రాజై ఉండి తోటకూరా పంచేది??

  ఒకానొక అగ్రహారములో అగ్నిహోత్రావధాని అని ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. కూటికి నే పేదను గుణములలో పెద్దను అన్నట్లు ఉండేవాడు. అతనికి ఉన్న ఆస్తి మొత్తం ఒక పూరిపాక. ఆ పాకని ఆనుకొని కాస్త ఖాళీ జాగా. ఆ జాగాలో తోటకూర విపరీతంగా పండేది. ఆ బ్రాహ్మడు చాలా మంచివాడు అవడంచేసి తన ఇంటిమీదుగా పోతున్న ప్రతివారినీ ఆపి పలుకరించి తన ఖాళీజాగాలో పండిన తోటకూర కాస్త ఉచితంగా ఇచ్చి పంపేవాడు.

         అతని ఔదార్యానికి మెచ్చిన బ్రహ్మ అతనిని మరు జన్మలో మహరాజుగా పుట్టించి అతనికి పూర్వ జన్మ జ్ఞాపకం ఉండేలా మాత్రం చేసేడు, అలా జ్ఞాపకం ఉంటే తనకు మహరాజ జన్మ కలిగినందుకు గల కారణం తెలిసి మరిన్ని మంచి పనులు చేస్తాడని.

         రాజైన ఆ బ్రాహ్మణుడు ఏం చేసేడో తెలుసా, తోటకూర నలుగురికీ ఉచితంగా పంచినందునే తనకు రాజ జన్మ లభించింది కనుక తాను మరు జన్మలో చక్రవర్తి కాదలచి తన రాజ్యమంతా తోటకూర పంట వేయించి అందరికీ ఉచితంగా పంచడం మొదలెట్టేడుట.

     
   రాజై ఉండి తోటకూరా పంచేది???? మూర్ఖుడు కాకపోతే?

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!