మడిసైపుట్టాక కుసింత కళాపోసనుండాల!

మడిసైపుట్టాక కుసింత కళాపోసనుండాల!

.

బాపు, రమణ కలిసి సృష్టించిన అద్భుతమయిన సినిమాలలో ‘ముత్యాల ముగ్గు’ ఒకటి. రావుగోపాలరావు తెలుగు సినిమాలలో ఎన్నటికీ నిలిచిపోయే డైలాగులతో విలన్ పాత్ర పోషించారు ఈ సినిమాలో. మచ్చుకి ఒక సన్నివేశం.

(అప్పుడే తెల్లవారుతూ ఉంటుంది. ఎర్రటి అకాశంలో సూర్యుడు ఉదయిస్తుంటాడు. పరకడుపునే చుట్టకాలుస్తూ సూర్యోదయం చూస్తుంటాడు విలన్ రావుగోపాలరావు.

సెగట్రీ: నారాయుడొచ్చాడండి.

రావు: వచ్చాడా తీసుకొచ్చావా?

సెగట్రీ: యెస్సర్. తీసుకొచ్చాను చూస్తారా?

(నారాయుడిని మర్డర్ చేయిస్తాడు రావుగోపాలరావు. నారాయుడి బాడీని రావుగోపాలరావుకి చూపించటానికి తెచ్చాడు సెక్రెట్రీ.)

రావు: అబ్బా సెగట్రీ ఎప్పుడూ పనులూ బిజినెస్సేనా? యే? పరగడుపునే కుసుంత పచ్చిగాలి పీల్చి ఆ పత్యక్షనారాయుడి సేవ చేసుకోవద్దూ?

సెగట్రీ: యెస్సర్

రావు: యెస్సర్ గాదు. కళ్ళెట్టుకు సూడు…..పైనేదో మర్డర్జరిగినట్టు లేదూ? ఆకాసంలో సూర్రుడు నెత్తురు గడ్డలా లేడూ?

సెగట్రీ: అద్భుతం సార్!

రావు: మడిసన్నాక కాసింత కళా పోసనుండాలయ్యా! ఉత్తినే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా యేటుంటాది? !

అలా మన అధునికాంధ్ర విలన్లను కూడా కళాభిమానులు చేస్తారు, బాపు, రమణ.

.

ఈస్ట్ కోస్ట్ మాష్టారు తనకిష్టమైన

అతికష్టమైన బారిష్టర్ టెస్ట్

ఫస్ట్ లో పాస్ అయినందుకు

తన పక్కింటివాడిని ఫీస్ట్ కని

పిలిచి చికెన్ రోస్ట్ టేస్ట్ ను

బెస్ట్ బెస్ట్ అనుకుంటూ

సుస్టుగా లాగించి బ్రేవ మన్నాట్ట" అంటూ

ప్రాసకోసం అతి ప్రయాసపడి రాసేడు

వేటగాడులోని ఈ సంభాషణ మన జంధ్యాల!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!