సీతారామాభ్యామ్ నమః - యాయ వారం, ముష్టి !

సీతారామాభ్యామ్ నమః - యాయ వారం, ముష్టి !


.

పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం .. అనే లోకోక్తి

పై లోకోక్తి ఎలా వచ్చింది?

.

మాచిన్న తనంలో కొందరు బ్రాహ్మణులు నిత్యజీవితానికి ఆరోజుకు అవసరమైన అవసరమైన ఆహారాన్ని ధాన్యం, లేదా బియ్యమును యాచనతో సంపాదించుకునేవారు.

ఇత్తడి చెంబు శుభ్రంగా తోముకొని, సీతారామాభ్యామ్ నమః అని చెప్పుకుంటూ ఆరోజు పంచాంగ శ్రవణం చేస్తూ పిడికెడు బియ్యం తో సంతుష్టిచెంది వెళ్ళేవారు.

బిక్షం వేయగానే ఆశీర్వచన మంత్రం చదివే వారు. దీనిని యాయవార వృత్తి అనేవారు. ఇది సంస్కృత పదం.

సంస్కృత నిఘంటువు - ప్రత్యహం ధాన్య యాచనా - అని అర్థం ఇస్తుంది. 

ముష్టి అంటే పిడికిలి, యాచన కాదు సవ్య ముష్టి ప్రహారంతో లంకాపురిని జయిస్తాడు . 

ఒక విద్యావిహీనుడు, దరిద్రుడు అయిన బ్రాహ్మణునికి చిన్నప్పుడు తండ్రి ఉరుములతో కూడీన వర్షం వచ్చినప్పుడు ఇంద్రుని వజ్రం (పిడుగు) పాలి పడకుండా అందరికీ తెలిసిన ఈ శ్లోకం చెప్పాడు

.

“అర్జునః ఫల్గుణః పార్థః కిరీటీ శ్వేతవాహనః 

భీభత్స విజయోర్జిష్ణుః సవ్యసాచీ ధనంజయః” .||

.

తరువాత కొన్ని దినాలకే తండ్రిపోవడం, దరిద్రస్థితిలో చదువులేక పోవడం జరిగింది. యాయవారంతో పొట్ట పోసుకుంటూ యాచనకు వెళ్ళీ తనకు తెలిసిన పిడుగు మంత్రం చెప్పడం మొదలు పెట్టాడు. పంచాంగం చదవడం, ఆశీర్వచనం చేయడం తెలియదు తెలిసినది ఒకే మంత్రం - పిడుక్కీ బియ్యానికి అదే!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!