Posts

Showing posts from 2016

చాయాదేవి శాపం !

Image
చాయాదేవి శాపం ! శ్రీమతి శారద పోలంరాజు గారికి కృతజ్ఞలతో.) . విశ్వకర్మ కూతురు సంజనకు (సంఙ్ఞ) సూర్యునితో వివాహం జరుగుతుంది. ఆమెకు మొదట మనువు, తరువాత యమ యమున అనే కవలలు జన్మిస్తారు. ఆమె సూర్యుని కాంతి వేడిమి భరించ లేకపోతుంది. ఆమె శరీరము కూడా మసిబారినట్టు అయిపోయి సూర్యోదయ సూర్యాస్తమయాలలో ఉండే చీకటి రంగులోకి మారిపోవడం చేత దేవతలు ఆమెను సంధ్య అని అన్నారు. బ్రహ్మాండ పురాణం మార్కండేయ పురాణాల ప్రకారం......... సంధ్యకు వైవశ్వంతమనువు తరువాత యమున యముడు కవలలుగా జన్మిస్తారు. ఏ విధంగానైనా ఆ వేడిమిని తప్పించుకోవాలనుకున్న సంధ్య తన అంశతో ఛాయ అన్న మరో రూపం సృష్టించి తాను తిరిగి వచ్చే వరకు తన బిడ్డలను చూసుకుంటూ సూర్యుడిని ఏ మాత్రమూ వదలకుండా వెన్నంటి తిరగమని ఆఙ్ఞాపించి తన ముగ్గురు పిల్లలను ఆమెకు అప్పగించి తండ్రి ఇంటికి వెళ్ళిపోతుంది. ఛాయకు ఇద్దరు కొడుకులు జన్మిస్తారు. మొదటివాడు శ్రుతశ్రవుడు అతను సావర్ణి మనువుగాను, రెండవవాడు శ్రుతకర్మ శనిగ్రహంగానూ ప్రఖ్యాతి చెందుతారు. సంధ్యముగ్గురు పిల్లలని సరిగ్గా చూడక ఛాయ సవతి బుద్ది చూపించుకుంటుంది. పెద్దవాడైన మనువు పట్టించుకోడు కాని యముడు కోపం తో ఆమె

పానకంలో పుడక !

Image
పానకంలో పుడక! .  భట్టుమూర్తి వ్రాసిన "వసుచరిత్రలోది ఈ పద్యము.వాసు రాజు వ్యాహ్యాళి కై వచ్చి ఒక చోట విశ్రమించినాడు. అప్పుడు ఎక్కడి నుండియో మధుర గానము వినపడెను.ఎవరో ఒకయువతి మధురముగా పాడుతూ వుంది. అప్పుడు ఆ రాజు తన వెంట వచ్చిన వయస్యుని (మిత్రుడిని)ఎవరిదీ గంధర్వగానము?పోయి చూచిరా అనిపంపించాడు.ఆ మిత్రుడు వెళ్లి చూసి వచ్చి ఆమె సౌందర్యమును యిలా వర్ణించాడు. కమనీయాకృతి యోగ్య కీర్తనలం గన్పట్టు నా శ్యామ, యా  సుమబాణాంబక, యా యమూల్య మణి, యా చొక్కంపు పూబంతి యా  సుమనోవల్లరి,ఆ సుధా సరసి యా సొంపొందు డాల్దీవి యా  కొమరు బ్రాయంపు రంభ, ఆ చిగురుటాకుంబోడి నీకేతగున్  అర్థము:--ఆమె కమనీయ రమణీయ అవయవ సౌందర్య యౌవ్వనము,ఆమె మన్మధ బాణముల వంటి కన్నులు గలది.(అరవింద,మశోకంచ,చూతంచ,నవమల్లికా, నీలోత్పలంచ పంచైతేపంచ బాణస్యసాయికా ఈ  ఐదూ మన్మధుని బాణాలు)పద్మరాగ మణి వంటి పెదవులు కలది.పూదీగేల వంటి చేతులు గలది,అమృత సరస్సు వంటి నాభి గలది,చొక్కమైన పూబంతుల వంటి కుచములు గలది,చిగురుటాకుల వంటి పాదములు గలది,అంతేకాక సన్నని దేహము గల్గి మన్మథ బాణము,అమూల్యమైన మణి పూబంతి  వంటి యింతి ;పూలతీగే అమృత సరస్సు,కాంతి,దేవి

అనిసెట్టి 'స్వీయచరిత్ర' అనే కవిత !

Image
అనిసెట్టి 'స్వీయచరిత్ర' అనే కవిత ! .  'మానవత్వ సూత్రాలు మననం చెయ్యడంకంటే  మందహాసంలో మంచితనం పంచిపెడితే చాలు'  విగ్రహంలా వెయ్యేళ్ళు బతకడం కన్నా  విద్యుత్తులా ఒక్కక్షణం వెలగడం మేలు. .  కంటికి కనిపించని సత్యం మనస్సులో గోచరిస్తుందని  మనస్సుకు స్ఫురించానిది స్వప్నంలో సాక్షాత్కరిస్తుందని  స్వప్నాలకందని సత్యం మానవాంతరాత్మలో  మౌన సంగీతం ఆలపిస్తుందని ఆలకిస్తున్నాను, అర్థం చేసుకుంటున్నాను. తన తత్త్వాన్ని విస్పష్టం చేస్తూ - తన యౌవనంలో ప్రచండావేషాల ఊయలపై ప్రతిక్షణం స్వారీ చేస్తూ, విశ్వాన్ని వెక్కిరిస్తూ, వెర్రిగర్వంతో విర్రవీగాడు; అయితే విపరీతమీ యౌవనం, వేకువ రాకముందే వెళ్ళిపోయింది అని తెలుసుకొన్నాడు, వేకువరాగానే. .  నాలోని మృత్యువును బంధించి మారణాయుదంలో చేర్చాను నాలోని ప్రాణశక్తి విజ్రుభించి ప్రచండ జీవనోద్వేగంగా మార్చాను  .  సంహరించాను  పురాణాల రాక్షసులని  భూమిమీద క్రిముల్ని  బుద్ధిలో ముసిరే  దురాలోచనల్ని , అని చెప్పిన తీరు మాత్రం అందరినీ ఆకర్షించక తప్పదు. .  అనిసెట్టి జీవన మహాయాత్రా పథంలో సర్వం సాధనకై ధారపోశాడు. తప్

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(3012)! (శ్రీ శేషప్ప కవి)

Image
శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(3012)! (శ్రీ శేషప్ప కవి) . సీ|| అర్ధివాండ్రకు నీక హానిఁజేయుటకంటెఁ దెంపుతో వసనాభిఁ దినుటమేలు; ఆఁడుబిడ్డలసొమ్ము లపహరించుటకంటె బండఁగట్టుక నూతఁబడుట మేలు; పరులకాంతలఁ బట్టి బల్మిఁ గూడుటకంటె; బడబాగ్ని కీలలఁ బడుటమేలు; బ్రతుక జాలక దొంగపనులు సేయుటకంటెఁ గొంగుతో ముష్టెత్తుకొనుట మేలు; . తే|| జలజదళనేత్ర! నీ భక్త జనులతోడి జగడమాడెడు పనికంటెఁ జావుమేలు; భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(2912)!

Image
శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ! శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(2912)! (శ్రీ శేషప్ప కవి) . సీ|| గౌతమీస్నానానఁ గడతేరుదమటన్న మొనసి చన్నీళ్ళలో మునుఁగలేను; దీర్ధయాత్రలచేఁ గృతార్ధు డౌదమటన్న బడలి నీమంబులె నడపలేను; దానధర్మముల సద్గతినిఁ జెందుదమన్న ఘనముగా నాయొద్ద ధనములేదు; తపమాచరించి సార్ధకము నొందుదమన్న నిమిషమైన మనస్సు నిలుపలేను; . తే|| కష్టములకోర్వ నాచేతఁగాదు: నిన్ను స్మరణఁజేసెద నా యధాశక్తి కొలఁది;. భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

ఆహారం'.

Image
ఆహారం'. గురించి ప్రముఖుల, మహాత్ముల అభిప్రాయాలూ , అనుభవాలూ ! ------------------------------------------------------- 1. ' శ్రీరామ రాజ్యం' ఎలా వుండేదో ఉత్తరకాండలో ఈ వర్ణన చూడండి " వ్యవసాయదారులు ఎవరూ పండిన వెంటనే పంట కోసుకోవాలని తొందర పడటంలేదు ! రాశులుగా పోసిన ధాన్యానికి ఎవరూ కాపలా వుండట్లేదు ! గాదెలు కట్టుకోటానికి ఎవరూ ఆత్రుత పడటంలేదు . ధాన్యం బస్తాలు ఇంటిబైటే పడేసి అంతా నిశ్చింతగా నిద్రపోతున్నారు .రామరాజ్యంలో ఎవరికీ తిండికరువూ , దొంగతనం అవసరం వుండదని వారికి తెలుసు !  ( మహర్షి వాల్మీకి ) 2. ఆకలిగొన్నవాడికి ' దేవుడు ' కనపడేది అన్నం రూపంలోనే ! ( మహాత్మా గాంధీ ) . 3. " నేను వంటింట్లోకి వేరే పనిమీదవెళ్ళినాకూడా , వంట చేస్తున్న మా అమ్మగారు. " పెట్టేస్తా నాన్నా ఒక్క అయిదు నిముషాలు " అనేవారు నొచ్చుకుంటూ- నేను అన్నం కోసం వచ్చాననుకుని !  ఎంతయినా అమ్మ అంటే అన్నం. అన్నం అంటే అమ్మ ! అంతే ! ( జంధ్యాలగారు ) . 4. మంచి భోజనం లేని పెళ్ళికి వెళ్ళటం - సంతాపసభకి వెళ్ళినదానితో సమానం ! ( విశ్వనాధ సత్యనారాయణ గారు ) . 5. రాళ్లు తిని అరిగ

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(

Image
శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ! శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(2812)! (శ్రీ శేషప్ప కవి) సీ|| శ్రవణ రంధ్రముల నీ సత్కథల్ పొగడంగ లేశ మానందబు లేనివాఁడు పుణ్యవంతులు నిన్నుఁౠజ సేయ గ జూచి భావమందుత్సాహ పడనివాఁడు భక్తవర్యులు నీ ప్రభావముల్ పొగడంగఁ దత్పరత్వములేక తలఁగువాఁడు తన చిత్తమందు నీ ధ్యాన మెన్నఁడు లేక కాలమంతయు వృధా గడపువాఁడు . తే|| వసుధలోనెల్ల వ్యర్ధుండు వాఁడె యగును; మఱియుఁజెడుఁగాక యెప్పుడు మమతనొంది;  భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(2712)!

Image
శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(2712)! (శ్రీ శేషప్ప కవి) . సీ|| మందుడనని నన్ను నిందఁజేసిన నేమి? నా దీనతను జూచి నవ్వనేమి? దూరభావములేక తూలనాడిననేమి? ప్రీతి సేయక వంక బెట్టనేమి? కక్కసంబులు పల్కి వెక్కిరించిన నేమి? తీవ్రకోపముచేతఁ దిట్టనేమి? హెచ్చుమాటలచేత నెమ్మెలాడిన నేమి? చేరి దాపట గేలి సేయనేమి? . తే|| కల్పవృక్షంబువలె నీవు కల్గ నింకఁ బ్రజల లక్ష్యంబు నాకేల! పద్మనాభ!  భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

ఔదార్యము!

Image
ఔదార్యము! . ధీరో దార గుణంబులు  కారణ జన్మునకు వేరే గరుపగ వలెనా  ధారుణిలో టెంకాయకు  నీరేవ్వరు పోసిరయ్య నిట్టల హరియా . అర్థము:-- ధైర్యము, ఉదారత్వము (ఔదార్యము)ఉత్తమునకు  నేర్ప వలిసిన పని లేదు.  కొబ్బరికాయలో నీరెంత సహజముగా పుట్టుకు వస్తుందో  ధైర్య, ఔదార్య గుణాలు కూడా పుట్టుకతోనే వస్తాయి.  నేర్చుకుంటే వచ్చేవి కావు.

తిరుప్పావై .. బాపు బొమ్మ .. దేవులపల్లి కవిత.

Image
.. బాపు బొమ్మ . .  తిరుప్పావై .. బాపు బొమ్మ .. దేవులపల్లి కవిత. . రావే గోపవంశాన రాజిల్లే లతకూన! రావే పాముపడగబోలే కటికలదానా! లేవే నీరదశ్యామమోహనుని నామముల నీ వాకిటనే నిలిచి నీవారు పాడరు! మేలి పొదుగుల ఆలువేలు కలవారు, ఆ భీలరణమున అరులబీర మడచేవారు, గో పాలకుల కులమున వెలసే ఓ వనమయూరీ! లేవే! కలములనెలవౌ ఓ నారి! ఒయ్యారి!

'మాతృషోడశి'.!

Image
'మాతృషోడశి'.! 'మాతృషోడశి'.! 'అమ్మా నేను గర్భంలో వుండగా నిన్ను చాలా బాధపెట్టాను .. ప్రసూతి తర్వాత కూడా నా గురించి, నా తిండితిప్పల గురించి, . ఆరోగ్యం గురించి ఎంతో కష్టపడ్డావు. . ఆ బాధలు కలిగించినదానికి ప్రతిగా యీ మాతృపిండాన్ని నీకు సమర్పిస్తున్నాను.'

లోకరీతి.!

Image
లోకరీతి.! . సీ. మంచిని అందరూ పంచుకో జూస్తారు పంచుకోరెవ్వరు ఎంచి చెడుని పాపపుణ్యములను పంచుకోమనగాను పుణ్యము తీసుకు పాపమొదలు  సుఖ దుఃఖముల నెల్ల సమముగ పంచగ  దుఃఖములనొదలి సుఃఖము గోరు. కలిమికి లేమికి కొలబద్ద జూపిన  కలిమికి కొలబద్ద కాంచ రెవరు  . . ఆ. కష్ట సుఖములుండు కలిమి లేములు నుండు మంచి చెడులు పుణ్య పాపములును  కలసి మెలసి యుండు కలగాపులగముగా కాల సహజ మింతె కలత పడకు. (మా అక్క గారు సుర్యలక్ష్మి తర్నకంటి గారు వ్రాసిన కవిత )

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(శ్రీ శేషప్ప కవి)

Image
శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(2612)! (శ్రీ శేషప్ప కవి) . సీ|| ఐశ్వర్యములకు నిన్ననుసరింపఁగలేదు. ద్రవ్య మిమ్మని వెంటఁ దగులలేదు, కనకమిమ్మని చాలఁ గష్ట పెట్టఁగ లేదు! పల్లకిమ్మని నోటఁ బలుక లేదు, సొమ్ము లిమ్మని నిన్ను నమ్మి కొల్వఁగ లేదు, భూమి లిమ్మని పేరు పొగడ లేదు, బలము లిమ్మని నిన్ను బ్రతిమాలఁగా లేదు, పసుల నిమ్మని పట్టు బట్టలేదు, . తే|| నేను గోరిన దొక్కటే నీలవర్ణ! చయ్యనను మోక్షమిచ్చినఁ జాలు నాకు, . భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

మాగాడిమాయరోగం!

Image
మాగాడిమాయరోగం! . స్త్రీ ఫలానా పురుషుడి భార్యగా గుర్తింప బడటానికి గర్విస్తుందేమో కానీ..... మగవాడు మాత్రం - ఫలానా స్త్రీ భర్తగా గుర్తింప బడేకంటే ....చావడం నయం అనుకుంటాడు ..... . భార్యా భర్తలు ఇద్దరూ  సమానమైన , పేరు ప్రతిష్ఠలు కలిగి ఉంటే అది వేరే సంగతి.  . "ఇద్దరిలో ఎవరిది ఆధిక్యత-అంటే భార్య తల వంచినట్లుగా , భర్త తలవంచలేడు . బహుశా మగవాడికి ఈ అహంకారం ప్రకృతే ప్రసాదించి వుంటుంది......"

సూటిగా ఒక ప్రశ్న?

Image
సూటిగా ఒక ప్రశ్న? . చాగంటి గారు ఇప్పటివరకు కొన్ని వేల ప్రవచనాలు చెప్పారు.. అన్ని వేల ప్రవచనాలలో ఎప్పుడూ సనాతనధర్మ వైభవం, విశిష్టత గురించే మాట్లాడారు..ఎక్కడా ఇతర మతాల గురించిన ప్రస్తావన గాని, వారిపై కోపగించుకోవడం గాని చేయలేదు.. కాని మొదటిసారి అలాంటి వ్యాఖ్యలు ఆయన నోటిద్వారా విన్నాను..ఒక వాట్సాప్ ఆడియో లో..ఆయనేమన్నారో ఆయన మాటల్లోనే.. "ఒక మైకు పట్టుకుని అరుస్తున్నావ్..నువ్వెప్పుడైనా రామాయణం చదివావా?.....

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!

Image
శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ! శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(2512)! . సీ|| చిత్తశుద్ధిగ నీకు సేవఁజేసెదఁ గాని, పుడమిలో జనుల మెప్పులకు గాదు, జన్మ పావనతకై స్మరణ జేసెదఁగాని, సరివారిలోఁ బ్రతిష్ఠలకుఁగాదు, ముక్తికోసము నేను మ్రొక్కివేడెద గాని, దండిభాగ్యము నిమిత్తంబుగాదు, నిన్నుఁబొగడను విద్య నేర్చితినేకాని, కుక్షి నిండెడు కూటి కొఱకుఁగాదు, . తే|| పారమార్ధికమునకు నేఁబాటుపడితిఁ గీర్తికి నపేక్ష పడలేదు కృష్ణవర్ణ! భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

శృంగార శ్రీనాథుని" చాటుపద్య కవితా వైభవం ....(2)

Image
శృంగార శ్రీనాథుని" చాటుపద్య కవితా వైభవం ! . అగసాలిది కాబోలును  సొగసైన మిటారి యోర చూపుల తోడన్  జగమెల్లను వలపించుచు  మగటిమితో వచ్చె బురము మార్గము వెంటన్ ! . శ్రీనాథుడు రాజమహేంద్రపుర వీధుల్లో సంచరించేటప్పుడు ఒక విశ్వబ్రాహ్మణిని చూచి చెప్పిన పద్యం. "మగటిమి" అనే పద ప్రయోగంవల్ల పురుషాయితము  అనే అర్థం స్పురిస్తుందీ శృంగార చాటువులో.

శృంగార శ్రీనాథుని" చాటుపద్య కవితా వైభవం ! .

Image
" శృంగార శ్రీనాథుని" చాటుపద్య కవితా వైభవం ! . పొచ్చెంబింతయు లేని హంస నడతో బొల్పొందు లే నవ్వుతో,  బచ్చల్ దాపిన గుల్కు ముంగరలతో, బాగైన  నెమ్మోవితో,  నచ్చంబైన ముసుంగువెట్టి, చెలితో నామాటలే చెప్పుచున్  వచ్చెంబో! కుచకుంభముల్ గదలగా వామాక్షి తా  నీళ్ళకున్! . నీలాటిరేవు కడకు వచ్చిన ఒక నీలవేణిని వర్ణిస్తూ చెప్పిన పద్యమిది. ఈ వామాక్షి నీళ్ళకోసం వచ్చింది కాబట్టి ఆమె చనుకట్టు కుచకుంభాలయ్యాయి. లేకుంటే మరేమయ్యేవో!

మన ఘంటసాల !

Image
మన ఘంటసాల ! తెలుగు వాడికి తెల్లవారితే 'దినకరా శుభకరా' ; మధ్యాహ్నం బాధ కలిగితే ఓదార్చే 'భగవద్గీత' ; సాయంత్రం వేడుకైతే 'పడమట సంధ్యా రాగం, కుడి ఎడమల కుసుమ పరాగం' ; రాత్రి 'కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది' , అలా కానప్పుడు 'నడిరేయి ఏ జాములో'' ... 'నిద్దురపోరా తమ్ముడా' ....'కల ఇదనీ నిజమిదనీ తెలియదులే' , అంతలోనే తెల్ల వారితే 'నిన్న లేని అందమేదో నిదుర లేచెనెందుకో' అన్న సందేహంలో సంతృప్తి - ఇవన్నీ ఆయన ప్రసాదించిన వరాలే. తెలుగు విద్యార్ధికి 'ప్రేమ తమాషా వింటేనే కులాసా' . కానీ 'పది మందిలో పాట పాడితే అది అంకితమెవరో ఒకరికే' అన్న సుతి మెత్తని బెత్తం దెబ్బా! తొందర పాటు నిర్ణయాలకు పోతుంటే 'కల కానిది విలువైనది బ్రతుకు- కన్నీటి ధారలలోనే బలి చేయకు' అన్న అక్షర లక్షల 'థెరపీ', ఆవేశం వస్తే 'ఆవేశం రావాలి' కానీ 'ఆవేదన కావాలి' అన్న మందలింపూ, ఆందోళనకు దిగితే 'తెలుగు వీర లేవరా' అన్న అదిలింపూ, ఎవరికి వారయి విడిపోతుంటే 'ఎవ్వరి కోసం ఎవరున్నారు పొండిరా పొండి' అన్న విదిలింపూ- ఇ

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ(2412)

Image
శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ(2412) . సీ|| ఆదినారాయణా యనుచు నాలుకతోడఁ బలుక నేర్చినవారి పాదములకు సాష్టాంగముగ నమస్కార మర్పణఁజేసి ప్రస్తుతించెదనయ్య బహువిధముల ధరణిలో నరులెంత దండివారైనను నిన్నుఁగాననివారి నే స్మరింప, మేము శ్రేష్ఠుల మంచు ముడుకుచుండెడివారి చెంతఁజేరఁగఁ బోను శేషశయన! . తే|| పరమ సాత్త్వికులైన నీ భక్తవరుల దాసులకు దాసుఁడను జుమీ ధాత్రిలోన,  భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

నవ్వుల రాణి గిరిజ!

Image
నవ్వుల రాణి గిరిజ! నవ్వుల రాణి గిరిజ! . తొలి నాళ్ళల్లో హాస్య నటిగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన దాసరి గిరిజ మొదటిసారి ‘పరమానందయ్య శిష్యులు’ చిత్రంలో కథానాయికగా నటించి ఆ తరువాత సినిమా రంగంలో అరంగేట్రంచేసి తిరుగులేని హాస్య నటిగా గుర్తింపుతెచ్చారు. గిరిజ ఎన్ని హాస్య పాత్రలు పోషించినా ‘పాతాళభైరవి’ చిత్రంలో పింగళి సృష్టించిన ‘నరుడా ఏమి నీ కోరిక’ అన్న డైలాగుతో అప్పటి ప్రేక్షకులకు చేరువయ్యారు. గిరిజ హాస్య నట ప్రస్థానం చిగురుతొడిగి మొగ్గవేస్తున్న తరుణంలో రేలంగితో జత కలిసి వారిద్దరి కాంబినేషన్‌లో ఎన్నో హాస్యచిత్రాలు వచ్చాయి. గిరిజ తన హాస్య అభినయంతో ఒక ఇమేజ్‌ని సృష్టించుకున్నారు. ‘రాముడు-్భముడు, ‘జగదేకవీరుని కథ’, ’ చిత్రాల్లో రేలంగితో కలిసి సున్నితమైన హాస్యాన్ని ప్రేక్షకులకు అందించి చిరకాలం గుర్తుండిపోయేలా నటించింది.

నడుస్తున్న వంటగదిలో ఉపగదులు .

Image
నడుస్తున్న వంటగదిలో ఉపగదులు  . ఎక్కడో అక్కడ కనిపించే మొల్ల, వెంగమాంబ, ముద్దుపళని, రంగాజమ్మ మొదలైన నలుగురైదుగురు స్ర్తీల పేర్లు తప్ప ఆదికవి నన్నయ దగ్గరనుంచి ఆధునిక యుగం వరకు కవిత్వ ప్రపంచ సర్వస్వం పురుషాధీనమే. వేదయుగంలో మంత్ర ద్రష్టలుగా, స్రష్టలుగా గార్గి, మైత్రేయి వంటి మహిళల పేర్లు వినిపించినా మధ్య యుగంలో మాత్రం సమాజంలో గాని, సాహిత్యంలో గాని పడతుల ప్రాతినిధ్యం, ప్రభావం శూన్యం.  తాళ్ళపాక తిమ్మక్క, ముద్దుపళని, రంగాజమ్మ, వెంగమాంబ మొదలైనవాళ్ళు కవయిత్రులుగా ప్రసిద్ధి కెక్కినా ఆ తర్వాత ఆడవాళ్ళకు మళ్ళీ అంధకార యుగమే. ఆడవాళ్ళకు చదువు ఎందుకు అన్నారు. ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళేలాలా అని తర్కించారు. కొన్ని శతాబ్దాలపాటు వెనక్కి నెట్టేశారు. చీకట్లో వేగు చుక్కల్లా స్రీల జీవితాల్లో సంఘ సంస్కర్తలు బయలుదేరి ఆశల నక్షత్రాలు వెలిగించారు. చదువుల చందమామ ఉదయింపచేశారు. . 19వ శతాబ్దంలో కందుకూరి, గురజాడ మొదలగువారు జన్మించి స్ర్తీ విద్యను ప్రోత్సహించారు. ‘ముదితల్‌ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్‌’ అన్నారు. ‘స్ర్తీ కి శరీరం ఉంది. దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకు మెదడు ఉంది. దానికి జ్ఞానం ఇవ్వాలి

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ(2312)

Image
శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ(2312) . సీ|| ఆదినారాయణా యనుచు నాలుకతోడఁ బలుక నేర్చినవారి పాదములకు సాష్టాంగముగ నమస్కార మర్పణఁజేసి ప్రస్తుతించెదనయ్య బహువిధముల ధరణిలో నరులెంత దండివారైనను నిన్నుఁగాననివారి నే స్మరింప, మేము శ్రేష్ఠుల మంచు ముడుకుచుండెడివారి చెంతఁజేరఁగఁ బోను శేషశయన! . తే|| పరమ సాత్త్వికులైన నీ భక్తవరుల దాసులకు దాసుఁడను జుమీ ధాత్రిలోన .భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

స్త్రీ స్వేచ్ఛకు నిజమైన అర్థమిదేః

Image
స్త్రీ స్వేచ్ఛకు నిజమైన అర్థమిదేః బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతీ రామకృష్ణను ఎరుగని తెలుగు లోగిలి లేదనడం అతిశయోక్తి కాదు. నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో యజమానురాలు, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు, గృహిణి... ఇలా నిజ జీవితంలో విభిన్న పాత్రలను పోషించి ఆయా రంగాల ప్రముఖులచే భేష్ అనిపించుకున్న ఘటికురాలు. స్త్రీ స్వేచ్ఛపై తన అభిప్రాయాలను సుస్పష్టంగా చెప్పారామె. మహిళా స్వేచ్ఛ అంటూ చాలామంది రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంటారని డాక్టర్ భానుమతి పేర్కొంటూ, ఎవరినీ లెక్కచేయక విచ్చలవిడిగా తిరుగుతూ నిర్లక్ష్య ధోరణి గలవారు ఒకరైతే... పురుషాధిక్యానికి గురై అమాయకత్వంతో కూడిన అజ్ఞానంతో కష్టాలు పడే మహిళలకు విముక్తినివ్వాలని సీరియస్‌గా వాదించేవారు ఇలా రెండు రకాల మహిళా స్వేచ్ఛావాదులు ఉన్నారంటారు. అయితే "మట్టిలో మాణిక్యం" చిత్రంలో తాను రూపొందించిన లలిత పాత్ర. స్త్రీ స్వేచ్ఛకు నిజమైన అర్ధం అంటారు డాక్టర్ భానుమతి. మహిళ తనకంటూ స్వంత వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకొని, తన పరిమితులను తానెరిగి, జీవిత భాగస్వానిగా, అమ్మగా, పరిపూర్ణ స్త్రీగా బాధ్యతలను నిర్వర్తిస్తూ ఆత్మాభిమానాన్ని కోల్పోకుండా ముందడుగు వేయా

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(2212)

Image
శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ(2212) (రచించినది కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన శేషప్ప కవి) . సీ|| నరసింహ! నీ దివ్యనామ మంత్రము చేత దురితజాలము లెల్లఁదోలవచ్చు, నరసింహ! నీ దివ్యనామమంత్రముచేత బలువైన రోగముల్ బాపవచ్చు, నరసింహ! నీ దివ్యనామమంత్రము చేత రిపు సంఘముల సంహరింపవచ్చు, నరసింహ! నీ దివ్య నామమంత్రము చేత దండహస్తుని బంట్లఁ దఱుమవచ్చు. . తే|| భళిర! నే నీ మహామంత్ర బలము చేత దివ్యవైకుంఠ పదవి సాధింపవచ్చు! భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

ఏమని పొగడుదుమే యీచెలి చక్కదనము.!

Image
ఏమని పొగడుదుమే యీచెలి చక్కదనము.! ఏమని పొగడుదుమే యీచెలి చక్కదనము.! (అన్నమాచార్యుల కీర్తన.) . ఏమని పొగడుదుమే యీచెలి చక్కదనము యీమేటి యలమేల్మంగ యెక్కువైతానిలిచె అరచంద్రుడుఁ జకోరాలద్దాలు సంపెగయు ధర శింగిణులు శ్రీలు తలిరులును అరుదుగాఁ దుమ్మిదలు నందముగా గూడగాను మరుతల్లి యలమేలుమంగమోమై నిలిచె బిసములు శంఖమును పెనుచక్రవాకములా కసము నీలపుఁజేరు కరికుంభాలు పొసగ వివెల్లా నొక పోడిమై నిలువగాను మసలక అలమేలుమంగ మేనై నిలిచె అనటులంపపొదులు నబ్జములు ముత్తేలు వొనరి వరుసఁ గూడి వుండగాను ఘనుడైన శ్రీవేంకటేశునురముమీద పనుపడలలమేల్మంగ పాదములై నిలిచె.

ఆకులో ఆకునెఇ'!

Image
ఆకులో ఆకునెఇ'! ఆకులో ఆకునెఇ'! . .గిద్దలూరు-నంద్యాల బస్సు మరియు రయిల్ మార్గంలో గిద్దలూరు కు  10కి.మీ.ల దూరం లో దిగువమెట్ట వున్నదిదిగువమెట్ట వద్దవుండి  నల్లమల్ల అడవి మొదలుఅయ్యి గాజులదిన్నె వద్ద అడవి ముగుస్తుంది .అడవి వేడల్పు 40-45 కి.మీ.వున్నది.వర్షకాలం లో అన్ని చెట్లు చిగిర్చి అడవి అంతపచ్చగాతివాచిపరచినట్లుకనులవిందుగావుండును .ఎత్తుఅయ్యినకొండలు,లోయలతో బస్సు ప్రయాణం చెయ్యునప్పుడు అందమయిన అనుబూతి కల్గుతుంది .క్రిష్ణ శాస్త్రి గారికి సంబంధించిన వ్యాసాలలో'ఆకులో ఆకునెఇ' అనే పాటను ఆయన రయిలులో విజయవాడ నుండి బళ్ళారి వెళ్ళునప్పుడు చూసి పరవసించి వ్రాసినట్లు ఆ వ్యాసంలో పెర్కొడం జరిగింది . పల్లవి : ఆకులో ఆకునై పూవులో పూవునై కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా వివరణ : కవి అడవి సౌందర్యానికి ముగ్ధుడై అక్కడి ఆకులు, పువ్వులు, కొమ్మలు, రెమ్మలతో తానూ ఒకడిగా కలసిపోయి అక్కడే ఉండిపోవాలని కోరుకుంటున్నాడు. చరణం 1 : గలగలనీ వీచు చిరుగాలిలో కెరటమై జలజలనీ పారు సెలపాటలో తేటనై పగడాల చిగురాకు తెరచాటు తేటినై పరువంపు విరి చేడే చిన్

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(2112)

Image
శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ! శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(2112) .  శ్రీ మనోహర! సురార్చిత! సింధుగంభీర! భక్త వత్సల! కోటి - భానుతేజ! కంజనేత్ర! హిరణ్యకశిపు నాశక! శూర! సాధురక్షణ! శంఖచక్రహస్త! ప్రహ్లాదవరద! పాపధ్వంస! సర్వేశ! క్షీరసాగరశాయి! కృష్ణవర్ణ! పక్షివాహన! నీలబృమరకుంతలజాల! పల్లవారుణ పాదపద్మ యుగళ! తే|| చారు శ్రీ చందనాగరు చర్చితాంగ! కుందకుట్మలదంత! వైకుంఠ ధామ! భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

తేట తేట తెనుగులా....

Image
తేట తేట తెనుగులా.... అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ: ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది. తేట తేట తెనుగులా.... మన తెలుగు భాష గొప్పదనం ముందుగా అక్షరమాల అల్లికలోనే ఉంది. పూర్వం గురువులు పిల్లలతో వర్ణమాలను వల్లె వేయించేవారు. అలా కంఠస్ధం చేయించడంవల్ల కంఠం నుంచి ముఖం వరకు వ్యాయామం తెలియకుండానే జరుగుతుంది ఏలాఅంటే ======= అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ: ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది. క ఖ గ ఘ ఙ……..కంఠ భాగం చ ఛ జ ఝ ఞ……..కంఠంపైన నాలుక మొదటి భాగం ట ఠ డ ఢ ణ……నాలుక మధ్యభాగం త థ ద ధ న……నాలుక కొస భాగం ప ఫ బ భ మ……..పెదవులకు య ర ల వ శ ష స హ ళ క్ష ఱ……నోరంతా ఇలా ముఖమంతా హల్లులతో వ్యాయామం జరుగుతుంది. సుందర సుమధుర సౌమ్యమైన కమ్మని మృదుత్వంతో కూడిన తియ్యని తేనేలాంటిది మన భాష. ఆనందంగా మనసుకు హాయి గొలిపే విధంగా వినసొంపైన మాటలు మనందరి నోటంట వెలువడుతే ఎంత బాగుంటుంది. తెలుగు భాషను అందంగా వ్రాసే వారికి చిత్రకళ సొంతమవుతుందంట ఎందుకంటే మన వర్ణమాలతో అన్ని మెలికలు ఉన్నాయి. మనలోని భావాన్ని మాతృభాషలో వర్ణించినంత వివరంగా ఏ భాషల

సీతాజననం !

Image
సీతాజననం ! సీతాజననం ! .  మిధిలాపుర నాయకుడైన జనక మహారాజు యాగము  చేయుచూ భూమిని దున్నుచుండగా నాగలికి ఒక పెట్టె అడ్డుపడింది.  ఆ పెట్టెను తెరచి చూడగా అందులో ఒక పసిపిల్ల కనిపించింది.  నాగటి చాలులో లభించినందున ఆమెకు సీత అని నామకరణము చేసి జనకమహారాజు, ఆయన భార్య సునయన అల్లారు ముద్దుగా ఆ బిడ్డను పెంచుకొన్నారు. కనుక సీత భూదేవి కుమార్తె అని అంటారు,  శ్రీ సీతమ్మ జన్మనక్షత్రము ఆశ్లేష నక్షత్రము .  .  సీత గర్భమున జన్మించలేదు గనుక అయోనిజ అని అంటారు. .  సీతాదేవి జననం సీత జన్మ నక్షత్రమైన ఆశ్లేష నక్షత్రం రోజున చైత్ర మాశ శుక్లపక్షంలో జరిగింది.

ఎందుకో ఈ సినిమా లో క్లారిటి లేదు ...

Image
ఎందుకో ఈ సినిమా లో క్లారిటి లేదు ...  సావిత్రి భర్త పద్మనాభం చని పోయి ఉండక పోతే  ఆమె గంపెడు పిల్లతో హాయిగా వుండేది ..  గోపి గౌరీ పెళ్లి చేసి కొనేవాడు  ఆదుర్తి ముగ మనసులు మనం ఏడవడానికి  రాధ భర్తను అన్యాయంగా చం పెసారు

శ్రావణ మేఘం !

Image
శ్రావణ మేఘం ! కురిసే దాకా అనుకోలేదు శ్రావణ మేఘమని తడిసే దాకా అనుకోలేదు తీరని దాహమని కలిసే ధాకా అనుకోలేదు తీయని స్నేహమని

జాబిలి కన్నా నా చెలి మిన్న

Image
జాబిలి కన్నా నా చెలి మిన్న జాబిలి కన్నా నా చెలి మిన్న పులకింతలకే పూచిన పొన్న కానుకలేమి నేనివ్వగలను కన్నుల కాటుక నేనవ్వగలను పాల కడలిలా వెన్నెల పొంగింది పూల పడవలా నా తనువూగింది ఏ మల్లెల తీరాల నిను చేరగలను మనసున మమతై కదా తెరగలను

వలచే మనసే మనసు

Image
వలచే మనసే మనసు తొలిచూపులు నాలోనే -  వెలిగి౦చె దీపాలే చిగురి౦చిన కోరికలే - చిలికి౦చెను తాపాలే . వలచే మనసే మనసు

పాపం శమించుగాక!

Image
పాపం శమించుగాక! పాపం శమించుగాక! భూమ్మీదఉండే అన్నీమతాలల లోనూ, (ఒక్క ఇస్లాంలో మాత్రం ఎవరికి అయితే అన్యాయంజరిగిందో వారు మాత్రమే ఆ తప్పుచేసిన మనిషిని  మన్నిచగలరు, ఇంక ఎవ్వరికీ ఆ అధికారం లేదు). ఒకమనిషి పాపం చేసినతరువాత, దేవునిపేరు తలచినా, లేక ఆయన మూర్తిని దర్శనం చేసినా, లేక మన్నించమని కోరినా, దయామయుడు అయిన ఆ దేవుడు, వీళ్ళుచేసిన ఘోరమైన పాపాలు, తప్పులు అన్నింటినీ క్షమించి, వీళ్లను పవిత్రులుగా చేసేస్తాడు అన్నది ప్రచారంలో ఉంది. నాదృష్టిలో ఈ "పాప విమోచనం" అన్నదే, ఈ లోకంలో జరుగుతూన్న అన్నితప్పులకూ మూలం అని. "నారాయణా" అన్న మాత్రాన సర్వ పాపాలు  హరించుకు పోతాయి, దర్శన మాత్రాన వేయి జన్మల పాపాలు వివృత్తమౌతాయి. ముడుపులు కట్టి మొక్కుకుంటే ఆ దేవుడు, మీరు చేసిన పాపాలు అన్నింటినీ క్షమించి, కోరిన కోరికలన్నీ తీరుస్తాడు. అందువల్లనే ఈ మధ్య వెంకన్న, కుబేరుడూ లక్ష్మీ, సాయీ లాంటి దేవుళ్ళకు డిమాండ్ పెరిగింది. మూర్తికి ఒక ప్రమిద దీపం అంటించదానికి నోచుకోని గుడులన్నీ కబ్జా అయిపోయి, కొత్త కొత్త గుడులు, పుట్ పాత్ మీద వెలిసేస్తున్నాయి. చెయ్యడానికి ఉద్యోగం దొరకని బ్రాహ్మణులు, చేసుకున

అప్పటికి మనం...(నేను) పుట్టలేదు.. గనుక ఆ వివాహానికి హాజరు కాలేక పొయా !

Image
అప్పటికి మనం...(నేను) పుట్టలేదు.. గనుక ఆ వివాహానికి హాజరు కాలేక పొయా !

నటి కాంచన...

Image
నటి కాంచన...  నటి కాంచన...  శాస్త్రి, విద్యాలతలకు జన్మించారు. వారిది సంపన్న కుటుంబం. అయితే, తండ్రి తాగుడు, జూదం వంటి దురలవాట్లతో ఆస్తిని కరిగిస్తూ పోయాడు . ఓ రోజున కాంచన చేత వారు తెల్ల కాగితంపై సంతకం చేయించి, ఆమెకు తెలియకుండా ఆమె ఆస్తినంతా తల్లిదండ్రులు తమ పేర్ల మీదికి మార్చుకున్నారు. అంతేకాకుండా, తమ కూతురు చెడిపోయిందని, ఎవరు కూడా ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదని కూడా తల్లిదండ్రులు ప్రచారం సాగించారు.  ఆమె సినీ రంగాన్ని వదిలేసి, సామాజిక సేవలో మునిగిపోయారు. ఆమె బెంగళూరులో ఉంటూ దేవాలయాలను శుభ్రం చేస్తూ, నిర్వహిస్తూ కాలం గడుపుతున్నారు. సుదీర్షమైన న్యాయపోరాటం ద్వారా తల్లిదండ్రుల నుంచి 15 కోట్ల రూపాయల విలువ చేసే తన ఆస్తిని ఆమె పొందారు.  సోదరి గిరిజతో కలిసి ఆమె తన ఆస్తిని టిటిడికి అందించారు. ఈవిడ నేటి తరం నటీమణులకు ఆదర్శప్రాయం కదా! —

రజాశ్లేషం” – ఒకనాటి హృదాశ్లేషం రచన: ఏల్చూరి మురళీధరరావు

Image
రజాశ్లేషం” – ఒకనాటి హృదాశ్లేషం రచన: ఏల్చూరి మురళీధరరావు 1973 హేమంతంలో అనుకొంటాను. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి ఇంటికి వెళ్ళాను. ఆ రోజుల్లో కృష్ణశాస్త్రిగారి ఇల్లంటే సాహిత్యికులందరికీ సాహిత్య సంగీత హృదయంగమ సంగమతీర్థరాజం. గోష్ఠీవినోదంకరణలతో అభ్యాగతులకు అయాచితంగా అనిమేషత్వం సిద్ధిస్తుండేది. మేడ మెట్లెక్కి నేను కాలింగ్ బెల్ నొక్కేసరికి – భగవంతుడే మందిరద్వారాలు తీసినట్లు కృష్ణశాస్త్రిగారే తలుపుతీసి, ఆప్యాయనంగా పలకరించి, లోపలి గదికి తీసుకొనివెళ్ళారు. అప్పటికే అక్కడ పిలకా గణపతిశాస్త్రి గారున్నారు. నిండైన ప్రేమతో వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే నేను ఆంధ్రదేశం భావకవిత్వపు ఇంద్రజాలంలో మంత్రముగ్ధమై ఉండిన కాలపు కవితాసవితల సన్నిధిరూపమైన పెన్నిధిని స్వాయత్తీకరించుకొంటూ కేవలానుభవానందమూర్తినై ఉన్నాను. ‘మాట్లాడుకోవటం’ అంటే కృష్ణశాస్త్రి గారు స్క్రిబ్లింగ్ ప్యాడ్ పైని వ్రాయటం, గణపతిశాస్త్రి గారు వాకోవాక్యాన్ని కొనసాగిస్తూ ప్రసంగించటం అన్నమాట. నా అదృష్టం ఏకకాలంలో ప్రేక్షక – శ్రోతృ స్థానీయత. కృష్ణశాస్త్రిగారి అందమైన అక్షరాలను చూస్తూ, గణపతిశాస్త్రిగారి అక్షరప్రసంగాన్ని వినటం. ఒక్కొ

నీవు నేనైతే !

Image
నీవు నేనైతే ! నీవు నేనైతే ! నిను నీలోనె కందు! నేను నేనుగ నుంటె! నీలోనె యుందు!

ముద్దు పేర్లు !

Image
ముద్దు పేర్ల ఒక తల్లికి నలుగురు కూతుళ్లు వుండేవారు. మనకు నవ్వుల కొరకు ఆమె ఈ విధంగా ముద్దు పేర్లతో  పిలిచిది. అందులో మొదటి అమ్మాయి పేరు విరిగిన, రెండవ అమ్మాయి పేరు చిరిగిన, మూడవ అమ్మాయి పేరు పాడయిపోయిన, నాలుగవ అమ్మాయి పేరు చనిపోయిన... ఇలా ఈ విధంగా ఆ తల్లి తన కూతుళ్లకు పేర్లు పెట్టుకుంది. ఒకరోజు వీరి ఇంటికి ఒక అతిథి వస్తాడు. అతనితో తల్లి అడుగుతూ... ‘‘మీరు కుర్చీలో కూర్చుంటారా లేక చాప మీద కూర్చుంటారా?’’ అతిథి : ‘‘కుర్చీ మీద కూర్చుంటాను’’ తల్లి : ‘‘విరిగిన..! కుర్చీ తీసుకుని రా’’! అతిథి : ‘‘వద్దులేండీ..! నేను చాపమీదే కూర్చుంటాను’’ తల్లి : ‘‘చిరిగిన..! చాప తీసుకుని రా’’ అతిథి : ‘‘ఉండనివ్వండి... నేను కింద నేలపైనే కూర్చుంటాను’’ అలా అని ఆ అతిథి నేలమీద కూర్చుంటాడు. కొద్దిసేపు తరువాత.... తల్లి : ‘‘మీరు టీ తీసుకుంటారా.. పాలు తీసుకుంటారా?’’ అతిథి : ‘‘టీ’’ తల్లి : ‘‘పాడయిపోయిన...! టీ తీసుకుని రామ్మా..’’ అతిథి : ‘‘వద్దు వద్దులెండి.. నేను పాలు తీసుకుంటాను’’ తల్లి : ‘‘చనిపోయిన..! ఆవు పాలు తీసుకుని రామ్మా’’ ఈ మాటలు విన్న అతిథి ఏమీ తోచక అక్కడి నుంచి పారి