Posts

Showing posts from May, 2013

గజేంద్ర మోక్షం..... (పోతన)

Image
                                 గజేంద్ర మోక్షం..... (పోతన)

ఇది నా 100వ పోస్టింగ్ప. ఇది మా తాతగారు వింజమూరి జోగయ్య గారికి అంకితం. ఈ పద్యం వారికీ ఎంతో ఇష్ట వారు,

Image
ఇది నా 100వ  పోస్టింగ్ప. ఇది మా తాతగారు వింజమూరి జోగయ్య గారికి  అంకితం. ఈ పద్యం వారికీ ఎంతో ఇష్టము అని మా తండ్రి గారు  వింజమూరి వెంకట్రావు గారు చెప్పే వారు, ప విపుష్పంబగు, నగ్నిమంచగు,నకూ / పారంబు భూమీస్థలం బవు,శత్రుండతిమిత్రుడౌ,విధముది / వ్యాహారమౌనెన్నగా నవనీమండలి లోపలున్ శివ శివే / త్యా భాషణోల్లాసికిన్ శివ!నీ నామము సర్వవశ్యకరమౌ / శ్రీకాళహస్తీశ్వరా! శ్రీకాళహస్తీశ్వర శతకము ధూర్జటీ. శ్రీకాళహస్తీశ్వరా!ఈ భూమియందు నీమహిమగల నామమైన "శివ శివ"యని నామోచ్చారణము చేయువానికి కఠినమైన వజ్రము సుకుమారమైన పువ్వుగాను,అగ్నిమంచుగాను,సముద్రము భూమిగాను,శత్రువు మిత్రుడుగాను, విషము గొప్పరుచికరమైన ఆహారముగాను కన్పట్టు చుండును.పరికించగా నీ పేరు అన్నింటిని వశము చేసుకోనునట్టిది అని తెలియును.

కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి .

Image
శక్రసుతు గాచుకొఱకై చక్రము చేపట్టి భీష్ము జంపఁగ జను నీ విక్రమ మేమని పొగడుదురు నక్రగ్రహ సర్వలోక నాయక కృష్ణా! కృష్ణ శతకము. కృష్ణా!అర్జునుడు భీష్మునితో యుద్దము చేయుచుండగా ఆ భీష్ముని దాటికి అతడోర్వలేని సమయమున నీవు చక్రమునుబట్టి భీష్ముని చంపుటకై పోవు నీవు,చూపిన పరాక్రమము నాకు వర్ణించుట నలవికాదు. పోతనామాత్యుడు ఈ విదముగా వర్ణించారు.. కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి గగన భాగంబెల్ల గప్పికొనగ నురికిన నోర్వక యుదరంబులో నున్న జగముల వ్రేగున జగతి గదల జక్రంబు జేపట్టి చనుదెంచు రయమున బైనున్న పచ్చని పటము జార నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపు మని క్రీడి మరల దిగువ.

శ్రీకాళహస్తీశ్వర శతకము ..దుర్జటీ

Image
అంతా సందయమే శరీర ఘటనం / బంతా విదారంబె లో నంతా దుఃఖపరంపరాన్వితమే మే / నంతా భయభ్రాంతమే యంతానంత శరీరశోషణమే దు / ర్వ్యాపారమే దేహికిన్ చింతన్నిన్నుదలంచి పొందురు నరుల్ / శ్రీ కాళహస్తీశ్వరా! శ్రీకాళహస్తీశ్వర శతకము ..దుర్జటీ శ్రీ కాళహస్తీశ్వరా! పరీక్షించి చూడగా శరీరంతయును భయ భ్రాంతులచేత కూడినట్టిదే.విచారించి చూడగా జరుగుతున్నదంతా శరీరమును శుధ్కింపచేసే విషయాలే.లోపల ఉన్న జీవుడు ఒక దుఃఖంలోకి పడినట్లుగా ఒక జన్మ నుంచి ఇంకొక జ్న్మానికి చేసే ప్రయాణమే.ఈ ప్రపంచమంతా సందేహాలమయమే.అయినా ఈ మనుష్యులు తమ మనస్సులలో నిన్ను గురించి అలోచించి నిన్ను చేరుకొనే ప్రయత్నం చేయటంలేదు

కృష్ణ శతకము

Image
దేవేంద్రుఁడలుక తోడను వావిరిగా ఱాళ్ళవాన వడి గురియింపన్ గోవర్థనగిరి యెత్తితివి గోవుల గోపకుల గాచు కొఱకై కృష్ణా! కృష్ణ శతకము కృష్ణా!దేవేంద్రుడు కోపగించి దట్టమైన,ఱాళ్ళను వేగముగల వానగా కుఱిపించగా గోవర్థనగిరిని గొడుగు వలె చిటికినవ్రేలితో పైకెత్తి ఆవులను,ఆవులను కాచువారిని రక్షించితివి.

మహామృత్యుంజయస్తోత్రం

Image
 మహామృత్యుంజయస్తోత్రం రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠముమాపతిమ్ | నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧ || నీలకంఠం కాలమూర్తిం కాలజ్ఞం కాలనాశనమ్ | నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౨ || నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిలయప్రదమ్ | నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౩ || వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుమ్ | నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౪ || దేవదేవం జగన్నాథం దేవేశం వృషభధ్వజమ్ | నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౫ || గంగాధరం మహాదేవం సర్వాభరణభూషితమ్ | నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౬ || త్ర్యక్షం చతుర్భుజం శాంతం జటామకుటధారిణమ్ | నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౭ || భస్మోద్ధూళితసర్వాంగం నాగాభరణభూషితమ్ | నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౮ || అనంతమవ్యయం శాంతం అక్షమాలాధరం హరమ్ | నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౯ || ఆనందం పరమం నిత్యం కైవల్యపదదాయినమ్ | నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౦ || అర్ధనారీశ్వరం దేవం పార్వతీప్రాణనాయకమ్ | నమామి శిరసా దేవం కిం నో మృత్యు

శ్రీకాళహస్తీశ్వర శతకము ధూర్జటీ.

Image
ఎన్నేళ్ళుండుదు?నేమి గందునిక నే / నెవ్వారి రక్షించెదన్ నిన్నె నిష్టభజించెద న్నిరూపమో / న్నిద్రాప్రమోదంబు నా కెన్నండబ్బెడు నెంత కాలమిక నే / నిట్లున్న నన్నియ్యెడం జిన్నంబుచ్చక నన్ను నేలుకొనవే / శ్రీకాళహస్తీశ్వరా! శ్రీకాళహస్తీశ్వర శతకము ధూర్జటీ. శ్రీకాళహస్తీశ్వరా!నేను ఇంకెన్నాళ్ళు బ్రతుకగలను?నేను బ్రతికి చూడవలసినదేమున్నది?ఎవరిని కాపడగలను? ఎటువంటి నిష్టతో నీకు సేవలు చేయగలను?ఎల్లపుడు నీ స్మరణ నిద్ర యందే మేలుకొని యుండు స్థితి నాకు ఎప్పుడు లభీమ్చునో!ఇంకెన్నాళ్ళు శక్తి లేని వానిగ ఉండవలెనో తెల్పుము.నీవు నన్ను తక్కువ్బగా చూడక త్వరితగతితో నన్ను ఏలుకొనుము.

జలదానం .

Image
జలదానం ప్రాముఖ్యత గురించి స్కాందపురాణంలోని ఒక కధ ఉంది. హేమాంగ అనే ఒక మంచి మహారాజు ఉండేవాడు. ఆయన దానశీలుడు. ఎన్నో దానాలు చేశారు. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు అన్ని ఉన్నాయో, సాగరంలో నీటిబిందువులు ఎన్ని ఉన్నాయో అన్ని ఆవులను దానం చేశాడు. వీటితో పాటు బ్రాహ్మణూలకు, పేదలకు, వికలాంగులకు కావల్సినంత బంగారం, వజ్రాలు, భూములు, ఇళ్ళు విపరీతంగా దానం చేశాడు. అన్ని దానాలు చేశాడు కానీ ఎవరికీ జల దానం మాత్రం చేయలేదు. దూరం నుండి వచ్చినవారికి, ఎండలో వచ్చినవారికి, దాహార్తులైనవారికి నీరు దానం చేయలేదు. నీరు దానంగా ఇచ్చేదేమిటి? నీరు ఎవరైనా ఇస్తారు. ఎక్కడైనా దోరుకుతుంది. నేను మహారాజును, నా హోదాకు తగ్గట్లు గో, భూ, సువర్ణ దానాలు చేయాలి అనుకున్నాడు. ఇది మనకు తప్పుగా అనిపించదు కానీ, శాస్త్రం మాత్రం దీన్నీ దోషంగా పరిగణిస్తుంది. దాహార్తులకు నీరు ఇవ్వకపోవడం వలన 'జాతక పక్షి' జన్మ 3 సార్లు వస్తుందని శాస్త్రం. దీనితో పాటు అతనికి ఇంకోక దోషం కూడా ఉంది. దానం ఇచ్చేసమయంలో అందరినీ సమానంగా చూసేవాడు. ఇక్కడ సమానంగా అంటే పాత్రులా, అపాత్రులా అన్నది పట్టించుకునేవాడు కాదు (అందరికి అన్ని దానం చేయకూడదు. ఎవరికి ఏది, ఎంత అవ

వెయ్య బోవని తలుపు తియ్య మంటూ పిలుపు

Image
దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారి ఈ భావ గీతం మరుగున పడి పోయింది. ఇది  1935 లో రాసిన గీతం..... . వెయ్య బోవని తలుపు తియ్య మంటూ పిలుపు.... రాధా కెందుకు నవ్వు గొలుపు.... నీలోన నాలోన నిదుర పోయే వలపు మేలుకొంటే లేదు తలపు... విశ్వమంతా ప్రాణ విభుని మందిరం అయెతే విధి వాకలి ఏది చెల్లల.... విస్వవిభుడే రాధా వెంట నంటి రాగ పిలుపేది తలుపు ఏది ... చెల్లల..

అల్లసాని వారి "మనుచరిత్రము" నుండి.

Image
అల్లసాని వారి "మనుచరిత్రము" నుండి. ఆ దివ్యాంగన వరూధిని ప్రవరుడి రూపలావణ్యాన్ని తిలకించి ఇలా మురిసిపోయింది : వదన ప్రభూత లావణ్యాంబు సంభూత కమలంబు లన వీని కన్నులమరు నిక్కి వీనులతోడ నెక్కసక్కెము లాడు కరణి నున్నవి వీని ఘన భుజములు సంకల్ప సంభవాస్థాన పీఠిక వోలె వెడఁద యై కనుపట్టు వీని యురము ప్రతిఘటించు చిగుళ్ళపై నెఱ్రవాఱిన రీతి నున్నవి వీని మృదుపదములు నేరేటేటి యసల్ తెచ్చి నీరజాప్తు సానఁబట్టిన రాపొడి చల్లి మెదిపి పదను సుధ నిడి చేసెనో పద్మభవుఁడు వీనిఁ గాకున్నఁ గలదె యీ మేని కాంతి! ఈ అందగాని కన్నులు ముఖ కాంతి అనే నీట పుట్టిన కమలాల లాగ ఉన్నాయి. అతని ఎగుభుజాలు నిక్కి చెవులతో ఆటలాడుతున్నాట్టున్నయి. ఇతని విశాల వక్షస్థలం మన్మధుడి సింహాసనంలాగ ఉంది. పాదాలు ఎంత సుకుమారంగా వున్నాయంటే, నడుస్తున్నప్పుడు గడ్డి చిగుళ్ళు తగిలి కందిపోయాయి కాబోలు, బాగా ఎఱ్రబారి ఉన్నాయి. ఆ బ్రహ్మదేవుడు జంబూనది యందలి బురద తెచ్చి (నేరేటి+ఏటి+అసల్) (జంబూనదిలోని అడుసు బంగారమని చెప్పబడింది), సూర్యుణ్ణి సానబట్టగా రాలిన పొడిని (రజను) అందులో జల్లి, కలయగలిపి, ముద్ద పాకానికి కావలసిన (పదను) తడిని, అమృతంతో కలి

కుంతి విలాపం.........జంధ్యాల పాపయ్య శాస్త్రి.... కరుణశ్రీ

Image
జంధ్యాల పాపయ్య శాస్త్రి.... కరుణశ్రీ అది రమణీయ పుష్పవన మావన మందొక మేడ మేడపై నది యొక మారుమూల గది యా గది తల్పులు తీసి మెల్లగా పదునయిదేండ్ల యీడుగల బాలిక పోలిక రాచపిల్ల జం కొదవెడి కాళ్ళతోడ దిగుచున్నది క్రిందికి మెట్లమీదుగా! ఉ. కన్నియ లాగె వాలకము కన్పడుచున్నది కాదు కాదు ఆ చిన్ని గులాబి లేత యరచేతులలో పసిబిడ్డ డున్న య ట్లున్నది యేమి కావలయునో గద యామెకు? యచ్చుగ్రుద్దిన ట్లున్నవి రూపురేఖ లెవరో యనరా దతడామె బిడ్డయే! తే. దొరలు నానంద బాష్పాలొ పొరలు దుఃఖ బాష్పములొ గాని యవి గుర్తుపట్టలేము; రాలుచున్నవి ఆమె నేత్రాలనుండి బాలకుని ముద్దు చెక్కుటద్దాల మీద! ఉ. పొత్తులలోని బిడ్డనికి పుట్టియు పుట్టక ముందె యెవ్వరో క్రొత్తవి వజ్రపుం గవచ కుండలముల్ గయిసేసినారు మేల్ పుత్తడి తమ్మిమొగ్గ బుజిబుగ్గల ముద్దులు మూటగట్టు నీ నెత్తురుకందు నెత్తుకొని నెచ్చెలి యెచ్చటి కేగుచున్నదో! తే. గాలి తాకున జలతారు మేలిముసుగు జారె నొక్కింత యదిగొ! చిన్నారి మోము! పోల్చుకొన్నాములే! కుంతిభోజపుత్రి స్నిగ్ధ సుకుమారి యామె కుంతీకుమారి!! మ. కడువేగమ్మున చెంగుచెంగున తరంగాల్ పొంగ నా తోట వెం బడి గంగానది పారుచున్నయది బ్రహ్మాండమ్ముగా అల్లదే

కృష్ణ శతకము

Image
అంగన పనుపున ధోవ తి కొంగున నటుకులను ముడుచు కొని వచ్చిన యా సంగతి విని దయనొసఁగితివి రంగుగ సంపదలు లోక రక్షక కృష్ణా! కృష్ణ శతకము లోకములను రక్షించు వాడవైన కృష్ణా!కుచేలుడు తన భార్య పంపగా నీ దర్శనమునకు వచ్చి నీకు కానుకలు ఏమియు ఇవ్వలేక బట్టకొంగునకట్టి తెచ్చిన యటుకులను ఈయగా నీవు అతడు వచ్చినపనిని తెలుసుకొని ఆ అటుకులను ఆరగించి అతనికి సంపదలిచ్చితివి.

తిరుపతి వెంకట కవులు

Image
అదిగో, ద్వారక! యాలమంద లవిగో! నందందు దోరాడు, న య్యదియే కోట, యదే యగడ్త, యవెరథ్యల్, వారలే యాదవుల్ యదుసింహుండు వసించు మేడ యదిగో! నాలానదంతావళా భ్యుదయంబై వర మందిరాంతర తురంగోచ్చండమై పర్వెడున్. ( తిరుపతి వెంకట కవులు .)

ద్వారకా నగరం....

Image
ద్వారకా నగరం.... మహాభారతం లో ద్వారకా నగరం ద్వారావతి గా పిలువబడింది. ఈ నగరానికి అనేక ద్వారాలు ఉండడమే ఇందుకు కారణం. సంస్కృత భాషలో ద్వారం అంటే తెలుగులో వాకిలి లేక ద్వారం అని అర్ధం. కనుక రెండు కారణ నామాలు ఈ నగరానికి చక్కగా వర్తిస్తాయి. అనార్తా సామ్రాజ్యాధీశులైన యాదవులకు ద్వారక రాజధాని. గుజరాత్ రాష్ట్ర పశ్చిమ తీరాన ఉన్న ఈ నగరం సముద్రజలాల వలన ముంచివేయబడింది. ఈ నగరం కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాల అనంతరం సముద్రగర్భంలో కలిసి పోయింది. మగధరాజైన జరాసంధుడి దండయాత్రల నుండి ప్రజలను సురక్షితంగా కాపాడడానికి శూర సామ్రాజ్యానికి చెందిన యదు ప్రముఖులు సముద్ర గర్భంలో ఉన్న ద్వీపాల సమూహాలను ఎంచుకుని, ఈ నగర నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టి, పూర్తి చేసి, ప్రజలను శూరసేన సామ్రాజ్యపు రాజధాని మధుర నుండి ద్వారకకు తరలించారు. ఈ ప్రదేశం అనర్త సామ్రాజ్యంలో ఒకభాగం. ద్వారకా నగరాన్ని సామ్రాజ్యము అనే కంటే సంయుక్త రాజ్యసమాహారం అనటం సమంజసం. అంధకులు, వృష్టులు, భోజులు ఈ రాజ్యసమాహారం లోని అంతర్భాగాలు. ద్వారకను పాలించిన యాదవులు దశరాస్ మరియు మధవులు అని కూడా పిలువబడ్డారు. ద్వారకలో నివసించిన యాదవ ప్రముఖులలో ముఖ్యులు వాసుదే

భద్రాది రామదాసు కీర్తన...

Image
.పాహి రామప్రభో ----------------- పాహి రామప్రభో పాహి రామప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో పాహి రామప్రభో ఇందిరా హృదయారవిందాధి రూఢ సుందరాకార నానంద రామప్రభో ఎందునే చూడ మీ సుందరానందము కందునో కన్నులింపొంద శ్యామప్రభో బృందారకాది బృందార్చిత పదార విందముల సందర్శితానంద రామప్రభో తల్లివి నీవె మా తండ్రివి నీవె మా దాతవు నీవు మా భ్రాత రామప్రభో నీదు బాణంబులను నాదు శతృల బట్టి బాధింపకున్నావదేమి రామప్రభో ఆదిమధ్యాంత బహిరంతరాత్ముండనుచు వాదింతునే జగన్నాథ రామప్రభో శ్రీ రామరామేతి శ్రేష్ఠ మంత్రము సారె సారె కును వింతగా చదువు రామప్రభో శ్రీ రామ నీ నామ చింతనామృత పాన సారమే నాదు మది గోరు రామప్రభో కలికి రూపము దాల్చి కలియుగంబున నీవు వెలసితివి భద్రాద్రి నిలయ రామప్రభో అవ్యయుడవైన ఈ అవతారములవలన దివ్యులైనారు మునులయ్య రామప్రభో పాహి శ్రీ రామ నీ పాద పద్మాశ్రయుల పాలింపుమా భద్రశీల రామప్రభో పాహి రామప్రభో పాహి రామప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో (భద్రాది రామదాసు కీర్తన.)

ముక్కు తిమ్మన్న గారి పద్యములు...

Image
ముక్కు తిమ్మన్న గారి పద్యములు..... జలజాతాసన వాసవాది సుర పూజా భాజనంబై తన ర్చు లతాంతాయుధు కన్న తండ్రి శిరమచ్చో వామ పాదంబునన్ తొలగన్ ద్రోచె లతాంగి ! యట్ల యగు నాధుల్ నేరముల్ సేయ పే రలుకన్ జెందిన యట్టి కాంతలుచిత వ్యాపారముల్ నేర్తురే !! కోపన పద హతి కుహనా గోపాలుడు కాంచి మెయి గగుర్పొడవగ ను ద్దీపిత మన్మధ రాజ్య ప్రాపితుడై పలికె కూర్మి బయట పడంగన్ ! నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కిన్క బూని తా చిన యది నాకు మన్ననయ ! చెల్వగు నీ పద పల్లవంబు మ త్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నే నని యెద నల్క మానవు గదా యికనైన నరాళ కుంతలా !!

తులసి దివ్యౌషధము.

Image
హిందువులకు తులసి పవిత్రమైనది. ఇది దేవతా ప్రీతికరము. పూజాద్రవ్యములలో ఒకటి. దీనిచేత ఇతర దేవతలను పూజిస్తారు. ఇది దివ్యౌషధము. శ్రీకృష్ణ భగవానుడు తరుచు తులసి వనమునందు విహరించుచుండెడివాడు. దీనియొక్క గాలి స్పర్శవలన దీర్ఘాయుర్దాయము కలుగుతుంది. ఎవరింట్లో తులసివనం ఉంటుందో ఆ ఇల్లు సర్వ తీర్ధ స్వరూపమై వర్ధిల్లుతుంది. యమదూతలు అక్కడికి రాలేరు.సర్వ పాప సంహారకమైన ఈ తులసివనాన్ని ఎవరు ప్రతిష్టిస్తారో వారికి యమధర్మరాజును దర్శించే పని ఉండదు.అనగా, నరకానికి వెళ్ళరని, పుణ్యాత్ములై స్వర్గాన్నే పొందుతారని భావం. గంగాస్నానం, నర్మదా దర్శనం, తులసీ సేవనం - ఈ మూడూ సమాన ఫలదాయకాలే. తులసిని ప్రతిష్టించినా, నీళ్ళు పోసినా, తాకినా సర్వ పాపాలూ నశిస్తాయి. By Padmini Bhavaraju

గోస్వామి తులసీదాసు

Image
కాశీనగరంలో గోస్వామి తులసీదాసు నిత్యము రామాయణ ప్రవచనము చేసెడివారట. ప్రతిదినము కాలకృత్యములకొరకు దగ్గరలోనున్న అడవికి పోయి పాత్రలోనున్న శేష జలమును ఓ రావిచెట్టు మొదాట్లో పోసెడివారు. ఆ చెట్టుపైనున్న భూతము ఓ రోజు ప్రత్యక్షమై "ఏమైనా అడుగు ఇస్తాను" అంది..మహాభక్తుడు తులసీదాసు శ్రీరామ దర్శనం కోరారు...ఆపని తనవల్లకాదంది కాని ఉపాయం చెప్పిందాభూతం...నీ రామాయణ ప్రవచనానికి రోజూ హనుమ వస్తున్నాడు. ..అందరికన్నా ముందు వచ్చి అందరూ వెళ్ళినతర్వాత వెళ్తాడు..కన్నులనీరు కారుతూవుండగా ఆనందంగా రామాయణం వింటూ వుంటాడు...అతన్ని పట్టుకో...అంది భూతం..శ్రీరాముడు కావాలంటే హనుమను పట్టాలి..హనుమను పట్టాలంటే భక్తితో శ్రీరామగానం చేయాలి...హనుమ సాయంతో శ్రీరామదర్శనమైంది గోస్వామికి.

చీమ కుట్టింది

చీమ కుట్టింది అనగా ఓ రాచగద్దె ... ఆ రాచగద్దెకు ఏడుగురు పోటీ ..... ఏడుగురు పోటీలు దేశంమీద పడ్డారు....... ఏడు డబ్బుసంచీలు తెచ్చారు...... అందులో ఓ డబ్బు సంచీ నిండలేదు...... సంచీ! సంచీ! ఎందుకు నిండలేదు?నీతి అడ్డమొచ్చింది..... నీతీ! నీతీ! ఎందుకు అడ్డమొచ్చావు?ఆశ మేయలేదు...... ఆశా! ఆశా! ఎందుకు మేయలేదు?పాలకుడు వదలలేదు...... పాలకుడా! పాలకుడా! ఎందుకు వదలలేదు?పదవి పోతానని బెదరిస్తోంది...... పదవీ! పదవీ! ఎందుకు పోతానంటున్నావు?ఓటరు ఏడుస్తున్నాడు....... ఓటరూ! ఓటరూ! ఎందుకు ఏడుస్తున్నావు?పెరిగే ధరలు కుట్తున్నాయి..... ధరలూ! ధరలూ! ఎందుకు కుట్తున్నారు? బుర్రవున్నా ఉపయోగించకుండా....తప్పుడు బాక్సులో ఓటేస్తే మరి కుట్టనా????

ప్రధమ దివసే

Image
ప్రధమ దివసే ఆషాఢం వచ్చేసిందన్నారు...నూతన వధూవరులు ఒక చోట వుండొద్దన్నారుఅందుకని బామ్మ యిల్లు సెంటరు....బామ్మలు తిన్నగా వుండరు కదా..అన్నీకూపీలు..... నీళ్ళోసుకొన్నావటే మనమరాలా?....మనమరాలి చేతికి గోరింటాకు పెడుతూ అడిగింది బామ్మ....... అదేమిటే బామ్మా! ప్రొద్దుటే పోసుకున్నాగా? అందిమనమరాలు... అది కాదే...పెళ్ళై నాలుగు నెలలయ్యింది కదా ... ఓ నలుసునికని పారేస్తే నాకూ కాలక్షేపం కదా. ఎందుకు ఆలస్యం? అంది బామ్మగారు. నాఆలస్యం యేమీ లేదు..మీ మనమడ్ని అడుగు...అని లోపలకి తుర్రుమంది ఆకొంటె పిల్ల. బజారుకు రమ్మన్నాడు పెళ్ళాన్నీ మనుమడు. వెళ్ళవే..మీ ఆయనహుకుమ్ జారీచేసాడు... మనమరాలు గబ గబా వచ్చింది....యెక్కు అన్నాడు.స్కూటర్ యెక్కింది..... నడుం పట్టుకోమని బామ్మ సైగ చేసింది....అమాయకంగాపొట్టచుట్టూ చేయి వేసి...మొగుడ్ని కరచుకుంది గడుసుగా. ఇంటికొచ్చారు కొత్త దంపతులు. తెలిసింది కడుపు పండిందని....... మనుమరాలికి కాదు....మనుమరాలిమొగుడుకి...... అమ్మాయి చేతిలో పండిన గోరింటాకు ఫకాలుమని నవ్వింది.......

..శ్రీకాళహస్తీశ్వర శతకము.

Image
సంతోషించితి చాలుచాలు రతిరా / జద్వార సౌఖ్యంబులన్ శాంతిన్ బొందితి చాలుచాలు బహురా / జద్వార సౌఖ్యంబులన్ శాంతింబొందెద జూపు బ్రహ్మపదరా / జద్వార సౌఖ్యంబు ని శ్చింతన్ శాంతుడనౌదు నీ కరుణచే / శ్రీకాళహస్తీశ్వరా! ధూర్జటీ .....శ్రీకాళహస్తీశ్వర శతకము. శ్రీకాళహస్తీశ్వరా!నేణు రతీ కేళీ విలాసములను ఎన్నో అనుభవించితిని.వానివలన సంతోషమును పొందితిని,ఆ సుఖము చాలును.అనేక రాజుల సభలలో గౌరవములను పొంది దాని ద్వారా అనేక సౌఖ్యములను అనుభవించినాను. ఆ సుఖములు కూడా ఇంక నాకు వద్దు.నీ దయను నాపై ప్రసరింపచేయుము.దానితో ఏ ఇతర ఆసక్తులు లేక నిశ్చింతగా పరబ్రహ్మ పదమును చేరే మార్గానికి నన్ను చేర్చుము.

కృష్ణ శతకము

Image
పాణితలంబున వెన్నయు వేణీమూలంబునందు వెలయఁగ పించం బాణిముత్యము ముక్కున నాణెముగా దాల్చు లోక నాథుఁడ కృష్ణా! కృష్ణ శతకము ఓకృష్ణా!నీవు లోకములకెల్ల ప్రభువునైనను చేతిలో వెన్నముద్దయు,సిగలో నెమలి పించమును,ముక్కున ఆణిముత్యమును దరించి పసి బాలునివలె ఉంటివిగదా!

జగద్గురువులు శ్రీ శంకరాచర్యులవారి జయంతి.

Image
~ మే 15,2013, బుధవారం, వైశాఖ శుద్ధ పంచమి, జగద్గురువులు శ్రీ శంకరాచర్యులవారి జయంతి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ~ హిందూ/భారతీయ ధర్మం మీద దాడి జరిగిన ప్రతిసారీ, ధర్మం తన వైభవాన్ని మర్చిపోయిన ప్రతిసారీ పరమాత్ముడు అనేకమంది మహాపురుషులను ప్రేరేపణ చేసి, కొన్ని సందర్భాల్లో స్వయంగా తానే అవతరించి, ధర్మాన్ని కాపాడుతూ వస్తున్నాడు. ~ సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి సరిగ్గా 2522 సంవత్సరాల క్రితం, 509 BC లో వైశాఖ శుద్ధ పంచమి రోజున దక్షిణ భారతదేశంలోని నేటి కేరళ రాష్ట్రంలో కాలిడి గ్రామంలో శివ గురువు, ఆర్యాంబ దంపతులకు బిడ్డగా, వేద ప్రమాణాన్ని నిలబెట్టడానికి, ధర్మ పునః ప్రతిష్ట చేయడానికి పరమశివుడి అంశతో శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యలు అవతరించారు. ~ చిన్న వయసులోనే వేదాలను, Philosophy, Metaphysics, Theology మొదలైన ఇతర శాస్త్రాలను చదివేశారు. 8 ఏళ్ళ వయసులోనే సన్యాసం స్వీకరించారు. ఆ సమయంలో భారతదేశంలో బౌద్ధ, జైన మతాలు, నాస్తిక వాదం విపరీతంగా ప్రబలాయి. ప్రజలంతా హిందూ ధర్మాన్ని వదిలి, నాస్తికం, చార్వాక మతాల వైపు నడవడం ప్రారంభించారు. ~ తన వాదన ప్రతిభతో బౌద్ధ,

కృష్ణుడికి సత్యభామ అంటే అంత భయమా.

Image
నిజంగా కృష్ణుడికి సత్యభామ అంటే అంత భయమా. జగన్నాటక సూత్రధారి ముందు ఎవరి నాటకాలు మాత్రం చెల్లుతాయి చెప్పండి. ఈ విషయాన్ని మన తిక్కన వారు బాగుగా గ్రహించారు. అందుకే.... పారిజాత పుష్పం విషయంలో... శ్రీకృష్ణున్ని తన్నే దాకా వచ్చింది మన సత్యభామ. ఆ వెంటనే శ్రీకృష్ణుడి చేత ఈ పద్యం చదివించారు.... నను, భవదీయ దాసుని మనంబున నెయ్యపుఁగింకఁ బూని తా చిన యది నాకు మన్ననయ! చెల్వగు నీ పదపల్లవంబు మ త్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నే ననియెద! అల్క మానవుగదా యికనైన అరాళకుంతలా! "నేను నీ దాసుణ్ణి. నీవు ప్రణయకోపముతో తన్నటం కన్నా, నేను కోరుకోదగిన భాగ్యం యేముంటుంది చెప్పు? ఇదిగో గగుర్పొడిచి నా శరీరం యెలా ముళ్ళపొదలా వుందో చూడు. ఈ ముళ్ళు గుచ్చుకుంటే అమ్మయ్యో! ఇంకేమైనా వుందా! మెత్తని నీ పాదాలు గాయపడవూ! అందుకే యింతసేపటినించీ బతిమాలుకుంటున్నాను. అలకమాను" అని ఈ పద్యం అర్థం. అంత వరకూ బాగానే ఉంది. చివర్లో అరాళ కుంతలా... అంటూ సంభోదింపజేశారు. అసలు ఇక్కడ సన్నివేశం ఏంటి.... ఈ సమయంలో... దట్టమైన కురులు కలదానా.... అని సంబోధించాల్సిన అవసరమేంటి.... అక్కడే ఉంది కిటుకంతా. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అ

మాయా బజార్

Image
ఆ దృశ్యం చాలా అపురూపం. చూడ ముచ్చటగా వుంది. సెల్ ఫోన్లో ఫోటో తీసి శాశ్వితంగా భద్రపరచుకోవాలనిమనసులో గట్టిగా అనిపించి కూడా  కూడా సభ్యత కాదని తమాయించుకున్నవారు ఎంతోమంది. అందులోకనబడుతున్నవారందరూ పెద్ద వాళ్లే! ఆరేడుపదుల వయస్సు పైబడ్డ వాళ్లే! చేతికర్ర ఊతంతో కొందరు- భార్య భుజం ఆసరాతో మరి కొందరు- మొగుడిచేయి పట్టుకుని ఇంకొందరు- 'రంగుల' మాయా బజార్ ఆడుతున్న అదునాతన థియేటర్ కాంప్లెక్స్ లో నెమ్మదిగా పైపైకి పాకుతున్న ఎస్కలేటర్ పై నిలుచుని వెడుతున్నదృశ్యం 'జగన్మోహనంగా' గోచరించింది. జీవన పధంలో మూడు వంతులకు పైగా నడిచివచ్చిన ఆ ముదివగ్గులందరూ - గతంలోని మధురిమను మరోసారి మనసారా నెమరు వేసుకోవాలని వచ్చిన వారిలా కానవచ్చారు. వీళ్ళల్లో కొందరయినా- బళ్ళు కట్టుకుని పోరుగునవున్న బస్తీకి పోయి - మూడు నాలుగు ఇంటర్వెల్స్ తో టూరింగ్ టాకీస్ లో ఆ సినిమా చూసివుంటారు. లేదా సినిమా చూడమని అమ్మా నాన్నా ఇచ్చిన అర్ధ రూపాయిలో ఒక బేడానో, పావులానో పెట్టి ముంతకింద పప్పుకొనుక్కొని, గోలీ సోడా తాగి నేల టిక్కెట్టుతో సరిపెట్టుకున్న వాళ్ళుంటారు. బెజవాడ దుర్గా కళా మందిరంలో మేడ మీద గోడను ఆనుకుని నిర్మించ

ఆ బాలుడే పోతనామాత్యులు.

Image
"ఇవ్విది దివీటీల్ వెలుగు యేమని బాలుడు పృచ్ఛ చేయగ...పలికె లక్కమాంబ"... అంటూ భాగవతం రాయడానికి ఆ పోతనామాత్యులను పురిగొల్పిన సంఘటనను చక్కగా వివరించారు ఈ పద్యంలో. "అమ్మా ఈ కాగడాల వెలుగేమిట"ని ఓ కు్రాడు ప్రశ్నించగా.. అతని తల్లి లక్కమాంబ "భాగవతం ప్రదర్శన ఉంది నాయనా.. దానికి సూచనగా ఇలా దివదిటీలు పెట్టారు" అనిచెప్పడం.. ఆ తర్వాత ఆ బాలుడు భాగవతమంటే కేవలం సంస్కృతంలో ఉంటుందని, సామాన్యులకు అది ఏమాత్రం అర్థంకాదని తెలుసుకోవడం.. "నేన్ రాసెదన్" అంటూ తల్లికి బాస చేసి, తెలుగులో భాగవతాన్ని రాస్తానని పదేళ్ల ప్రాయంలో చెప్పడం నిజంగా దైవ సంకల్పమే. ఆ బాలుడే పోతనామాత్యులు. అచ్చతెలుగులో మనకు భాగవత గాథల్ని అందించారు. పలుకు పలుకునా తేనెలొలికే అచ్చతెలుగు భాషలో పద్యాలను కూర్చి... మనల్ని ధన్యుల్ని చేశారు. అసలు ఆయన శైలిని వర్ణించలేము. భాగవతంలో తొలిపద్యమే.. "పలికెడిది భాగవతమట.. పలికించెడువాడు రామభద్రుండట.. నేపలికెద ..." అంటూ.. ద్రాక్షాపాక శైలిలో మనకు అందించారు. "సిరికిన్ చెప్పడు శంఖచక్రయుగముల్ చేదోయి సంధించడు.." కూడా ఆయన భాగవతంలోనిదే.. Sahakaram ..Kamalap

సంజ వెలుంగులో పసిడి చాయల ఖద్దరు చీర గట్టి.....

Image
కరుణశ్రీ సంజ వెలుంగులో పసిడి చాయల ఖద్దరు చీర గట్టి నా రింజకు నీరు వోయు శశిరేఖవె నీవు సుభద్ర సూతినై రంజిత పాణి పల్లవము రాయుదునా నిను మౌళి దాల్చి మృ త్యుంజయ మూర్తినై జమునితో తొడ గొట్టి సవాలు చేతునా

కరుణశ్రీ

Image
మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవిత మెల్ల మీకయి త్యజించి కృశించి నశించిపోయె; మా యౌవన మెల్ల కొల్లగొని ఆ పయి చీపురుతోడ చిమ్మి మ మ్మావల పారబోతురు గదా! నరజాతికి నీతి యున్నదా ! బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు సహజ మగు ప్రేమ నీలోన చచ్చెనేమి? అందమును హత్య చేసెడి హంతకుండ! మైలపడిపోయె నోయి! నీ మనుజ జన్మ. కరుణశ్రీ

ముక్కు తిమ్మన

Image
వింజమూరి అప్పారావుగారి అనుమతితో....గంటివారు అడిగిన ప్రకారం.... నందితిమ్మన ముక్కు తిమ్మనగా ప్రసిద్ధి అయ్యాడు. దానికి ఒక కథ చెబుతారు. ఈయన నాయిక ముక్కుని వర్ణిస్తూ “నానా సూన....” అనే పద్యం చెప్పాడట. ఈ పద్యంతో నంది తిమ్మన కాస్తా ముక్క తిమ్మన అయ్యాడు. ఈ పద్యాన్ని రామరాజభూషణుడు కొనుక్కొని తన వసుచరిత్రములో వాడుకున్నాడనీ మరో కథ ఉంది. ఇది పూర్తిగా కట్టుకథ అని తేల్చారు. ఈ పద్యం గొప్పదే కానీ అనువాదం. కాకతీయుల కాలంనాటి విద్యానాథుడి శ్లోకం. భృంగానవాప్తి ప్రతిపన్న ఖేదా! కృత్యావనే గంధఫలీత పాలం తన్నాసికా భూదనుభూత గంధా! స్వపార్శ్య నేత్రీ కృతభృంగ సేవా ! దీన్నే కళాపూర్ణొదయ కర్త పింగళిసూరన్న "అంబుజగంధి నాసిక నిజాన్వయ శత్రువు చంపక ప్రసూనంబు గరంబు గెల్చుట మనంబున బెట్టి..." అంటూ అనువదించాడు. అనువాద పద్యానికి ఇంత హడావిడా? ఇంటిపేరు మారిపోయిందా? అసంబద్ధం అని తేల్చారు విమర్శకులు. ఇలాంటి అర్థం వచ్చే పద్యం హర్ష నైషధంలో - తపస్సుచేసి దమయంతి పాదాల్లా మారిందని - ఉంది. “వసుచరిత్రము”లో వసురాజు నర్మసచివుడు ఒక వీణా నాదం విన్నారు. ఆ నాదం ఎక్కడిదో కనుగొనడానికి నర్మసచివుడు వెళతాడు. అతడు అక్కడ వీణవాయ

సరస్వతీ స్తోత్రం

Image
రచన: అగస్త్య ఋశి యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా | యా బ్రహ్మాచ్యుత శంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా || 1 || దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణినిభై రక్షమాలాందధానా హస్తేనైకేన పద్మం సితమపిచ శుకం పుస్తకం చాపరేణ | భాసా కుందేందుశంఖస్ఫటికమణినిభా భాసమానాౙ్సమానా సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా || 2 || సురాసురైస్సేవితపాదపంకజా కరే విరాజత్కమనీయపుస్తకా | విరించిపత్నీ కమలాసనస్థితా సరస్వతీ నృత్యతు వాచి మే సదా || 3 || సరస్వతీ సరసిజకేసరప్రభా తపస్వినీ సితకమలాసనప్రియా | ఘనస్తనీ కమలవిలోలలోచనా మనస్వినీ భవతు వరప్రసాదినీ || 4 || సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి | విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా || 5 || సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః | శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః || 6 || నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమో నమః | విద్యాధరే విశాలాక్షి శుద్ధఙ్ఞానే నమో నమః || 7 || శుద్ధస్ఫటికరూపాయై సూక్ష్మరూపే నమో నమః | శబ్దబ్రహ్మి చతుర్హస్తే సర్వసిద్ధ్యై నమో నమః || 8 || ముక్తాలంకృత

Saraswatee Vamdanam

Image
Yaa Kundendu tushaara haaradhavalaa, Yaa shubhravastraavritha| Yaa veenavara dandamanditakara, Yaa shwetha padmaasana|| Yaa brahmaachyutha shankara prabhritibhir Devaisadaa Vanditha| Saa Maam Paatu Saraswatee Bhagavatee Nihshesha jaadyaapahaa||

Saraswati Mantra....

Image
Yaa Kundendu tushaara haaradhavalaa, Yaa shubhravastraavritha| Yaa veenavara dandamanditakara, Yaa shwetha padmaasana|| Yaa brahmaachyutha shankara prabhritibhir Devaisadaa Vanditha| Saa Maam Paatu Saraswatee Bhagavatee Nihshesha jaadyaapahaa||

అందెలు గజ్జెలు మ్రోయగ చిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా నందుని సతి యా గోపిక ముందర నాడుదువు మిగుల మురియుచు కృష్ణా! కృష్ణ శతకము ఓ కృష్ణా!పసితనమున నీ కాళ్ళ కలంకరించిన అందెలు,గజ్జెలు చప్పుడగుచుండగా,గంతులిడుచు నేడుకగా నందుని భార్యయగు ఆ యశోద ముందర ముద్దులొలుకునట్లు నీవు ఆడుచుందువు.

అందెలు గజ్జెలు మ్రోయగ చిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా నందుని సతి యా గోపిక ముందర నాడుదువు మిగుల మురియుచు కృష్ణా! అందెలు గజ్జెలు మ్రోయగ చిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా నందుని సతి యా గోపిక ముందర నాడుదువు మిగుల మురియుచు కృష్ణా! కృష్ణ శతకము ఓ కృష్ణా!పసితనమున నీ కాళ్ళ కలంకరించిన అందెలు,గజ్జెలు చప్పుడగుచుండగా,గంతులిడుచు నేడుకగా నందుని భార్యయగు ఆ యశోద ముందర ముద్దులొలుకునట్లు నీవు ఆడుచుందువు. ఓ కృష్ణా!పసితనమున నీ కాళ్ళ కలంకరించిన అందెలు,గజ్జెలు చప్పుడగుచుండగా,గంతులిడుచు నేడుకగా నందుని భార్యయగు ఆ యశోద ముందర ముద్దులొలుకునట్లు నీవు ఆడుచుందువు.

గజేంద్ర మోక్షణ ఘట్టం.

Image
అడిగెదనని కడు వడిఁ జను- నడిగిన దను మగుడనుడుగడని నడయుడుగున్ వెడవెడ చిడిముడి తడఁ బడ నడుగిడు; నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్ గజేంద్ర మోక్షణ ఘట్టం. భర్తగారు ఎక్కడికో హడావుడిగా పరిగెడుతున్నారు. లక్ష్మి తటపటాయింపు ఆమె అడుగుల్లో కనబడుతోందని పోతన యీ పద్యంలో పదాలలో చూపించారు. ఇది 'సర్వలఘు కంద పద్యం'. `ఎక్కడికి వెళ్తున్నారు?' అని అడుగుదామని తొందరగా ముందుకెళ్తుంది. అడిగినా వెనుకకి పొమ్మంటారని వెనుకకు జంకుతుంది. ఇలా అటూ యిటూ ఆగి, వెళ్ళి, తడబడుతూ అడుగులేస్తోంది. పైకి చదివితే ఈ పద్యం అందం బయటపడుతుంది.

నంది తిమ్మన గారి "పారిజాతాపహరణము" నుండి.

Image
B.v. Ramana నంది తిమ్మన గారి "పారిజాతాపహరణము" నుండి.  మగమీల నగఁ జాలు తెగఁ గీలుకొను వాలుఁ గనుఁగవ కొక వింత కాంతి యొదవె  వలిజక్కువల పెక్కువలు దక్కువగ నిక్కు  చనుదోయి కొక వింత చాయ దోఁచె నెల తుమ్మెదల దిమ్ము వెలిఁజిమ్ము చెలువమ్ము గలవేణి కొక వింత నలుపు మీఱె నల చెందొవల విందు చెలువెందు వెదచిందు మొగమున కొక వింత జిగి దొలంకెఁ జక్కఁదనమున కొక వింత చక్కఁదనము  జవ్వనంబున కొక వింత జవ్వనంబు విభ్రమంబున కొక వింత విభ్రమంబు గలిగె నద్దివ్య కుసుమంబు కతన సతికి శ్రీకృష్ణుడు రుక్మిణీ మందిరంలో ఉండగా కలహప్రియుడైన నారదుడు పారిజాత పుష్పాన్ని ఆయనకిచ్చి నీ భార్యలలో నీకెవరు ఎక్కువ ఇష్టమయితే వారికీ దివ్యకుసుమాన్ని ఇవ్వు అని ఇరకాటంలో పెట్టాడు. పాపం శ్రీకృష్ణుడు ఆ పుష్పాన్ని రుక్మిణీ దేవికి ఇవ్వక తప్పింది కాదు. ఆవిడ భక్తితో దాన్ని జడలో తురుముకుంది.  ఆ దివ్య పారిజాత కుసుమాన్ని అలంకరించుకోడం చేత - అసలే గండు చేపల్ని సైతం పరహసించే ఆవిడ కళ్ళకి ఒక వింత కాంతి వచ్చి చేరింది. పూర్వం కంటే ఎక్కువ శొభాయమానమయ్యాయని. గుండ్రని చక్రవాక పక్షుల గొప్పలు (పెక్కువలు) కించపరిచేట్టు (తక్కువగ చేస

తెలుగు తల్లికి మల్లె దండ.

Image
తెలుగు వెలుగులు తెలుగు తల్లికి మల్లె దండ (రాయప్రోలు సుబ్బారావు) పాల క్రొమ్మీగడల్ వచ్చి వెన్నయి విచ్చి తీయని నునుపూసలాయెనేమో కమ్మని మకరంద కణములు స్నేహించి చిన్నారి పలుకులై చిక్కెనేమో పూల లావణ్యంబు పొంగి చక్కదనాల పిందెలై రుచులెక్కి పెరిగెనేమో సెలయేటి యుయ్యాల కులుకు టోయ్యారముల్ ముద్దు ముచ్చటలయి ముదిరెనేమో పాటకును, పద్యమునకు నబ్రముగ నొదిగి చవికి చాతుర్యమునకు, సాజముగ సాగి పోరునకు పొత్తునకు జాతి పొంది పొసగు మా తెలుగు తల్లి మెడ కిదె మల్లెదండ!!

కాబోయే కథకులకు పనికొచ్చే చిట్కాలు: ఆరుద్ర

Image
కాబోయే కథకులకు పనికొచ్చే చిట్కాలు: ఆరుద్ర చాల్లేవయ్యా..ఆపాటి అనుభవం మాకూ ఉంది. ఊ కొట్టడం వచ్చిన దగ్గర్నుంచీ కథలు వింటున్నాం. కూడబలుక్కుని చదవడం మొదలుపెట్టిన దగ్గర్నుంచీ కథలు చదివేస్తున్నాం. కంపోజిషన్లు రాయటం మొదలెట్టిన మర్నాటినుంచీ కథలు రాస్తున్నాం. ఇంతకన్నా ఇంకేం కావాలి. అని మీలో ఏ ఒక్కరైనా అనగలిగితే మీకు అనుభవముందని తప్పుకుండా ఒప్పుకుంటాను. చిన్నప్పటినుంచీ కథలు వినాలనీ,చదవాలనీ,వ్రాయాలనీ తహ తహ ఉన్నవాళ్ళు మంచి కథకులవడానికి అవకాశాలున్నాయి అంటున్నారు ప్రముఖ(సినీ)కవి స్వర్గీయ ఆరుద్ర.. ఆయన “కాబోయే కథకులకు పనికొచ్చే చిట్కాలు!” అంటూ కథలు వ్రాసే ఆసక్తి ఉన్నవారి కోసం ఓ వ్యాసం వ్రాసారు. పనికొస్తుందనుకుంటే (సినిమా వాళ్లకు కూడా వర్తిస్తుందనే) చదవండి. “మనం చదివే చాలా కథలు కన్నా మనం రాసే కథలే మనకి బాగుంటున్నాయి. అయినా మనం పంపించే కథలు ఈ పత్రిక వాళ్లు ప్రచురించరే? ” అని మీరెప్పుడేనా బాధపడ్డారా? ఇప్పుడు పడుతున్నారా? పడకండి ధైర్యం చేతబట్టుకొని, కాళ్లు నిలదొక్కుకోండి. మీరు పంపించే కథలు మీకొక్కరికే బాగుంటే చాలదు. అందరికీ బాగుండాలి. అప్పుడే సంపాదకులు వాటిని ప్రచురిస్తారు. బాగున్న కథల్ని పత్రికలవ

.శ్రీకాళహస్తీశ్వర శతకము.

Image
కలంచు న్మకునంబులంచు గహయో / గంబంచు సాముద్రికం బులటంచుం దెవలంచు,దిష్టియనుచు / న్భూతంబులంచు న్విషా శలటంచు న్నిమిషార్ధ జీవనములం / దుం బ్రీతి పుట్టించినా సిలుగుల్ ప్రాణూల కెన్ని చేసితివయ్యా! / శ్రీకాళహస్తీశ్వరా! ధూర్జటీ.... .శ్రీకాళహస్తీశ్వర శతకము. శ్రీకాళహస్తీశ్వరా!ప్రకృతియందు మానవ జీవితములో కలలనీ, శకునాలనీ, గ్రహచారమనీ, సాముద్రికమనీ, రోగాలనీ, దిష్టియనీ, భూతములనీ,విషాదములనీ-ఎన్నియో రీతులను కల్పించితివి గదయ్యా!ఇవన్నియు క్షణాభంగురమైన.మానవ జీవితానికి అంగరక్షలు అని ఏర్పరచితివి.నీ భక్తి ఉన్నచో ఇవి అన్నియు ఏమీ చేయలేవు గదా!

మనసుకు మైల ఉండదు.

Image
మైలలో ఉంటే దేవుణ్ణి ద్యానించవచ్చా ? భగవంతుని నామస్మరణ మనసును నిర్మలం చేస్తుంది. ఆ సమయంలో మైల వున్నా భగవంతుని నామస్మరణం చేయడం ద్వారా స్వామి కి మైల సోకదు. నిరభ్యంతరంగా దైవస్మరణ చేసుకోవచ్చు. అయితే పూజ మందిరాన్ని గాని, సంబందిత పాత్రలను గాని తాకరాదు. నామస్మరణకు ఎటువంటి దోషం లేదని ధర్మ శాస్త్రం సెలవిస్తోంది. మనసుకు మైల ఉండదు.

కృష్ణ శతకము.

Image
మడుగుకు జని కాళీయని పడగలపై భరతశాస్త్ర పద్దతి వెలయన్ గడు వేడుకతో నాడెడు నడుగులు నా మదిని దలఁతు నచ్యుత కృష్ణా! కృష్ణ శతకము. కృష్ణా!మహాభయంకరుడయి జనులను భాదించు కాళీయుడను పాము నివసించు సరస్సునకు పోయి ఆ సర్పపు పడగలపై నాట్యశాస్త్ర విధానము ప్రకారము ఎంతో విలాసముగా నాట్యమాడి దానిని హతమార్చిన పాదములను నా మనస్సులో స్మరింతును.

శ్రీనాథుడి గుణనిధి కథలోని పద్యం

శ్రీ అప్పారావుగారి "కిళ్ళీ" పొడుపుకథ వలన నాకు శ్రీనాథుడి గుణనిధి కథలోని పద్యం గుర్తుకొచ్చింది. మరిచి ధూళీ పాళి పరిచితంబులు మాణి బంధాశ్మ లవణ పాణింధమములు బహుళ సిద్ధార్థ జంబాల సారంబులు పటురామఠామోద భావితములు తింత్రిణీక రసోపదేశ దూర్థురములు జంబీర నీరాభి చుంబితములు హైయంగవీన ధారాభిషిక్తంబులు లలిత కస్తుంబరూల్లంఘితములు శాకపాక రసావళీ సౌష్టవములు భక్ష్యభోజ్య లేహ్యంబులు పానకములు మున్నుగాఁ గల యోగిరంబులు సమృద్ధి వెలయగొని వచ్చె నొండొండ విధములను మహా శివరాత్రినాడు ఒక శివభక్తుడు సిద్ధపరచిన నైవేద్యాలను వర్ణిస్తున్న పద్యమిది. మిరియాలపొడి (మరిచిధూళి) చల్లినవి కొన్నీ, సైంధవలవణం వేసి తయారు చేసినవి కొన్నీ, ఆవపెట్టి (సిద్ధార్ధ) వండినవి కొన్నీ, ఇంగువతో (రామఠము) ఘుమఘుమలాడుతున్నవి కొన్నీ, చింతపండుపులుసుతో (తింత్రిణీక రసం) చేసినవి కొన్నీ, నిమ్మరసంతో (జంబీర నీరం) చేసినవి కొన్నీ, తాజా నేతిలో (హైయంగవీనము = నిన్నటి పాలు తోడు పెట్టగా తయారయిన పెఱుగుని నేడు చిలికి తీసిన వెన్నకాచిన నెయ్యి - సద్యోఘృతం), మునిగితేలుతున్నవి కొన్నీ, లేత కొత్తిమీరతో పరిమళిస్తున్నవి కొన్నీ, శాకంగా ఉన్నపుడూ పాకంగా రసంగా

శ్రీ దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రిగారు.

Image
శ్రీ దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రిగారు.దేవులపల్లిసోదరకవులలో యొకరు.రెండవవారు తమ్మనశాస్త్రులవారు.1879 వ సంవత్సరం నివంబరు నెల పిఠాపురసంస్శ్చానాధీశుడు శ్రీగంగాధరరామరాయ మహారాజుగారి యాస్థానం కవిపండితులతో కిటకట లాడుతోంది.కారణం శతావధాని,భరతాభ్యుదయ ప్రబంధకర్త విద్వాన్ శ్రీ మాడభూషి వేంకటాచార్యులవారు,శతావధానము చేయుటకు విచ్చేసినారు.అపూర్వ శతావదాన ప్రక్రియ.అవధాననైపుణ్యము,అసాధారణ ధారణకు రాజావారబ్బురపడి వారిని తగురీతి సమ్మానించి యిట్లనిరి:-సభ్యులారా!మనయాస్థానంబున నేతాదృక్షవిచక్షణులెవ్వరేని నివ్వటిల్లుదురే? యని ప్రశ్నించిరి.అప్పుడు యొక సభ్యుడు లేచి దేవా!దేవర సంస్థానిక విద్వాంసులగు శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రులుగారు,వారి కుమారులు యిరువురు కూడా అవధానంబునకు సమర్ధులని విన్నవించిరి. కాని వారికి దేవులప్లలి వారి కవితా శక్తి మాత్రమే తెలియును కాని వారిధారణశక్తిగాని,మేధా శక్తిగాని ఇంతవరకు ప్రకటితము కాలేదు.వెంటనే రాజావారు చంద్రంపాలెంనుండి దేవులపల్లివారిని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించిరి.ఈ ఇరువది యారేళ్ల యువకులైన సుబ్బరాయశాస్త్రిగారికి ఇది క్రొత్తగానుండుటచే మరునాడు అవధానము చేయుటకంగీకరించిరి. మరునాడవదధానమునకు హాజర

కృష్ణ శతకము

Image
అందెలు గజ్జెలు మ్రోయగ చిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా నందుని సతి యా గోపిక ముందర నాడుదువు మిగుల మురియుచు కృష్ణా! కృష్ణ శతకము ఓ కృష్ణా!పసితనమున నీ కాళ్ళ కలంకరించిన అందెలు,గజ్జెలు చప్పుడగుచుండగా,గంతులిడుచు నేడుకగా నందుని భార్యయగు ఆ యశోద ముందర ముద్దులొలుకునట్లు నీవు ఆడుచుందువు.

అమ్మా, నాన్న ఎక్కడికి....(దేవరకొండ బాల గంగాధర తిలక్ కవిత్వం..)

Image
అమ్మా, నాన్న ఎక్కడికి....(దేవరకొండ బాల గంగాధర తిలక్ కవిత్వం..) అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళాడు? ఇంకా రాడేం? అని అడిగాడు నాలుగేళ్ళ పిల్లవాడు మరోసారి- అలవోకగా, వాడి తల నిమురుతూ ఆమె అలాగే ఆశతో వింటోంది రేడియోలో వార్తలు- ఆమె కళ్ళల్లో విమానాల రెక్కలు కదలిన నీడలు ఆమె గుండెల్లో మర ఫిరంగులు పేలిన జాడలు.... ..కాష్మీర్ సరిహద్దుల్లో పొగలమధ్య కాలూని నిల్చున్న సైనికుడు ఆమె కళ్ళ ముందు నిలిచాడు. ఆమె కళవళపడింది - నిట్టూర్చింది పైట సరిచేసుకుంది అంతలో మృదు గర్వ రేఖ ఆమె పెదాల చిరునవ్వుతో కలసి పోయింది... .. ఆమె రోజూ వస్తుంది పార్కు లోకి వార్తల కోసం అల్లాగే తెల్లని చీర కట్టుకొని యెర్రని బొట్టు పెట్టుకుని నల్లని వాల్జెడలో తెల్లని సన్నజాజులు తురుముకొని... ... జాతికి మతావేశం పొదిగితే కోతి అవుతుంది పాకిస్తాన్ చైనా ల మధ్య మైత్రి, పామూ తోడేలూ కలసినట్టు ఇది రెండు దేశాల మధ్య యుధ్ధమే కాదు... ప్రపంచ భవితవ్యానికి ప్రధానమైన విలువల్ని కాపాడే ప్రయత్నం ఇది... ....శత్రువుల టాంకులు విమానాలు యెన్నో కూలిపోయాయి సాహసోపేతమైన భారత సైన్య తరంగం లాహోర్ సరిహద్దుల మీద విరుచుకు పడింది నిర్ణిద్ర హర్యక్షమై జాతి నిలబడి గర్జించింది ....

.శ్రీకాళహస్తీశ్వర శతకము.

Image
శ్రీకాళహస్తీశ్వర శతకము ! (ధూర్జటి..) నిను సేవింపగ నాపదల్పొడమనీ, / నిత్యోత్సవంబబ్బనీ జనమాత్రుండననీ మహాత్ముడననీ / సంసార మోహంబు పై కొననీ జ్ఞానముగల్గనీ గ్రహగతుల్ / కుందింపనీ,మేలు వ చ్చిన రానీ యవి నాకు భూషణములే / శ్రీకాళహస్తీశ్వరా! . శ్రీకాళహస్తీశ్వరా! నీకు సేవలు చేయు సందర్భములో నాకు ఆపదలు వచ్చిన రానిమ్ము లేక మేలు జరిగి అన్ని వేళాలయందు నీకు వేడుకలు జరుగనిమ్ము.సామాన్య మానవుడని అందరూ అననిమ్ము.లేక నన్ను మహాత్ముడని ప్రశంసించనిమ్ము,సంసార సముద్రములో మోహాదులు కలిగితే కలుగనీ,జ్ఞానము