శ్రీ చైతన్య మహాప్రభు !

శ్రీ చైతన్య మహాప్రభు !

.

“ శ్రీ గురుగౌరాంగౌ జయతః ”-" హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరేహరే రామ హరే రామ రామ రామ హరే హరే " ”

-

చైతన్య మహాప్రభు రాధాకృష్ణ సంప్రదాయాన్ని పరాకాష్ఠకు తీసుకువెళ్ళిన ఒక మహా భక్తుడు. ఇతని జీవిత కాలం ఫిబ్రవరి 18, 1486 - జూన్ 14, 1534) జన్మస్థలం నవద్వీపం (ఇప్పటి నదియా). వల్లభుడు మథుర, బృందావన ప్రాంతాలలో రాధాకృష్ణ మతాన్ని ప్రచారంచేస్తున్న కాలంలోనే చైతన్యుడు బెంగాల్, ఒడిషాలలో అదే మతాన్ని ప్రచారం చేశాడు.

.

కృష్ణ ప్రేమను పంచుటకు అరుదెంచారు. సామూహిక హరినామ సంకీర్తనమునకు పితయును అయిన "శ్రీ చైతన్య మహా ప్రభువు" బెంగాల లోని నవద్వీపము లోని శ్రీధామ మాయాపురములో క్రీ. శ. 1407 శతాబ్దమున ( క్రీస్తు కాలమాన ప్రకారము ఫిబ్రవరి 1486 నంవత్సరమున) ఫాల్గుణ పౌర్ణమి సంద్యా సమయమున అవతరించిరి. శ్రీ చైతన్య మహా ప్రభువు తండ్రియైన జగన్నాథ మిశ్రులు సిల్హట్ జిల్లాకు చెందిన విద్వత్పూరుడైన బ్రాహ్మణుడు.చైతన్యుడి తల్లిదండ్రులకు మొదట ఎనిమిదిమంది సంతానం పుట్టడం, వెంటవెంటనే చనిపోవడం జరిగిన తర్వాత తొమ్మిదవ సంతానంగా విశ్వరూపుడు జన్మించాడు. అతడు చిన్నతనంలోనే సన్యాసం స్వీకరించి దక్షిణానికి వెల్లిపోయాడు. ఆఖరి సంతానం చైతన్యుడు. అతనికి తల్లిదండ్రులు పెట్టిన పేరు విశ్వంభరుడు. తెల్లగా మెరిసిపోతూ ఎంతో అందంగా ఉన్నందున అతడిని గౌరాంగుడు అని పిలిచేవారు. ఇది కాక ఇతడి తోటి పిల్లలు ""నిమాయి" అని పిలిచేవారు. సన్యాసం స్వీకరించిన తర్వాతనే "శ్రీకృష్ణచైతన్యుడు" అనే పేరు వచ్చింది.

.

గౌరాంగుడు చిన్నతనంలోనే సకల శాస్త్రాలూ, పురాణేతిహాసాలూ చదివి మహా పండితుడయ్యాడు. తర్కం, వ్యాకరణం అతని అభిమాన విషయాలు. 16వ ఏటనే నవద్వీపంలో అతడు పాఠశాల స్థాపించి, వందలాది విద్యార్థులకు తర్క, వ్యాకరణాలు బోధించాడు. సంస్కృతంలో ఒక వ్యాకరణ గ్రంథం కూడా రచించాడు. గౌరాంగుని 11వ ఏట తండ్రి చనిపోవడం జరిగింది. ఆయన శ్రాద్ధ కర్మలను నిర్వర్తించడానికి తన 23వ ఏట గౌరాంగుడు ఒకసారి గయ వెళ్ళాడు. అక్కడ ఒక విష్ణ్వాలయంలో పూజలు చేస్తుండగా అతని హృదయం భగవంతుని పట్ల అపార భక్తి భావంతో తన్మయుడయిపోయాడు. ఆ స్థితిలో అతడిని చూసిన ఈశ్వరపురి అనే సాధువు అతడు మహాభక్తుడు కాగలడని తలచి కృష్ణమంత్రోపదేశం చేసాడు.

ఆ సమయమున నవద్వీప ప్రాంతము విద్యాసంస్క్రతులకు కేంద్రమై ఉన్నందున ఆయన విద్యార్థిగా నవద్వీపమునకు చేరిరి. నవద్వీపములోని గొప్ప విద్వాంసులైన శ్రీ నీలాంబరి చక్రవర్తి యొక్క తనయయైన శచీదేవిని వివాహము చేసికొనిన తరువాత జగన్నాథముశ్రులు గంగాతటమునందు తమ నివాస మేర్పరుచుకొనిరి. జగన్నాథ మిశ్రుడు తన భార్యయైన శ్రీమతి శచీదేవి ద్వారా పలువురు పుత్రికలను పొందినను వారిలో దాదాపు అందరు పసివయస్సులలోనే మరణించిరి. చివరికి మిగిలిన శ్రీ విశ్వరూపుడు మరియు విశ్వంభరుడను పుత్రుల వలననే పిత్రు ప్రేమను చూపుటకు వారికి అవకాశము కలిగినది. సంతానమున కడపటివాడును, దశమ సంతానము అయిన విశ్వంభరుడే తరువాత నిమాయి పండితుడుగా పేరుగాంచారు. ఆ నిమాయ పండితుడే సన్యాసమును స్వీకరించిన పిమ్మట " శ్రీ చైతన్య మహా ప్రభువు"గా ప్రసిద్ధిగాంచారు.

.

ఆతడికి తరచుగా తన్మయ స్థితి కలిగేది. చివరి 12 ఏళ్ళు సగం సమాధి స్థితిలోను, సగం జాగ్రదావస్థలోను గడిపాడు. సమాధిలో ఉండగా కృష్ణ సంయోగ సుఖాన్ని, జాగ్రదావస్థలో కృష్ణవియోగ వేదనలోని సుఖాన్ని అనుభవించేవాడు.

.

చైతన్యుడు 1534, జూన్ 14న తన 48వ ఏట జగన్నాథాలయంలో పూజానిమిత్తం తలుపులు తెరుచుకుని లోనికి వెళ్ళినవాడు వెళ్ళినట్టే మహాప్రస్థానం చెందాడని ఒక కథనం. నదిలో స్నానం చేస్తుండగా అతడిని మామూలుగా ఆవరించే భగవత్తన్మయత్వంలో ఆ నీటిలో మునిగిపోయి తనువు చాలించడని మరొక కథనం.

.

చైతన్య సంప్రదాయానికి చెందిన వేదాంతాన్ని అచింత్య భేదాభేదవాదం అని అంటారు. మతపరంగా దానికి గౌడీయ వైష్ణవం అని కూడా పేరు.

చైతన్యుడి జ్ఞానమీమాంస మరియు ధార్మిక బోధనలు పదివున్నాయి. వీటినే "దశ మూల బోధనలు" అని వ్యవహరిస్తారు.

ధార్మిక గ్రంథాలు అయినటువంటి భగవద్గీత మరియు శ్రీమద్భాగవతం, గ్రంథాల ఆధారంగా క్రింది తొమ్మిది సత్యాలు స్థాపించబడినవి;

శ్రీకృష్ణుడు "మహా" మరియు "అనంత" 'సత్యం'.

శ్రీకృష్ణుడు దివ్యశక్తి (transcendental), జీవశక్తి (living entities), మరియు భౌతిక (material nature) శక్తులకు మూలము.

కృష్ణుడు రస సముద్రుడు.

జీవులులన్నిటికీ మూలవస్తువు కృష్ణుడే.

కొన్ని జీవులు భౌతికశక్తుల ప్రభావాలకు లోనవుతాయి.

ఇతర జీవుల దివ్యశక్తులు, భౌతిక విధానాలకూ మరియు శక్తులకు అతీతంగా వుంటాయి.

జీవులు మరియు భౌతికపరమయిన ప్రకృతి అచింత్య భేద అభేద, ఒకదానికొకటి అంతర్భాగమైనప్పటికీ, శ్రీకృష్ణుడి అంతర్భాగాలు కావు.

భక్తి లేదా కృష్ణుడి పట్ల పరిపూర్ణ భక్తి మాత్రమే ముక్తికి మార్గము.

శ్రీకృష్ణుడి పట్ల ప్రేమ అత్యున్నత లక్ష్యం.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!