-

-పాలువాయి భానుమతి !

.

పద్మ భూషణ్ పాలువాయి భానుమతి అంటే తెలుగులుకు, తమిళులలో తెలియనిది ఎవరికి..

సహజ నటన , గాంభీర్యం..ఆమె సొంతం..మృదు మధుర స్వరాలతో ఆమె పాడిన పాటలు.. నేటికీ వినబడుతూనే ఉంటాయి.. తను నిర్మించి నటించిన ప్రతి ఒక్క చిత్రంలో ..చిత్ర కథను బట్టి.. సాంప్రదాయ సంగీతం ఉండేట్టు చూసుకున్నారు.. ముదితల్ నేర్వగ రాని విద్యల్ గలవే ముద్దార నేర్పించినన్ అన్నట్టు.. నటీమణిగా, గాయనిగా, రచయిత్రిగా, చిత్ర నిర్మాతగా, స్టూడియో అధినేత్రిగా , దర్శకురాలిగా.. సంగీత దర్శకురాలిగా, ఎడిటర్ గా ఆమె బహుముఖ ప్రజ్ఞ చూపారు..

వరవిక్రయం 1939 తో ప్రారంభం అయిన ఆమె చలన చిత్ర జీవిత ప్రస్థానంలో నటించినవి కొన్ని చిత్రాలు మాత్రమే అయినా.. ఆమె పోషించిన ప్రతి పాత్రకు జీవం పొసారు.. స్వర్గ సీమ, కృష్ణ ప్రేమ, గృహప్రవేశం, రత్నమాల,రక్ష రేఖ, అపూర్వ సహోదరులు, లైలా మజ్ను.. మల్లీశ్వరి.. మంగళ, ప్రేమ,చండీరాణి, చక్రపాణి, విప్రనారాయణ, చింతామణి, తెనాలి రామకృష్ణ, వరుడు కావాలి..బాటసారి, అనురాగం, వివాహ బంధం, తోడు నీడ, అంతస్థులు.. బొబ్బిలి యుద్ధం, పల్నాటి యుద్ధం.. అంత మనమంచికే వంటి ఎన్నో చిత్రాలలో ఆమె పోషించిన పాత్రలు మరువ లేనివి.. 1980 లలో వచ్చిన మంగమ్మ గారి మనవడు చిత్రం దిగ్విజయం సాధించింది అంటే.. అందులో పౌరుషం గల మంగమ్మ గా ఆమె సహజ గాంభీర్య నటనవలనే అంటే అతిశయోక్తి కాదు..

ఆమె పాడిన ప్రతి ఒక్క పాట.. సుమధురమే.. ఆమె నటించిన ప్రతి పాత్ర మరపురానిదే.. భర్త పాలువాయి రామకృష్ణతో కలసి ఆమె సుప్రసిద్ధ భరణీ స్టూడియో ను నెలకొల్పి మంచి చిత్రాలను నిర్మించి నటించారు.. మిస్సమ్మ, చెంచులక్ష్మి వంటి మరెన్నో విజయవంతమైన చిత్రాలలో.. ఆమె చివరి నిముషంలో తప్పుకున్నా దర్శక నిర్మాతలు ఆమెకు అహం అని తెగిడినా.. అంజలి,సావిత్రి, జమున వంటి సరికొత్త అందగత్తెలు చిత్ర సీమకు వచ్చినా.. ఆమె ఏ మాత్రం జంకకుండా. పురుషాధిపత్యం కూడిన చిత్ర సీమలో 60 సంవత్సరాలు మకుటం లేని మహా రాణిగా మెలిగారు.. ఆమె రచించిన అత్తగారి కథలు, రంభా చక్రపాణీయం నేటికీ చదువరులను కిత కితలు పెడుతూనే ఉన్నాయి..నాలో నేను అని ఆమె జీవితలోని మరపు రాని మధుర ఘట్టాలను ఎన్నో స్వయంగా రాసుకున్నారు..

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!