మాల్గుడి కథలు!


-మాల్గుడి కథలు                     

VINJAMURI VENKATA APPARAO·TUESDAY, 21 NOVEMBER 2017

మాల్గుడి కథలు అనే కథాసంకలనపుస్తకం ప్రముఖ, ప్రసిద్ధ ఆంగ్లకథా రచయిత ఆర్.కె. నారాయణ్ రచించిన 'మాల్గుడి డేస్' అనే ఆంగ్లకథాసంకలమునకు తెలుగుసేత. తెలుగు అనువాదాన్నిడా.సి.మృణాళిని చేసారు.

నారాయణ్ పూర్తిపేరు రాసిపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణస్వామి.జననం 1906 అక్టోబరు 10, 

నాటిమద్రాసు, నేటి చెన్నైలో జన్మించారు కథలు, నవలలు రెండింటిని రచించడంలో సిద్దహస్తుడు.సాధారణంగా మిగతా రచయితల అభిప్రాయం ప్రకారం కథను వ్రాయడం నవల వ్రాయడంకన్న కష్టమైనది.నవల పెద్దదిగా వుండటంవలన కథనంను, పాత్రలను, సన్నివేశాలను విపులంగా వర్ణించె వీలున్నది.కానికథను క్లుప్తంగా వ్రాయవలసి రావడం వలనప్రధానకథావస్తువును అతిజాగ్రత్తగా, ప్రాంరంభంనుండి ముగింపువరకు నడిపించవలసివుంటుంది.కాని నారాయణ్ అభిప్రాయం- కథకన్న నవల వ్రాయడం కష్టం.

ఈపుస్తకంలోని కథలు మాల్గుడిఅనే వూరును కేంద్రంగా చేసుకొని, ఆవూరిలోని ప్రజలజీవితంలోని సంఘటనలను ఆధారంచేసుకొని కథలల్లబడ్డాయి. రచయిత చెప్పినదానిప్రకారం ఈ మాల్గుడి అనేది తన కథలలోని కల్పితపాత్రలలా, సంఘటనలలా, తన ఊహాలనుంచిపుట్టిన కల్పిత నగరం.రచయిత మనోభావం ప్రకారం మాల్గుడి లాంటి నగరం, దానిలోని వీథులవంటివి, అందులో కనిపించే జనులు ఎక్కడైన చూడగల్మంటాడు.

ఉదాహరణకు తాను 1959 నుంచి అప్పు డప్పుడూ నివసిస్తూవచ్చిన వెస్ట్ ట్వేంటి థర్డ్ స్ట్రీట్‌లో మాల్గుడి లక్షణాలున్నాయంటాడు 

.

మాల్గుడి కథలు !

జ్యోతిష్కుడి జీవితంలో ఒక రోజు :

ఎ న్నో ఏళ్ళక్రితం, ఈజ్యోతిష్కుడు, 200 మైళ్ళ అవలనున్న వూరినించి వచ్చాడు మల్గుడికి జ్యోతిష్యం రాకపొయిన తన మాటల చాతుర్యంతో, తెలివితేటలతో ప్రజలను మాయపెట్టి, మభ్యపెట్టి జీవనం కొనసాగిస్తున్నాడు. తన వూరినింఛి హఠాత్తుగా ఎందుకొచ్చాడో, అ జ్ఞాతంగా బ్రతుకుతున్న విషయం ఎవ్వరికి తెయదు. ఒకరోజు సాయంత్రం, చిక్కట్లు కమ్మిన వేళ తనవద్దకు జాతకం చెప్పించుకోవటానికి వచ్చిన వ్యక్తిని చూసి అవాక్కు అవ్వుతాడు. ఎవ్వరావ్యక్తి? ఏమిటాకథ?

తప్పిపోయిన వుత్తరం:

ఇప్పుడంటే అంతా సెల్లుమయం.ఎవ్వరిచేతిలో చూసిన పిడెకెడంత సెల్లు చేసే హంగామా అంతాఇంతాకాదు.శుభమైన, అశుభమైన, అవసరమైన, అనవసరమైన అంతా సొల్లు సెల్లుమయమే. ఇందుగలదు, అందులేదని సందేహం వలదు, ఎందెందు చూసిన అందందే చెవికి అతుక్కుపోయి సెల్లుదర్శనమిస్తుంది.కాని 50-60సంవత్సరాలక్రితం ఒకరినుంచి మరొకరికిసమాచారాన్ని చేరవేసె ఉత్తమసాధనము వుత్తరము .అప్పటికి టెలిఫొనులు సామాన్యులకు అందుబాటులో లేనిరోజులవి.పేదవాడైన, పెద్దవాడైన సమాచారం కావాలన్నా, పంపాలన్నా తపాలే ఆధారం.అండుకే అప్పుడు ఇంటింటికి వుత్తరాలను చేరవేసె తపాలా మనిషి/పోస్ట్‌మాన్ (post man), ప్రతి ఇంటివారికి అవసరమైనవాడే.ప్రతిరోజు పోస్టుమేన్ వచ్చెసమయానికి అప్తుడయ్యిన మనిషికై చూసినట్లు ఎదురుచూసేవారు.పోస్టుమేన్ కూడా అలాగే గ్రామస్తులతో కుటుంబ సభ్యుడులా మెలిగేవాడు.శుభవార్తతెచ్చినప్పుడు వారిసంతోషంలో తాను పాలుపంచుకొనేవాడు, అశుభవార్త అయ్యినచో వారితోపాటూ తాను దుఃఖంలో పాలుపంచుకొనేవారు.ఈ కథలోని పోస్టుమేన్ కూడా అచ్చు ఆలాంటి వాడే.అంతరితలలో నాలికలా వుండేవాడు.ముఖ్యంగా మల్గుడిలోని, వినాయకవీధిలోని 10వ నెంబరు ఇంటిలోని రామానుజంతో మరింత సన్నిహితంగా వుండేవాడు.రామానుజం కూతురు కామాక్షి పుట్టినప్పడినుండి, కామాక్షికి పెళ్ళీడురాగానే పోస్టుమేన్ ఒకమంచి ఢిల్లీసంబంధం కుదిర్చాడు.వరుడు ఉన్నతశిక్షణకై 20రోజుల్లో వెళ్ళవలసిరావటం, అతరువాత 3సంవత్సరాలవరకు పెళ్ళిచేయుటకు కుదరదు.అందువలన 20రోజుల్లో పెళ్ళిజరగాలి.రామానుజం సమయంతక్కువగావుందని, ఈలోపు జరుగగూడని అశుభం ఏదైన జరిగినచో పెళ్ళి మూడుసంవత్సరాలు వాయిదా పడుతుందని కంగారుపడగా భయంవలదని ధైర్యం చెప్పి, పోస్టుమేన్ దగ్గరుండి, అన్నితానై ఆశుభకార్యం పూర్తి చేస్తాడు.పెళ్లిజరిగిన15 రోజులకు పోస్టుమేన్ ఒకవుత్తరం, ఒక టెలిగ్రాం తీకొని రామానుజం ఇంటికొస్తాడు.వుత్తరంలో సేలంలోవున్న రామానుజం పెద్దనాన్నఆరోగ్యం బాగాలేదని వుంది, టెలిగ్రాంలో పెద్దనాన్న మరణించినట్లు సమాచారం.అదిచదివి రామానుజం కంగారుగాబయలు దేరుతుండగా పోస్టుమేను-, "ఆ వుత్తరం పెళ్ళికి ముందురోజువచ్చింది,టెలిగ్రాం పెళ్ళిరోజు వచ్చింది,ఈవిషయం తెలిస్తేనీవు పెళ్ళి ఆపివేస్తావని,చెప్పలేదు.అందుకే దాచి వుంచాను.ఇదితప్పే.కావల్సినచో మీరు నాపై అధికారులతో పిర్యాదు చేసుకోవచ్చు,బహుశా నావుద్యోగంపోవచ్చును.కాని కామాక్షి పిళ్ళిజరగడం నాకు అవసరమనిపించింది"అని మెల్లగా వెనుతిరిగి తలవంచుకు వెళ్లిపోతున్న పోస్టుమేనుతో,రామానుజం "నేనేమి నీమీద పైవాళ్లకేమి పిర్యాదు చెయ్యడంలేదు.కాని నీవు చేసింది నాకు నచ్చలేదందే ."అంటాడు.

వైద్యుడి మాట :

మాటే మంత్రం.అవును నిజం.ఒకవ్యక్తిని గాఢంగా విశ్వసించినప్పుడు,నమ్మినప్పుడు ఆవ్యక్తి చెప్పెమాట నమ్మినవ్యక్తిమీద,మనస్సుమీద ప్రభావం చూపిస్తుంది.భారతంలో ద్రోణాచార్యులకు ధర్మరాజు అబద్ధము చెప్పడని పూర్తినమ్మకము.అందుకే రణభూమిలో ధర్మరాజు "ఆశ్వథామా హతః.." అనిఅనగానే ద్రోణుడు అస్త్రసన్యాసంచేసాడు.అతరువాత ధర్మరాజు "కుంజర"అంటూ అసత్యమాడినదోషం నుండి తెలివిగా తప్పించుకున్నాడు.ఈ కథలోని డాక్టరు రామన్ కూడా అబద్ధము పలకడు.తనవద్దకు వచ్చేరోగులను వారికున్న రోగతీవ్రతను బట్టి,ముందే నిజం చెప్పేవాడు.అందుకే ఆ డాక్టరు అబద్ధమాడడని అందరి నమ్మకం. అదినిజం కూడా.అలాంటి డాక్టరుకూడా అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.భారతంలో ధర్మరాజు స్వార్థంతో అబద్ధంచెప్పి,తనప్రియమైన గురువు మరణానికి కారణమైతే,ఇక్కడ డా.రామన్ మరణించే స్థితిలో వున్న తన మిత్రుని రక్షించెటందుకు,అతనిలో ఆత్మవిశ్వాసం కలిగించేటందుకు " నీకేమి కాదు, నీఆరోగ్యానికి ఏప్రమాదంలేదని" మొదటి సారి అబద్ధం చెప్తాడు.డాక్టరు మీద ఆపారనమ్మకమున్న అతని మిత్రుడు, డాక్టరే ఆశ్చర్యపడెలా ఆరోగ్యవంతుడవ్వుతాడు.మాటకున్న అపారశక్తి ఇది.

గుడ్దికుక్క :

ప్రపంచంలో అత్యంత విశ్వాసంచూపే పెంపుడుజంతువు ఏదని ప్రశ్నిస్తే అందరు ముక్తకంఠంతో చెప్పెపేరు కుక్క .అవును; ఇది అక్షరసత్యం. కాని ఈ కుక్కవిశ్వాసమే ఒకవూరకుక్కను ఎలా శాశ్విత బానిసత్వంలోకి నెట్టింది వివరించే కథ.నిజం! ఒక్కొసారి, మనవిశ్వాసమే మనపాలిట శాపంగా మారుతుందని నర్మగర్భంగా ఎచ్చరించేకథ.

అగంతకుడు :

ఈకథ అప్పుడేకాదు ఇప్పుడు కూడా నిత్యంజరిగే కథే.ఎక్కడంటరా?రైలులోని జనరల్ కంపార్ట్‌మెంటులో అనునిత్యం జరిగే సీటుకై పోరాటం.ముందెక్కినవారు సీటుఆక్రమించి కూర్చున్నతరువాత ఆతరువాత వచ్చే ప్రయాణికులు సీటుకై బుజ్జగింపులు, వేడికోలు, అర్థింపులు, ఆపై బెదరింపులు, చొక్కాచేతులు మడవటాలు, మీసాలు దువ్వటాలు, చూసుకుందామా?అంటే; ..చూచుకుందాం...ఇవన్ని..ఆనాడు ఈనాడు షరామాములే!

ఈశ్వరన్ : 

అదిజూన్‌నెల.ఆ రోజు మాల్గుడి ఊరుఊరంతా ఆతురతాగా ఎదురు చూస్తున్నారు ఇంటర్మిడియట్ ఫలితాలకై, ఒక్క ఈశ్వర్ తప్ప.ఈశ్వర్ కూడా పరీక్ష వ్రాసాడు, కాని ఫలితానికై ఆతృతలేదు. ఎందుకంటె ఇప్పటికే ఎన్నోసార్లు ఇంటర్మీడియేట్ పరీక్ష వ్రాయడం, తప్పడంమాములై పోయింది.అందుకే అందరు ఫలితాలకై ఎదురుచూస్తుంటే, తనఫలితమేమిటో తనకుముందే తెలుసుకాబట్టి, ఏ టెన్షను లేకుండాగా సినిమాకెళ్ళాడు వరుసపెట్టి రాత్రి రెండో ఆటవరకు చూశాడు.అటుతరువాత ఇంటికెళ్లటానికి మనసొప్పక సరయు నదివడ్డుకు చేరుతాడు.తనమీద తనకే అసహ్యంవేసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని, ఆలా వుత్తరంవ్రాసింకోటుజేబులోపెట్టి, కోటును ఒడ్డునపెట్టి, మరణించటానికి సిద్ధమై, మరణించేముందు చివరిసారిగా స్కూలును, చూడాలనిపించి, స్కూలుదగ్గరకు వెళ్తాడు.నోటిసుబోర్డులో తాను సెకండు శ్రేణిలో పాసు అయ్యినట్లు తెలుసుకొని ఆనందంతో గుర్రపుస్వారీ చేస్తున్నట్లు ఉహించుకుంటూ గెంతుతూ, గెంతుతూ వెళ్ళి పొరపాటున సరయునదిలో పడిపోతాడు.ఉదయంశవమై అయినవాళ్ళకు కనిపిస్తాడు.

--

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!