Posts

Showing posts from July, 2013

రాష్ట్రాలు తెలుగు ఖ్యాతికి అడ్డు గోడలు కావు

తెలంగాణ ఆంధ్రులు.. కోస్తా ఆంధ్రులు .. రాయలసీమ ఆంధ్రులు ... ప్రవాసాంధ్రులు....అందరు ..తెలుగు జాతికి ప్రతి బింబా లే ... తెలుగు జాతికి గర్వ కారణాలే ...తెలుగు ఖ్యాతికి పెంపు చేసేవారే... రాష్ట్రాలు తెలుగు ఖ్యాతికి అడ్డు గోడలు కావు http://www.youtube.com/watch?v=PBwh69j5rTs&feature=youtu.be&a

అక్కినేని స్వంత పాట Cheliya kanarava..Balaraju old telugu moviee 1947-48.

అక్కినేని స్వంత పాట....

Image
అక్కినేని స్వంత పాట Cheliya kanarava..Balaraju old telugu moviee 1947-48.  సినిమాలో మనం ఘంటసాల గారి పాట వింటాం...  కా నీ ఈ పాట నాగేశ్వర రావు గారు స్వయం గా పాడేరు... నిర్మాతలు మర్చేరు...కారణం.. ఘంటసాల గారి పాటే  వారికీ  నచ్చింది..

శ్యామలా దండకం....

Image
శ్యామలా దండకం ధ్యానమ్- మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసామ్ | మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి || ౧ || చతుర్భుజే చంద్రకలావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే | పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః || ౨ || వినియోగః- మాతా మరకతశ్యామా మాతంగీ మదశాలినీ | కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ || ౩ || స్తుతి- జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే | జయ సంగీతరసికే జయ లీలాశుకప్రియే || ౪ || దండకమ్- జయ జనని సుధాసముద్రాంతరుద్యన్మణీద్వీపసంరూఢ బిల్వాటవీమధ్యకల్పద్రుమాకల్పకాదంబకాంతారవాసప్రియే కృత్తివాసప్రియే సర్వలోకప్రియే,సాదరారబ్ధసంగీతసంభావనాసంభ్రమాలోలనీపస్రగాబద్ధచూలీసనాథత్రికే సానుమత్పుత్రికే, శేఖరీభూతశీతాంశురేఖామయూఖావలీబద్ధసుస్నిగ్ధనీలాలకశ్రేణిశృంగారితే లోకసంభావితే కామలీలాధనుస్సన్నిభభ్రూలతాపుష్పసందోహసందేహకృల్లోచనే వాక్సుధాసేచనే చారుగోరోచనాపంకకేళీలలామాభిరామే సురామే రమే, ప్రోల్లసద్వాలికామౌక్తికశ్రేణికాచంద్రికామండలోద్భాసి లావణ్యగండస్థలన్యస్తకస్తూరికాపత్రరేఖాసముద్భూత సౌరభ్యసంభ్రాంతభృంగాంగనాగీతసాంద్రీభవన్మంద్రతంత్రీస్వరే సుస్వరే భాస్వరే, వల్లకీవాదనప్రక్రియ

తనికెళ్ళ భరణి ...

Image
Bhaasskar Palamuru తెలుగు సాహిత్యంలో అతడు అరివిరిసిన మందారం కళామతల్లి మేడలో దారమై నటుడిగా విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ రచయితగా ..కవిగా .. కలాకారుడిగా .. దర్శకుడిగా ..విశ్లేషకుడిగా ... తనికెళ్ళ భరణి అరుదైన పాత్రను పోషిస్తూ ఎందరినో అభిమానుల మనసు దోచుకున్నారు కలకాలం గుర్తుంచుకునేలా తనను తాను తీర్చిదిద్దుకున్నారు భరణి మనకు దక్కిన గౌరవం తెలుగు సినిమా చేసుకున్న పుణ్యం .. పదికాలాల పాటు బతకాలి

Divine quotes..

Image
Divine quotes.. The first step in samskara (refinement) is to remove dirt from the mind. Know that envy is the stickiest dirt. You must be happy, when people around you are happy. That is the true test. The Ramayana says that Lord Rama was happy when joyous events happened to others around, as if they happened to Him. Krishna describes Arjuna as An-asuya (envy-less). What a great compliment to receive from the Master Himself! That is why Lord Krishna taught the mysteries of spiritual discipline to Arjuna. Have deep Love for the Lord. But be very careful not to become depressed with envy when others also love Him or get His attention and become attached to Him. Always be vigilant to have love without envy. Divine quotes.. The women of a country should be happy, healthy and holy. Every woman has a very crucial role to play in their individual uplift and the uplift of their homes and societies around them. Young girls and women alike should learn the technique of mental calm, social

భీమకవి ....

Image
భీమకవి కాలం ఇంతవరకూ ఎవరూ నిర్ధారణ చేయలేదు కాని ఆయనగురించి చెప్పుకునే కథలు చాలా వున్నాయి. ముఖ్యంగా జననం గురించి. గోదావరిమండలంలో ద్రాక్షారామ భీమేశ్వరాలయం ప్రాంతంవాడని ఒకకథనం. ఆయన తల్లి బాలవితంతువు, సాటి చెలులతో కలిసి భీమేశ్వరస్వామి దర్శనసమయంలో స్త్రీలకోరికలు వింటూ నాకు నీవంటిపుత్రునివ్వమని కోరిందిట. స్వామి ఆవిడ అభీష్టం నెరవేర్చాడు. ఆవిడ తనముద్దుబిడ్డకి భీమన అని పేరు పెట్టుకుని పెంచుకుంటూంది. వూళ్లో ప్రజలు మాత్రం ఆమె మాట నమ్మక, వెలివేశారు. అ పిల్లవాడిని సాటిపిల్లలు రండాపుత్రుడని గేలి చేయగా, అతడు వచ్చి తల్లిని తనతండ్రి ఎవరని అడిగితే, ఆమె భీమేశ్వరుడేనని చెప్పిందిట. అంతట, ఆ చిన్నవాడు భీమేశ్వరాలయానికి వెళ్లి, “నన్ను వూళ్లో అందరూ తండ్రి లేనివాడని గేలి చేస్తున్నారు. నువ్వు నిజంగా నాతండ్రివవునో కాదో చెప్పకపోతే ఇక్కడే తలపగలగొట్టుకు చస్తాను” అని పట్టు బట్టాడు. అప్పుడు భీమేశ్వరుడు ప్రత్యక్షమయి, అతనితల్లిమాట నిజమేననీ, తానే తండ్రిననీ చెప్పి, అందుకు నిదర్శనంగా భీమన ఆడినమాట సత్యమవుతుందని వరం ఇచ్చాడుట. ఒకనాడు వేములవాడలో ఒక బ్రాహ్మణుని ఇంటిలోసంతర్పణ జరుగుతోంది. ఆ ఇంటి యజమాని అందరినీ ఆహ్వానించాడు, కా

-<@ **శుభాకాంక్షలు** @>--

Image
- -<@ **శుభాకాంక్షలు** @>-- ____________________________________________ స్వాతంత్ర్యం రాక ముందు తెల్ల వాళ్ళు దోచుకున్నారు.. వచ్చినాక నల్లవాళ్ళు (సొంత వాళ్ళే) దోచుకుంటున్నారు.. కాబట్టి స్వాతంత్ర్యం వచ్చినట్టా ?? లేనట్టా??? స్వాతంత్ర్యం ఎందుకొరకు పోరాడి తెచ్చుకున్నామో.., స్వాతంత్ర్యం కోసం ఎందుకు అంతలా తపించామో , అదే నేరవేరనపుడు నామమాత్రపు స్వాతంత్ర్యం వచ్చీ ఏం ప్రయోజనం??? --- ఇన్నాళ్ళూ అన్యాయాలు జరిగాయి, అక్రమాలు జరిగాయ్ అంటూ గొంతులు చించుకుని వేర్పాటు వాదానికి పునాదులేసి రాష్ట్రాన్ని విడగొట్టి , రాష్ట్ర ప్రయోజనాల్ని చెడగొట్టి , సొంత రాష్ట్రం అంటూ గొడవ చేసి సాధించుకుంటున్న సోదరులకి శుభాకాంక్షలు. ఇప్పటి వరకూ మిమ్మల్ని రెచ్చగొట్టిన మీ ప్రతినిధులే రేపు మిమ్మల్ని దోచుకోకుండా చూసుకోండి.. ఆత్మార్పణలతో , సొంతం చేసుకున్న ఫలితాన్ని అనుభవించండి. జాగ్రత్తగా చూసుకోండి..., అక్రమాలను, అన్యాయాన్నీ పెరగనివ్వకండి.. వచ్చేస్తుందీ, వచ్చేసింది.., అంటూ తృప్తి పడకుండా, వచ్చినదాన్ని కాపాడుకోవటంలో అభివృద్ధి చేసుకోవడంలో శ్రద్ధ చూపండి. ఎలాగో మా నమ్మకాలపై , కలిసుండాలనే ఆశలపై నీళ్ళ

.మనవాళ్ళు అంత ఒట్టి ఇడియట్స్ ...

Image
సూలురు పేట నుండి శ్రీకాకుళం దాక కాణీ.కాణీ కూడ పెట్టి చెన్నపట్నం అభి వ్రుది చేసారు...ఆనాడు.... అదే సూలుర్ పేట నుండి శ్రీ కాకుళం దాక పైసా .పైసా కూడ పెట్టి హైదరాబాదు ను అభి వ్రుది చేసారు..ఈనాడు.. రెండు సార్లు ..నెత్తిన తడి గుడ్డలు .. మిగిలియీ.... ఉరికే అనలేదు గిరీశం.. .మనవాళ్ళు అంత ఒట్టి ఇడియట్స్ ...అని.

నన్నయ్యగారి గడుసుదనం...

Image
నన్నయ్యగారి గడుసుదనం.... కురుపాండవ రాజకుమారులు విద్యాభ్యాసం పూర్తి చేసుకొని తమ తమ విద్యలనీ, శస్త్రాస్త్ర ప్రయోగ కౌశలాన్నీ ప్రదర్శించే సన్నివేశం. సుతుల విద్యాప్రవీణత జూచు వేడ్క నెంతయును సంతసంబున గుంతిదేవి రాజు సన్నిధి, గాంధారరాజపుత్రి కెలన నుండె, నున్మీలితనలిననేత్ర ఇదీ పద్యం. ఇందులో పెద్ద విశేషం ఏముంది? తన కొడుకుల విద్యాప్రావీణ్యాన్ని చూడాలన్న కోరికతో, చాలా సంతోషంగా, ధృతరాష్ట్రుని సన్నిధిలో గాంధారీదేవి పక్కనే కుంతి కూర్చుని ఉంది. ఇంతే దీని అర్థం! "కెలన నుండె" అన్న దగ్గర యీ అర్థం పూర్తయిపోయింది. కానీ పద్యం పూర్తి కాలేదు! చివరన "ఉన్మీలితనలిననేత్ర" అని ఒక పదాన్ని వేసారు నన్నయ్యగారు. "లోనారసి" చూడలేని విమర్శకులు, "ఆఁ, ఇది వట్టి పాదపూరణ కోసం వేసిన పదం" అని తోసిపారేస్తారు. కాని అసలు మందుగుండంతా యీ ఒక్క పదంలోనే ఉంది! "ఉన్మీలిత-నలిన-నేత్ర" అంటే "బాగా విచ్చుకున్న తామరపూవుల్లాంటి కళ్ళు ఉన్నది" అని అర్థం. కుంతీదేవికి నన్నయ్యగారు వేసిన విశేషణం ఇది. అందమైన కళ్ళని పద్మాలతో పోల్చడం మామూలుగా ప్రాచీన కవిత్వం అంతటా కనిపించేదే. ఇక్కడ

Lakshmi Sarma A.V. గారి మంచి మాటలు....

Image
Lakshmi Sarma A.V. గారి మంచి మాటలు.... భగవంతుని చల్లని చూపు లభించకపోతే ,మంచి వారితో మైత్రి బంధం అసలే దొరకదు . మానవునికి శత్రువులు బయటి ప్రపంచంలో లేరు.... దుష్ట సంకల్పాలే శత్రువులు ,,, సత్య సంకల్పాలే మిత్రులు. జీవితంను చూచి చిరునవ్వు చిందించగలిగితే జీవితం మీ పట్ల ఎల్లప్పుడూ చిరునవ్వు చిందిస్తుంది -లక్ష్మి శర్మ. మంచి ఉపన్యాసం చెవులకు మాత్రమే కాదు ఆత్మకు కూడా విందు. మాట వినని మనిషికి మించిన చెవిటి వాడు ఎవడూ ఉండడు. తెలివైన వ్యక్తి పుస్తకాలతో పాటు జీవితాన్ని కూడా అధ్యయనం చేసాడు . చిన్న చిన్న విషయాలే పరిపూర్ణత్వానికి దారితీస్తాయి ,,కాని పరిపూర్ణత మాత్రం చిన్న విషయం కాదు - మనిషికి ఎంత సృజనాత్మకమైన ఉహా శక్తీ ఉంటే,అంత మెండుగా ప్రణాళికలు అవతరిస్తుంటాయి. అతి తొందరపాటు కంటే పిరికితనము వలన ఎక్కువుగా ఓటమి చెందుతాము. మనుషులు కాలాన్ని వృధా చేస్తారు..... కాలం మనుషులని త్వరగా చంపుతుంది. పగిలిన గాజుసీసాను అతికించలేక పోయినట్లే ...పోయిన కీర్తిని తిరిగి పొందలేము. మనం చేపట్ట్టిన పనిలో జయాపజయాలు మానసిక సామర్ధం మీద కాకా ,మానసిక వైఖరి మిద ఆధారపడి ఉంటాయి - నీ ఆస్తిని ,నీ జీవితాన్ని నిల

అంకిలి సెప్ప లేదు.

Image
అంకిలి సెప్ప లేదు, చతురంగ బలంబుల తోడ నెల్లి యో పంకజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్ జయించి, నా వంకకు వచ్చి, రాక్షసవివాహమునన్ భవదీయ శౌర్యమే యుంకువ సేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొనిపొమ్ము! వచ్చెదన్. . పంకజనాభుడవూ, పురుషశ్రేష్ఠుడవూ అయిన ఓ కృష్ణా! నీవు అడ్డు చెప్పేందుకు కారణమేమీ లేదు. రథ, గజ, తురగ, పదాతి చతురంగబలములతో నీవు విచ్చేసి, శిశుపాల జరాసంధులను జయించి, నా వద్దకు వచ్చి, క్షత్రియోచితమైన రాక్షసవివాహ పద్ధతిలో నన్ను పరిగ్రహించి తీసికొని వెళ్ళు. నేను నీ వెంట వస్తాను. ఇదీ ఈ పద్య భావము.

రామప్ప మరియు లక్నవరం ..By - Venkatachary Rangoju ..

Image
రామప్ప మరియు లక్నవరం ..By - Venkatachary Rangoju .. ఏమి సరస్సు ! లేమి గిరు ! లేమి ధరాజము ! లేమి లోయ ! ల వ్వేమి జలప్రవాహములు ! నేమి కళాత్మక కట్టడాల్ ! విధం బేమని వర్ణనల్ సలుప, నేమి రచించెదఁ వాటి గూ ? ర్చహో ! రామపదేవళమ్మనినఁ, లక్నవరమ్మనినన్ గనన్వలెన్ !!

అందుకే ప్రేమిద్దాం... ప్రేమ కోసం జీవిద్దాం..

Image
ఎదుటివారి గురించి పట్టించుకోవాలంటే ముందు మనమేమిటో మనకి తెలియాలిగా? "ఏ వ్యక్తీ జీవిత భాగస్వామిని సంపూర్ణంగా అర్థం చేసుకోలేరు. అందుకే అర్థం చేసుకొనే విషయం లో ఆరాటాలొద్దు. మనం చేయవలసిందల్లా ఒక్కటే... తక్కువగా అర్థం చేసుకోవడం. ఎక్కువగా ప్రేమించడం" నిజమే... మనకి అర్థం కాలేకపోవడం అవతలివాళ్ళ ప్రాబ్లం కానీ వాళ్ళని అమితంగా ప్రేమించడం మన ఎడదకి సాధ్యమైన పనే.. సో... సముద్రంలోని అలల్లా మన మనసులో ఎన్ని కల్లోలాలు కలవరాలు కాపురమున్నా, మన జీవిత భాగస్వామిని సాధ్యమైనంతగా ప్రేమిస్తే చాలు- మనకన్నీ పున్నములే.... వెన్నెల పూల పున్నాగలే... అందుకే ప్రేమిద్దాం... ప్రేమ కోసం జీవిద్దాం... జీవితాన్ని ఆద్యంతం ఆస్వాదిద్దాం.... By - Padma Sreeram Vangara

పద్యాలు చదివి పకోడీ రుచి ఆస్వాదించండి. ..

Image
చిలకమర్తి వారు పకోడీపై కొన్ని పద్యాలు ఆశువుగా చెప్పారు. పద్యాలు చదివి పకోడీ రుచి ఆస్వాదించండి. వనితల పలుకులయందున ననిముష లోకమున నున్న దమృతమటంచున్ జనులనుటె గాని, లేదట కనుగొన నీయందమృతము గలదు పకోడీ ! ఎందుకు పరమాన్నంబులు ఎందుకు పలు పిండివంటలెల్లను నాహా ! నీ ముందర దిగదుడుపున కని యందును సందియము కలుగ దరయ పకోడీ ! ఆ కమ్మదనము నా రుచి యా కర కర యా ఘుమ ఘుమ, యా పొమకములా రాకలు పోకలు వడుపులు నీకేదగు నెందులేవు పకోడీ ! నీ కర కర నాదంబులు మా కర్ణామృతములు, నీదు మహితాకృతియే మా కనుల చందమామగ నే కొనియాడెదను సుమ్ము నిన్ను పకోడీ! ఆ రామానుజు డాగతి పోరున మూర్చిల్ల దెచ్చె మును సంజీవిన్ మారుతి ఎరుగడు, గాక, య య్యారె నిను గొనిన బ్రతుకడట పకోడీ ! హరపురుడు నిన్ను దిను నెడ గరుగదె యొక వన్నె నలుపు గళమున, మరి చం దురుడున్ దినిన కళంకము గరుగక యిన్నాళ్లు నుండగలదె పకోడీ! ఈ పకోడీలు ఎప్పుడు కావాలంటే అప్పుడు గుర్తు తెచ్చుకుని రుచి ఆస్వాదించవచ్చు.. కానీయండి మరి.

మారుతి కోసిన మామిడిపండు.

Image
రచయిత : గోలి హనుమచ్ఛాస్త్రి ..... మారుతి కోసిన మామిడిపండు. కందము: ఆకసపు మావి చెట్టున నా కాసిన పండు జూడ నాకలి పుట్టెన్ తోకనె యూపుచు తేజము తో కపివరు డెగిరె భాను తొడిమను ద్రుంచన్.

ఆకాశదేశాన, ఆషాఢమాసాన మెరిసేటి, ఓ మేఘమా!

Image
ఆకాశదేశాన, ఆషాఢమాసాన మెరిసేటి, ఓ మేఘమా! విరహమో దాహమో విడలేని మోహమోవినిపించు నా చెలికి, మేఘసందేశం సందర్భాన్ని, మబ్బుని పరిచయం చెయ్యడం కోసం వేటూరి - "ఆకాశ దేశంలో, ఆషాఢ మాసం" అని అన్నారు. ఈ "ఆకాశదేశం" ప్రయోగం వేటూరికి బాగా నచ్చి ఆ పైన చాలా సార్లు వాడుకున్నారు. [ఉదా:- అగడం బగడం (చిత్రం: హనుమాన్), తెల్ల చీరకు తకధిమి (చిత్రం: ఆఖరి పోరాటం), ఏ కొమ్మకాకొమ్మ (చిత్రం: శీను).] మిగతా పాటలో వాన ప్రస్ఫుటంగా కనిపించకపోయినా ఆ ధ్వని ఉంటుంది. అందుకే కదా అది "మేఘ"-సందేశం! "వానకారు కోయిలనై" (వసంతం వెళ్ళిపోయిన తఱువాత కోకిల), "ఉలిపిరి చినుకుల బాసలతో, తొలకరి మెరుపుల లేఖలతో, రుధిరబాష్పజల ధారలతో విన్నవించు నా చెలికి మనోవేదన...నా మరణయాతన!" చలనచిత్రంలో కథానాయకుడు కవి అయినప్పుడు పాటలు వ్రాయాలంటే దానికి ఉత్త సినీకవులు న్యాయం చెయ్యలేరనిపిస్తుంది. నిజజీవితంలో కవితాత్మకంగా ఆలోచించగలిగినవారే దానికి న్యాయం చెయ్యగలరు. అలాంటి సహజకవి అయిన దేవులపల్లి పాటలకు సమానంగా ఉండేలాగా వేటూరి ఈ చిత్రంలోని పాటలను వ్రాసారు

సూపర్ శక్తి ఉన్నాడనడానికి సాక్షాలు.

Image
బెర్ముడా ట్రాంగిల్ రహస్యము ఇప్పటి వరకు ఎవరికీ అర్థం కానిది .. తెలుసుకునే ప్రయత్నాలు చేసిన వారి ఆచూకి గల్లంతైంది .. ఇక మన దేశంలో ఇలాంటి చేదింప బడని విషయాలు ఎన్నో ... అనంత పద్మనాభస్వామి ఆరో తలుపు నెంబర్ "B " నాగ భంధం చే మూయబడింది . టెక్నాలజీ తో తలుపులు తెరిచే ప్రయత్నం చేస్తే తీవ్ర అనర్థం సంభవిస్తుందని సాత్వికులు హెచ్చరించడం , ట్రావన్కోర్ రాయల్ ఫామిలీ వారి దైవ భాషిని చిలుక హెచ్చరింపులతో తెరిచే ప్రయత్నం చేయక పోయినా లేజార్ కిరణాలు పంపి లోపల ఏముందో తెలుసుకొనే ప్రయత్నం చేసిన సిబ్బంది ఎ కారణం లేకుండా అర్థాంతర మరణం .... కైలాసగిరి పర్వతం సాక్షాత్తు కైలాసం దానిని అధిరోహించ రాదు అన్నా కూడా అధిరోహించిన వారి మరణం . ఎత్తు తక్కువ ఉన్న పర్వతం పైన నిజంగా కైలాసం ఉందా లేదా అని హెలికాప్టర్ లో పైకి వెళ్ళినప్పుడు హెలికాప్తీర్ మాయమవడం . ఇలాంటి కేసులు ఎక్కువ ప్రచారం చేయకుండా వెంటనే క్లోజ్ చేయడం .. ఇక రీసెంట్ గా విగ్రహం పొద్దున్న పసిపాపలా , మధ్యాన్నం యువతిలా , సాయం సంధ్యలో వ్రుద్దురాలిగా కనిపించే దారి దేవి మహత్యం ... ఎంతో ఉంది తొలగించకండి అని ఎంత మొరపెట్టుకున్నా , హైడ్రో ప్రాజెక్ట్ కొరకు తీ

స్వామి వివేకానంద ....

Image
తనకోసం తాను బతికేవాడు గాక, సమాజం కోసం, సమాజంలోని పీడితుల కోసం బతికేవాడే నిజమైన శక్తివంతుడు. తనలో ఉన్న అద్భుత భావస్ఫూర్తి, ఉత్సాహపూరిత రక్తాన్ని అందరికోసం వెచ్చించేవాడే నిజమైన యుక్తిపరుడని స్వామి వివేకానంద తన సూక్తుల ద్వారా ఈ సమాజానికి తెలియజెప్పారు. ముఖ్యంగా శ్రమైకజీవన సౌందర్యాన్ని గుర్తించినవాడే ఈ ధరణిలో నిజమైన సుఖాన్ని పొందగలడని, ఆయాచితంగా వచ్చే ఫలాల కోసం ఆశించేవాడి తత్వం జగానికి శ్రేయోదాయకం కాదు. ఎప్పుడూ జడత్వంతో నిండివుండి, తాను శ్రమించక, పక్కవాడి కార్యాన్ని చెడగొట్టేవాళ్లు ఈ సమాజంలో గడ్డిపువ్వులా భావించబడతారని పేర్కొన్నారు. జడత్వం అనే భావన మనిషిలో నాటుకుంటే ఆ వ్యక్తి శ్రేయోదాయకమైన ఆలోచనలకు తనలో చోటు కల్పించలేడు. అతని దృష్టిలో 'నేను' అన్నదే మహితమైన పదంగా నిలిచిపోతుందట. అతనికి శ్రేయస్సు అంటే తానూ, తన కుటుంబం మాత్రమే. మిగిలిన సంఘం అతనికి అనవసరమైన వస్తువు స్వామి వివేకానంద తెలియజెప్పారు. నేను ప్రయోజకుణ్ణి అని అనుకుంటే అలాగే అవుతారు. కాకుండా, నేను ఏమీ చేయలేననే జడత్వంలో కుంగిపోతే నిజంగా వృద్ధుడవే అవుతావు. ఈ మహాసత్యం ఎల్లవేళలా జ్ఞప్తి పెట్టుకోవాలని స్వామి వివేకానంద సమాజాన

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నొ కధలు...ఎన్నెనెన్నొ కధలు

Image
సంధ్యా రాగం చంద్ర హారతి పడుతున్న వేళ మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ ఓ శుభ ముహూర్తాన తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నొ కధలు...ఎన్నెనెన్నొ కధలు జో అచ్యుతానంద జో జో ముకుందా లాలి పరమానంద రామ గోవిందా జో జో నిదుర పోని కనుపాపలకు జోల పాడలేక ఈల వేసి చంపుతున్న ఈడునాపలేక ఇన్నాళ్ళకు రాస్తున్నా హూహు హూహుప్రే..మ లేఖ ఏ తల్లి కుమారులో తెలియదు గాని ఎంతటి సుకుమారులో తెలుసు నాకు ఎంతటి మగ ధీరులో తెలియలేదు గాని నా మనసును దోచిన చోరులు మీరు వలచి వచ్చిన వనితను చులకన చేయక తపులుంటె మన్నించి ఒప్పులుగా భావించీ చప్పున బదులివ్వండి..చప్పున బదులివ్వండి తలలోన తురుముకున్న తుంటరి మల్లే తలపులలో ఎన్నెన్నో మంటలు రేపే ఆహ్ అబ్బా..సూర్యుడి చుట్టూ తిరిగే భూమికి మల్లే నా వూర్పుల నిట్టూర్పుకు జాబిలి వాడేఆహ్ ఆహ్.. మీ జతనే కోరుకుని లతలాగా అల్లుకునే నాకు మీరు మనసిస్తే ఇచ్చినట్టు మాటిస్తే ఇప్పుడే బదులివ్వండిఇప్పుడే.. బదులివ్వండి

కొత్త అమ్మ ,

Image
ఒక 8 సంవత్సరాల అబ్బాయి వాళ్ళ అమ్మ చనిపోయింది.. కానీ వాళ్ళ నాన్న మల్లి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు.. ఒక రోజు వాళ్ళ నాన్న ఆ అబ్బాయితో ఒరేయ్ బాబు నీకు కొత్త అమ్మ , చనిపోయిన పాత అమ్మ మద్య ఏం తేడా అనిపించింది రా అని అడిగాడు.. . . . అప్పుడు ఆ అబ్బాయి ఇలా అన్నాడు.. నా కొత్త అమ్మ నిజం.. పాత అమ్మ అబద్ధం ... అది విన్న తండ్రి అవాక్కయి.. అదేంటి బాబు అల అంటున్నావ్ అంటే.. అప్పుడు ఆ అబ్బాయి ఇలా అన్నాడు.. నేను ఎపుడైనా అల్లరి చేస్తే అప్పుడు ఆ అమ్మ అనేది నువ్ ఇలాగె అల్లరి చేస్తే నేకు అన్నం పెట్టాను అని..అయిన నేను అల్లరి చేసేవన్నీ.. కానీ ఆ అమ్మ నన్ను లాక్కొని వెళ్లి తన దగ్గర కుచోబెట్టుకొని అన్నం తినిపించేది.. ఇప్పుడు ఉన్న కొత్త అమ్మ కూడా అల్లరి చేసావంటే నీకు అన్నం పెట్టను అంది .. కాని ఈ కొత్త అమ్మ 3 రోజుల నుండి నాకు నిజంగానే అన్నం పెట్టడం లేదు నాన్న.. అందుకే ఆ పాత అమ్మ అబద్ధం .. ఈ కొత్త అమ్మ నిజం.. ఇది విన్న ఆ తండ్రి నోట్లో నుండి మాటరాలేదు.....

అద్భుత చిత్రం......

Image
. 1949 బాల పత్రికలో శ్రీ వడ్డాది పాపయ్యగారుగీసిన అద్భుత చిత్రం.  ఈ బొమ్మని త్రిప్పిచూస్తే రామున్ని వనవాసానికి పంపమన్న కైకేయి  ఒక వైపు, మరో వైపు త్రిప్పి చూస్తే ఆ మాట విని విచారిస్తున్న దశరధ మహారాజు కనిపించడం విశేషం. 

వివేకవతి రంభ By - Satyanarayana Piska

Image
వివేకవతి రంభ By - Satyanarayana Piska రంభను గురించి తెలియనివారు ఎవరూ ఉండరు. ఆమె అందానికి మారుపేరు! సౌందర్యానికి ప్రతీక! దేవలోకంలోని దేవేంద్రుని ఆస్థానములోనున్న అప్సరసభామినులలో అగ్రగణ్య! అప్సరసల జాబితా చెప్పవలసివచ్చినపుడు ' రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ ' అంటూ రంభనే ప్రథమస్థానంలో పేర్కొనడం పరిపాటి. చాలా అందమైన యువతి కనబడితే "రంభలా ఉంది" అంటారు. ' మరి, ఇటువంటి చరిత్ర కలిగిన రంభను "విలాసవతి" అంటే బాగుంటుంది కాని, "వివేకవతి" అంటున్నారేమిటి?! ' అని పాఠకమిత్రులకు సందేహం కలగవచ్చు. ఐతే, ఇది నామాట కాదు. రంభ యొక్క వివేకం గురించి శ్రీనాథ కవిసార్వభౌములు తమ రసవత్ప్రబంధమైన "శృంగార నైషదము" లోని ఒక పద్యములో ఉల్లేఖించారు. ఆ పద్య వివరాల్లోకి వెళ్ళేముందు, రెండు మాటలు. ఒకసారి పుష్పకవిమానంపై గగనవీధిలో విహరిస్తున్న రావణాసురునికి, ఇంద్రుని నందనవనములో నుండి నడిచివెళ్తున్న రంభ కనిపిస్తుంది. సర్వాభరణభూషితయైన ఆమె సౌందర్యాన్ని చూసి మోహించిన దశకంఠుడు తమకంతో రంభను సమీపిస్తాడు. అప్పుడు రంభ "నేను మీ అన్నగారైన కుబేరులవారి కోడలిని; నలకూబరుని పత్నిని. మ

అధార్మికాభివృద్ధి ....

Image
అధార్మికాభివృద్ధి .... "లోకంలో ధార్మికులకంటే అధార్మికులే సుఖంగా బ్రతుకుతున్నారు" అనే మాట తరచూ వింటూ ఉంటాం. వ్యక్తిగతజీవితంలో ఎదురయ్యే సమస్యలు, సమాజంలో ఉత్పన్నమౌతున్న భయంకరమైన అనుభవాలు మనను ధర్మాచరణవిషయికంగా విచికిత్సకు గురిచేస్తాయి. "న్యాయానికి రోజులు కావండీ" "మడికట్టుకు కూర్చుంటే మట్టే మిగులుతుంది" "ఎలా సంపాదించావనేది కాదు – ఎంత సంపాదించావనేది ముఖ్యం" "నిజాయితీ కూడూ గుడ్డా పెడుతుందా ?" "చాదస్తాలు పెట్టుకోక నాలుగురాళ్ళు వెనకేసుకో" ఇలాంటి మాటలు బలహీన మనస్కులను ప్రలోభపెడతాయి. ఇవి నిజమేనేమో అనిపిస్తాయి. తాము పాటిస్తున్న నైతికవిలువలు ఆదరణీయాలా –కాదా? అనే సంశయాన్నీ కలిగిస్తాయి. అసలు ఏ విలువలూ పట్టించుకోకుండా , నిస్సంకోచంగా అధర్మవర్తనానికే అలవాటుపడినవాడికి ఈ ఊగిసలాటే ఉండదు. "ధర్మశీలురకు కష్టాలేమిటి ? అధర్మవర్తనులకు సుఖాలేమిటి ?" అనే ఆలోచన సాక్షాత్తూ ధర్మరాజుకే వచ్చింది. ఒకప్పుడు అరణ్యవాస సమయంలో ఆయన రోమశమహర్షిని – ధరణిన ధార్మికులగు – కా పురుషుల కభివర్ధనంబుఁ బుణ్యచరిత్రం బరగెడు ధార్మికులకు –దు ర్ధరమగు నవివర్

మనసైన చెలి పిలుపు...

Image
ఈ పాట మిత్రుడు పొన్నాడ మూర్తి గారికి కానుక... ఈ పాట యు ట్యూబ్ లో దొరక లేదు... నేను అప్ లోడ్ చేశాను... మనసైన చెలి పిలుపు... సీనియర్ సముద్రాల రచన...మ్యూజిక్ టి వి రాజు.. పాడినది రావు బాల సరస్వతి...ఏ .పీ. కోమల.. జయ సింహ లో పాట....వహీదా రామారావు ల జంట.

A Song From Suvarna Sundari..

Image
This superb classical duet is based on four Ragas, one each for each stanza, Sohni (Hamsanandi), Bahar (Kanada), Jaunpuri (Juanpuri) and Yaman (Yamuna Kalyani).Adi Narayana Rao was producer and his wife Anjali Devi acted in the film along with A Nageshwar Rao.

'' ఓం హ్రీం భం కాలభైరవాయ నమః"

Image
భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు( Indian Culture) కాలం అను కూలించాలంటే ఏం చేయాలి అయితే ఇలాచేసి చూడండి. " కాలానికి అధిపతి కాలభైరవుడు, విశ్వనాధుని మరోరూపం, మీకు అన్ని కాలాలు, అనుకూలంగా వుండాలంటే, తప్పక కాలభైరవుని అనుగ్రహంకావాలి. ప్రతినిత్యం తప్పకుండా కాలభైరవుని స్మరించినచో కాలానికి భయపడనవసరంలేదు " సమస్త దోషనివారణ కొరకు కాలభైరవ మంత్ర జపం 5.నిముషాలు చేయండి. నల్ల కుక్కుకు రొట్టెముక్కగాని, బిస్కట్టు గాని తిని పించండి. మంత్రం. '' ఓం హ్రీం భం కాలభైరవాయ నమః"

అమ్మలగన్నయమ్మ

Image
అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె ద్దమ్మ సురారులమ్మ కడుపారడిపుచ్చినయమ్మ తన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా యమ్మ కృపాబ్ది యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ భావం: అందరు అమ్మలకు అమ్మ, ముగ్గురు అమ్మలకూ మూలమైన అమ్మ, అమ్మలందరి కంటె గొప్పది అయిన అమ్మ, రాక్షసుల తల్లుల కడుపులకు చిచ్చుపెట్టిన అమ్మ (రాక్షసులను చంపి వారి తల్లులకు శోకం మిగిల్చిన తల్లి), తనను మనస్ఫూర్తిగా నమ్మిన దేవతల తల్లుల మనసులో నిలిచి ఉండే తల్లి, దయా గుణంలో సముద్రమంత పెద్ద మనసు గల తల్లి అయిన దుర్గాభవాని, మహత్తులు కల కవిత్వ పటుత్వ సంపదలను ప్రసాదించుగాక!

సామెతలు...

సామెతలు....సత్యవతి గారి సేకరణ. 1. అందని పండ్లకు అఱ్ఱులు చాచినట్లు. 2. అందరికి నేను లొకువ నాకు నంబి లోకువ. 3. అంగిట బెల్లం ఆత్మలో విషం. 4. అంతా వట్టిది పట్టుతెరలే. 5. అంగడి బియ్యం తంగెడి కట్టెలు. 6. అందరూ ఘనులైన హరునకు తావేది? 7. అందాల పురుషుడికి రాగి మీసాలు. 8. అందరూ ఆ బుర్రలో విత్తనాలే. 9. అంబటి మీద ఆశ మీసాల మీద మొజు. 10. అంబలి థినువేళ అమృతమబ్బినట్లు. 11. అందరూ అయ్యోరులైతే చదివేదెవరు. 12. అక్కమ్మ స్రార్ధనికి అధిశ్రావణం. 13. అక్కలు లేచేవరుకు నక్కలు కూస్తాయి 14. అగసాలిని వెలయాలిని నమ్మరదు. 15. అగ్గువ బేరం నుగ్గు నుగ్గు. 16. అగడ్తలో పడ్డ కప్పకు అదే వైకుంఠం. 17. అగ్నిలో మిడత పడ్డట్లు. 19. అడక్కుంటే జోలె అడుక్కుపోతుంది. 20. అడవి నక్కలకు కొత్వాలు ఆజ్ఞలా? 21. అడవి పులి మనుషులని ఆదరించునా? 22. అడవిలో తినేసి ఆకుతో తుడిచినట్లు. 23. అడిగింది రొట్టె, ఇచ్చింది రాయి. 24. అడుగనేరను ఊడ్చిపెట్టు అన్నట్లు. 25. అడుగు తప్పితే అరవై ఆరు గుణాలు. 26. అడుగు దాటితే అక్కర దాటుతుంది. 27. అడుగు పడగానే పిడుగు పడ్డట్టు. 28. అడేజావ్ వచ్చి బడేజావ్ అన్నదట. 29. అడుసు తొక్కనేల కాలు కడుగనేల.

Waheeda Rehman's beauty not only glows,it enchants with an aura of mystery.

Image
One of the finest Geeta Dutt songs. And Waheeda Rehman's beauty not only glows,it enchants with an aura of mystery.

వింజమూరి శివ రామారావు గారు రచించిన పాట..

Image
ఇది మా బాబయ్య గారు వింజమూరి శివ రామారావు గారు రచించిన పాట..

కాంచన ..

Image
.  మనుష్యుల వయస్సు పెరిగే కొద్దీ బాహ్య సౌందర్యం తగ్గి, వారి అతః సౌందర్యం వృధ్ధి చెందుతుంది, ఆధ్యాత్మికత వైపు అడుగులు పడతాయి''

" తేనె " వంటి తెలుగు సాహితీ వైభవ వింజామర.

Image

రాజై ఉండి తోటకూరా పంచేది??

Image
  ఒకానొక అగ్రహారములో అగ్నిహోత్రావధాని అని ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. కూటికి నే పేదను గుణములలో పెద్దను అన్నట్లు ఉండేవాడు. అతనికి ఉన్న ఆస్తి మొత్తం ఒక పూరిపాక. ఆ పాకని ఆనుకొని కాస్త ఖాళీ జాగా. ఆ జాగాలో తోటకూర విపరీతంగా పండేది. ఆ బ్రాహ్మడు చాలా మంచివాడు అవడంచేసి తన ఇంటిమీదుగా పోతున్న ప్రతివారినీ ఆపి పలుకరించి తన ఖాళీజాగాలో పండిన తోటకూర కాస్త ఉచితంగా ఇచ్చి పంపేవాడు.          అతని ఔదార్యానికి మెచ్చిన బ్రహ్మ అతనిని మరు జన్మలో మహరాజుగా పుట్టించి అతనికి పూర్వ జన్మ జ్ఞాపకం ఉండేలా మాత్రం చేసేడు, అలా జ్ఞాపకం ఉంటే తనకు మహరాజ జన్మ కలిగినందుకు గల కారణం తెలిసి మరిన్ని మంచి పనులు చేస్తాడని.          రాజైన ఆ బ్రాహ్మణుడు ఏం చేసేడో తెలుసా, తోటకూర నలుగురికీ ఉచితంగా పంచినందునే తనకు రాజ జన్మ లభించింది కనుక తాను మరు జన్మలో చక్రవర్తి కాదలచి తన రాజ్యమంతా తోటకూర పంట వేయించి అందరికీ ఉచితంగా పంచడం మొదలెట్టేడుట.          రాజై ఉండి తోటకూరా పంచేది???? మూర్ఖుడు కాకపోతే?

గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ

Image
గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ | తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః || ౧ || అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా | చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః || ౨ || గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః | గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః || ౩ || స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్సచరాచరమ్ | తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః || ౪ || గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజంచే రోజును గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించివందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు. గురువుల పట్ల ఇదే గౌరవం అన్నివేళలా పాటిస్తున్నప్పటికీ ఈ రోజు వ్యాసమహాముని పుట్టిన రోజు కాబట్టి దీనికంత ప్రాధాన్యత ఉంది. ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి, చంద్రోదయం వేళకు ఉపవాసం

"శనైశ్చరుడు"

Image
చిన్న వివరణ...శని - గ్రహం - దేవుడు కాదు...వేదాలలో గ్రహాలకి ఈశ్వరత్వం లేదు. కాబట్టీ, ' శనీశ్వరుడు ' అని ఉఛ్చరించడం సరికాదు. "శనైశ్చరుడు" అనేది సరియైన నామము. "శనైః-శనైః-చరహః" - "మెల్లగా మెల్లగా కదిలేవాడు" - "శనైశ్చరుడు". శని వికలాంగుడు..రావణుడు, రెండు కాళ్ళను నరికివేయడం వల్ల శని తన కాళ్ళు కోల్పోయాడు. అందువల్ల మెల్లగ కదులుతాడు. ఇంద్రజిత్తు జన్మించే సమయంలో, రావణుదు తన ఆదేశంతో, అన్ని గ్రహాలను ఉత్తమమైన స్థానాలలో ఉంచాడు. అలా ఉండీ ఉండీ, సరిగ్గా ఇంద్రజిత్తు జన్మించే సమయంలో, శని తన రెండు కాళ్ళనూ ముందరి స్థానంలోకి చాపాడు..దానితో ఇంద్రజిత్తు జన్మించిన సమయంలో శని స్థానం దోష భూయిష్టంగా మారింది..దానికి ఆగ్రహించిన రావణుదు, కోపంతో శని రెండు కాళ్ళనూ అప్పటికప్పుడు నరికేశాడు..ఎంతో ప్రతిభావంతుడైన ఇంద్రజిత్తు, శని స్థానం దోషం కావడం వల్లన, అధర్మాన్ని ఆశ్రయించి ఉండడం వల్లనా, యుద్ధంలో అకాల మరణం పొందిన విషయం మన అందరికీ తెలిసినదే...

కుందేలు మారింది రెండు రైళ్ళు..(ఆరుద్ర కవిత)

Image
తాబేలూ కుందేలూ వేసేయి వందమైళ్ళ పందెం తాబేలే గెలిచింది తెలుసునా ఆ చందం? తాబేలు నడిచింది వంద మైళ్ళు కుందేలు మారింది రెండు రైళ్ళు..(ఆరుద్ర కవిత)

పాండవ ఉద్యోగ విజయాలు

Image
పాండవ ఉద్యోగ విజయాలు అర్జునుడు, దుర్యోధనుడు కృష్ణుని సహాయమర్ధించుటకు వచ్చుట అర్జునుడు: దృపదుని పంపునన్ జనె పురోహితు డా ధృతరాష్ట్ర సూతి బల్ కపటి; వినండు; సంధి జెడగా గమకించెడు గాని; తప్పదా- లపు బని; సర్వమున్ గడప లావు గలండు యశోద పట్టి; యా రిపు జన కాలు తోడుత వహించెద, సర్వము నిర్వహించెదన్ అదిగో, ద్వారక! యాలమంద లవిగో! నందందు దోరాడు, న య్యదియే కోట, యదే యగడ్త, యవెరథ్యల్, వారలే యాదవుల్ యదుసింహుండు వసించు మేడ యదిగో! నాలానదంతావళా భ్యుదయంబై వర మందిరాంతర తురంగోచ్చండమై పర్వెడున్. జలజాతాసన ముఖ్య దైవత శిరస్సంలగ్న కోటీర పం క్తుల కెవ్వాని పదాబ్జ పీఠి కడు నిగ్గుల్ గూర్చు దత్సన్నిధి స్థలి గూర్చుండి భవంబు పావనముగా దైవార గావించి నా తొలి జన్మంబున గూడు పాపముల నాందోళింపగా జేసెదన్. కృష్ణుడు (అర్జునునితో): ఎక్కడనుండి రాక యిట? కెల్లరునున్ సుఖులే కదా! యశో భాక్కులు నీదు నన్నలును భవ్య మనస్కులు నీదు తమ్ములున్ జక్కగ నున్నవారె? భుజశాలి వృకోదరు డగ్రజాజ్ఞకున్ దక్కక నిల్చి శాంతుగతి దాను జరించునె తెల్పు మర్జునా! కృష్ణుడు (దుర్యోధనునితో): బావా! ఎప్పుడు వచ్చితీవు ? సుఖులే, భ్రాతల్-సుతుల్-చ

(నారాయణ శతకము - పోతన)

Image
ధర సింహాసనమై, నభంబు గొడుగై, తద్దేవతల్ భృత్యులై, పరమామ్నాయములెల్ల వందిగణమై, బ్రహ్మాండ మాకారమై, సిరి భార్యామణియై, విరించి కొడుకై, శ్రీగంగ సత్పుత్రియై వరుసన్ నీ ఘనరాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణా! (నారాయణ శతకము - పోతన)

వేంకటేశ్వరుడు

Image
 వేంకటేశ్వరుడు నాకు ఒక్క విషయం అర్థం కాలేదు. పండితులను అడిగాను కాని దాటేశారు సరైన సమాధానం చెప్పలేదు. కొంచెం పెద్దలు నా సందేహాన్ని తీర్చగలరు. ఏమంటే ఆదిశంకరులు ఆశేతు హిమాచల పర్యంతం పర్యటించి అనేక మఠాలను నెలకొల్పి హైందవమతాన్ని జాగ్రుతం చేసారు. బాగుంది. చాలా బాగుంది. అయితే ఆయన కొండకోనలలో జనులు చొరరాని కీకారణ్యంగా వున్న తిరుమల గిరిపై వెలసిన వెంకన్నగారి హుండీకి లక్ష్మీ యంత్రాన్ని ధనాకర్షణ, జనాకర్షణ యంత్రాన్ని ఎందుకు స్థాపించారు తన శైవ మఠాలను వదిలేసి. ఎవరికైనా తన మఠాలపైనే దృష్టి వుంటుంది కదా. శంకర మఠాలను వదిలేసి వైష్ణవ క్షేత్రంలోనే ఎందుకు యంత్రాలను ప్రతిష్టించారు అని. శంకరులవారికి శివకేశవ బేధం లేదు అని చెప్పచ్చు. కేవలం వైష్ణవ క్షేత్రం అభివృద్ధిని కాంక్షించే చేసారంటారా....... పెద్దలెవరైన సరైన వివరణ ఇస్తే బాగుంటుంది. VVS = ఈ ప్రశ్నలోని విషయాలు సామాన్యంగా అందరికీవచ్చే సంశయాలే. మనందరి పరిజ్ఞానం - పెద్దలు చెప్పినా, ప్రవచనాలు విన్నా, ఇప్పుడు ఇంటర్నెట్లో ఉన్న సమాచారం వెదకినా వచ్చినదే. పురాణ వాఙ్మయము చదివి ప్రమాణములతో చెప్పగలవారు చాలా తక్కువ. మన మొదటి అపోహ శంకరాచార్యుడు శైవుడు, ఆయన వైష్ణవుడు కా

Vinjamuri sisters..

Image
Vinjamuri sisters.. VINJAMURI ANASUYA & SEETAMAMBA[ daughters of VINJAMURI VENKATARATNAMAMBA] at a young age after recording the YENKI PATALU for Chennapuri musical records[ yes! that was what Madras was called then] Thier father is Late Vinjamuri Lakshmi narasimha panthulu was a great writter & telugu pandit..he wrote Anarkali drama,...He got Padmasree award in 1967...

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి చాల అర్ధవంతమైనకవిత!

Image
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి  చాల అర్ధవంతమైనకవిత! (విధాత తలపున  అనే ఈ పాట 1986లో విడుదలైన సిరివెన్నెల చిత్రంలో సుప్రసిద్ధమైనది. )  . విరించినై = నేనే బ్రహ్మని విరచించితిని = రచించితిని ఈ కవనం = ఈ కవిత్వం విపంచినై = వీణనై వినిపించితిని = వినిపిస్తున్నా ఈ గీతం =ఈ పాట . బ్రహ్మ యొక్క ఆలోచనలలో ఎప్పుడో పుట్టిన స్రుష్టి మూల వేదం - " ఓం "  . మన ప్రాణ నాడులకు మొట్టమొదట ప్రాణం ఇచ్హినదే ఈ " ఓం "  . కళ్ళ కొలనులో ప్రతిభింబించిన స్రుష్టి రూపం ఈ "ఓం "  . గుండే వంటి పర్వత శ్రేణులలో ప్రతిధ్వనించిన బ్రహ్మ యొక్క వీణా గానం సరస సంగీతమైనటువంటిది, మంచి నదీ ప్రవాహము వంటిది, మొత్తం సామవేదం సారంశము అయినటువంటిది  ఈ నేను పాడిన పాట నెనే బ్రహ్మనై రాసినది ఈ పాట/పద్యం/కవిత వీణనై వినిపిస్తున్నా ఈ పాట తూర్పు (దిక్కు) అనే వీణపై, సూర్య కిరణాలు అనే తీగెలను మీటుతూ మెల్కొన్న పక్షులు అకాశపు వేదికపై, పలికిన కిల కిల రావాలు స్వర ప్రపంచానికి మొదలు ఇంకా విశ్వం అనే దానికి వివరణ. పుట్టే ప్రతి శిశివు పలికే జీవన రాగపు అలలే ఈ ఓం చైతన్యం పొందిన హ్రుదయ

ముళ్ళ పూడి రమణ గారి బాల్యం ...

Image
రమణ గారి బాల్యం ఆయన మాటల్లోనే… “మా ఊరు ధవళేశ్వరం. రాజమండ్రి దగ్గర. గోదావరి ఒడ్డున. రామపాదాల రేవులో మొదటి మేడ మా ఇల్లు. పక్కనే కొండమీద జనార్ధనస్వామి కోవెల, కొండ కింద శివాలయమూ ఉన్నా వాటి కన్నా మా ఇల్లే కోలాహలంగా ఉండేది. గుమ్మంలో ఎప్పుడూ ఒక పందిరి. పందిట్లో హరికథలూ, అవి లేనప్పుడు సావిట్లో జై హరనాథ జై కుసుమ కుమారి జై – భజనలూ. నట్టింట్లో దె య్యాలను సీసాల్లో బిగించే ముగ్గుల పూజ లూ, బైరాగులూ – పెరటి వసారాలో చుట్టాలూ – వాళ్ళ చుట్టాలకి పెట్టుకునే (వాళ్లింట్లో వీల్లేక) తద్దినాలూ – పెరట్లో బావి అవతల పడవ వాళ్ళకి మా అమ్మమ్మ పెట్టే భోజనాలూ – బువ్వలు తిని దుంగళ్ళూ – కొట్టేవాళ్ళు. మేడ వరండాలో హిందీ పాఠశాల – రాజమండ్రి నుంచి గుమ్మడిదల దుర్గాబాయమ్మ గారు జటకాలో వచ్చి మా అమ్మకీ, పక్కింటి వాళ్ళకీ మైతోహూం తూతో హై అంటూ చెప్పే హిందీ పాఠాలూ, పూనకాలూ, శాంతులూ, తర్పణాలూ – పూజగది పక్కన భజగోవిందం పాడుకుంటూ మా నాన్నగారు. ఆఫీసు వేళ వంటవక ఏవిటీ జనం – ఇది ఇల్లా సంత బజారా అని ఆయన ఎప్పుడేనా ఒక్కొక్కసారి చుట్టాల మీద విసుక్కుంటే అంతవరకూ అందరికీ అన్నీ అందిస్తూ సందడిగా తిరిగే మా అమ్మకి కోపమొచ్చి, ఫిట్లొచ్చి నేలకి ఒరి