”ఆముక్తమాల్యద- శ్రీకృష్ణ దేవరాయ ప్రభు !!”

”ఆముక్తమాల్యద- శ్రీకృష్ణ దేవరాయ ప్రభు  !!”

.

”ఆముక్తమాల్యద” రసజ్ఞులకు రసజుష్టంగానూ..

ఆలంకారికులకు నవరత్నపేటికగాను..

అర్థజ్ఞులకు సర్వార్థ నిధిగాను..

పాండితీ పూజారులకు నూత్నార్థ పదకోశంగానూ..

వర్ణనా ప్రియులకు సర్వభావ పూర్ణముగానూ..

భాసించే ఈ కావ్యరాజమునకు

ధీటైన మరో కావ్యము నభూతో..ణ భవిష్యతి..!

.

కృష్ణదేవరాయలు 1474 ప్రాంతాల్లో పుట్టి, 1509లో రాజై,

అనేక దిగ్విజయాలు చేసి, 1515,16ల్లో విజయవాడకు వెళ్ళి, 

అక్కడికి దగ్గర్లో ఉన్న శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువుని సేవించేడు

(ఈ శ్రీకాకుళం విశాఖపట్టణం దగ్గరిది కాదు, విజయవాడ దగ్గరిది). 

--ఏకాదశి నాడు ఉపవాసం చేసేడు. 

ఆ పుణ్యదినాన, రాత్రి నాలుగో జామున ఆ “ఆంధ్ర జలజాక్షుడు” 

అతని కల్లో ప్రత్యక్షమయేడు “లేములుడిపెడు లేజూపు లేమ తోడ”. చిరునవ్వుతో ఇలా అన్నాడు 

.

“రసికులు మెచ్చేట్టు మదాలసచరిత్ర పలికేవు, భావం, ధ్వని, వ్యంగ్యం మేళవించి సత్యావధూప్రీణనం చెప్పేవు, వేదపురాణాల కథల్నేరి సకల కథాసారసంగ్రహం తయారుచేసేవు, శ్రోతల పాపాలు ఎగిరిపోయేట్టు జ్ఞానచింతామణిని వినిపించేవు, రసమంజరి మొదలైన మధురకావ్యాలు రచించేవు అన్నీ గీర్వాణభాషలో! 

ఇలాటి నీకు ఆంధ్ర భాష అసాధ్యమా? 

మాకు ప్రీతిగా ఓ కృతి నిర్మించు. నా అవతారాల్లో దేన్ని గురించి చెప్పాలా అని నీకు సందేహం రావొచ్చు.

.

కృష్ణావతారంలో సుదాముడిచ్చిన పూలదండలు వెనకాడుతూ తీసుకున్నాను అతను మగవాడాయె! శ్రీరంగంలో తను ముందుగా ధరించిన పూదండల్ని నాకిచ్చిన వయ్యారిని పెళ్ళి చేసుకున్నా ఆ కొరత తీరలేదు నాకు. 

నేను తెలుగురాయడిని, నువ్వో కన్నడరాయడివి. కనుక నువ్వు ఆ మా పెండ్లికథను చెప్తే అది పూర్తిగా తీరిపోతుంది. 

.

తెలుగెందుకంటావా? ఇది తెలుగుదేశం, నేను తెలుగువల్లభుణ్ణి, కలకండలాటి తియ్యటిది తెలుగు, ఎన్నో భాషల్లో మాట్టాడే నీకు తెలీదా అన్నిట్లోనూ ఉత్కృష్టమైంది తెలుగని! 

ఈ కృతిని నీ ఇష్టదైవమైన వెంకటేశ్వరుడికి అంకితం చెయ్యి మాకేం భేదం లేదు. 

ఇలా చేస్తే నీకు ఉత్తరోత్తరాభివృద్ధి కలుగుతుంది” అని ఆనతిచ్చేడు.

.

వెంటనే నిద్ర మేల్కుని, దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుని, 

తెల్లవారేక నిండుసభలో దండనాథ సామంతుల పనులు త్వరగా ముగించి 

వేదవేదాంగ వేత్తల్ని రప్పించి వాళ్ళకీ కల గురించి వివరించేడు రాయలు.

వాళ్ళు ఎంతో ఆనందించి ఆ స్వప్నాన్ని విశ్లేషించి దాన్లోని అన్ని అంశాలూ మంగళప్రదమైనవని తేల్చి సాహితీసమరాంగణ సార్వభౌముడైన అతను ఆంధ్ర మహావిష్ణుడు కోరిన విధంగా ఆముక్తమాల్యదని నిర్మించమన్నారు. అతను కూడా సంతోషంగా కావ్యరచనకి పూనుకున్నాడు. 

.

1521 నాటికి ఇది పూర్తయిందని పరిశోధకుల అభిప్రాయం. 1530లో రాయలు మరణించేడంటారు. )

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!