Posts

Showing posts from August, 2017

కల్పవృక్షంలో కైక –రచన : భైరవభట్ల కామేశ్వరరావు. .

Image
కల్పవృక్షంలో కైక –రచన : భైరవభట్ల కామేశ్వరరావు. . రామాయణ కథని మలుపు తిప్పిన స్త్రీ పాత్రలలో కైకది ఒక కీలకమైన పాత్ర అని అందరికీ తెలిసిన విషయమే. దశరథుని ఆకాంక్ష మేరకు రాముని పట్టాభిషేకం జరిగిపోయుంటే, రామాయణం అక్కడితో ఆగిపోయేది. అది కాకుండా మలుపు తిప్పినది కైక. అయితే, వాల్మీకి రామాయణంలో కైక పాత్ర కీలకమైనదే కాని, చాలా పరిమితమైనది. కేవలం రామపట్టాభిషేక సందర్భంలో, అలుక పూని, వరాలడిగి, పట్టాభిషేకం చెడగొట్టి, రాముడిని అడవులకి పంపించడం వరకే ఆమె పాత్ర మనకి ప్రముఖంగా కనిపిస్తుంది వాల్మీకంలో. ఆ తర్వాత కథని ముందుకి నడిపించేది సీత. రాముని సర్వ ప్రయత్నమూ సీత కోసమే. ముందుగా లంకలోకి ప్రవేశించి, లంకని సర్వనాశనం చేసి, చివరకి రావణునితో పాటు సర్వ రాక్షస సంహారానికీ కారణమైనది సీతే. అందుకే వాల్మీకి మహర్షి రామాయణాన్ని గురించి “సీతాయాశ్చరితం మహత్” అన్నది. అంతటి సీత పాత్రకి సరిజోడుగా, అంతటి ప్రాధాన్యమున్న పాత్రగా కల్పవృక్షంలో కైకని తీర్చిదిద్దారు విశ్వనాథ. రావణసంహారం చేసి వనవాసం ముగించుకొని సీతారామలక్ష్మణులు అయోధ్యకు తిరిగి వచ్చిన్నప్పుడు కైకేయి సీతని కౌగిట చేర్చుకొని యిలా అంటుంది: కైకెయి సీత గౌగిటికి
Image
- -పాలువాయి భానుమతి ! . పద్మ భూషణ్ పాలువాయి భానుమతి అంటే తెలుగులుకు, తమిళులలో తెలియనిది ఎవరికి.. సహజ నటన , గాంభీర్యం..ఆమె సొంతం..మృదు మధుర స్వరాలతో ఆమె పాడిన పాటలు.. నేటికీ వినబడుతూనే ఉంటాయి.. తను నిర్మించి నటించిన ప్రతి ఒక్క చిత్రంలో ..చిత్ర కథను బట్టి.. సాంప్రదాయ సంగీతం ఉండేట్టు చూసుకున్నారు.. ముదితల్ నేర్వగ రాని విద్యల్ గలవే ముద్దార నేర్పించినన్ అన్నట్టు.. నటీమణిగా, గాయనిగా, రచయిత్రిగా, చిత్ర నిర్మాతగా, స్టూడియో అధినేత్రిగా , దర్శకురాలిగా.. సంగీత దర్శకురాలిగా, ఎడిటర్ గా ఆమె బహుముఖ ప్రజ్ఞ చూపారు.. వరవిక్రయం 1939 తో ప్రారంభం అయిన ఆమె చలన చిత్ర జీవిత ప్రస్థానంలో నటించినవి కొన్ని చిత్రాలు మాత్రమే అయినా.. ఆమె పోషించిన ప్రతి పాత్రకు జీవం పొసారు.. స్వర్గ సీమ, కృష్ణ ప్రేమ, గృహప్రవేశం, రత్నమాల,రక్ష రేఖ, అపూర్వ సహోదరులు, లైలా మజ్ను.. మల్లీశ్వరి.. మంగళ, ప్రేమ,చండీరాణి, చక్రపాణి, విప్రనారాయణ, చింతామణి, తెనాలి రామకృష్ణ, వరుడు కావాలి..బాటసారి, అనురాగం, వివాహ బంధం, తోడు నీడ, అంతస్థులు.. బొబ్బిలి యుద్ధం, పల్నాటి యుద్ధం.. అంత మనమంచికే వంటి ఎన్నో చిత్రాలలో ఆమె పోషించిన పాత్రలు మరువ లే

రావణ కాష్ఠం : --

Image
రావణ కాష్ఠం : -- - సమస్య రగులుతూనే ఉంది అన్న అర్థంలో ఈ పదాన్ని వాడుతున్నాం. అది సరైన భావనే. అయితే..  ఇంతకీ రావణ కాష్టం అన్న పదం ఎలా పుట్టిందో తెలుసా..? . రావణాసురుడు ఎప్పుడు యుద్ధానికి వెళ్లినా.. మహా పతివ్రత అయిన ఆయన సతీమణి మండోదరి పూజామందిరంలో దీక్షకు కూర్చునేదట. రావణుడి శక్తికి, ఆమె అకుంఠిత దీక్ష తోడై.. అన్నీ విజయాలే సిద్ధించేవట.  రామ రావణ యుద్ధ సమయంలోనూ ఆమె దీక్షలో కూర్చుందట. ఆమె దీక్షను భగ్నం చేయకుంటే రావణవధ జరగదని తెలిసిన దేవతలు, మండోదరి దీక్ష భగ్నం చేసే బాధ్యతను ఆంజనేయుడికి అప్పగించారట. మారుతి ప్రయత్నంతో మండోదరి దీక్షకు భగ్నమైందట. దాంతో, రాముడు రావణుడిని మట్టుపెట్టగలిగాడట. రావణుడి కాయాన్ని చితిపై చేర్చి తగులబెట్టిన తర్వాత, సతీసహగమనం చేయబోతూ.. తనను వంచించిన దేవతలను మండోదరి శపించబోయిందట. మహాసాధ్వి శాపానికి భయపడ్డ దేవతలు.. ఆమెను శాంతింప చేసేందుకు, ఆమెకు శాశ్వత సుమంగళిత్వాన్ని వరంగా ఇచ్చారట. .  భర్త చనిపోయిన తాను శాశ్వత సుమంగళిని ఎలా కాగలను అన్న ప్రశ్నకు, చితి ఆరిపోయి.. అస్తికలు, భస్మాన్ని పుణ్యతీర్థాల్లో నిమజ్జనం చేసి, పిండ ప్రదానం చేస్తే కానీ మనిషి గతించినట్లు

బాలభాష! (శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి.)

Image
బాలభాష! (శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి.) . చిన్నారి పొన్నారి చిఱుత కుఱ్ఱఁడ రార! . అయ్య రారా! చక్కనయ్య రార! అల్లారు ముద్దుల పిల్లవాఁడా రార! . అప్ప రారా! కూర్మికుప్ప రార! రత్నాల చిటిముల్లె రార! నవ్వుంబువ . తోట రారా! ముద్దుమూట రార! ముత్యాల క్రోవి రా! ముచ్చట్లదీవి రా! . పల్కు వెన్నెల చిన్ని చిల్క రార! కన్నకాచి రార! గారాలకూచి రా! . నాన్నరార! చిన్నియన్నరార! ఆడ రార! నవ్వులాడ రారా! పల్కు లాడ రార! కుల్కులాడ రార! -

శ్రీనాధుడు-పిఠాపురం !

Image
శ్రీనాధుడు-పిఠాపురం  ! . పిఠాపురాన్ని పూర్వం పీఠికాపురం అనేవారు.  ఈ ఊరుకి అధిపతిపిఠాపురాన్ని పూర్వం పీఠికాపురం అనేవారు. ఈ ఊరుకి అధిపతి పీఠాంబ. ఈ పీఠాంబ విగ్రహం ఒకటి - ఒక చేతిలో బంగారు పాత్ర, వేరొక చేత బాగుగా పండిన ఉసిరి కాయ, మూడవ చేత త్రిశూలం, నాల్గవ చేత లోహ దండం ధరించి - నేటి పిఠాపురానికి సమీపంలో, నాలుగు వీధులు కలిసే కూడలిలో ఉండేదట. ఇటువంటి విగ్రహమే ఒకటి ఈనాడు కొత్తపేటలో కుమారస్వామి ఆలయంలో ఉంది . ఈ విషయాన్ని ప్రముఖ కవీశ్వరుడు శ్రీనాధుడు భీమేశ్వర పురాణం లో ఈ కింది విధంగా చెబుతాడు. . "హాటక పాన పాత్రయును నారగ బండిన మాతులుంగమున్ ఖేటము లోహదండము నొంగి ధరియించి పురోపకంఠశృం గాటక భూమి భాగమున గాపురముండెది పీఠికాంబకుం గైటభదైత్యవైరిప్రియ కాంతకు మ్రొక్కె నతండు భక్తితోన్." పిఠాపురానికి ఉత్తర దిక్కున ఏలేరు అనే ఏరు ఒకటి ఉంది ( ప్రస్తుతం దీనిని చెరుకుల కాలువ అని అంటున్నారు). ఈ ఏలేరుని "జగతి నెక్కడివేలేటి సాటి నదులు" అంటాడు శ్రీనాధుడు అలా అనేసి ఊరుకోకుండా- - "ఏలేటి విరినీట నిరుగారునుంబండు ప్రాసంగు వరిచేలు పసిడిచాయ." - అని చెబుతూ పిఠాపు

గిడుగు- గురజాడ స్నేహం .!

Image
. గిడుగు- గురజాడ  స్నేహం .! . శ్రీ గిడుగు రామమూర్తిగారు విజయనగరం మహారాజా కళాశాలలో లోయ ర్  ఎఫ్ .ఏ లోచేరారు. .అంతవరకూ ఆయన ఏకళాశాసకు వెళ్ళి చదువుకోలేదు. మహారాజా కళాల ప్రిన్సిపాల్ చంద్ర శేఖరశాస్త్రిగారింట్లో గురజాడని కలిశారు. అప్పటినుంచివాళ్ళిద్దరిమధ్యాస్నేహంపెరగసాగింది. మెట్రికె తరువాత అప్పారావుగారు చదువుని కొనసాగించారు కానితండ్రి చనిపోవడంతో గిడుగు కుటుంబానికి అండగా ఉండడం కోసం విశాఖ కలెక్టరేట్ లో నెలకి పదిహేను రూపాయలతో ఆరు నెలల పాటు ఓతాత్కాలికోద్యోగాన్ని చేసారు. ఇద్దరి  మధ్య వ్యత్యాసం పదిహేనురోజులుతక్కువ  సంవత్సవరం .పెరిగిన తరువాత వీళ్ళిద్దరూ ఆధునిక భాషా సాహిత్యాలకి పెద్ద పట్టుగొమ్మలవుతారని ఎవరూ అనుకోలేదు,ఆఖరికి వాళ్ళు కూడా! . గిడుగు,గురజాడ ఎంతటి ఆత్మీయులయ్యారంటే...ఇద్దరూ చరిత్ర అధ్యాపకులైనా తాము చేసిన శాశన పరిష్కారన్నింటినీ గురజాడకి చూపించిగాని ఏపరిశోధనా పత్రికలోనైనా ప్రచురణకు పంపేవారుకారు.ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే గురజాడ చెప్పారనే గిడుగు భాషోద్యమాన్ని చేపట్టారు.ఆఖరులో గురజాడ గ్రాంధికంలో విద్యా బోధనలో తమ అసమ్మతిని తెల్పడానికి సబ్కమి

శ్రీ చైతన్య మహాప్రభు !

Image
శ్రీ చైతన్య మహాప్రభు ! . “ శ్రీ గురుగౌరాంగౌ జయతః ”-" హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరేహరే రామ హరే రామ రామ రామ హరే హరే " ” - చైతన్య మహాప్రభు రాధాకృష్ణ సంప్రదాయాన్ని పరాకాష్ఠకు తీసుకువెళ్ళిన ఒక మహా భక్తుడు. ఇతని జీవిత కాలం ఫిబ్రవరి 18, 1486 - జూన్ 14, 1534) జన్మస్థలం నవద్వీపం (ఇప్పటి నదియా). వల్లభుడు మథుర, బృందావన ప్రాంతాలలో రాధాకృష్ణ మతాన్ని ప్రచారంచేస్తున్న కాలంలోనే చైతన్యుడు బెంగాల్, ఒడిషాలలో అదే మతాన్ని ప్రచారం చేశాడు. . కృష్ణ ప్రేమను పంచుటకు అరుదెంచారు. సామూహిక హరినామ సంకీర్తనమునకు పితయును అయిన "శ్రీ చైతన్య మహా ప్రభువు" బెంగాల లోని నవద్వీపము లోని శ్రీధామ మాయాపురములో క్రీ. శ. 1407 శతాబ్దమున ( క్రీస్తు కాలమాన ప్రకారము ఫిబ్రవరి 1486 నంవత్సరమున) ఫాల్గుణ పౌర్ణమి సంద్యా సమయమున అవతరించిరి. శ్రీ చైతన్య మహా ప్రభువు తండ్రియైన జగన్నాథ మిశ్రులు సిల్హట్ జిల్లాకు చెందిన విద్వత్పూరుడైన బ్రాహ్మణుడు.చైతన్యుడి తల్లిదండ్రులకు మొదట ఎనిమిదిమంది సంతానం పుట్టడం, వెంటవెంటనే చనిపోవడం జరిగిన తర్వాత తొమ్మిదవ సంతానంగా విశ్వరూపుడు జన్మించాడు. అతడు చిన్నతనంలోనే సన్యాసం స

బాపు రమణుల -కొత్త పెళ్లి కూతురు -ముత్యాలముగ్గు - -

Image
బాపు రమణుల -కొత్త పెళ్లి కూతురు -ముత్యాలముగ్గు - - (ఆరుద్ర - సాహిత్యం....రామకృష్ణ - గాత్రం.) . ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు ..... ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు ఒదిగి ఒదిగి కూచుంది బిడియపడే వయ్యారం ముడుచుకొనే కొలది మరీ మిడిసిపడే సింగారం సోయగాల విందులకై వేయి కనులు కావాలీ ..... హ్మ్మ్మ్ మ్మ్మ్ మ్మ్ ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు నింగిలోని వేలుపులు ఎంత కనికరించారో నిన్ను నాకు కానుకగా పిలిచి కలిమినొసగేరు పులకరించు మమతలతో పూల పాన్పు వేసారు హ్మ్మ్మ్ మ్మ్మ్ మ్మ్ ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు . ఈ పాట డెభ్భై ఎనభై దశకాల్లో వచ్చిన అపురూపమైన పాటల్లో మొదటిదని నా నమ్మకం. సాహిత్యం ఎంత నిండుగా ఉంటుందో ఈ పాటలో. ప్రేమ,ఇష్టం,సున్నితమైన శృంగారం వీటన్నింటితో చక్కటి మేళవింపు ఈ పాట. "ముడుచుకునే కొలదీ మరీ మిడిసిపడే సింగారం". ముడుచుకోవటం, మిడిసిపడటం రెండూ ఒకదానికొకటి భిన్నమైనవి. ఆ రెంటినీ కలిపి ఒకచో

జగన్మోహిని అమృతము పంచుట !

Image
జగన్మోహిని అమృతము పంచుట ! ( జాఱించు; జా ఱించి, లొలయించు; నొలయించి, . . అంటూ పూర్వపాదాంత పదాన్ని గ్రహించి, ఉత్తరపాదం ఆరంభించడం ప్రయోగిస్తూ, ముక్తపదగ్రస్త అలంకారాన్ని అత్యద్భుతంగా మథురాతి మథురంగా ప్రయోగించిన మన పోతన్న గారికి శతకోటి పాదాభివందనాలు.) - -సీ. 'పాలిండ్లపై నున్న పయ్యెద జాఱించు;  జాఱించి మెల్లన చక్క నొత్తు దళ్కు దళ్కను గండఫలకంబు లొలయించు;  నొలయించి కెంగేల నుజ్జగించుఁ గటు మెఱుంగులు వాఱు కడకన్ను లల్లార్చు;  నల్లార్చి ఱెప్పల నండఁ గొలుపు సవరని దరహాస చంద్రికఁ జిలికించుఁ;  జిలకించి కెమ్మోవిఁ జిక్కుపఱచు- -తే. 'దళిత ధమ్మిల్ల కుసుమ గంధమ్ము నెఱపుఁ గంకణాది ఝణంకృతుల్ గడలు కొలుపు నొడలి కాంతులు పట్టులే కులుకఁ బాఱు సన్నవలిపంపుఁ బయ్యెద చౌకళింప.! భావము: పైటకొంగును వక్షోజాలపైనుండి జార్చి, మెల్లగా సర్దుకుంటోంది.  తళతళ మెరుస్తున్న చెక్కిళ్ళను చేతిపై చేర్చి మరల వదిలివేస్తోంది. జిగేలుమని మెరుస్తున్న కడగంటి చూపులను ప్రసరించి, మళ్ళీ కనురెప్పలు మూస్తోంది. అందంగా చిరునవ్వులు చిలకరించి, ఎర్రని పెదవుని మెలిపెడుతోంది, కొప్పులోని వికసించిన పూలపరిమళాలు వ్యాపిం

బాపు గారి బొమ్మ- నిలచెను బస్ కై-

Image
బాపు గారి బొమ్మ- నిలచెను బస్ కై- - స్మైలింగు ఫేసు చిన్నది పైలా పచ్చీసు మేను ఫెళ ఫెళ లాడన్ స్టైలుగ నిలచెను బస్ కై సైలెంటయిపోవ ఆడియన్సుల హార్టుల్; . (బాపు గారి బొమ్మ)

మూడు ప్రశ్నలు-మూలం: లియో టాల్‌స్టాయ్ !

Image
మూడు ప్రశ్నలు-మూలం: లియో టాల్‌స్టాయ్ ! (సేకరణ) . ఆ రోజుకి సభ చాలించి లేవబోతూ రాజు మంత్రి కేసి చూసేడు. “ఇంకా ఏదైనా మిగిలి ఉందా?” “మీకు కోపం రాదని చెప్తేనే కానీ చెప్పడానికి లేదు. ఆ మధ్య మీ ప్రశ్నలకి సమాధానాలు చెప్పినవాళ్ళని దండించేరు కనుక అలా అడగవలసి వస్తోంది.” చెప్పేడు మంత్రి. ఆ రోజు సంతోషంగా ఉన్నాడేమో ఏవిటో కాని, రాజు నవ్వుతూ చెప్పేడు, “ఆ శిక్షలు మిగతావాళ్లకే లెండి. చెప్పండి ఏమిటి సంగతులు?” “మన రాజ్యపు సరిహద్దు చివరలో ఒక ఊరికి బైటగా ఒక సాధువున్నాడనీ ఆయన మీ సందేహాలకి సరైన సమాధానం ఇవ్వగలడనీ చారుల ద్వారా తెల్సింది.” “ఆ సమాధానాలు నాకు నచ్చకపోతే?” “సమాధానాలు నేను చెప్తానని ఆయన అనలేదు మహారాజా. ఆయన ఆశ్రమంలోంచి బయటకి రాడు. ఎవరైనా కలవాలనుకుంటే ఆయన దగ్గిరకే ఒంటరిగా వెళ్ళాల్సి ఉంటుంది. రాజహోదాలో కాకుండా మామూలు బట్టలు వేసుకుని వెళ్తే తప్ప ఆయన మీతో మాట్లాడడని చెప్తున్నారు. చారులు చెప్తే విన్నాను తప్ప ఆయన నాకు పంపించిన వార్త కాదండి ఇది.” “నేనొక్కణ్ణే వెళ్ళాలా? దారిలో నన్ను హత్య చేసి మరొకడెవడో రాజ్యం సంపాదించడానికి వేసిన ఎత్తులా లేదూ?” “అది కూడా విచారించాను లెండి. ఆ సాధువు న

కోనసీమ కథలు: న్యాయవాదం! (రచన: సాయి బ్రహ్మానందం గొర్తి.....సేకరణ )

Image
కోనసీమ కథలు: న్యాయవాదం! (రచన: సాయి బ్రహ్మానందం గొర్తి.....సేకరణ ). ఉదయం పెందరాళే భోజనం చేసి కోర్టుకి వెళదామనుకుంటూండగా ‘ఒక్కసారి పెరట్లోకి రండీ’ అంది నా భార్య సులోచన. ఎందుకని ప్రశ్నించకుండానే వెళ్ళాను. కోర్టుకి టైమవుతోంది. పెరట్లోకి వెళ్ళగానే అక్కడ కారునలుపులో ఉన్న ఒక ముసలావిడ కనిపించింది. బాగా ఏడిచినట్టుందేమో కళ్ళన్నీ ఉబ్బినట్లున్నాయి. ముడతలుపడ్డ మొహంలో కంటికింద చారికలూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంతకుముందెక్కడో చూసినట్లుగా వుంది. వేంటనే గుర్తుకు రాలేదు. నన్ను చూడగానే ఏడవడం మొదలుపెట్టింది. నాకేం అర్థం కాలేదు. ఇది చూసి సులోచనే చెప్పింది. “ఈవిడ మన మన రైతు పనసయ్య అక్కట. సత్తిరాజు గారి కేసు విషయమై మాట్లాడాలని వచ్చింది.” విషయం ఏమిటని అడిగాను. “అయ్యా సత్తిరాజుగారన్యాయంగా మా మీద కేసు బనాయించారయ్యా. సత్తె పెమాణంగా ఆ పొలం మాదేనయ్యా. మేమెవరిదీ కబ్జా చెయ్య లేదయ్యా. ఎలాగయినా మీరే చూడాల. ఈ పొలం కూడా పొతే కుటుంబం రోడ్డెక్కుతుందయ్యా.” ఆమె ఏడుస్తూ చెప్పింది. ఆమె ఎందుకొచ్చిందో అర్థమయ్యింది. ఇవాళ రవణం సత్తిరాజు కేసుంది. ఈరోజే ఫైనల్ జడ్జిమెంటు. ఇప్పటికే రెండు మూడు వాయిదాలు పడింది. సాధా

స్వయంభూ.. వినాయకుడు.. చోడవరం...విశాక.! -

Image
స్వయంభూ.. వినాయకుడు.. చోడవరం...విశాక.! - చోడవరంమా అత్త గారి ఊరు- చోడవరం లో ని వినాయకుని గుడి చాలా ప్రసిద్దమైనది. ఈ విగ్రహం మానవ నిర్మితమైనధి కాధు. ఈ విగ్రహం స్వయంభూ వినాయకుడు.- . విశాఖజిల్లా చోడవరంలోని గౌరీశ్వరాలయం, విఘ్నేశ్వరాలయాల్లో ఆలయ మూర్తులు స్వయంభువులు. వీటికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. విశాఖజిల్లాలో ఈ రెండు ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ వుంటారు. చోడవరానికి తూర్పు ముఖంలో వున్న ఈ ఆలయాన్ని 600 సంవత్సరాల క్రితం మత్స్యవంశపు రాజులు నిర్మించినట్లు చెబుతారు. ఈ ఆలయంలో గర్భగుడి ద్వారంపైనా తలపైభాగంలో చేప చిహ్నాలు ఉండడంతో దీనిని మత్స్యగణపతిగా పేర్కొంటారు. . ఆంధ్ర రాష్ట్రంలో స్వయంభూ విఘ్నేశ్వరాలయాలు ఉన్న క్షేత్రాలు రెండే రెండు. ఒకటి చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఉండగా రెండవది విశాఖ జిల్లా చోడవరంలో ఉంది. చాలా కాలం క్రితం అక్కడబావి తవ్వటానికి తవ్వుటలో వినాయక విగ్రహం బయటపడింది. వినాయకుని తొండం భూగర్భం ద్వారా ఊరు చివర వున్న చాలా పెద్దగా కొలను వరకూ వ్యాపించి ఉంటుంది. దాని తొండము చివర ఎవరు కనుక్కోలేకపోయారు. --వినాయకుని తొండము చివర తెలుసుకోటానికి చాలాసార్లు ప్రయత్నించారు కానీ ఎవరూ త

కవుల రైలు-రచన: దేవరకొండ బాలగంగాధర తిలక్

Image
తిలక్ కథలు!- - - -(సేకరణ) కవుల రైలు-రచన: దేవరకొండ బాలగంగాధర తిలక్ - తెలుగుదేశం కవులతో నిండి మూడవతరగతి రైలు పెట్టె లాగ క్రిక్కిరిసిపోయింది. “ఇంక జాగా లేదు” అని కేకలేస్తున్నా వినిపించుకోక చవకగా అమ్మే టిక్కెట్లు కొనుక్కొని కొత్త కవులు తోసుకు లోపలి కెగబడుతున్నారు. కొందరు ఫుట్‌బోర్డుల మీద నిలబడీ, కొందరు కమ్మీలు పట్టుకుని వేలాడుతున్నారు. - ఒకావిడ మేలిముసుగు వేసుకుని వచ్చింది. సుతారంగా అందంగా వుంది. కళ్ళల్లో అపూర్వమైన వెలుగు. ఎర్రని పెదవుల్లో తియ్యని సిగ్గు వొంపులు. వెన్నెలనీ, ఉషఃకాంతినీ, మల్లెపువ్వుల్నీ, మంచిగంధాన్నీ, రత్నాలనీ కలబోసి మనమీద జల్లినట్లు అనిపిస్తుంది ఆవిడను చూస్తే.. అక్కడ దగ్గరలో నిలుచుంటే… - ఆవిడ నిస్పృహగా చూసింది రైలుపెట్టె కేసి. లోపలి బొగ్గు పులుసు గాలీ, చుట్టపొగా వాగుడూ కలసి పెట్టెలోంచి బయటకి దుర్భరంగా వ్యాపిస్తున్నాయి. - “ఇక్కడ చోటులేదు దయచేయవమ్మా. నువ్వు కూడానా మా ఖర్మ” వగలొలకబోసుకుంటూ అన్నాడొక చుట్ట ఆసామీ కాండ్రించి ఉమ్మివేస్తూ. ఆయన కవి శార్దూల బిరుదాంకితుడు. అప్పకవీయం అడ్డంగా బట్టీ వేశాడు. - “నో ప్లేస్ మేడం వెరీసారీ” అంటూ కన్ను గీటాడొక నవయువకు

సీత రాముడి కంటే వయసులో పెద్దదా ?? -

Image
సీత రాముడి కంటే వయసులో పెద్దదా ?? - ఎందుకో – సీతాదేవి శ్రీరాముడికన్నా వయసులో పెద్దది అనే ప్రచారం వ్యాప్తిలో ఉంది. ఈ అంశంపై ఇప్పటికి ఎక్కడో ఒక చోట చర్చ నడుస్తూ ఉంటుంది. ముఖ్యంగా వధువు వయసు ఎక్కువగా ఉన్న సందర్భాల్లో ఏదో విధంగా పెళ్లి చేయాలనే లక్ష్యంతో సీత కూడా రాముని కంటే వయసులో పెద్దది .. ఆయన చేసుకోగా లేనిది నువ్వు చేసుకుంటే తప్పు ఏమిటి అని వరుడికి నచ్చచెప్పే యత్నాల్లో ఈ వయసు ప్రస్థావన వస్తోంది . ఇంతకు మించి మరోకారణం ఉండకపోవచ్చు.  . కొన్ని కథల్లో కూడా సీతారాముల వయసులో కొంచెం తేడాలున్నాయి కానీ రామునికంటే సీత పెద్దది అన్నట్టు ఎక్కడ కనిపించదు. వాల్మీకి రామాయణంలో ఈ విషయం గురించి, ఒక సందర్భంలో తేటతెల్లంగా వివరాలు దొరుకుతాయి. . అరణ్యకాండ 47వ సర్గ. యతి వేషంలో రావణాసురుడు సీతాదేవి వద్దకు వచ్చినప్పటి సందర్భం . తానెవరని యతి వేసిన ప్రశ్నకు సమాధానంగా తన వివరాలు చెబుతుంది సీత.  ఆ సర్గలో పదవ శ్లోకం… . "మమ భర్తా మహాతేజా వయసా పంచవింశకః | అష్టాదశ హి వర్షాణి మమ జన్మని గణ్యతే || . అర్థం: మిగులు పరాక్రమశాలియగు నా భర్త యొక్క అప్పటి* వయస్సు ఇరువదిఐదు సంవత్సరములు. నా వయస్స

బాల త్రిపుర సుందరి !

Image
బాల త్రిపుర సుందరి ! . త్రిపురాంతకం శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మ వారి దేవాలయం. . త్రిపుర సుందరి లేదా మహా త్రిపుర సుందరి (షోడసి , లలిత మరియు రాజరాజేశ్వరి ) దశ మహావిద్యలలో ఒక స్వరూపము.  సాక్ష్యాత్ ఆది పరాశక్తి. ముల్లోకాలకి సుందరి కావున త్రిపుర సుందరి అంటారు. పదహారేళ్ళ వయసు కల, పదహారు వివిధ కోరికలు కలది కావు షోడసి అని వ్యవహరిస్తారు.  . త్రిపుర అనగా ముల్లోకములు. సుందరి అనగా అందమైనది. కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకములని పాలించే సుందరి అని అర్థం. అయితే త్రిపుర అనే పదానికి అర్థాలు అనేకం. ఈ దేవతకి ఉన్న మూడు వివిధ రూపాల వల్ల కూడా ఆ పేరు వచ్చినదని సిద్ధాంతము కలదు. భాస్కరాచార్యులు రచించిన త్రిపుర ఉపనిషత్తులో ఈ దేవత మూడు రూపాలలో ఉంటుంది. * స్థూల (భౌతికం): ధ్యాన శ్లోకాలలో వివరించబడినది. బహిర్యాగంతో పూజించబడుతుంది. * సూక్ష్మ (సున్నితం): మూల మంత్రాలలో వివరించబడినది. జపంతో పూజించబడుతుంది. * పర (మహోన్నతం): అంతర్యాగం (యంత్ర-మంత్ర ప్రయోగాలతో) పూజించబడుతుంది. శ్రీ చక్రం లో బిందువు ఒకటిగానే కనిపించిననూ శాంతమయి అయిన ఆ దేవి మూడు వివిధ శక్తుల సమాహారము. * ఇఛ్ఛా శక్తి: వా

-మంచి ఆలోచన--రేపటి వార్తలు ఈ రోజు !

Image
-మంచి ఆలోచన--రేపటి వార్తలు ఈ రోజు ! . -ఒక జూదరి తన ఆస్తి అంత గుఱ్ఱం పందేలలో వొడి పోతాడు. . తన ఇల్లు ఆఖరి తాకేట్టు పెట్టి -ఆఖరి దావు అంటో, -మల్లి బయలు దేరు తాడు. . దారిలో ఒక పేపర్ కుర్ర వాడు పేపర్ ఇస్తాడు, - అది రేపటి పేపరు. -తప్పు డేట్ అని బయటకు విసిరేస్తాడు.  -రోడ్ మీదపేపర్ పడే కూడదు అని ట్రఫిక్ పొలిసు ఆయనకి తిరిగి తీసి ఇస్తాడు. - సర్లే అని అయన చూద్దాం అని నవ్వుకొంటూ పేపరు చూస్తాడు. -దానిలో ఆ రోజు జరిగే రేస్ లో గెలిచే గుఱ్ఱాలు పేర్లు చూసి సరదాగా ఆడి  బాగా డబ్బు చేసుకుంటాడు... -తన పోయిన ఆస్థి కు రెండితలు డబ్బు చేసుకుంటాడు . -అప్పుడు సంతోషంగా మల్లి పేపర్ చూస్తే -అందులో తన పేరు ఉంటోంది.. . -గుఱ్ఱం పందేలలో బాగా డబ్బు చేసుకొని గుండె ఆగి చనిపోయాడు -అని మరణ వార్త.. -అంతే ... అక్కడకి అక్కడే మరణిస్తాడు.. . -ఇది ఒక బెంగాలీ కధ..

కరుణశ్రీ - విశ్వ ప్రేమ !

Image
కరుణశ్రీ - విశ్వ ప్రేమ ! (కరుణశ్రీ - శ్రీజంధ్యాల పాపయ్య శాస్త్రి .)  - సీ.  ఏ ప్రేమ మహిమచే నీ ధారుణీచక్ర  మిరుసు లేకుండనే తిరుగుచుండు  ఏ ప్రేమమహిమచే నెల్ల నక్షత్రాలు  నేల రాలక మింట నిలిచియుండు  ఏ ప్రేమమహిమచే పృథివిపై బడకుండ  కడలిరాయుడు కాళ్ళు ముడుచుకొనును  ఏ ప్రేమమహిమచే నీ రేడు భువనాల  గాలిదేవుడు సురటీలు విసరు గీ.  ఆ మహాప్రేమ - శాశ్వతమైన ప్రేమ -  అద్భుత మఖండ మవ్యక్తమైన ప్రేమ -  నిండియున్నది బ్రహ్మాండభాండమెల్ల  ప్రేయసీ ! సృష్టియంతయు ప్రేమ మయము !

భర్తృహరి నీతి శతకము .

Image
భర్తృహరి నీతి శతకము . . -శ్లోకము దాక్షిణ్యం స్వజనే, దయా పరిజనే, సాఠ్యం సదా దుర్జనే । ప్రీతిః సాధుజనేనయోః నృపజనే, విద్వజ్జనేచార్జవం । శౌర్యం శతృజనే, క్షమా గురు జనే, నారీజనే ధృష్టతా । యే చైవం పురుషాః కలాసు కుశలాస్తేష్వేవ లోక స్థితిః ।।  . దీనికి ఏనుగు లక్ష్మణ కవి యొక్క తెలుగు సేత.... చంపకమాల - "వరకృప భృత్యులందు నిజసర్గమునందనుకూల వృత్తి కా పురుషులయందు శాఠ్యము సుబుద్ధులయం దనురక్తి దాల్మి స ద్గురువులయందు శౌర్యము మృగాక్షులయందు బ్రగల్భభావ మీ వరుస కళాప్రవీణులగు వారలయందు వసించు లోకముల్! . భావం- బంధువుల యెడ దాక్షిణ్యముతోనుండుటయు,  అనగా వారి యిష్టానుసారము నడచుకోనుటయు,  సేవకుల యెడ దయతోనుండుటయు, దుర్జనుల యందు కఠినముగా వ్యవహరించుటయు, సజ్జనులయందు ప్రీతి పాత్రమై మెలగుటయు,  రాజులయందు – అనగా నేటి రాజకీయ నేపథ్యములో రాజకీయ నాయకులయందు నీతితో వారికి అనుగుణముగా వ్యవహరించుటయు,  విద్వాంసులయందు క్రమ ప్రవర్తనము లేదా ఋజు ప్రవర్తనము కలిగియుండుటయు, శత్రువులయందు పరాక్రమమును, పెద్దలయందు ఓర్పును, స్త్రీల యందు దిట్టతనూ అనగా ధృఢచిత్తము కలవారుగానూ యే పురుషులు కనపఱుతురో అ

నందో రాజా భవిష్యతి ' !

Image
నందో రాజా భవిష్యతి ' అంటే ? (సేకరణ) . చాలామంది ఈ శ్లోక పాదాన్ని వాడుతూ ఉంటారు. కానీ ఏ సందర్భం లో ఉపయోగించాలో, అసలు ఈ శ్లోకం ఎలా పుట్టిందో, దాని అర్ధం ఏమిటో, పూర్తి శ్లోకం ఏమిటో ఇప్పుడు వారికి కూడా తెలియక పోవచ్చు. ఇదొక పురాణ కథ. . ఉత్తుంగ భుజుడు అనే రాజుకు నందుడు అనే కొడుకు ఉన్నాడు. అయితే, యితడు పుట్టిన తరువాత రాజు గారు కామావేశుడై, మరొక అందమైన వేశ్యను తెచ్చుకుని ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. భార్యా కొడుకు ను నిర్లక్ష్యం చేసాడు. వీరికి కనీసం డబ్బు, ఆహారం కూడా అందించకుండా నిరంతరం వేశ్య తోనే కాలం గడుపుతూ, ఆమెకు బోలెడంత ధనం ఇస్తున్నాడు. రాజుగారి భార్య, కొడుకు చేతిలో చిల్లిగవ్వ లేక పేదవారుగా రాజమందిరం లోనే గడుపుతున్నారు. ఒకరోజు ఒక నగల వర్తకుడు మేలిమి ముత్యాల నగలు అమ్ముతూ రాజమందిరానికి వచ్చాడు. ఈమె ఆ నగలవంక ఆశగా చూసింది. కానీ కొనడానికి డబ్బు లేదు. ఆ విషయం గ్రహించి ఆమె పనిమనిషి ఒక సలహా ఇచ్చింది. అప్పటి భాష సంస్కృతం కాబట్టి ఆమె సలహా సంస్కృతం లో ఇచ్చింది. "ఉత్తుంగ భుజనా శోవా దేశకాల గతోపివా  వేశ్యా వణి గ్వినా శోవా నందో రాజా భవిష్యతి" దీని అర్ధం ఏమిటంటే;;

శ్రీ కృష్ణ సౌదర్య మహిమ - "మధురాధి పతే అఖిలం మధురం"!

Image
శ్రీ కృష్ణ సౌదర్య మహిమ - "మధురాధి పతే అఖిలం మధురం"! . "దినే దినే నవం నవం,  నమామి నంద సంభవం" - శ్రీ శంకర భగవత్పాదులు . శ్రీ కృష్ణుడి పేరులోనే ఉంది ఆకర్షణ. నిత్య నూతన సౌదర్యంతో మోహింపచేస్తాడన్నమాట. ఎన్ని సార్లు చూసినా, మళ్లీ మళ్లీ చూడాలనిపించే, నిత్య నూతనమైన ముగ్ధమోహన సౌందర్యము ఆయనది. ఆయన లీలలు కూడా నిత్య నూతనమే. . కౌరవ పాండవ యుద్ధంలో, ఆయుధం పట్టను అన్నప్పటికీ, తన సౌదర్యంతో అరి వీరులను మోహపరవసులను చేసి, వారు ఆ అద్భుత దృశ్యంలో మైమరచి తేరుకునే లోపల అర్జున బాణ ధాటికి, కూలిపోయే వారట. ఆయన నిజంగా ఎవరినైనా నిర్జించాలంటే, ఆయుధాలు అవసరమా? . ఆయనను ఆరాధించే వారికి, నిత్య నూతనంగా, కొత్త కొత్త అందాలతో, నిత్యరమణీయతతో కనిపిస్తాడు. అప్పుడే మొదటిసారి చూస్తున్నట్లుంటుంది. . ఆయన బోధించిన భగవద్గీత ఎన్ని సార్లు చదివినా, నిత్య నూతనంగా, ప్రతీసారీ కొత్త కొత్త అర్ధాలు నీ కోసమే ప్రత్యేకంగా నీ ప్రక్కనే కూర్చుని నీ అంతరాత్మగా చెప్తున్నట్లు, స్ఫురిస్తూ ఉంటాయి. . పద్దెనిమిది పురాణాలు రచించినా తీరని ఆర్తి,  వ్యాస భగవానుడికి, భాగవతం రచించాక కొంత తీరిందేమో! అప్

బాపూ రమణు ల- పెళ్ళిపుస్తకం’.! -

Image
బాపూ రమణు ల- పెళ్ళిపుస్తకం’.! - 'పెళ్ళిపుస్తకం’. రావి కొండలరావు గారు మిస్సమ్మ కథ  తిరగేసి ఇచ్చారు. నంది అవార్డే కాక జనం కూడా రివార్డిచ్చారు. చాలా గొప్ప నటుడు రాజేంద్రప్రసాద్ – కొత్తనటి దివ్యవాణి. - కొంతభాగం మా మిత్రులు NCL రాజుగారి తోటలో తీశాం.  రమణగారు అక్కడ చక్రాలు లేని రైలుపెట్టి ఉండడం చూసి గుమ్మడిగారి పాత్రకి చక్కని సీను రాశారు సినిమాలో “అసూయ అసలైన ప్రేమకి ధర్మామీటరు” అన్న డైలాగు చాలా ఇష్టం. - ఆరుద్రగారి “శ్రీరస్తు శుభమస్తు” పాట షూటింగుకి మా ఆర్టువారు కళ్యాణమండపం అద్దె, డెకొరేషన్సు, జూనియర్సు, వార కాస్ట్యూమ్సు లెక్కేసి పొడుగాటి జాబితా తెచ్చారు. వద్దనుకుని ఓ తమాషా చేశాం. ఓ గదిలో నాలుగిటుకలూ పుల్లలూ, కాస్తమంట, ముగ్గులు, నాలుగు అరటి పిలకలు, నాలుగు మామిడి రెమ్మలు, ఓ కొబ్బరి బొండాం, మంగళ సూత్రం, పుపు కలిపిన బియ్యం ఓ పళ్ళెం, రెండు కర్రలకి పూలదండలు అమర్చుకుని Tight Close shots తో ఓ పూటలో పాట ముగించేశాం. హీరో హీరోయిన్లు తప్ప జూనియర్సు లేరు. అక్షింతల వేసన చేతులు కూడా మా యూనిట్ వాళ్లవే! - క్లైమాక్సు రాసుకుని రమణగారు పద్మాలయ స్టూడియోస్ లో పెద్ద ఫ్లోరు బుక్ చే

అలుగ కారణమేమిరా రామ!

Image
త్యాగరాజు! పలుకవేమి నా దైవమా పరులు నవ్వేది న్యాయమా! . అలుగ కారణమేమిరా రామ నీవాడించినట్లుయాడిన నాతో ! . తల్లి తండ్రి భక్తినొసగి రక్షించిరి తక్కిన వారలెంతో హింసించిరి తెలిసియూరకుండేదియెన్నాళ్ళురా దేవాది దేవ త్యాగరాజునితో!

పోలాల అమావాస్య – పోలాంబా వ్రతం’!

Image
పోలాల అమావాస్య – పోలాంబా వ్రతం’! . మొదట్లో మనకు ఎన్నో పర్వదినాలు, పండుగలు ఉండేవి. అవన్నీ మన సంస్కృతికి, సంప్రదాయాలకి అద్దం పట్టేవిగా ఉండేవి. అప్పట్లో ఊరు ఊరంతా కలిసి చేసుకునేవారు. ఇప్పుడు  మ్యుఖ్యమైన పండగలకి కూడా కుటుంబం లోని సభ్యులు కలవడమే గగనం అయిపోతోంది. మన అమ్మమ్మలు చేసుకున్న పండగలలో కొన్నిటిని హడావిడి జీవనంలో పడి మనం ఇప్పటికే  వదిలేసాము  మన. దాని వలన పాపం మన పిల్లలికి మన పండగలలో చాలా పండగల విశిష్టత మాట పక్కకు పెడితే, పేర్లు కూడా తెలియదు అంటే అతిశయోక్తి కాదు. అలా మన పిల్లలతో పాటు మనలో చాలా మంది విస్మరిస్తున్న పండగలలో ఒక పండగ ప్రతి శ్రావణ మాసంలో అమావాస్య రోజు చేసుకునే ఎంతో ముఖ్యమైన పండుగ.  అదేనండీ 'పోలాల అమావాస్య' పండుగ. దీనినే 'పోలాంబ వ్రతం' లేక ‘కంద గౌరీ వ్రతము’ అని కూడా అంటారు. ఈ వ్రతం, తల్లి అయిన ప్రతి స్త్రీ తప్పక చేయవలసిన విధానం. సంతానం ఆయురారోగ్యాలతో వర్ధిల్లడానికి ఆచరించ తగ్గది ఈ వ్రతం. మనము, మన సంతానం ఆయురారోగ్యాలతో ఉండటానికి కారణం మన గ్రామ దేవతల కరుణా కటాక్షాలే!  అందుకే మన పెద్దలు గ్రామ దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి పండు

”ఆముక్తమాల్యద- శ్రీకృష్ణ దేవరాయ ప్రభు !!”

”ఆముక్తమాల్యద- శ్రీకృష్ణ దేవరాయ ప్రభు  !!” . ”ఆముక్తమాల్యద” రసజ్ఞులకు రసజుష్టంగానూ.. ఆలంకారికులకు నవరత్నపేటికగాను.. అర్థజ్ఞులకు సర్వార్థ నిధిగాను.. పాండితీ పూజారులకు నూత్నార్థ పదకోశంగానూ.. వర్ణనా ప్రియులకు సర్వభావ పూర్ణముగానూ.. భాసించే ఈ కావ్యరాజమునకు ధీటైన మరో కావ్యము నభూతో..ణ భవిష్యతి..! . కృష్ణదేవరాయలు 1474 ప్రాంతాల్లో పుట్టి, 1509లో రాజై, అనేక దిగ్విజయాలు చేసి, 1515,16ల్లో విజయవాడకు వెళ్ళి,  అక్కడికి దగ్గర్లో ఉన్న శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువుని సేవించేడు (ఈ శ్రీకాకుళం విశాఖపట్టణం దగ్గరిది కాదు, విజయవాడ దగ్గరిది).  --ఏకాదశి నాడు ఉపవాసం చేసేడు.  ఆ పుణ్యదినాన, రాత్రి నాలుగో జామున ఆ “ఆంధ్ర జలజాక్షుడు”  అతని కల్లో ప్రత్యక్షమయేడు “లేములుడిపెడు లేజూపు లేమ తోడ”. చిరునవ్వుతో ఇలా అన్నాడు  . “రసికులు మెచ్చేట్టు మదాలసచరిత్ర పలికేవు, భావం, ధ్వని, వ్యంగ్యం మేళవించి సత్యావధూప్రీణనం చెప్పేవు, వేదపురాణాల కథల్నేరి సకల కథాసారసంగ్రహం తయారుచేసేవు, శ్రోతల పాపాలు ఎగిరిపోయేట్టు జ్ఞానచింతామణిని వినిపించేవు, రసమంజరి మొదలైన మధురకావ్యాలు రచించేవు అన్నీ గీర్వాణభాషలో!  ఇల

బాపూ రమణు ల రాముడు !

Image
బాపూ రమణు ల రాముడు ! . రాముణ్ణి నమ్ముకుంటే అందరికీ మంచే జరుగుతుంది. ఇరవై ఏళ్ళ క్రితం తీసిన ఆయన కథ “సంపూర్ణ రామాయణం” వట్టిపోని పాడి ఆవు.  అయిదేళ్ళకోసారి అమ్మి లాభం పొందేవాళ్ళం. ఆ మధ్య మా పార్ట్నర్స్ లో ఒకరు మాకు చెప్పకుండా రామాయణం సినిమాని మరో అయిదేళ్ళకి అమ్మేసి జేబులో వేసుకున్నాడు. రమణగారు ఆయన్ని నిలేస్తే –  “అవును. తిన్నాను. ఏం జేస్తావ్? కోర్టుకెడితే వెళ్ళు. సివిలు కేసు హియరింగు కొచ్చేసరికి నువ్వైనా వుండవు. నేనైనా వుండను. ఈ లోగా మరిన్ని మాట్లు అమ్ముకుంటాను” అని హామీ ఇచ్చారు. అంటే – రాముడు పాపం ఆయనకు అవసరమైన సొమ్ము జతపరిచాడు.  మాకు కోర్టు వ్యవహారాల గురించి జ్ఞానమూ ప్రసాదించాడు. _ ముళ్ళపూడి వెంకట రమణ గారు .

గోపాలకృష్ణమ్మ గోవులకు వెలుగు.!

Image
గోపాలకృష్ణమ్మ గోవులకు వెలుగు.! (బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి ) . కొడుకుల్లు పుట్టన్ని కడు పేమి కడుపు? కుల ముద్ధరించన్ని కొడు కేమి కొడుకు? కన్నకానుపులెల్ల కడుచక్కనయితె, కన్నుల్ల పండుగే కన్నతల్లికిని. * * * లాభమ్మ లాభమ్ము ఏమి లాభమ్ము? కొడుకులను గంటేను కోటి లాభమ్ము. గోరంతదీపమ్ము కొండలకు వెలుగు, గోపాలకృష్ణమ్మ గోవులకు వెలుగు. మాడంతదీపమ్ము మేడలకు వెలుగు, మారాజు అబ్బాయి మాకళ్ల వెలుగు. * * *

మడిసైపుట్టాక కుసింత కళాపోసనుండాల!

Image
మడిసైపుట్టాక కుసింత కళాపోసనుండాల! . బాపు, రమణ కలిసి సృష్టించిన అద్భుతమయిన సినిమాలలో ‘ముత్యాల ముగ్గు’ ఒకటి. రావుగోపాలరావు తెలుగు సినిమాలలో ఎన్నటికీ నిలిచిపోయే డైలాగులతో విలన్ పాత్ర పోషించారు ఈ సినిమాలో. మచ్చుకి ఒక సన్నివేశం. (అప్పుడే తెల్లవారుతూ ఉంటుంది. ఎర్రటి అకాశంలో సూర్యుడు ఉదయిస్తుంటాడు. పరకడుపునే చుట్టకాలుస్తూ సూర్యోదయం చూస్తుంటాడు విలన్ రావుగోపాలరావు. సెగట్రీ: నారాయుడొచ్చాడండి. రావు: వచ్చాడా తీసుకొచ్చావా? సెగట్రీ: యెస్సర్. తీసుకొచ్చాను చూస్తారా? (నారాయుడిని మర్డర్ చేయిస్తాడు రావుగోపాలరావు. నారాయుడి బాడీని రావుగోపాలరావుకి చూపించటానికి తెచ్చాడు సెక్రెట్రీ.) రావు: అబ్బా సెగట్రీ ఎప్పుడూ పనులూ బిజినెస్సేనా? యే? పరగడుపునే కుసుంత పచ్చిగాలి పీల్చి ఆ పత్యక్షనారాయుడి సేవ చేసుకోవద్దూ? సెగట్రీ: యెస్సర్ రావు: యెస్సర్ గాదు. కళ్ళెట్టుకు సూడు…..పైనేదో మర్డర్జరిగినట్టు లేదూ? ఆకాసంలో సూర్రుడు నెత్తురు గడ్డలా లేడూ? సెగట్రీ: అద్భుతం సార్! రావు: మడిసన్నాక కాసింత కళా పోసనుండాలయ్యా! ఉత్తినే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా యేటుంటాది? ! అలా మన అధునికాంధ్ర విలన్లను కూడా క

సీతారామాభ్యామ్ నమః - యాయ వారం, ముష్టి !

Image
సీతారామాభ్యామ్ నమః - యాయ వారం, ముష్టి ! . పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం .. అనే లోకోక్తి పై లోకోక్తి ఎలా వచ్చింది? . మాచిన్న తనంలో కొందరు బ్రాహ్మణులు నిత్యజీవితానికి ఆరోజుకు అవసరమైన అవసరమైన ఆహారాన్ని ధాన్యం, లేదా బియ్యమును యాచనతో సంపాదించుకునేవారు. ఇత్తడి చెంబు శుభ్రంగా తోముకొని, సీతారామాభ్యామ్ నమః అని చెప్పుకుంటూ ఆరోజు పంచాంగ శ్రవణం చేస్తూ పిడికెడు బియ్యం తో సంతుష్టిచెంది వెళ్ళేవారు. బిక్షం వేయగానే ఆశీర్వచన మంత్రం చదివే వారు. దీనిని యాయవార వృత్తి అనేవారు. ఇది సంస్కృత పదం. సంస్కృత నిఘంటువు - ప్రత్యహం ధాన్య యాచనా - అని అర్థం ఇస్తుంది.  ముష్టి అంటే పిడికిలి, యాచన కాదు సవ్య ముష్టి ప్రహారంతో లంకాపురిని జయిస్తాడు .  ఒక విద్యావిహీనుడు, దరిద్రుడు అయిన బ్రాహ్మణునికి చిన్నప్పుడు తండ్రి ఉరుములతో కూడీన వర్షం వచ్చినప్పుడు ఇంద్రుని వజ్రం (పిడుగు) పాలి పడకుండా అందరికీ తెలిసిన ఈ శ్లోకం చెప్పాడు . “అర్జునః ఫల్గుణః పార్థః కిరీటీ శ్వేతవాహనః  భీభత్స విజయోర్జిష్ణుః సవ్యసాచీ ధనంజయః” .|| . తరువాత కొన్ని దినాలకే తండ్రిపోవడం, దరిద్రస్థితిలో చదువులేక పోవడం జరిగింది. యాయవారం

మధ్యాహ్నం మాణిక్యం!

Image
మధ్యాహ్నం మాణిక్యం! (ప్రఖ్యాత కథకులు నందివాడ భీమారావు గారు, వారి అర్థాంగి శ్రీమతి శ్యామల గారు కలిసి వారి జ్ఞాపకాల్నీ కలబోసి రాసిన కథ ) . మా తాత గారిది పెద్ద ఉమ్మడి కుటుంబం. ఆయన తమ్ముళ్ళూ, మేనల్లుళ్ళూ, బావ మరిదీ, మొత్తం పిల్లా పెద్దా కలిసి ఎప్పుడు చూసినా పెళ్ళి ఇల్లులా ఉండేది. ఎప్పుడూ ఏవో నోములూ పేరంటాలూ పురుళ్ళూ తద్దినాలూ సమారాధనలూ చాలా సందడిగా ఉండేది. పక్కన అతిథి కూచుని భోంచేస్తేనే మా తాతగారు తినే వారు. ఆస్థి ఉండి అట్టహాసముండి సరదాలూ సంబరాలూ వేడుకలతో నిండి, బొత్తిగా ముందు చూపూ జాగ్రత్తా లేని ఆ కాలపు పెద్ద కుటుంబం మా తాతగారిది. పెద్ద మండువా ఇల్లూ నాలుగు వేపులా పెద్ద పెద్ద వసారాలూ, పెద్ద భోజనాల సావిడీ, నాలుగు పెద్ద పడక గదులూ, కొన్ని చిన్న గదులూ, పాల మజ్జిగలకి ప్రత్యేకం గదీ, వంటకి వేరే, పిండి వంటకి వేరే గదులూ ఉండేవి. మా బామ్మ కూర్చుని పిండి వంటలు చేస్తూ ఉంటే మేవంతా చుట్టూ కూర్చుని ఖాళీ చేసేవాళ్ళం. “చేసినంతసేపు పట్టదర్రా, ఖాళీ అయిపోవడానికి” అనేదావిడ. మా నాన్న కన్నతల్లి చంటితనంలోనే పోతే తాతగారి రెండో భార్య దగ్గిరే ఆయన పెరిగారు. “అమ్మా” అనే పిలిచే వారు. చాలా కాలం దాకా ఆవిడే

ఉపవాసము!

Image
. ఉపవాసము! . ఉపవాసం అనగా దగ్గరగా నివసించడం. ఉప అంటే దగ్గరగా వాసం అంటే నివసించడం అని అర్ధం. కొన్ని ప్రత్యేక పండుగల సమయాలలో ఈ ఉపవాస దీక్షను చేపడతారు. ఉపవాసం ఉండాలనుకున్న రోజు దేవుని యందు మనస్సు లగ్నం చేయడానికి ఆహార, పానీయాలను తీసుకోకుండా లేదా కొద్ది మొత్తంలో తీసుకుని పస్తు ఉంటారు. ఈ ఉపవాసం చేసే దీక్షను బట్టి ఒక పూట లేక ఒకరోజు లేక కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది. .  భక్తితో కావచ్చు.. బరువు తగ్గేందుకు కావచ్చు.. కారణమేదైనా చాలామంది తరచూ ఉపవాసం చేస్తుంటారు. సరైన అవగాహన లేకుండా తరచూ ఉపవాసాలు చేస్తుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా అస్సలు ఆహారం తీసుకోకుండా ఖాళీ కడుపుతో ఉండిపోతుంటే బలహీనత, అసిడిటీ, డస్సిపోవటం, తలనొప్పుల వంటి బాధలు చాలా వేధిస్తాయి. కాబట్టి ఉపవాసం అంటే పూర్తిగా ఏమీ తినకుండా లంఖణం చేయటం కాదని, ఈ సమయంలో కూడా శరీరానికి పోషకాలు అవసరమని గుర్తించాలి. మధుమేహం, అసిడిటీ వంటి సమస్యలున్నవారు, గర్భిణులు, పిల్లలు.. అసలు ఉపవాసం చేయకపోవటం మేలు. మరోవైపు చాలామంది ఉపవాసం ముగిస్తూనే బాగా నూనె, నెయ్యి వేసి వండిన స్వీట్లు, కొవ్వు పదార్ధాల వంటివి దండిగా తింట