నమో‘ ‘చంద్రా‘! -సంస్కృత కళాశాలల దీనగాథ వినుమా! – ఏలూరిపాటి

నమో‘ ‘చంద్రా‘! 

-సంస్కృత కళాశాలల దీనగాథ వినుమా!

– ఏలూరిపాటి

విద్యార్థులు లేరని కళాశాల మూసివేయడం, ముసలి తల్లితండ్రులను గోదావరి పుష్కరాలలో వదిలి వేయడం, పాలు లేవని గోవును కబేళాకు పంపడం సమానం కాదా?

సంస్కృత కళాశాలలను మూసివేయాలని ముఖ్యమంత్రి అయిన మొదటి సారి

ఎన్ టి రామారావు కు కొందరు నూరిపోశారు. ఆయనకు చెప్పిన కారణాలు ఒకే ఒక్కటి. సంస్కృతం చదవడానికి పిల్లలు ఎవరూ రావడంలేదు. కనుక వీటిని ప్రభుత్వం వదిలించుకోవాలని సిఫార్సు చేశారు.

.అయితే తెలుగు, సంస్కృత భాషలపై మక్కువ ఉన్న రామారావు వీటిని అధ్యయనం చేయమని ఒక అధికారిని నియమించారు. 

అంతేకానీ ఆయన సంస్కృత కళాశాలలను తీసివేయలేదు.

కానీ, ఆయన చేసిన అద్యయనం వల్ల చాలా ఆసక్తికర విషయాలు, ప్రతిపాదనలూ ముందుకు వచ్చాయి. వీటిని అమలు చేయాలని నాటి ముఖ్యమంత్రి ప్రయత్నించినా, రాజకీయ కారణాల వల్ల ఆయన చేయలేకపోయారు. అంతేకాదు నేటికీ అవి అమలు కాలేదు. ఆ వివరాలు ఇవి.

1) చదవడానికి పిల్లలు లేరు అనడానికి కారణం చదివితే ఉద్యోగాలు రాకపోవడమే.

2) విద్యాప్రవీణా, భాషా ప్రవీణా పట్టాలు

3) నిధుల కొరత:

అస్తుబిస్తు మంటూ ఉన్న సంస్కృత కళాశాలలకు నిర్వహణ నిధుల కొరత ఉంది. 

చాలా కళాశాలలకు మౌలికమైన సౌకర్యాలు కూడాలేవు. 

కేవలం కెవికె సంస్కృత కళాశాల వంటి వాటికే మౌలికమైన వసతులు ఉన్నాయి.

.

ప్రభుత్వం మైనార్టీ సంస్థలకు అంగలార్చుకుంటూ వేల కోట్లాది రూపాయలు నిధులూ గ్రాంటులూ రూపంలో, విందు భోజనాలకు కోట్లాది రూపాయలూ వెదచల్లుతోంది కానీ, సంస్కృత పాఠశాలల్లో విద్యార్థులకు పిడికెడు మెతుకులు విదిల్చే కరుణ లేదు.

.

బహుశా సెక్యులరిజం అనే తద్దినం అడ్డం వచ్చి ఉంటుంది.

దీంతో ఆ కళాశాల ప్రిన్సిపాళ్లే నిధుల కోసం ఊరిలో చందాలకు తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. మరి కొన్ని యాజమాన్యాలు ఉపాధ్యాయుల గోళ్లూడగొట్టి వారి జీతాల నుంచీ నిర్వహణ నిధులు సేకరించేవారు. కుటుంబాలను రోడ్డు మీద పడేయలేక మౌనంగా ఉపాధ్యాయులు తమ జీతాలు సమర్పించుకుని గంజితాగి బతుకులీడుస్తూ వచ్చారు.

.

ఇప్పటి వరకూ మీకు చెప్పింది అతిముఖ్యమైన సమస్యలు మాత్రమే.

.

కేంద్రంలో మన ప్రభుత్వం వచ్చినందున ఈ కళాశాలలకు ఒరిగింది ఏమిటి?

.

ఈ సంస్కృత కళాశాలను కబేళాకు పంపుతున్నది ఎవరు?

.

అటు కేంద్రమైనా ఇటు రాష్ట్ర ప్రభుత్వమైనా కొడికడుతున్న కళాశాల దీపాన్ని కాపాడతాయా, తల దగ్గర దీపాన్ని వెలిగిస్తాయా?

.

బ్రాహ్మణోత్తములు డాక్టర్ కొలచల వెంకట కృష్ణమూర్తిగారు సంస్కృత భాషాభివృద్ధికి చేసిన దానాలు వృథా కావల్సిందేనా?

.

మరికొద్ది రోజుల్లో భూస్థాపితం కానున్న కళాశాలకు పునరుజ్జీవం కల్పించగలమా?

.

ఏం చేయాలో మీరే తేల్చుకోండి.

.

-ఏలూరిపాటి

/

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!