పాపం శమించుగాక!

పాపం శమించుగాక!

పాపం శమించుగాక!

భూమ్మీదఉండే అన్నీమతాలల లోనూ, (ఒక్క ఇస్లాంలో మాత్రం ఎవరికి అయితే అన్యాయంజరిగిందో వారు మాత్రమే ఆ తప్పుచేసిన మనిషిని 

మన్నిచగలరు, ఇంక ఎవ్వరికీ ఆ అధికారం లేదు). ఒకమనిషి పాపం చేసినతరువాత, దేవునిపేరు తలచినా, లేక ఆయన మూర్తిని దర్శనం చేసినా, లేక మన్నించమని కోరినా, దయామయుడు అయిన ఆ దేవుడు, వీళ్ళుచేసిన ఘోరమైన పాపాలు, తప్పులు అన్నింటినీ క్షమించి, వీళ్లను పవిత్రులుగా చేసేస్తాడు అన్నది ప్రచారంలో ఉంది.

నాదృష్టిలో ఈ "పాప విమోచనం" అన్నదే, ఈ లోకంలో జరుగుతూన్న అన్నితప్పులకూ మూలం అని. "నారాయణా" అన్న మాత్రాన సర్వ పాపాలు 

హరించుకు పోతాయి, దర్శన మాత్రాన వేయి జన్మల పాపాలు వివృత్తమౌతాయి. ముడుపులు కట్టి మొక్కుకుంటే ఆ దేవుడు, మీరు చేసిన పాపాలు అన్నింటినీ క్షమించి, కోరిన కోరికలన్నీ తీరుస్తాడు.

అందువల్లనే ఈ మధ్య వెంకన్న, కుబేరుడూ లక్ష్మీ, సాయీ లాంటి దేవుళ్ళకు డిమాండ్ పెరిగింది.

మూర్తికి ఒక ప్రమిద దీపం అంటించదానికి నోచుకోని గుడులన్నీ కబ్జా అయిపోయి, కొత్త కొత్త గుడులు, పుట్ పాత్ మీద వెలిసేస్తున్నాయి. చెయ్యడానికి ఉద్యోగం దొరకని బ్రాహ్మణులు, చేసుకునే "దేవుడిపూజ" చేసే పూజారి ఉద్యోగం, మంచి లాభదాయకంఅయిపోయి, బ్రాహ్మణులే కాకుండా అన్య జాతీయులు కూడా అర్చకత్వానికి ముందుకు వస్తున్నారు.

ఒక 40 సంవత్సరాలక్రితం గుడులకు ఇంత డిమాండు ఉండలేదు, ఇన్ని ముడుపులు ఉండలేదు, ఇంత రష్, ఇంత "భక్తి" ఉండలేదు. ఎక్కడినుండీ వచ్చిందో తెలియదు. కొన్ని పాడుబడిన గుడులలో పెకలించివేసిన మూలమూర్తిని మళ్ళీ గప్ చిప్ గా ప్రతిష్టించేసి డబ్బుచేసుకుంటున్నారు. ఉన్నట్లుఉండి స్వయంభూస్వాములు వెలిసేస్తున్నారు. (దీనికి నేనే సాక్ష్యం). దీన్ని నేను తప్పు అని అనడంలేదు. కానీ ఈ పనిని గత వందసంవత్సరాలలో చేయలేదు, కారణం అప్పట్లో ఇంత డిమాండ్ ఉండలేదు.

చేసిన పాపాలను కడుగుకునే టెక్నిక్ తెలిసిపోయింది, తను చేసినపాపం, కన్ఫెస్ చేసుకునేసి,/ నారాయణా అనేసి/ నాలుగు గుడులకెళ్లి భారీగా 

(లెక్కవేసుకుని 10 - 30 % వరకూ) ముడుపులు చెల్లించుకుని/ కిరీటాలు చేయించేసి, కళ్యాణం, ఆకుపూజలు వగైరా చేయించేసి, సత్రాలూ, భవనాలు గట్రా కట్టించేసి, తాము చేసిన పాపాలు పూర్తిగా కడుక్కునేసి, ఫ్రెష్ గా మళ్ళీ పాపాలను చెయ్యడానికి రెడీ అవుతున్నాడు.

అసలు "పాపవిమోచనం" అన్నపదమే కదా వీళ్ళకు ఇంత ధైర్యం ఇచ్చింది. "నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు, దానికి ఫలితం ఈ జన్మలోనో, లేక నువ్వు చనిపోయిన తరువాతనో అనుభవించితీరాలి" అంటే, మళ్ళీమళ్ళీ ఇన్ని పాపాలు జరుగుతాయా?

చూడండి, పట్టుపడుతున్న దోషులలో అందరూ నామాలూ బొట్లు పెట్టుకున్న, దైవం మీద నమ్మకంఉన్న వాళ్ళే కనబడుతున్నారు. నాస్తికముండావాళ్ళు కనబడడంలేదు. ఇలా ఎందుకని? చేసిన పాపానికి "ప్రాయశ్చిత్తం" అనే షార్ట్ కట్ ఉంది, అని నమ్మిన దైవభక్తులు తప్పులుచేసి, దాన్నికడుక్కుని, మళ్ళీమళ్ళీ పాపాన్నిచేయడానికి వెనకాడడం లేదు.

భక్తి అనేదిఉంటే తప్పుకాదు, కానీ దాన్ని ప్రదర్శించుకుంటే మాత్రం తప్పు అయితీరుతుంది. ఏం మనకు భక్తి ఉంది అని అందరికీ తెలియచెప్పాలా? అప్పుడే ఆ భగవంతుడు మనలను గుర్తిస్తాడా? మన తప్పులను క్షమిస్తాడా?

40 కోట్ల కిరీటాన్ని ఇచ్చిన "గాలి" ని జైలు కెళ్ళకుండా వెంకన్న ఆపలేదు, ఇంకా ఆ విషయం పెండింగులోనే ఉంది, ఇహలోకంలో కానీ, ఆతర్వాత అయినా కానీ, అతనికి ఎంతటి తీవ్రమైన శిక్ష కాచుకుందో ఆ పైవాడికే తెలియాలి.

చేసిన పాపానికి తగిన శిక్ష తప్పదు, అది ఇక్కడకావచ్చు, మరెక్కడైనా కావచ్చు, కర్మసిద్దాంత ప్రకారం ఇది తప్పదు

Comments

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!