శ్రావణ పౌర్ణమి విశిష్టత!

శ్రావణ పౌర్ణమి విశిష్టత!
.
యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః |
తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల ||
పై శ్లోకాన్నిపఠిస్తూ భార్య-భర్తకు సోదరి-సోదరునకు యుద్ధానికి వెళ్లే వీరునకు విజయ ప్రాప్తి కోసం ఈ రక్షాబంధనను కడతారు. శ్రీ మహావిష్ణువు శక్తిచే మహాబలుడు అయిన బలిచక్రవర్తిని బంధించినట్లుగా, ఓ రక్షాబంధనమా ! నీవు చలించక వీనికి రక్షణ కల్పించుము అని పై శ్లోకం అర్దం. దీనిలో రక్షాబంధనం అంటే సాక్షాత్తూ శ్రీ మహావిష్ణు శక్తేనని తెలియచెప్పే భావం ఇమిడి ఉంది. రాఖీ/రక్ష కట్టడం వలన కట్టినవారికి, కట్టించుకున్నవారికి రక్ష కలుగుతుంది. రాఖీ కట్టినందుకు బదులుగా సోదరుడు సోదరికి పసుపుకుంకుమలు, సారె ఇచ్చి ఆశీర్వదించాలి.

.
అన్నా చెల్లి అనుబంధం.రాఖి!

భారతీయ పురాణాలని అనుసరించి మృత్యు కారకుడైన యమధర్మరాజు ముంజేతికి ఆయన సోదరి యమున రాఖీ కట్టి, ఆయనని అమరుడిగా భాసిల్లమని ఆశీర్వదించడంతో ‘రక్షాబంధన’ సంప్రదా యం ఆరంభమైందని ప్రతీతి.
.
శిశుపాలిడి మరణానంతరం, శ్రీకృష్ణుడిని గాయపడిన చేతి వేలితో చూసిన ద్రౌపది తట్టుకోలేక, తన చీరె కొంగును చించి ఆయన ముంజేతికి కట్టుగా కట్టిందట.
ఆమె ప్రేమతో కరిగిపోయిన శ్రీకృష్ణుడు రాబోయే 25 సంవత్సరాల కాలంలోనే, ఆమె చేసిన సేవకి ప్రత్యుపకారం చేసి తీరుతానని మాట ఇచ్చాడట.
కౌరవ సభలో ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో, అసహాయ శూరులైన ఐదుగురు భర్తల సమక్షంలో, అక్షయ వస్త్ర ప్రదానం చేసి, ఆమె మాన సంరక్షణకి పూనుకున్న వాడు, ఆమె అపూర్వ సహోదరుడు శ్రీకృష్ణుడే.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!