మానస సంచర రే బ్రహ్మణి..మానస సంచర రే! సదాశివ బహ్రేంద్ర యోగి:--

మానస సంచర రే బ్రహ్మణి..మానస సంచర రే!

సదాశివ బహ్రేంద్ర యోగి:-- 

కర్ణాటక సంగీత వాగ్గేయకారుడు, అద్వైత తత్వవేత్త. !

.

సదా శివ బ్రహ్మేంద్ర సరస్వతి అంటేమనకు గుర్తు వచ్చేది ఈ కీర్తన.

నవరోజ్‌ - ఆది (సామ -)

పల్లవి:

మానస సంచర రే బ్రహ్మణి

మానస సంచర రే॥

చరణము(లు):

శ్రీరమణీ కుచ దుర్గ విహారే

సేవకజన మందిర మందారే॥

మద శిఖిపింఛాలంకృత చికురే

మహనీయ కపోలవిజిత ముకురే॥

పరమహంసముఖ చంద్రచకోరే

పరిపూరిత మురళీరవధారే॥

.

జీవిత విశేషాలు

మోక్ష సోమసుందర అవధాని, పార్వతి అనే తెలుగు దంపతులకు సదాశివ జన్మించారు. ఆయన తొలి పేరు శివరామకృష్ణ. 17 ఏటనే వివాహమైంది.

17 - 18 శతాబ్దాల మధ్య తమిళనాడులోని కుంభకోణంలో జీవించారు.

మరో ఇద్దరు ప్రముఖ హిందు ఆధ్యాత్మిక వేత్తలు శ్రీధర వేంకటేశ అయ్యాళ్, శ్రీ బోధేంద్ర సరస్వతి వేదపాఠశాలలో సదాశివకు సహచరులు.

సత్యాన్వేషణకై ఇంటిని వదిలి వేశారు. సన్యాసం స్వీకరించిన తరువాత దిగంబరంగా, అర్ధనగ్నంగా పరధ్యాన స్థితిలో తిరిగేవాడు. విపరీత వైరాగ్యంతో సమాధి స్థితిలో ఉండేవాడుపరమహంస యోగనంద "ఒక యోగి ఆత్మకథ" లో ఆయన జీవ సమాధి ఉదంతాన్ని సంగ్రహంగా ప్రస్తావించడం జరిగింది. ఆయన ఆత్మ విద్యా విలాసం వేరిట ఒక అద్వైత గ్రంథాన్ని కూడా రచించారు.ఆయన జీవించి ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలను చేసాడని ప్రతీతి. వాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని మాత్రమే ఈ కింద ఉదహరించడం జరింగింది.

ఒకసారి కావేరి నది ఒడ్డున ఉన్న మహధనపురంలో కొంత మంది పిల్లలు అక్కడికి వంద మైళ్ల దూరంలో ఉన్న మదురైలో జరిగే ఉత్సవానికి తీసుకుని వెళ్లాని కోరారు. ఆయన వారిని కళ్లు మూసుకోవాలని చెప్పాడు. కొన్ని క్షణాల తరువాత వారు తెరిచేసరికి మదురైలో ఉన్నారు.

ఈ కథకు కాస్త పొడిగింపు కూడా ఉంది. ఈ సంఘటన గురించి తెలుసుకున్న ఒక యువకుడు నమ్మకం కలగక తనను కూడా ఉత్సవానికి తీసుకుని పోవాలని కోరాడు. మరుక్షణమే అతని కోరిక తీరింది. కానీ వచ్చేప్పుడు సదాశివను కనుగొనలేక కాలినడకన రావాల్సి వచ్చింది

మరోసారి ఒక ధాన్యపు కుప్పల వద్ద ధ్యానం చేసుకుంటున్నాడు. ఆయనను దొంగగా భావించి ఒక రైతు కొట్టేందుకు కర్రను ఎత్తగా శిలలా నిల్చిపోయాడు. మర్నాటి ఉదయం తన ధ్యానం ముగిశాక సదాశివ రైతును చూసి చిరునవ్వు నవ్వగా మళ్లీ మామూలు మనిషి అయ్యి క్షమాపణ కోరాడు.

మరోసారి, కావేరి నది ఒడ్డున ధ్యానంలో మునిగి ఉండగా అకస్మాత్తుగా వరదలు వచ్చి కొట్టుకుని పోయారు. కొన్ని వారాల తర్వాత కొంత మంది మట్టిని తవ్వుతుండగా సదాశివ దేహం తగిలింది. బయటకు తీయగా ఆయన లేచి నడచి వెళ్లి పోయారు

ఇవి జరిగిన చాలాకాలం తర్వాత ఆయనను ప్రజలు మరిచిపోయే దశలో ఆయన మళ్లీ కనిపించారు. బ్రహ్మము తప్ప మరేమీ పట్టని పరధ్యాన స్థితిలో దిగంబంరంగా శరీరస్పృహలేకుండా తనకు ఎవరు ఎదురు వస్తున్నారో, ఎటు వెళ్తున్నారో తెలియకుండా ఒక నవాబు గారి అంతఃపురంలో అటుఇటూ తిరుగుతుండగా అంతఃపుర వాసులు గమనించి నవాబుకు తెలిపారు. ఆయనను పట్టుకోమని నవాబు పురమాయించగా సైనికులు ఆయన రెండు చేతులను నరికి వేశారు. చేతులు రాలాయి. సదాశివలో మార్పు లేదు. అలా పరధ్యానంగా నడుస్తూనే ఉన్నారు. ఇది నవాబుకు తెలిపారు. తప్పు తెలుసుకుని పశ్చాత్తాపచిత్తుడై నవాబు రెండు చేతులను తీసుకుని సదాశివకు ఎదురు వెళ్ళి ఆ చేతులను అర్పించారు. అంతే రెండు చేతులూ తిరిగి అతుక్కున్నాయి. సదాశివ నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఎవరూ ఏమీ మాట్లాడలేదు.

.

ఆలయ సేవ

పుదుకొట్టాయ్ రాజు తొండైమన్ ను కలిసి ఆయనకు దక్షిణామూర్తి మంత్రం ఉపదేశించారని కథనం. సదాశివ ఇసుకలో దక్షిణామూర్తి మంత్రాన్ని రచించగా ఆ ఇసుకను రాజు తీసుకున్నాడు. ఇప్పటి వరకు పుదుకొట్టాయ్ రాజభవనంలోని దక్షిణాముర్తి ఆలయం ఆ రాజుల అధీనంలోనే ఉంది.

తంజావూరు సమీపంలోని పున్నైనల్లూర్ మరియమ్మన్ దేవతను ఈయనే ప్రతిష్ఠించారు. కామాక్షి దేవాలయంలోని దేవదనపట్టి విగ్రహ స్థాపనకు మార్గనిర్దేశనం చేశారు. తంజావూరులోని నాలుకాల్ మంటపం వద్ద ఉన్న ప్రసన్న వెంకటేశ్వరం ఆలయంలో ఆంజనేయ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

కుంభకోణం వద్ద తిరునాగేశ్వరం రాహుస్థలం లో గణపతి విగ్రహాన్ని, శక్తిమంతమైన గణపతి యంత్రాన్ని స్థాపించారు. ఈ విషయం ఆలయశాసనంలో లిఖితమై ఉంది.

సంస్కృతంలో అనేక గ్రంథాలకు ఆయన రచయిత. ప్రచురితమైన ఆయన రచనలు :

బ్రహ్మసూత్రవృత్తి లేదా బ్రహ్మతత్వప్రకాశిక

యోగసుధాకర - పతంజలి యోగ సూత్రలమీద వ్యాఖ్యానం

సిద్ధాంత కల్పవల్లి

అద్వైతరసమంజరి

ఆత్మానుసంధానం

ఆత్మవిద్యావిలాసం

శివమానసపూజ

దక్షిణామూర్తి ధ్యానం

స్వప్నోదితం

నవమణిమాల

నవవర్ణరత్నమాల

స్వప్నానుభూతిప్రకాశిక

మనోనియమం

పరమహంసాచార్య

శివయోగ దీపిక.

http://www.dailymotion.com/video/xsgare_manasa-sancharare-anta-mana-manchike-1972_music

.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!