Posts

Showing posts from December, 2015

అమరం చదవని వానికి నేను అమరను - సరస్వతీ దేవి!

Image
అమరం చదవని వానికి నేను అమరను - సరస్వతీ దేవి! . ‘అమరం చదవని వానికి నేను అమరను’ అని సరస్వతీ దేవి  వచనంగా ప్రచారంలో ఉన్న 'నామలింగానుశాసనం' అనే నిఘంటువుసుమారు రెండు వేల సంవత్సరాలకు పైగా  భారత భూమిలో ప్రచారంలో ఉన్నది. . సంస్కృతం నేర్చుకొనే ప్రతి విద్యార్థి అమరం వల్లెవేయటం ప్రాథమికమని  భావించబడిన మహా గ్రంథం ఇది. ఆయుర్వేద మహాశాస్త్రవేత్త ధన్వంతరి  కూడా ఈ నిఘంటువును రచించాడంటే ఈ నామలింగానుశాసనం యొక్క విశిష్టతను తెలుసు కో వచ్చు. . ’నామలింగానుశాసనం’ రచించిన అమరసింహుని పేరు మీదనే ఈ నిఘంటువు అమరకోశం అని ప్రాచుర్యం పొందింది. పదిహేను వందల సంవత్సరాల క్రిందటే చైనా భాషలోనికి కూడా అనువాదం పొందిన నిఘంటువు ఇది. అమరకోశం తనకు పూర్వం రచింపబడిన నిఘంటువుల నడుమ మహోజ్జ్వలమై నాటికీ నేటికీ ప్రకాశించే కోశరత్నం. అమర కోశానికి సంస్కృత ప్రచారానికీ శాశ్వతమైన అవినాభావ సంబంధం ఏర్పడింది. . ఈనాటికీ ప్రతి సంస్కృత విద్యార్థి ’యస్యజ్ఞాన దయా సింధో’ అనే ప్రార్థనా శ్లోకంతో మొదలుపెట్టి సంస్కృత అధ్యయనాన్ని ప్రారంభిస్తున్నాడు. ఈ విధంగా అమరకోశం సంస్కృత వాఙ్మయంలో శాశ్వత స్థానాన్ని సంపాది

అనిసెట్టి 'స్వీయచరిత్ర' అనే కవిత !

Image
అనిసెట్టి 'స్వీయచరిత్ర' అనే కవిత ! . 'మానవత్వ సూత్రాలు మననం చెయ్యడంకంటే  మందహాసంలో మంచితనం పంచిపెడితే చాలు'  విగ్రహంలా వెయ్యేళ్ళు బతకడం కన్నా  విద్యుత్తులా ఒక్కక్షణం వెలగడం మేలు. . కంటికి కనిపించని సత్యం మనస్సులో గోచరిస్తుందని  మనస్సుకు స్ఫురించానిది స్వప్నంలో సాక్షాత్కరిస్తుందని  స్వప్నాలకందని సత్యం మానవాంతరాత్మలో  మౌన సంగీతం ఆలపిస్తుందని ఆలకిస్తున్నాను, అర్థం చేసుకుంటున్నాను. తన తత్త్వాన్ని విస్పష్టం చేస్తూ - తన యౌవనంలో ప్రచండావేషాల ఊయలపై ప్రతిక్షణం స్వారీ చేస్తూ, విశ్వాన్ని వెక్కిరిస్తూ, వెర్రిగర్వంతో విర్రవీగాడు; అయితే విపరీతమీ యౌవనం, వేకువ రాకముందే వెళ్ళిపోయింది అని తెలుసుకొన్నాడు, వేకువరాగానే. . నాలోని మృత్యువును బంధించి మారణాయుదంలో చేర్చాను  నాలోని ప్రాణశక్తి విజ్రుభించి ప్రచండ జీవనోద్వేగంగా మార్చాను  .  సంహరించాను  పురాణాల రాక్షసులని  భూమిమీద క్రిముల్ని  బుద్ధిలో ముసిరే  దురాలోచనల్ని , అని చెప్పిన తీరు మాత్రం అందరినీ ఆకర్షించక తప్పదు. . అనిసెట్టి జీవన మహాయాత్రా పథంలో సర్వం సాధనకై ధారపోశాడు. తప్పొప్పుల .పట్టికలా

తెలుగులో మొదటి నీతి పుస్తకంసుమతి శతకం! .

Image
తెలుగులో మొదటి నీతి పుస్తకంసుమతి శతకం! . (రచన: వెల్చేరు నారాయణరావు.) . 1966లో ప్రచురించిన సుమతి శతకానికి పీఠిక రాస్తూ నిడదవోలు వెంకటరావు సుమతి శతకం మొట్ట మొదటి సారిగా ఆదిసరస్వతి ముద్రణాలయం వారు  1868 ఏప్రిల్ 20వ తారీకున ప్రచురించారు అని రాశాడు. తెలుగులో ఏ పుస్తకానికైనా ఇంత నిక్కచ్చిగా అది ప్రచురించబడిన సంవత్సరం, నెల, తేదీతో సహా తెలుసుకోవడం చాలా కష్టమైన విషయం.  దాదాపు 100 సంవత్సరాల క్రితం ప్రచురించబడిన ఇంత విలువైన సమాచారం వెంకటరావుకి ఎలా దొరికిందో ఆయన వివరించలేదు.  కానీ ఈ సమాచారాన్ని ఇంకొక ఆలోచన లేకుండా మచ్చా హరిదాసు  (తథ్యము సుమతి: పరిశోధన వ్యాసాలు, 1984, పే. 67),  ఆరుద్ర (సమగ్రాంధ్ర సాహిత్యం, 2002, సంపుటం 1, పే 224) తిరిగి చెప్పారు. కాని 1868 సంవత్సరపు ప్రచురణ నాకు ప్రపంచంలో ఏ గ్రంథాలయంలోనూ దొరకలేదు. ఇలాటి ముద్రణ తాము చూసినట్లు ఏ పరిశోధకుడు నాతో చెప్పలేదు.  అందుచేత 1870 సంవత్సరపు ప్రచురణనే సుమతి శతకానికి మొదటి ముద్రణగా నేను భావిస్తున్నాను. . 1930లో ప్రచురింపబడి Director of Public Instruction వారిచే మూడవ తరగతి పాఠ్య పుస్తకముగా ఆమోదించబడిన ‘ఆనంద వాచకమ

మను చరిత్రము లేదా స్వారోచిష మనుసంభవము1

Image
మను చరిత్రము లేదా స్వారోచిష మనుసంభవము1 .  అల్లసాని పెద్దన రచించిన ఒక ప్రబంధ కావ్యము. ఈ కావ్యం రచనా కాలం 1519-20 ప్రాంతం కావచ్చునని,  అప్పటికి పెద్దనకు 45 యేండ్ల వయసు ఉండవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. పింగళి లక్ష్మీకాంతం అభిప్రాయంలో "మనుచరిత్రము శాంత శృంగార రసములు సమ ప్రాధాన్యముతో సంగమించిన యొక తీర్థము. తత్కర్త సహజముగా శృంగార ప్రియుడు.  ఆ చిత్తవృత్తి శాంతాభిముఖమయినప్పటి రచన యిది. శృంగారానుభవ రుచి, శాంతనిష్ఠయు రెండును మనోగోళమునావరించియున్నప్పటికిని శాంతివైపు చిత్తము మరలుచున్నదనవచ్చును" అల్లసాని పెద్దన, కృష్ణదేవరాల ఆస్థానంలో ఆష్టదిగ్గజాలలో ఒకడు. .  మారన మార్కండేయ పురాణంలో 150 పద్యాలలో చెప్పిన విషయము. ఇది వరూధినీ, ప్రవరాఖ్యుల ప్రేమ కథతో మొదలై స్వారోచిషుని తో ముగుస్తుంది. కాశి నగరం దగ్గర ప్రవరుడనే పరమ నిష్టాగరిష్టుడైన బ్రాహ్మణుడు, అతనికి అనుకూలవతియైన భార్య ఉండేవారు. వారు అతిథులను ఎంతగానో ఆదరించేవారు. వారి ఇంటికి వచ్చిన ఒక సిద్ధుడు ప్రవరునికి ఒక మహిమాన్వితమైన పసరును ఇచ్చాడు. ఆ పసరు కాళ్ళకు పూసుకొని ఆ దివ్య ప్రభావం వలన ప్రవరుడు హిమాలయ పర్వతాలకు పోయి అక్కడి సుందర

లవణరాజు కల' గురజాడ అప్పారావు రచించిన పద్య కావ్యం.!

Image
లవణరాజు కల' గురజాడ అప్పారావు రచించిన పద్య కావ్యం.! . ఇతివృత్తం.! . లవణుడు కొలువుదీరి గారడీ చూడడం, ఒక తెల్లని గుర్రము పుట్టడం, అతను దాని మీద ప్రయాణము చేయడం, అది అంతటా తిరిగి ఒక అడవిలో పడగా ఒక చెట్టుతీగవల్ల క్రింద వాలడమూ, ప్రయాణ బడలిక వల్ల నిదుర చెందడం, అపుడిలా కలగాంచడం. అదియొక సంధ్యా సమయము. ఆకలితో వున్న లవణరాజుకు మధురగీతం వినిపించింది. లవణుడా వంక కెళ్ళాడు. ఒక సుందరి కనిపించింది. ఆమెపై మనసుపడి ఆమె ప్రేమను కోరి ఆరగించాడు. ఆమెను వివాహమాడి ఆ మాలపల్లెలోనే ఉన్నాడు. ఇంతలో మామ మరణించాడు. మాలవాడను మడ్డితన మల్లుకుంది. లవణదంపతులు అడవిని బట్టారు. సతీపతులు ఇద్దరూ చితిలో దూకారు. తరువాత లవణుడు మేల్కొని తన స్వప్నసుందరికై విచారింపసాగాడు. ఇంతలో ఆ స్వప్నసుందరి వచ్చింది. అందర్నీ అద్భుతాశ్చర్యాలు అలుముకున్నాయి. లవణుడు ప్రియా పరిశ్వంగములో ఒళ్ళు మరిచాడు. దీనిని గురజాడ బహు నిపుణంగా అద్భుత సన్నివేశాలతో నడిపాడు . కొన్ని పద్యాలు.! మలిన వృత్తులు మాలవారని కులము వేర్చిన బలియు రొక దే శమున కొందరు వెలికి దోసిరి మలినమే, మాల కులము లేదట వొక్క వేటున పసరముల హింసించు వారికి, కులము కలదట నరుల వ్

కొన్ని నిజాలు.!

Image
కొన్ని నిజాలు.! .  ఏమతం ? 1436 సంవత్సరములకు పూర్వము ఇస్లాం లేకుండెను. 2015 సంవత్సరములకు పూర్వము క్రైస్తవ మతములేకుండెను. 2500.సంవత్సరములకు పూర్వము బౌధ మతములేకుండెను. అలెగ్జాండరు భారతదేశం పై దండయాత్ర చేసిన తదుపరి, సింధూనది పరివాహక ప్రదేశమును "హిందూ " దేశముగా పిలవ బడెను ఇందు నివసించివారు హిందూవులుగా పిలువబడిరి. 5115 సంవత్సరములకు పూర్వము, ఈ భూభాగము, జంబూద్వీపములో భరతవర్షములో భరత ఖండముగా మేరుపర్వతమునకు (హిమాలయ) దక్షిణ దిగ్భాగమందున్నదని భారతీయులచే కీర్తింపబడుచుండెను. ఆ సమయమందు, ఈ భూభాగమందు వేదోక్త సనాతన సాంప్రదాయ జీవన విధానముండెను. 2085 సంవత్సరములకు పూర్వము, ఈ వేదోక్త సనాతన సాంప్రదాయమునుండి వివిధ శాఖలుత్పన్నమై, స్వతంత్ర మతములుగా ప్రభవిల్లెను. అవి.... బౌధ్ధ, జైన, చార్వాక, గాణపత్య శాక్తేయ, పాశుపత, వీరశైవ ఇత్యాది స్వతంత్రమతములు, వాటినిర్మాతలు, సాహిత్యము, బలమైన సాంప్రదాయములు, జీవనవిధానము, పరస్పరవిబేధములు, నిందలు, దూషణలు, ఆధిపత్య పోరులు కొనసాగుచుండెను. మరలా 1194 సంవత్సరములకు పూర్వము, ఆదిశంకరాచార్యులవలన. ఈ విరోధాభాసములు నిర్జింపబడి, కేవలము, వేదోక్త సనా

కర్నాటక సంగీతం.!

Image
కర్నాటక సంగీతం.! . కర్నాటక సంగీతంలో గాత్రానికి సహకారంగానూ,స్వతంత్రంగానూ కొన్నివాద్యాలని వాడ్తారు. . .1.తంత్రీ వాద్యాలు.వయొలిన్, వీణ వంటివి.(stringed instruments) 2.సుషిర వాయిద్యాలు;వేణువు,సన్నాయి వంటివి ( wind instruments )  3.అనవద్ధ వాద్యాలు.(percussion instruments) మృదంగం ,డోలు వంటివి. ఈ రోజుల్లో క్లారినెట్.మాండొలిన్,శాక్జొఫోన్ వంటివి కూడా వాడుతున్నారు. . వాగ్గేయకారులు (composers) ;--  . 1.పురందరదాస(1484-1564) కన్నడంలోను,సంస్కృతంలోను ఎన్నోవేల కీర్తనలు రచిస్తే ఇప్పుడు లభ్యమౌతున్నవి 2000. 2.కనకదాస;-- (1509-1609 )కన్నడంలో 1000 కీర్తనలు 3.అన్నమాచార్య ;-- 30000దాకా రచించినట్లు ప్రతీతి.కాని నేడు 3600 కీర్తనలు మాత్రం లభ్యం.తెలుగులోను,కొన్ని సంస్కృతంలోను రచించాడు . 4.అరుణగిరినాథ;-- తమిళంలో దాదాపు 1500 రచనలు చేసాడు.(15 వశతాబ్దం.) 5.భద్రాచల రామదాసు ;-- (1620-1688) తెలుగులో500 కీర్తనలు రచించాడు.దాశరథి శతకకర్త కూడా. 6.క్షేత్రయ్య;-- (1600-1680)తెలుగులో100 పదాలు రచించాడు 7.నారాయణతీర్థ;- (1650-1745) తెలుగు,సంస్కృతంలో 200 రచనలు 8.సారంగపాణి;-- (1680-1750) తెలుగ

నీ సైటు నాడిలైటు;

Image
నీ సైటు నాడిలైటు; నిన్ను మిన్న కానకున్న క్వైటు రెచడ్ ప్లైటు మూనులేని నైటు. ఫుల్లుమూను నైటటా, జాసమిన్ను వైటటా, మూను కన్న మొల్ల కన్న నీదు మోము బ్రైటటా టా! టా! టా!...... (గురుజాడ వారి కన్యా శుల్కం నుండి.)

ఈ రెడ్ కలర్ టపాకాయ్ కాలిస్తే పెద్దగా సౌండ్ వస్తుందా..? .

Image
చింటు: అమ్మా, ఈ రెడ్ కలర్ టపాకాయ్ కాలిస్తే పెద్దగా సౌండ్ వస్తుందా..? . తల్లి: ఒరేయ్ సచ్చినోడా, అది గ్యాస్ సిలిండర్ రా!”

మా నివాళి.

Image
ఏప్పుడైనా.. ఎవరి ప్రాణమైనా.. అలా నడుచుకుంటూ.. వెళ్లిపోవడం చూశావా..  చూడు నిర్లక్ష్యంగా నా ప్రాణం వెళ్లి పోతోంది..  ( తుమ్ నే కిసీకా జాన్ కో జాతే హుయె దేఖా హై.. వో.. దేఖో ముంజ్ సే రూఠ్ కర్ మెరి జాన్ జా రహేహై..  మహమ్మద్ రఫీ,, షమ్మీకపూర్ - చిత్రం రాజ్ కుమార్ )  అన్న పాటను నిజం చేస్తూ.. నిజంగానే.. సాధన వెళ్లిపోయింది..  . మా నివాళి. Sadhana jee RIP(died yesterday, 25 Dec 2015) You were a wonderful actress and a wonderful person! We will always remember you.... https://www.youtube.com/watch?v=GwfqaXbobDI

మాగాడిమాయరోగం!

Image
మాగాడిమాయరోగం! . స్త్రీ ఫలానా పురుషుడి భార్యగా గుర్తింప బడటానికి గర్విస్తుందేమో కానీ..... మగవాడు మాత్రం - ఫలానా స్త్రీ భర్తగా గుర్తింప బడేకంటే ....చావడం నయం అనుకుంటాడు ..... . భార్యా భర్తలు ఇద్దరూ  సమానమైన , పేరు ప్రతిష్ఠలు కలిగి ఉంటే అది వేరే సంగతి.  . "ఇద్దరిలో ఎవరిది ఆధిక్యత-అంటే భార్య తల వంచినట్లుగా , భర్త తలవంచలేడు . బహుశా మగవాడికి ఈ అహంకారం ప్రకృతే ప్రసాదించి వుంటుంది......"

||అవ్యక్తానుభూతి|

Image
||అవ్యక్తానుభూతి|| సుధారాణి గుండవరపు|| . నా చూపువు నీవై నిలచిన వేళ... నా శ్వాసవు నీవై సాగిన వేళ... నా తనువు ను తాకే స్పర్శవు నీవైన వేళ... నా చెవులను చేరవచ్చిన సంగీతం నీవైన వేళ... నా మాటల పాటలో పద పల్లవులు నీవైన వేళ... ఈ నా ప్రకృతి తనని తాను మరచి నెమలి లా పురివిప్పి ఆడినట్లు... వసంత కోకిల కోటిరాగాలు కూసినట్లు... గ్రీష్మ తాపం చల్లార్చేందుకు శరదృతువులో స్వాతిచినుకులు కురిసినట్లు... హేమంత తుషారపు జల్లులు పరచినట్లు... అవ్యక్తానుభూతులు జీవనదులై పరవళ్ళు త్రొక్కుతున్నట్లు... ఈ భావావేశం మాటల రూపం లో ఇలా అల్లుకుంటున్నాయి... ఇవి నీవే...ఇది నీవే... కర్తవు నీవే... కర్మవు నీవే... క్రియవు నీవే... నేను సాక్షిని మాత్రమే...

Tera Mera Pyar Amar - Asli Naqli

Image
My most favourite song, great music and beautiful actress Sadhna with all time great Devanand. Shanker Jaikishan great. ·  tera mera pyar amar, phir kyo mujhko lagta hai dar tera mera pyar amar, phir kyo mujhko lagta hai dar mere jivan saathi bata, dil kyo dhadake rah-rah kar kya kaha hai chand ne, jisko sunke chandani har lahar pe jhumake, kyo ye nachane lagi chahat ka hai harsu asar, phir kyo mujhko lagta hai dar tera mera pyar amar, phir kyo mujhko lagta hai dar kah raha hai mera dil, ab ye raat na dhale khushiyo ka ye silasila, aise hi chala rahe tujhko dekhu dekhu jidhar, phir kyo mujhko lagta hai dar tera mera pyar amar, phir kyo mujhko lagta hai dar hai shabab par umang, har khushi javaan hai meri dono baho me, jaise aasman hai chalti hu mai taro par, phir kyo mujhko lagta hai dar tera mera pyar amar, phir kyo mujhko lagta hai dar https://www.youtube.com/watch?v=ZRqcR-7TbCE

మిత్ర బేదం లో నావుడు , అనవుడు..ఎవరు

Image
తెలుగు లో బాష ప్రవీణ చేసాడుట ఒక కుర్రవాడు....  అతను నన్ను అడిగిన ప్రశ్న..  పరవస్తు చిన్నయ సూరి గారి మిత్ర బేదం లో నావుడు , అనవుడు..ఎవరు వారితో  కధకు సంబధం ఏమిటి నాకు తెలియుట లేదు.. మీరు వివరింప గలరా... అంటే నేను అవాక్కు అయ్యెను...  Sambhara Venkata Rama Jogarao.గారి చమత్కార సమాధనం  .  ఆర్యా, శుభోదయ నమస్కారములు తెలుగు పండితుల వారి ప్రశ్నకు సమాధానము ఇది నావుడు, అనవుడు కరటక దమనకుల బిడ్డలు. నావుడు కరటకుని కుమారుడు అనవుడు దమనకుని పుత్రుడు. వీరిరువురు మారీచ సుబాహువుల ముని మనుమలు  కరటకుడి కొడుకు నావుడు నావుడి భార్య కింతు  దమనకుడి కొడుకు అనవుడు అనవుడి భార్య పరంతు  నావుడు కింతు ల సంతానము పశ్చాత్  అనవుడు పరంతు ల సంతానము భవతి భవంతు  ఇంకా ఇంకా చాలా వుంది లెండి. జోగారావు

అందరికీ మెర్రీ క్రిస్మస్ !

Image
.... అందరికీ మెర్రీ క్రిస్మస్ !

మన ఘంటసాల !

Image
మన ఘంటసాల ! తెలుగు వాడికి తెల్లవారితే 'దినకరా శుభకరా' ;  మధ్యాహ్నం బాధ కలిగితే ఓదార్చే 'భగవద్గీత' ;  సాయంత్రం వేడుకైతే 'పడమట సంధ్యా రాగం, కుడి ఎడమల కుసుమ పరాగం' ;  రాత్రి 'కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది' , అలా కానప్పుడు 'నడిరేయి ఏ జాములో'' ... 'నిద్దురపోరా తమ్ముడా' ....'కల ఇదనీ నిజమిదనీ తెలియదులే' ,  అంతలోనే తెల్ల వారితే 'నిన్న లేని అందమేదో నిదుర లేచెనెందుకో' అన్న సందేహంలో సంతృప్తి - ఇవన్నీ ఆయన ప్రసాదించిన వరాలే. తెలుగు విద్యార్ధికి 'ప్రేమ తమాషా వింటేనే కులాసా' . కానీ 'పది మందిలో పాట పాడితే అది అంకితమెవరో ఒకరికే' అన్న సుతి మెత్తని బెత్తం దెబ్బా! తొందర పాటు నిర్ణయాలకు పోతుంటే 'కల కానిది విలువైనది బ్రతుకు- కన్నీటి ధారలలోనే బలి చేయకు' అన్న అక్షర లక్షల 'థెరపీ', ఆవేశం వస్తే 'ఆవేశం రావాలి' కానీ 'ఆవేదన కావాలి' అన్న మందలింపూ, ఆందోళనకు దిగితే 'తెలుగు వీర లేవరా' అన్న అదిలింపూ, ఎవరికి వారయి విడిపోతుంటే 'ఎవ్వరి కోసం ఎవరున్నారు పొండిరా పొండి' అన్న

మన ఇతిహాసాలు - తెలుగు సినిమాలు! భారతము:

Image
శ్రీ జాజి శర్మ..గారి కి కృతజ్ఞతలతో... . మన ఇతిహాసాలు - తెలుగు సినిమాలు! భారతము: "మాయాబజార్" సినిమా: మన తెలుగు దృశ్యకావ్యము "మాయాబజార్" (విజయావారిది) సినిమా పూర్తిగా కల్పితము. ఈ కధావృత్తాంతము అంతా శ్రీపింగళి గారి అపూర్వ సృష్టి. వ్యాసభారతములో దీని ప్రస్తావనలేదు. వ్యాసభారతము ప్రకారము అసలు బలరామునికి శశిరేఖ అనే కూతురు లేనేలేదు. ఆ లేని శశిరేఖను సృష్టించి కధ మొత్తము పాండవులు లేకుండా నడిపించారు విజయావారు. శ్రీకృష్ణపాండవీయము: శ్రీకృష్ణపాండవీయము లో శకుని పాత్ర కొండవీటివెంకటకవి (సినిమా టైటిల్స్ లో కధ శ్రీరామారావుగారని ఉంది) మరో రకంగా చిత్రీకరించారు. చిత్రకధప్రకారము: భీముడు సుయోధనుడి సమక్షములో కౌరవులను "గోళకులు" అని సంభోధిస్తాడు. గోళకులు అంటే "భర్త పోయిన స్త్రీకి జన్మించిన వారు" అని అర్ధము. దీనికి సుయోధనుడు, వ్యాసుని నిజం అడుగుతాడు. అది నిజమేనని వ్యాసుడు చెప్పినట్లుగా మరో అసందర్భమైన కధ ఆ చిత్రములో చొప్పించారు. ఈ కధ వ్యాస భారతములో లేదు. ఇది ఎక్కడ నుండి సేకరించారో కనీసం నిర్మాతలు "టైటిల్స్" లో చూపించలేదు. వారి కధ ఇలా వుంది. 

స్త్రీ స్వేచ్ఛకు నిజమైన అర్థమిదేః

Image
స్త్రీ స్వేచ్ఛకు నిజమైన అర్థమిదేః బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతీ రామకృష్ణను ఎరుగని తెలుగు లోగిలి లేదనడం అతిశయోక్తి కాదు. నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో యజమానురాలు, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు, గృహిణి... ఇలా నిజ జీవితంలో విభిన్న పాత్రలను పోషించి ఆయా రంగాల ప్రముఖులచే భేష్ అనిపించుకున్న ఘటికురాలు. స్త్రీ స్వేచ్ఛపై తన అభిప్రాయాలను సుస్పష్టంగా చెప్పారామె. మహిళా స్వేచ్ఛ అంటూ చాలామంది రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంటారని డాక్టర్ భానుమతి పేర్కొంటూ, ఎవరినీ లెక్కచేయక విచ్చలవిడిగా తిరుగుతూ నిర్లక్ష్య ధోరణి గలవారు ఒకరైతే... పురుషాధిక్యానికి గురై అమాయకత్వంతో కూడిన అజ్ఞానంతో కష్టాలు పడే మహిళలకు విముక్తినివ్వాలని సీరియస్‌గా వాదించేవారు ఇలా రెండు రకాల మహిళా స్వేచ్ఛావాదులు ఉన్నారంటారు. అయితే "మట్టిలో మాణిక్యం" చిత్రంలో తాను రూపొందించిన లలిత పాత్ర. స్త్రీ స్వేచ్ఛకు నిజమైన అర్ధం అంటారు డాక్టర్ భానుమతి. మహిళ తనకంటూ స్వంత వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకొని, తన పరిమితులను తానెరిగి, జీవిత భాగస్వానిగా, అమ్మగా, పరిపూర్ణ స్త్రీగా బాధ్యతలను నిర్వర్తిస్తూ ఆత్మాభిమానాన్ని కోల్పోకుండా ముందడుగు వేయా

అభయమిమ్ము అష్టమూర్తి

Image
సృష్టిమొదట నీవుగలవు సృష్టి పిదప నీవు గలవు సృష్టి జరుగ నీవుగలవు సృష్టి లయకు నీవు గలవు సృష్టి భవ అంబు రూప అభయమిమ్ము అష్టమూర్తి ..

నడుస్తున్న వంటగదిలో ఉపగదులు

Image
నడుస్తున్న వంటగదిలో ఉపగదులు  . ఎక్కడో అక్కడ కనిపించే మొల్ల, వెంగమాంబ, ముద్దుపళని, రంగాజమ్మ మొదలైన నలుగురైదుగురు స్ర్తీల పేర్లు తప్ప ఆదికవి నన్నయ దగ్గరనుంచి ఆధునిక యుగం వరకు కవిత్వ ప్రపంచ సర్వస్వం పురుషాధీనమే. వేదయుగంలో మంత్ర ద్రష్టలుగా, స్రష్టలుగా గార్గి, మైత్రేయి వంటి మహిళల పేర్లు వినిపించినా మధ్య యుగంలో మాత్రం సమాజంలో గాని, సాహిత్యంలో గాని పడతుల ప్రాతినిధ్యం, ప్రభావం శూన్యం.  తాళ్ళపాక తిమ్మక్క, ముద్దుపళని, రంగాజమ్మ, వెంగమాంబ మొదలైనవాళ్ళు కవయిత్రులుగా ప్రసిద్ధి కెక్కినా ఆ తర్వాత ఆడవాళ్ళకు మళ్ళీ అంధకార యుగమే. ఆడవాళ్ళకు చదువు ఎందుకు అన్నారు. ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళేలాలా అని తర్కించారు. కొన్ని శతాబ్దాలపాటు వెనక్కి నెట్టేశారు. చీకట్లో వేగు చుక్కల్లా స్రీల జీవితాల్లో సంఘ సంస్కర్తలు బయలుదేరి ఆశల నక్షత్రాలు వెలిగించారు. చదువుల చందమామ ఉదయింపచేశారు. . 19వ శతాబ్దంలో కందుకూరి, గురజాడ మొదలగువారు జన్మించి స్ర్తీ విద్యను ప్రోత్సహించారు. ‘ముదితల్‌ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్‌’ అన్నారు. ‘స్ర్తీ కి శరీరం ఉంది. దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకు మెదడు ఉంది. దానికి జ్ఞానం ఇవ్వాలి

"నేను శ్రీశ్రీని. ఈ శతాబ్దం నాది"

Image
ఒక సారి శ్రీ శ్రీ గారు రైలు లో ప్రయాణం చేస్తున్నారు.టిక్కెట్ లేదు శ్రీశ్రీ వంతు వచ్చింది.. ఇది గమనించి "ఎవరు మీరు" అన్నాడు టి.సి. "భూతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ్య గీతాన్ని నేను" "కవిత్వంలో దేనికి? తెలుగులో చెప్పరాదుటయ్యా" అన్నారెవరో. "నేను శ్రీశ్రీని. ఈ శతాబ్దం నాది" "కావచ్చు. కాని ఈ రైలు శ్రీ సర్కారు వారిది" అన్నాడు టి.సి.. "మొన్నటి దాకా తెలుగు సాహిత్యం నన్ను నడిపింది. ఇప్పుడు దాన్ని నేను నడుపుతున్నాను..." "అవచ్చు. కాని ఈ రైళ్ళని ఇండియన్ రైల్వేస్ వారు నడుపుతున్నారు" "ఔను నిజం, ఔను సుమా నీవన్నది నిజం నిజం" అనేసి శ్రీశ్రీ సీటుమీద కూచుని, నిట్టూర్చి డబ్బులు తీసేరు.

శివుడు.!

Image
శివుడు.! . (నెట్ లో దొరికిన ఒక మంచి కవిత.) ఇసుక రేణువులోన దూరియుందువు నీవు బ్రహ్మాండమంతయును నిండియుందువు నీవు చివురాకులాడించు గాలిదేవర నీవు ఘన కానలను గాల్చు కారుచిచ్చువు నీవు క్రిమికీటకాదులకు మోక్షమిత్తువు  నీవు కాలయమునిబట్టి కాలదన్ను నీవు పెండ్లి జేయరాగ మరుని మండించినావు పెండ్లియాడి సతికి సగమిచ్చినావు దక్షయాగము ద్రుంచి సురలందరిని గొట్టి వికటాట్టహాసమున భయపెట్టినావు కడలి చిలుకు వేళ కాలకూటము బుట్ట దాని త్రావి సురల గాచినావు  ఈ తిక్క శివునితో వేగలేననుచూ ముక్కంటి కోపాన్ని ఓపలేననుచూ  వదిలిపోదమన్న వేరు దైవము లేదు .

ఉండాలోయ్ ఉండాలి.!

Image
ఉండాలోయ్ ఉండాలి.! . (భానుమతి గారు నవంబరు 1947 చందమామలో పాపాయిల కోసం రాసిన ఓ బుజ్జిగీతం.) . ఫిలింకు పాట పిల్లలకు ఆట రాజుకు కోట ఉండాలోయ్ ఉండాలి అత్తకు నోరు దేవుడికి తేరు స్టారుకు కారు ఉండాలోయ్ ఉండాలి స్టేజీకి తెర కత్తికి ఒర చేపకు ఎర ఉండాలోయ్ ఉండాలి యింటికి అమ్మ నిమ్మకి చెమ్మ కొలువుకి బొమ్మ ఉండాలోయ్ ఉండాలి తలుపుకి గడి దేవుడికి గుడి అవ్వకు మడి ఉండాలోయ్ ఉండాలి జూదరికి పేక గొడ్లకి పాక గాంధీకి మేక ఉండాలోయ్ ఉండాలి అరవలకు పొగాకు ఆంధ్రులకు గోగాకు మళయాళులకు తేయాకు ఉండాలోయ్ ఉండాలి

పొరుగింటి పుల్లకూర రుచికాదా...

Image
. పెళ్లానికి కలలో కూడా కాంప్లిమెంట్ ఇవ్వరు గానీ,  ఇక్కడ లేడీ ఫోటో కనిపిస్తే చాలు.. ఆహో, ఓహో, సూపర్, గీపర్అంటారు .. పొరుగింటి పుల్లకూర రుచికాదా...
Image
చిటపట చినుకులు పడుతూ ఉంటె చెలికాడే సరసన ఉంటె. ప్యార్ హువా ... ఇకరారు హువా

ఆహా... ఎంతటి అందమైన ముగ్గు...!

Image
పదహారణాల తెలుగమ్మాయి, ముగ్గు, ముత్యాల ముగ్గు.! . తీరైన తన నడకతొ లయబద్ధంగా సవ్వడి చేస్తున్న పట్టీలు నా చూపుని తన వైపు మరల్చాయి... సింధూరం, పసుపు పచ్చల పట్టు పరికిణీని మునివేళ్ళతో కొంచెం పైకి లాగి తను కలియతిరుగుతుంది వాకిట దేని కోసమో వెతుకుతూ... ఏదో కనుగున్నట్టు ఇంట్లోకి పరుగెట్టింది... . ముగ్గు గిన్నెతో తను బయటకొచ్చింది పైటను నడుముకు చుట్టుకుని, పరికిణీ సర్దుకుని ఒంటి కాలిపై భారం మోపి, కూర్చుంది ముగ్గుపెట్టటానికి... నేను అలానే చూస్తున్నాను... . తన వేళ్ళు ఏదో మాయం చేస్తున్నట్టు చక చకా చుక్కలు పెట్టుకుంటూ వెళ్తున్నాయి . నింగిలో చుక్కలు నేలపై ఆమె వేలు జారిన చుక్క చుక్కలో పోలికలు వెతుక్కుంటు మురిసిపోతున్నాయి ఎంచక్కా... అదే పనిగా... చంద్రుడు లేడని గుసగుసలాడుతున్నాయి అది విని నెలరాజు మోము చిన్నబోయింది, రోజు తనతో ఊసులాడే చిన్నది తనని ఈరోజు మరచిపోయిందని... . ఆహా... ఎంతటి అందమైన ముగ్గు...! చంద్రుడు చిన్నబోవటంలో అర్ధం వుందనిపించింది... ముగ్గుని చూసుకున్న ఆనందంతో తన కళ్ళు మెరిసాయి పెదవులపై నవ్వులు విరిసాయి ఆ నవ్వులో తడిసిన ముగ్గు ముత్యాల ముగ్

తిరుమల విమాన వేంకటేశ్వర స్వామి.!

Image
తిరుమల విమాన వేంకటేశ్వర స్వామి.! పూర్వం తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయ అర్చకులు తొమ్మిదిమంది , స్వామివారి ఆభరణాలను ధరించారు. అది స్వామివారి దర్శనానికి వచ్చిన విజయనగర రాజు కంటపడింది. దాంతో ఆ రాజుకు ఆగ్రహం ముంచుకొచ్చింది. తొమ్మిదిమంది అర్చకులనూ విచక్షణా రహితంగా అక్కడికక్కడే చంపేశాడు. నరహత్య మహాపాపం అనుకుంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా తొమ్మిదిమందిని హత్య చేశాడు రాజు. పైగా పవిత్ర దేవాలయంలో హత్య చేశాడు. అది సామాన్య దోషం కాదు. మహా పాపం. ఆ పాప పరిహారం కోసం వ్యాసరాయలు ప్రయత్నించారు. పన్నెండేళ్ళ పాటు భక్తులెవర్నీ ఆలయంలోనికి అనుమతించలేదు. వ్యాసరాయలవారు గర్భగుడిలో ప్రవేశించి, పాప నివృత్తి అయ్యేందుకు కఠోర దీక్షతో పూజలు నిర్వహించారట. ఆ పన్నెండేళ్ళ కాలంలో భక్తులకు గర్భగుడిలో ఉన్న మూలవిరాట్టును దర్శించుకునే భాగ్యం కలగలేదు కానీ, అందుకు ప్రతిగా ఆనంద నిలయ విమానం మొదటి అంతస్తులో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇలా ప్రతిష్టించిన వేంకటేశ్వర స్వామివారి విగ్రహం ఉత్తర వాయువ్యంలో ఉంటుంది. అప్పుడు ప్రతిష్టించిన స్వామివారి విగ్రహమే విమాన వేంకటేశ్వర స్వామి. అప్పుడు స్వామివారికి బదులుగా ప్రతిష్టిం

పెళ్ళి

Image
పెళ్ళి మొన్న రెండు కుటుంబాల కలయిక, నిన్న రెండు మనసుల కలయిక, నేడు రెండు మనీపర్సుల కలయిక.

అమెరికా పిల్లలు!

Image
అమెరికా పిల్లలు! (శ్రీ రావి రంగారావు గారు.) . అమెరికా పిల్లలు ఒక లక్ష్యంతో  మనం వదిలిన బాణాలు  మన పిల్లలు... అంతే... అవి తిరిగి రావు.

జీవన గొడుగు!

Image
జీవన గొడుగు! (రాజేందర్ గణపురం ) . ............... అడుగులో అడుగేసి ఏడడుగులు నాతో వేసి.. తాళి కోసమే తలవంచి నా..తలను పదిమందిలో పైనుంచి..! ఏడు జన్మలంటూ ఈ జన్మనుండే చిటికన వేలు బట్టి..! అర్ధాంగి వై అగ్ని చుట్టు ప్రమాణంచేసి నాజన్మతో జతగలిపి ఈజన్మంత జత నిలిచి నా ఆనందానికి అర్దాంగివై నా చిరునవ్వు కు ప్రమిదవు నీవై.... కష్ట నష్టాలలో కన్నీటికి నేస్తానివై సుఖ దు:ఖాలలో సుధారాశిపై....! ఆకలికి అమ్మవై నడిజామున కోమలివై నా కోపానికి ఓపిక నీదై..! కష్టపెట్టినా ఇష్టమే నంటు నీ కంటా తడి వచ్చినా ఇంటిగుట్టు ఇల్లంటు..! నన్నునన్నుగా ఇన్నేల్లు నన్నంటి వెన్నంటి సాదక బాదకలో సరి జోడువై..! నీవు ఆనందిమచినది ఎంతో నాకు తెలియదుగాని..! చివరిగా నీకు నే నేమిచ్చుకోను చెలి ఈ గొడుగు క్రింద చోటు తప్పా....?

Ideas చాలా మందికి వస్తాయి

Image
Ideas చాలా మందికి వస్తాయి కాని ఎవడైతే ముందుగా Execute చేస్తాడో  వాడే దానికి Owner అవుతాడు ..  మిగతా వాళ్ళంతా Followers అవుతారు .

మీకు తెలుసా ...

Image
మీకు తెలుసా ....  . గణ పతి భార్యలు సిద్ధి ,బుద్ధి . కుమారస్వామి భార్యలు వల్లీ ,దేవసెనలు . వీరు శబ్ద వాచ్యులు ,శక్తి స్వరూపులే కాని , స్త్రీ సుఖం ఇచ్చిన వారు కాదు . .  భ్రాంతిలో ఉన్న దాంపత్యం ఇది .

బుడుగో ! బుడుగు !!

Image
బుడుగో ! బుడుగు !! . గిడుగు ఉత్తరధ్రువం పర్యటనకు వెళ్ళొచ్చాడు. మర్నాడు సాయంత్రం తన స్నేహితులతో యాత్రా విశేషాలు చెబుతున్నాడు. "అక్కడ ఎంత చల్లగా ఉందంటే....మేం సిగిరెట్ ముట్టించడానికి అగ్గిపుల్ల వెలిగించగానే మంట గడ్డ కట్టుకుపోయేది ఎంత ఊదినా ఆరేది కాదు" అని ఆగాడు. . ఇంతలో పక్కనే ఉన్న మన బుడుగు "అందులో గొప్పేం ఉంది. మేం వెళ్ళినప్పుడైతే పరిస్తితి మరీ ఘోరంగా ఉండెది. మా నొట్లోంచి శబ్దం రావడం ఆలశ్యం, మాటలన్నీ గడ్డ కట్టుకుపోయేవి. ఆ తర్వాత మా తిప్పలు తిప్పలు కావు. ఆ మాటలన్నింటినీ జాగర్తగా ఏరుకుని వెచ్చబెట్టే దాకా ఎవరు ఏం మాట్లాడారో తెలిసేది కాదు" . అని చెప్పాడు ఇంకాస్త బడాయిగా x

వసు చరిత్ర"

Image
భట్టుమూర్తి వ్రాసిన "వసుచరిత్రలోది ఈ పద్యము.వాసు రాజు వ్యాహ్యాళి కై వచ్చి ఒక చోట విశ్రమించినాడు. అప్పుడు ఎక్కడి నుండియో మధుర గానము వినపడెను.ఎవరో ఒకయువతి మధురముగా పాడుతూ వుంది. అప్పుడు ఆ రాజు తన వెంట వచ్చిన వయస్యుని (మిత్రుడిని)ఎవరిదీ గంధర్వగానము?పోయి చూచిరా అనిపంపించాడు.ఆ మిత్రుడు వెళ్లి చూసి వచ్చి ఆమె సౌందర్యమును యిలా వర్ణించాడు. కమనీయాకృతి యోగ్య కీర్తనలం గన్పట్టు నా శ్యామ, యా  సుమబాణాంబక, యా యమూల్య మణి, యా చొక్కంపు పూబంతి యా  సుమనోవల్లరి,ఆ సుధా సరసి యా సొంపొందు డాల్దీవి యా  కొమరు బ్రాయంపు రంభ, ఆ చిగురుటాకుంబోడి నీకేతగున్  అర్థము:--ఆమె కమనీయ రమణీయ అవయవ సౌందర్య యౌవ్వనము,ఆమె మన్మధ బాణముల వంటి కన్నులు గలది.(అరవింద,మశోకంచ,చూతంచ,నవమల్లికా, నీలోత్పలంచ పంచైతేపంచ బాణస్యసాయికా ఈ  ఐదూ మన్మధుని బాణాలు)పద్మరాగ మణి వంటి పెదవులు కలది.పూదీగేల వంటి చేతులు గలది,అమృత సరస్సు వంటి నాభి గలది,చొక్కమైన పూబంతుల వంటి కుచములు గలది,చిగురుటాకుల వంటి పాదములు గలది,అంతేకాక సన్నని దేహము గల్గి మన్మథ బాణము,అమూల్యమైన మణి పూబంతి  వంటి యింతి ;పూలతీగే అమృత సరస్సు,కాంతి,దేవి యౌవనవతి,రంభ వంటిది చి

సంస్కృతం తరగతి !

Image
సంస్కృతం తరగతి నడుస్తోంది అధ్యాపకుడు విభక్తి , వచనములు వివరిస్తున్నాడు . " రామ " శబ్దము ఉదాహరణగా తీసుకుందాం ...  రామః .....రామౌ.... రామాః  అంటే తెలుసుగదా ,  రాముడు .... (ఇద్దరు ) రాములు ......(అనేక) రాములు సంస్కృతములో ఏక వచనము , బహువచనమే కాక , ద్వి వచనము కూడా ఉంటుంది. దీన్నే ఇంకోలా , అహం రామః అస్మి -- నేను రాముడిని [ అయి ఉన్నాను ] ఆవాం రామౌ స్వః --మేమిద్దరము రాములము [అయి ఉన్నాము] వయం రామాః స్మః --మేము రాములము [అయి ఉన్నాము ] అని చెప్పవచ్చు... అర్థం అయిందా.. అందరూ తలలాడించారు.. అధ్యాపకుడు :- ఏదీ , సుబ్బారావు , ఇంకో ఉదాహరణ చెప్పూ.. సుబ్బారావు :- అహం బ్రహ్మః అస్మి [ అహం బ్రహ్మాస్మి ] ఆవాం బ్రహ్మౌ స్వః  వయం బ్రహ్మాః స్మః అధ్యాపకుడు మూర్ఛపోయాడు.  --------------- ఈ జోకు అర్థం కాని వాళ్ళు చేతులెత్తండి

పండుగరోజు !!

Image
పండుగరోజు !! @ జాజిశర్మ ఈ రోజు మన బాపు పుట్టిన రోజు. మనకందరికీ చాలా పవిత్రమైన రోజు. ఈ రోజు భాగ్యనగరములో జరుగుతున్న ఈ విశిష్టమైన రోజు పండుగలాగా నిర్వహిస్తున్న బాపు రమణ అకాడమీ వేడుకలో బాపురమణీయలోగిలి సభ్యులందరూ ఉత్సాహంగా పాల్గొని సన్మానితులైన కళాతపస్వి శ్రీ విశ్వనాధ్ గారి, శ్రీ జయదేవ్ గారి ఆశీస్సులను స్వీకరించి మన బాపు రమణీయ లోగిలి సమూహము అజరామరమైన కీర్తి ప్రతిష్టలను సంతరించుకుని బాపు రమణల జయపతాకములను విశ్వవ్యాప్తము చేయుదురు గాక అని భగవంతుని ప్రార్దిస్తూన్నాను. ఈ సందర్భములో మన బాపురమణీయ లోగిలి ముఖ్య సంధానకర్త డాక్టర్ శ్రీ పొన్నాడ విజయవేంకట సుబ్బారావు గారి రెండు గ్రంధములు "ఎంకి పాటలు" " అమ్మపదములు" ఆవిష్కరణ అవుతున్నాయి. ఇది ముదావహము. డాక్టర్ గారి ప్రతిభా మకుటంలో ఇది మరో కలికితురాయి. వారిని ప్రత్యేకముగా అభినందిస్తూ, ఈ వేడుకకు కారణమైన బాపు రమణీయలోగిలి సభ్యులందరికీ నా మన:పూర్వక జేజేలు అర్పిస్తున్నాను. బాపు రమణలు మనలను పై లోకములో నుండి మురిసిపోతు చిరునవ్వులజల్లులు కురిపిస్తూ ఈ వేడుకలు వీక్షించెదరు అనే మన ప్రగాఢ విశ్వాసము. ఈ వేడుకలు అత్యంత వై

ఎందుకో ఈ సినిమా లో క్లారిటి లేదు ...

Image
ఎందుకో ఈ సినిమా లో క్లారిటి లేదు ...  సావిత్రి భర్త పద్మనాభం చని పోయి ఉండక పోతే  ఆమె గంపెడు పిల్లతో హాయిగా వుండేది ..  గోపి గౌరీ పెళ్లి చేసి కొనేవాడు  ఆదుర్తి ముగ మనసులు మనం ఏడవడానికి  రాధ భర్తను చ అన్యాయంగా చం పెసారు

సీతాజననం !

Image
సీతాజననం ! . మిధిలాపుర నాయకుడైన జనక మహారాజు యాగము చేయుచూ భూమిని దున్నుచుండగా నాగలికి ఒక పెట్టె అడ్డుపడింది. ఆ పెట్టెను తెరచి చూడగా అందులో ఒక పసిపిల్ల కనిపించింది. నాగటి చాలులో లభించినందున ఆమెకు సీత అని నామకరణము చేసి జనకమహారాజు, ఆయన భార్య సునయన అల్లారు ముద్దుగా ఆ బిడ్డను పెంచుకొన్నారు. కనుక సీత భూదేవి కుమార్తె అని అంటారు, శ్రీ సీతమ్మ జన్మనక్షత్రము ఆశ్లేష నక్షత్రము . . సీత గర్భమున జన్మించలేదు గనుక అయోనిజ అని అంటారు. . సీతాదేవి జననం సీత జన్మ నక్షత్రమైన ఆశ్లేష నక్షత్రం రోజున చైత్ర మాశ శుక్లపక్షంలో జరిగింది.

జాబిలి కన్నా నా చెలి మిన్న!

Image
జాబిలి కన్నా నా చెలి మిన్న పులకింతలకే పూచిన పొన్న కానుకలేమి నేనివ్వగలను కన్నుల కాటుక నేనవ్వగలను పాల కడలిలా వెన్నెల పొంగింది పూల పడవలా నా తనువూగింది ఏ మల్లెల తీరాల నిను చేరగలను మనసున మమతై కదా తెరగలను x

బాల గంగా ధర తిలక్..... కవితా మనసు.!

Image
బాల గంగా ధర తిలక్..... కవితా మనసు.! . ఒక్క మునిమాపు వేళ మా వూళ్ళో ఒక కదంబ వృక్ష ఛాయలో మొదటి సారిగా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు తమ ఊర్వశీ ప్రవాసం లోంచి వివరాలీ విభావరీ విలాసాల నీ మసలు చరణ మంజీరము గుసగుసలో అన్న గేయం విన్నప్పుడు చటుక్కున ప్రబంధాల బలవంతపు వర్ణనలూ బిగుసుకుపోయిన భాషా శరీరాలూ, మా వూరి రోడ్ల మీది దుమ్ము అన్నీ మాయమయి పొయి నేను నా లోంచి కదలి పోయి జాలి జాలిగా గాలిలో చిరు చీకటిలో నక్షత్రాల చిరు కాంతిలో కలసి పోయి యేదో యేదో అయిపోయిన క్రొత్త చైతన్యం లో ఆ రాత్రంతా నిద్రపోలేదు.

మీ లాంటి కొండ ముచ్చులు దోర్కపోరు అంది...

Image
అది 1959 యూనివర్సిటీ నుండి కోటి బస్సు లో వస్తున్నాం...నేను హనుమంతరావు.. . ఒక అమ్మయిని చూసి మా హనుమంతరావు ..ఇలాంటి . కోతులకు పెళ్లి ఎలా అవుతుంది...జాలి వేస్తోంది అప్పారావు అన్నాడు. . అందుకు ఆ అమ్మయీ పర్వాలేదు ... మీ లాంటి కొండ ముచ్చులు దోర్కపోరు అంది... . ఆ .. అన్నాడు పాపం హనుమంతరావు...

ఎప్పుడు అలా తిట్టు కోవడమ మాత్రమే ఎప్పుడు కొట్టు కొంటారో ..

Image
నేను హనుమంతరావు ఒకసారి బస్సు ఆర్ట్స్ కాలేజీ దగ్గెర దిగి కెమిస్ట్రీ బిల్డింగ్ కు నడుస్తునాం. అక్కడ మా ఫ్రెండ్స్ అర్జునసింగ్, పార్థ సారధి ఏదో గో డవపడి..తిట్టుకుంటున్నారు.. కమలేషు బేడి..(ఆమె అప్పుడు మా కాలేజి బుటి లెండి)..,,,గురుంచి ఏదినా అంటే నేను ఉప్పుకోను అంటున్నాడుఅర్జును... అంటాను..అంటో ముదుకు వస్తున్నాడు పార్థు.... .. ఎప్పుడు అలా తిట్టు కోవడమ మాత్రమే ఎప్పుడు కొట్టు కొంటారో .. అన్నాడు మన హనుమంతరావు .. అంటే మేము కొట్టుకోవడం నీకు ఇష్టమా అంటో ........ఇద్దరు కలసి .నా సామి రంగా ఉతికేసారు మన హనుమంతరావుని... Vinjamuri Venkata Apparao's photo. x

నీ శత్రువుల మాట విను.. ఎందుకంటే నీ లోని లోపాలు, తప్పులు అందరికంటే వారికే బాగా తెలుసు .

Image
నీ శత్రువుల మాట విను.. ఎందుకంటే నీ లోని లోపాలు, తప్పులు అందరికంటే వారికే బాగా తెలుసు .

ఈ రేయి నన్నొల్ల నేరవా? రాజా! ఎన్నెలల సొగసంత యేటి పాలేనటర!

Image
ఈ రేయి నన్నొల్ల నేరవా? రాజా! ఎన్నెలల సొగసంత యేటి పాలేనటర! x

నీవు నేనైతే !

Image
                          నీవు నేనైతే ! నిను నీలోనె కందు! నేను నేనుగ నుంటె! నీలోనె యుందు!

లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం !

Image
లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం . లక్ష్మీ దేవీ! పాల సముద్రపు రాజు కూతురవై, శ్రీరంగధామమునకు అధిపతివై,  దాస దాసీ జనులను, సమస్త దేవతా స్త్రీలను, లోకములన్నింటిని ప్రకాశింప జేయు దీప జ్యోతివి నీవు. బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు మొదలయిన వారు కూడ శ్రీమంతురాలగు నీ చల్లని చూపులచే వైభవమును పొందిరి. ముల్లోకములు నీ కుటుంబమే. పద్మములో పుట్టిన, విష్ణువుకు ఇష్ట సఖివైన ఓ! లక్ష్మీ దేవీ, నీకు నమస్కారములు