గిడుగు- గురజాడ స్నేహం .!

.

గిడుగు- గురజాడ  స్నేహం .!

.

శ్రీ గిడుగు రామమూర్తిగారు విజయనగరం మహారాజా కళాశాలలో

లోయ ర్  ఎఫ్ .ఏ లోచేరారు. .అంతవరకూ ఆయన ఏకళాశాసకు

వెళ్ళి చదువుకోలేదు.

మహారాజా కళాల ప్రిన్సిపాల్ చంద్ర

శేఖరశాస్త్రిగారింట్లో గురజాడని కలిశారు.

అప్పటినుంచివాళ్ళిద్దరిమధ్యాస్నేహంపెరగసాగింది.

మెట్రికె తరువాత అప్పారావుగారు చదువుని కొనసాగించారు

కానితండ్రి చనిపోవడంతో

గిడుగు కుటుంబానికి అండగా ఉండడం కోసం విశాఖ

కలెక్టరేట్ లో నెలకి పదిహేను రూపాయలతో ఆరు నెలల

పాటు ఓతాత్కాలికోద్యోగాన్ని చేసారు. ఇద్దరి 

మధ్య వ్యత్యాసం పదిహేనురోజులుతక్కువ 

సంవత్సవరం .పెరిగిన తరువాత వీళ్ళిద్దరూ ఆధునిక భాషా సాహిత్యాలకి పెద్ద పట్టుగొమ్మలవుతారని ఎవరూ అనుకోలేదు,ఆఖరికి

వాళ్ళు కూడా!

.

గిడుగు,గురజాడ ఎంతటి ఆత్మీయులయ్యారంటే...ఇద్దరూ చరిత్ర అధ్యాపకులైనా తాము చేసిన శాశన పరిష్కారన్నింటినీ గురజాడకి చూపించిగాని ఏపరిశోధనా పత్రికలోనైనా ప్రచురణకు పంపేవారుకారు.ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే గురజాడ చెప్పారనే గిడుగు భాషోద్యమాన్ని చేపట్టారు.ఆఖరులో గురజాడ గ్రాంధికంలో విద్యా బోధనలో తమ అసమ్మతిని తెల్పడానికి సబ్కమిటీకి

సమర్పించాల్సి వచ్చినప్పుడు ఆయన ఆరోగ్యం ఏమాత్రం సహకరించడంలేదు.అక్షరాల్ని కలం నిలిపి రాయలేకపోతున్నారు.టేబుల్ అవతల కూర్చున్న గిడుగుకి అందించలేని స్థితి.ఇష్టం వచ్చినట్లు రాసి అలాగే కిందకి వదిలేస్తే,కింద కూర్చున్న గిడుగు వాటిని

అందుకుని సాఫుప్రతి రాసి గురజాడద్వారా సబ్కమిటీకి సమర్పించారు.గురజాడ చనిపోయేముందు తనతో భాషోద్యమాన్ని వడిచి పెట్టవద్దని కోరారు కాబట్టే తరువాత25 సం.తను చనిపోయేవరకూ భాషోద్యమంతోనే గడిపారు.తమ ఆరోగ్యం దెబ్బతంటున్న రోజుల్లో భాషగురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు అందరూ ఆయనని పొగుడుతుంటే పట్టించుకోకుండా ఇప్పుడు మా అప్పారావు ఉంటే ఎంత ఆవందించేవాడో అన్నారట.

అదీ వాళ్ళ స్నేహం.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!