కర్నాటక సంగీతం.!

కర్నాటక సంగీతం.!

.

కర్నాటక సంగీతంలో గాత్రానికి సహకారంగానూ,స్వతంత్రంగానూ కొన్నివాద్యాలని వాడ్తారు.

.

.1.తంత్రీ వాద్యాలు.వయొలిన్, వీణ వంటివి.(stringed instruments)

2.సుషిర వాయిద్యాలు;వేణువు,సన్నాయి వంటివి ( wind instruments ) 

3.అనవద్ధ వాద్యాలు.(percussion instruments) మృదంగం ,డోలు వంటివి.

ఈ రోజుల్లో క్లారినెట్.మాండొలిన్,శాక్జొఫోన్ వంటివి కూడా వాడుతున్నారు.

.

వాగ్గేయకారులు (composers) ;-- 

.

1.పురందరదాస(1484-1564) కన్నడంలోను,సంస్కృతంలోను ఎన్నోవేల కీర్తనలు రచిస్తే ఇప్పుడు లభ్యమౌతున్నవి 2000.

2.కనకదాస;-- (1509-1609 )కన్నడంలో 1000 కీర్తనలు

3.అన్నమాచార్య ;-- 30000దాకా రచించినట్లు ప్రతీతి.కాని నేడు 3600 కీర్తనలు మాత్రం లభ్యం.తెలుగులోను,కొన్ని సంస్కృతంలోను రచించాడు .

4.అరుణగిరినాథ;-- తమిళంలో దాదాపు 1500 రచనలు చేసాడు.(15 వశతాబ్దం.)

5.భద్రాచల రామదాసు ;-- (1620-1688) తెలుగులో500 కీర్తనలు రచించాడు.దాశరథి శతకకర్త కూడా.

6.క్షేత్రయ్య;-- (1600-1680)తెలుగులో100 పదాలు రచించాడు

7.నారాయణతీర్థ;- (1650-1745) తెలుగు,సంస్కృతంలో 200 రచనలు

8.సారంగపాణి;-- (1680-1750) తెలుగులో 200 పైగా పదాలు రచించాడు

9.విజయదాస- (1682-1755 ) కన్నడంలో 25000 కీర్తనలు రాసినట్లు ప్రతీతి.

.

ఇక సంగీతానికి త్రిమూర్తులుగా పేరుపడిన వారు18 వ శతాబ్దపు మలిభాగంలోను,19వ శతాబ్దం తొలిభాగంలోను జీవించారు.సమకాలికులు.తంజావూరు ప్రాంతీయులు.

.

.

1.త్యాగరాజు;- సుప్రసిద్ధులు. వేలకొద్దీ కృతులు పాడినా ప్రస్తుతం దాదాపు 1000 కీర్తనలే దొరుకుతున్నవి.జీవితకాలం 1767-1845 ప్రహ్లాదవిజయం.నౌకాచరిత్రం అనే సంగీత నాటికలు కూడా రచించాడు.

2.శ్యామశాస్త్రి;-మీనాక్షీదేవి పైన ఎక్కువ కృతులు రచించాడు.(1762 -1827)

3.ముత్తుస్వామి దీక్షితులు ;- (1776-1835) 300 కృతులు రచించాడు.సంస్కృతంలో వ్రాసిన ఈ కీర్తనలలో ఒక చోట రాగం పేరును సూచించడం ఈయన ప్రత్యేకత.

.

.

వీరుగాక,తిరువాంకూర్ ప్రభువు స్వాతితిరునాళ్ (1813-1843 ) బహుభాషావేత్త .చాలా భాషల్లో స్వల్ప జీవితకాలంలోనే రచించాడు.

.

సదాశివబ్రహ్మం,మైసూర్ వాసుదేవాచార్ ,పట్నం సుబ్రమణ్య అయ్యర్, చెప్పుకోదగిన వాగ్గేయకారులు.

.

ఆధునికులు కూడా కొందరు ( బాలమురళీకృష్ణ వంటివారు ) సంగీతరచనలు కొనసాగిస్తూనేఉన్నారు.

.

చాలామంది వాగ్గేయకారులు తమపేరును ఒకచోట ఉటంకిస్తారు. (ఉదా;'త్యాగరాజనుత 'అన్నట్లు).

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!