💐🙏🏼కాళిదాసు గర్వభంగం🙏🏼💐

💐🙏🏼కాళిదాసు గర్వభంగం🙏🏼💐


మండు వేసవిలో ఒకరోజు మహాకవి కాళిదాసు పరదేశానికి బయల్దేరాడు.


మిట్ట మధ్యాహ్న సమయానికి ఒక కుగ్రామానికి చేరుకున్నాడు.


బాగా దాహం వేయడంతో ఓ గుడిసె దగ్గరికి నీళ్ల కోసం వెళ్తాడు.


ఓ బాలిక నీటి కుండతో గుడిసెలోకి వెళ్తుంటుంది.


ఆమెను చూసి... ‘బాలికా! నాకు దాహంగా ఉంది.


నీళ్లు ఇవ్వమ’ని అడిగాడు కాళిదాసు. అప్పుడా బాలిక...


‘మీ రెవరో నాకు తెలియదు.. నీళ్లు ఎలా ఇచ్చేద’ని బదులిచ్చింది. కాళిదాసు:


‘నేను ఎవరో తెలియక పోవడం ఏంటి?


పెద్ద పండితుడను. ఎవరిని అడిగినా చెబుతార’ని అన్నాడు.*


అహంకార పూరిత మైన ఆ మాటలు విని బాలిక నవ్వి...


‘మీరు అసత్య మాడుతున్నారు.


ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు.


వారెవరో చెబితే నీళ్లు ఇస్తాను’ అంటుంది.


అప్పుడు కాళిదాసు కాసేపు ఆలోచించి...


‘నాకు తెలియదు. గొంతు ఎండి పోతోంది.


ముందు నీళ్లు ఇవ్వమ’ని బతిమాలుకుంటాడు.


అయినా ఆ బాలిక కనికరించదు.


‘ఇద్దరు బలవంతులు ఎవరో కాదు ఆకలి, దాహం. ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు?’


అని అడుగు తుంది. బాలిక.*


‘నేను బాటసారి’ని అన్నాడు కాళిదాసు.


‘మళ్లీ అసత్య మాడుతున్నారు.


బాటసారి అంటే ఒకచోటి నుంచి మరోచోటికి బడలిక లేకుండా వెళ్లాలి.


మీరేమో అలిసి పోయారు కదా.


ఈ లోకం లో అలా అలసి పోకుండా సంచరించే బాటసారులు ఇద్దరే ఉన్నారు.


వారే సూర్యచంద్రులు!’


అని చెప్పి గుడిసెలోకి వెళ్లింది బాలిక.


దాహానికి తట్టుకోలేక.. ఆ గుడిసె ముందే నిలబడి..


‘మాతా నీళ్లు ఇవ్వండి.


దాహం తో చనిపోయేలా ఉన్నాను..’ 

అని ప్రాధేయపడ్డాడు కాళిదాసు.


లోపలి నుంచి ఓ ముసలావిడ బయటకు వచ్చి...


‘మీరెవరో సెలవివ్వండి...


నీళ్లిస్తాను’ అంది. కాళిదాసు దీనంగా...


‘నేను అతిథిని..!’ అని బదులిచ్చాడు.*


‘మీరు అసత్యం చెబుతున్నారు.


ఈ సృష్టిలో ఇద్దరే అతిథులు.


ఒకటి ధనం, రెండోది యవ్వనం.


ఈ రెండూ ఎప్పుడు వెళ్లిపోతాయో ఎవరికీ తెలియదు’ అంటుంది.*


కాళిదాసు.. ‘నేను సహనశీలిని నీళ్లు ఇవ్వండ’ని వేడుకుంటాడు.*


కానీ ఆమె ‘మీరు మళ్లీ అసత్యమే చెబుతున్నారు.


ఈ ప్రపంచంలో ఇద్దరే సహన శీలురు ఉన్నారు.


ఒకటి భూమి, రెండోది వృక్షం. ఇప్పుడు నిజం చెప్పు నీవెవరు?’ అని అడిగింది.


ఓపిక నశించిన కాళిదాసు..


‘నేను మూర్ఖుడను. ఇప్పుడైనా నీళ్లివ్వండ’ని అడిగాడు.


ఆ అవ్వ నవ్వుతూ...‘


ఇదీ అసత్యమే.


ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు.


ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు. అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. రెండోవాడు.

ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పే పండితుడు’ అని అంటుంది.


ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది.


ఆ అవ్వ కాళ్ల మీద పడి క్షమాపణలు కోరుతాడు_


ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించింది._


👉‘కాళిదాసా..! విద్యతో వినయం వృద్ధి చెందాలి కానీ, అహంకారం కాదు నాయనా!


కీర్తిప్రతిష్ఠల మాయలో పడిపోయిన నీ బుద్ధిని మరల్చడానికే ఈ పరీక్ష’అని జలమును అనుగ్రహిస్తుంది*

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!