ఆకులో ఆకునెఇ'!

ఆకులో ఆకునెఇ'!

ఆకులో ఆకునెఇ'!

.

.గిద్దలూరు-నంద్యాల బస్సు మరియు రయిల్ మార్గంలో గిద్దలూరు కు 

10కి.మీ.ల దూరం లో దిగువమెట్ట వున్నదిదిగువమెట్ట వద్దవుండి 

నల్లమల్ల అడవి మొదలుఅయ్యి గాజులదిన్నె వద్ద అడవి ముగుస్తుంది

.అడవి వేడల్పు 40-45 కి.మీ.వున్నది.వర్షకాలం లో అన్ని చెట్లు చిగిర్చి అడవి అంతపచ్చగాతివాచిపరచినట్లుకనులవిందుగావుండును

.ఎత్తుఅయ్యినకొండలు,లోయలతో బస్సు ప్రయాణం చెయ్యునప్పుడు అందమయిన అనుబూతి కల్గుతుంది

.క్రిష్ణ శాస్త్రి గారికి సంబంధించిన వ్యాసాలలో'ఆకులో ఆకునెఇ' అనే పాటను

ఆయన రయిలులో విజయవాడ నుండి బళ్ళారి వెళ్ళునప్పుడు చూసి పరవసించి వ్రాసినట్లు ఆ వ్యాసంలో పెర్కొడం జరిగింది

.

పల్లవి :

ఆకులో ఆకునై పూవులో పూవునై

కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై

ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

వివరణ : కవి అడవి సౌందర్యానికి ముగ్ధుడై అక్కడి ఆకులు, పువ్వులు, కొమ్మలు, రెమ్మలతో తానూ ఒకడిగా కలసిపోయి అక్కడే ఉండిపోవాలని కోరుకుంటున్నాడు.

చరణం 1 :

గలగలనీ వీచు చిరుగాలిలో కెరటమై

జలజలనీ పారు సెలపాటలో తేటనై

పగడాల చిగురాకు తెరచాటు తేటినై

పరువంపు విరి చేడే చిన్నరి సిగ్గునై

ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

వివరణ : తన మనసులోని భావాల్ని మరింత లోతుగా తరుస్తూ చిరుగాలిలో కెరటం లాగా, సెలయేరులో తేటగా, పూలమొగ్గలోని సిగ్గుగా వాటన్నితో కలసిపోవాలని కోరుకుంటాడు.

చరణం 2 :

తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల

చదలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై

ఆకలా దాహమా చింతలా వంతలా

ఈ కరణి వెర్రినై ఏకతమా తిరుగాడ

ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

వివరణ : అక్కడ అడవిలోని చెట్లు, ఆ చెట్ల పైనుంచి నీలి కొండలు ఎక్కుతూ మెలమెల్లగా ఆకాశాన్ని చేరుకొని నీలి మబ్బులోకి చేరి దాని నీలిరంగులో కలిసి ప్రకాశిస్తూ ఆకలి - దాహం చీకులు, చింతలూ లేకుండా ఏకాంతంగా విహరిస్తూ వెర్రివాడిలా తిరుగుతూ ఆ అడవిలోనే కలిసిపోయి ఉండిపోనా అంటూ కవి ప్రకృతిలో తానూ మమేకమయిపోవాలని కోరుకుంటున్నాడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!