయైనమః విజయాయై నమహ్ అపరాజితా దేవిని పూజించి రాజులు పట్టాభిషేకమును విజయదశమి నాడు చేయుదురు. విదేశములు వెళ్ళువారుకూడా ఈ విజయముహూర్తమే శ్రేష్ఠము.

మొక్కజొన్న తోటలో.............కొనకళ్ల వెంకటరత్నం!

Image
మొక్కజొన్న తోటలో.............కొనకళ్ల వెంకటరత్నం! (పాటకు ప్రాణం పోసింది ....వింజమూరి సిస్టర్స్... సీతా అనసూయ లు .) . సుక్కలన్ని కొండమీద సోకు జేసుకునే వేళ, పంటబోది వరిమడితో పకపక నవ్వేవేళ, సల్లగాలి తోటకంత సక్కలగిల్లి పెట్టువేళ, మొక్కజొన్నతోటలో ముసిరిన చీకట్లలో, మంచెకాడ కలుసుకో; మరువకు మామయ్య. చీకటి మిణుగురు జోతుల చిటిలి చిల్లులడక మునే, సుద్దులరాగాలు చెవుల నిద్దరతీయక మునుపే; ఆకాశపుటొడిని తోట ఆవలింతగొనక మునే, పొద్దువాలుగంటనే పుంతదారి వెంటనే, సద్దుమణగనిచ్చి రా ముద్దులమామయ్య! గొడ్డుగోద మళ్ళేసే కుర్రకుంకలకు గానీ, కలుపుతీతలయి మళ్లే కన్నెపడుచులకు గానీ, బుగ్గమీస మొడివేసే భూకామందుకు గానీ, తోవకెదురు వస్తివా, దొంగచూపు చూస్తివా, తంటా మన యిద్దరికీ తప్పదు మామయ్య!! కంచెమీద గుమ్మడిపువు పొంచి పొంచి చూస్తాది; విరబారిన జొన్నపొట్ట వెకిలినవ్వు నవుతాది; తమలకుతీగెలు కాళ్ళకు తగిలి మొరాయిస్తాయి; చెదిరిపోకు మామయా, బెదిరిపోకు మామయా! సదురుకొ నీ పదునుగుండె సక్కని మామయ్య! పనలుకట్టి యొత్తి నన్ను పలకరించబోయినపుడు, చెరుకుతోట మలుపుకాడ చిటికవేసి నవ్వినపుడు, మోటబావి వెనక న

మరచిన మన దసరా పద్యం.

Image
మరచిన మన దసరా పద్యం. . ఏదయా మీ దయా మామీద లేదు ఇంతసేపుంచితే ఇది మీకు తగదు దసరాకు వస్తిమని విసవిసలు పడక చేతిలో లేదనక అప్పివ్వరనక ఇరుగుపొరుగులకెల్తె ఇస్తారు సొమ్ము పావలా ఇస్తేను పట్టీది లేదు అర్ధరూపాయిస్తె అంటీది లేదు ముచ్చెవక ఇస్తేను ముట్టీది లేదు ఇచ్చరూపాయిస్తె పుచ్చుకుంటాము అటుపైని పావలాల్ పప్పుబెల్లాలు జై జై విజయీభవ!

బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి అయిదు వ్రేళ్లు! .

Image
బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి అయిదు వ్రేళ్లు! . చుట్టాలసురభి - బొటనవ్రేలు కొండేల కొరివి - చూపుడువ్రేలు పుట్టుసన్యాసి - మధ్యవ్రేలు ఉంగరాలభోగి - ఉంగరపువ్రేలు పెళ్లికిపెద్ద -చిటికెనవ్రేలు * * * తిందాం తిందాం ఒకవేలు! ఎట్లా తిందాం ఒకవేలు? అప్పుచేసి తిందాం ఒకవేలు! అప్పెట్టా తీరుతుంది ఒకవేలు? ఉన్నాగదా నేను అన్నింటికీ పొట్టివాణ్ణి, గట్టివాణ్ణీ బొటనవేలు! (చిటికన వ్రేలు, ఉంగరము వ్రేలు, నడిమివ్రేలు, చూపువ్రేలు, బొటనవ్రేలు, అని అయిదు వ్రేళ్ల పేళ్లు, ఈ అయిదు వ్రేళ్ళూ అనుకొన్నట్టు ఒక్కొక్క వ్రేలినీ చూపుకుంటూ బాలకు లీ పదములు పాడుదురు.)

పరాధికారము మనము పయిఁ బెట్టు కోరాదు.! .

Image
పరాధికారము మనము పయిఁ బెట్టు కోరాదు.! . (నీతి చంద్రిక - పరవస్తు చిన్నయ సూరి.... మిత్రభేదము.) . వారణాసియందు ధావకమల్లుఁడను చాకివాఁడు గలడు. ఒకనాఁడు వాఁడు మిగుల బట్టలు గుంజిన బడలిక చేత మయిమఱచి గుఱువెట్టి నిద్రపోవుచుండెను. ఆ నడిరేయి వాని యిల్లొక దొంగ చొచ్చెను. అప్పుడు వాని యింటి వాకిటఁ గాలి బందముతో గాడిద నిలుచుండెను. ఆ యింటి కావలికుక్క దాపునఁ గూర్చుండి చూచుచుండెను. అవి యొండొంటితో 'లోనికి దొంగ చొచ్చినాఁడు. చూచితివా?', 'చూచితిఁ జూచితి', 'మఱి యేల మొఱుగవు?', 'నాపని విచారింప నీకేమి నిమిత్తము?', 'మన దొరయిల్లు దొద్దవోఁగా నొప్పరికింపవచ్చునా?', 'నీవే మెఱుఁగుదువు? రాత్రి దినము నిమిషమాత్రమయినఁ బ్రమాదపడక తలవాకిలి వదలక యిల్లు గాచుకొని యుండుదును. ఆవంతయయిన నావలని ప్రయోజన మెఱుఁగక యేలిక నాయందు సాతకము లేకయున్నాఁడు. కాఁబట్టి కూడు కమికెఁడయిన దొరకుట కఱవయ్యె. పాటెఱుఁగని దొరను సేవించుట కంటె మిన్నకుంట మేలు.' ఇట్లు ఖరశ్వానములు ప్రశ్నోత్తరములు జరుపుచుండఁగా గాడిద మిక్కిలి కోపించుకొని 'యోరి దురాత్మ! వినుము. ఒక పోరామి వచ్చినపుడు స్వామి దోషములు దడవి యుపేక్షించి యు

తెలుగోడు మొట్ట మొదటిగా కట్టు కొనే స్వంత రాజధాని .

Image
అమరావతి ... తెలుగోడు మొట్ట మొదటిగా కట్టు కొనే స్వంత రాజధాని . ఏ పాదుష... ఏ నవాబు లేదా ఏ తెల్ల దొర కట్టి ఇచ్చింది కాదు. ఇది వారి చెమట.. వారి కృషి .. వారి నేర్పు. మేచ్చుకుందాం.....గర్వించదగ్గ విషయం.. శుభాకాంక్షలు

సహజ శాంతస్వభావుడైన శ్రీ రామచంద్రుడు ఆగ్రహిస్తే ఏమవుతుంది?

Image
మీకు మీ కుటుంబ సభ్యులకు నా విజయదశమి శుభాకాంక్షలు ... . .. సహజ శాంతస్వభావుడైన శ్రీ రామచంద్రుడు ఆగ్రహిస్తే ఏమవుతుంది? రావణుడు ఎదురుపడగానే రాముడు కోపోద్రిక్తుడయ్యాడు. ఆ తరువాత జరిగిన పరిణామాలేమిటో ఈ క్రింది పద్యంలో చెప్పారు ఎర్రాప్రగడ తన రామాయణంలో.. .. అతని రౌద్రరేఖ గని యబ్ది గలంగె, జలించె శైల మౌ త్పాతిక వారిదంబు లతి దారుణ రావములై జనించె ధా త్రీతల మెల్ల బిట్టదరె, దిక్కులు వ్రీలె, సమస్త భూతముల్ భీతి వహించె డెందమగలెన్, రజనీచరలోక భర్తకున్ …………(ఎర్రాప్రగడ) .. ఎర్రాప్రగడ భారతం తెనిగించక ముందే రామాయణం వ్రాసారు. దురుదృష్టవశాత్తూ అది మనకు ప్రస్తుతం అందుబాటులో లేదు. శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు చాల శ్రమించి 46 పద్యాలు సేకరించి భారతి మాసపత్రికలో “ఎర్రాప్రగడ రామాయణం” శీర్షికన ప్రచురించారు. వాటిలో యుద్ధకాండంలోని ఈ పద్యం ఒకటి. . విజయదశమి నాడే శ్రీరాముడు రావణాసురిడిని వధించాడని కూడా చెబుతారు. ఉత్తర భారతదేశంలో విజయదశమి నాడు “రామ్లీలా” ఉత్సవం జరిపి రావణుడి బొమ్మను దహనం చేస్తారు. .. (సేకరణః తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రచురించిన ఆచార్య వి.రామచంద్ర గారి చిన్ని పుస్తకం

ఓయిఓయిఓయి ఓకాపు పిల్ల!

Image
దసరా పాటలు..(జానపద గేయములు.) . ఓయిఓయిఓయి ఓకాపు పిల్ల! తాటిమేకలచల్ల తాగడే గొల్ల నిన్న మొన్నటిచల్ల నేటిక్కి పుల్ల కవ్వాన్ని తిప్పింది కమ్మన్నిచల్ల.

చక్కని బొమ్మలు వేశారు బాపు. !

Image
తను ఆమోదించని భావాలున్న పుస్తకాలకు కూడా  చక్కని బొమ్మలు వేశారు బాపు. ! .  రామస్వామి ‘భగవద్గీత’ పుస్తకం ముఖచిత్రంలో  శ్రీకృష్ణుడు అర్జునుడిలా విషాదయోగంలో కూర్చుని ఉండగా  రచయిత రామస్వామి గీతాబోధ చేస్తున్నట్టు గీశారు. . పల్నాటి యుద్ధంలో బాలచంద్రుణ్ణి ఉద్దేశించి తండ్రి బ్రహ్మనాయుడు చేసిన గీతోపదేశమే ఈ భగవద్గీత. ‘శకటములందెల్ల ధూమశకటము నేనే..  యెడారులలోన సహారా యెడారిని నేనే..  పద్యముల గంద పద్యము... విద్యల యందెల్ల జోర విద్యను నేనే ’- ఈ పద్ధతిలో వ్యంగ్య ధోరణిలో భగవద్గీతను పరిహసిస్తూ రాసిన సెటైర్ ఈ రచన.

“అల్పజీవి”తో నేను......: అతిథి

Image
“అల్పజీవి”తో నేను......: అతిథి ఇప్పుడే రావి శాస్త్రి రాసిన ఈ నవల చదవటం అయ్యింది.  ఇప్పుడే అంటే ఓ రెండు గంటలవుతోంది. “హమ్మయ్య.. అయ్యిపోయింది” అన్న రిలఫ్ ఉందెక్కడో! మధ్యలోనే ఆపేస్తానేమో అనుకున్నాను చాలా సార్లు. కానీ మొత్తానికి పూర్తి చేసేశాను. రావిశాస్త్రి గురించి చాలా విని ఉన్నాను. ఎలా అయినా ఆయన రచనలు చదివితీరాలన్నంత విన్నాను. అందుకే అల్పజీవి చేతికందగానే ఇక ఆగేది లేదనుకుంటూ చదవటం మొదలెట్టాను. చదువుతున్నప్పుడు “ఆహా” అనుకున్న సందర్భాలూ లేవు. సుమారు 200 పేజీలున్న ఈ నవల చదవడానికి నేననుకున్నదాని కన్నా చాలా తక్కువ సమయం పట్టింది. కథా-కమామిషు: మొదట్లో చెప్పినట్టు, ఈ పుస్తకం మధ్యలో ఆపేస్తానేమో అనుకోడానికి కారణం, ఇది ఒక “అల్పజీవి” అయిన “సుబ్బయ్య” కథ. బొత్తిగా ధైర్యం లేని మనిషి. ఏది ఎప్పుడు ఎలా చేసినా అది పిరికి చర్యలానే అనిపిస్తుంది. రోజూ అరుగు మీద కూర్చుని బానే పరికిస్తాడు చుట్టూ ఉన్న మనుషులని, దారెమ్మెట పోయే వాళ్ళని. తన భార్యని ఎవడో వచ్చి పిల్లల్ని ఎట్లా చూసుకోవాలో చెప్తూ ఉంటే కోపానికి బదులు హాశ్చర్యపోయే అల్పజీవి. భార్యతో మాట్లాడాలన్నా పిరికితనం. చుట్టూ ఉన్న మనుషుల్లో ఏదో ఒక్క గొప్పతన

వర్షం రావిశాస్త్రి

Image
వర్షం రావిశాస్త్రి చిరునామా అక్కరలేని రచయిత. వృత్తి లాయరైనా ప్రవృత్తి మాత్రం రచనా వ్యాసంగమే. తెలుగు నవలా సాహిత్యానికి అల్పజీవి లాంటి మనో విశ్లేషణాత్మక నవలను అందించారు. ఉత్తరాంధ్ర మాండలిక భాషను సొగసుగా రచనల్లో వాడారు. కథను ఎలా రాయాలో తెలుసుకోడానికి గొప్ప ఉదాహరణలు రావి శాస్త్రి కథలు. అసలు కథను ఎక్కడ ప్రారంభించాలో, ఎలా మలుపు తిప్పి మెరుపులాంటి ముగింపు ఎలా ఇవ్వాలో రావి శాస్త్రికి బాగా తెలుసు. అతను రాసిన కథల్లో ప్రతి ఒక్కటీ ఓ పాఠం లాంటిదే. అలాంటిదే వర్షం కథ. సంకల్పం అనేది మనిషికి ఎంత అవసరమో ఓ పిల్లాడి చేత చెప్పిస్తాడు ఈ కథలో. క్లుప్తంగా కథా విషయానికి వస్తే- వర్షం దబాయించి కొడుతుంది. కలకత్తా వెళ్లాల్సిన సిటీబాబు అడివిపాలెం నుంచి వచ్చి వర్షం వల్ల కమ్మలపాక టీ దుకాణంలో చిక్కుకు పోతాడు. ఆ టీ దుకాణాన్ని ఒక తాత నడుపుతుంటాడు. అక్కడి నుంచి సిటీబాబు స్టేషన్ కు వెళ్లాలంటే రెండు కోసుల దూరం నడవాలి. లేదా బస్సు, లేదా బండి. వర్షం వల్ల అవేవి రావు. వర్షం మాత్రం మబ్బులు పట్టి, జోరుగా కురుస్తుంది. ఆ సిటీబాబు పేరు పురుషోత్తం. తాత వర్షంలో వెళ్లలేవని చెప్తాడు. పైగా- కత్తుల్లా మెరుపులు, కొండలు బద్దలు కొట్టినట్

అమరావతి: ఆంధ్రుల రాజధాని........ నోట్ దీస్ పాయింట్స్ యువరానర్ !

Image
నోట్ దీస్ పాయింట్స్ యువరానర్ ! కరెన్సీనోటు చిరగడానికి ముందు కనీసం 4000 మంది చేతులు మారుతుంది. * హాలీవుడ్‌లో అడుగుపెట్టేనాటికి వాల్ట్‌డిస్నీ జేబులో 40డాలర్లు, చేతిలో సగం గీసిన ఓ కార్టూన్‌ ఉన్నాయంతే! * విజయవాడ నగర విస్తీర్ణం(61.88 చ.కి.మీ) కన్నా తక్కువ విస్తీర్ణం గల దేశాలు పది ఉన్నాయి.(ఇది పాత లెక్క ఇప్పుడు మరో రెండు చదరపు కిలోమీటర్లు కలుపుకొండి. * నెపోలియన్‌తో జరిపిన యుద్ధాలకు సంబంధించిన అప్పులను బ్రిటన్‌ ఇంకా తీరుస్తూనే ఉంది. ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ ఈ-బేలో విక్రయించిన అత్యంత ఖరీదైన వస్తువు జెట్‌విమానం. వెల దాదాపు 5మిలియన్‌డాలర్లు. అమరావతి: ఆంధ్రుల రాజధాని అమరావతి గుంటూరు జిల్లాలో కృష్ణా నదీ తీరానికి కుడి వైపున ఉన్నది. ఈ పట్టణము వేల సంవత్సరాల ప్రాచీనమైన చరిత్ర కలిగి ఉన్నది. ప్రాచీన శాసనాల ప్రకారము ఈ పట్టణానికి ధాన్యకటకము అనే పేరు ఉన్నట్లు తెలుస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ లోని పంచారామాలలో ఒకటైన అమరేశ్వరాలయము పేరు మీదుగా అమరావతి పేరు వచ్చింది. ఈ పట్టణము జైన, బౌద్ధ మతాలకు కూడా ప్రసిద్ధమైనది. శాతవాహనులలో ప్రసిద్ధుడైన గౌతమీపుత్ర శాతకర్ణి మూలముగా క్రీ.శ. ఒకటవ శతాబ్దములో ధాన్యకటక

వెడలె ఈ రాజు కుమారుడు ...

Image
బంగారు పాపా పాట .. నిన్న అడిగిన ప్రశ్నకు జవబు.  .  (శ్రీ దేవులపల్లి వారి చక్కటి పాట .. రామశర్మ .. కృష్ణకుమారి .  పాడింది రాజా సుశీల .. మాధవ పెద్ది .. సిత మరియు అనసూయ ) .  వెడలె ఈ రాజు కుమారుడు ...  బంగారు తేరు మీద ..  కోర మీసం చిన్నవాడ .. ఓర చూపులు పిల్లతోడ  నువ్వు కులుకు బెళుకు తు జాతర కేల్లవు ..  ఓరబ్బి చిన్నబ్బి. ...ఒలమ్మి చినమ్మి..  ఆరేవు కాడ ... ఆతోపు నీడ  నన్ను చూసి చిన్నది .. నవ్వి ఉరు కున్నది ..  మున్నేటి జాడ .. మేఘల ఓడ .  నన్ను చూసి చిన్నది నవ్వి ఉరుకున్నది .