వి నదగు నెవ్వరు చెప్పిన

సుమతి కారుడు ఏమి అన్నాడు అంటే !

.

"
వి నదగు నెవ్వరు చెప్పిన 

వినినంతనె వేగపడక వివరింపదగున్ 

గనికల్ల నిజము దెలిసిన 

మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ"!

ఎవరు చెప్పినా వినాలి. వినగానే తొందర పడక నిజమో, అబద్దమో... తెలుకోవాలి.

ఇది బద్దెన గారి సూక్తి. మరి ఎంత మంది ఇలా మంచి చెడ్డలు పరిశీలించి 

.

న్యాయ పరమైన నిర్ణయాలు తీసుకొంటున్నారు. అందువల్లే .. చాడీలు చెప్పే వారి మాటలే

చెల్లుబాటు అవుతున్నాయి. నిజానిజాలు గమనించక... తొందర నిర్ణయాలు తీసుకొని...

అపార్ధాలతో.... ఆవేశపడి, ఆతర్వాత ఎంత బాధపడితే.... ఎమి ప్రయోజనం...! 

చెప్పుడు మాటలు విని శతృత్వం తెచ్చుకొంటే.. ఆ తర్వాత సర్దుకుపోవడానికి 

నానా అవస్థలు పడాల్సి వస్తుంది. ఒకవేళ చెప్పుడు మాటలతో బలమైన వ్యక్తులను ఢీ 

కొట్టాల్సివస్తే.. మొదటికే మోసం రావచ్చు.

చేతులు కాలాక ఆకులు పట్టుకోన్నట్లవుతుంది.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!