"నేను శ్రీశ్రీని. ఈ శతాబ్దం నాది"

ఒక సారి శ్రీ శ్రీ గారు రైలు లో ప్రయాణం చేస్తున్నారు.టిక్కెట్ లేదు

శ్రీశ్రీ వంతు వచ్చింది.. ఇది గమనించి

"ఎవరు మీరు" అన్నాడు టి.సి.

"భూతాన్ని

యజ్ఞోపవీతాన్ని

వైప్లవ్య గీతాన్ని నేను"

"కవిత్వంలో దేనికి? తెలుగులో చెప్పరాదుటయ్యా" అన్నారెవరో.

"నేను శ్రీశ్రీని. ఈ శతాబ్దం నాది"

"కావచ్చు. కాని ఈ రైలు శ్రీ సర్కారు వారిది" అన్నాడు టి.సి..

"మొన్నటి దాకా తెలుగు సాహిత్యం నన్ను నడిపింది. ఇప్పుడు దాన్ని నేను నడుపుతున్నాను..."

"అవచ్చు. కాని ఈ రైళ్ళని ఇండియన్ రైల్వేస్ వారు నడుపుతున్నారు"

"ఔను నిజం, ఔను సుమా నీవన్నది నిజం నిజం"

అనేసి శ్రీశ్రీ సీటుమీద కూచుని, నిట్టూర్చి డబ్బులు తీసేరు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!