"ఇద్దరమ్మాయిలూ-ముగ్గురబ్బాయిలు"

శ్రీ ముళ్లపూడి వెంకటరమణగారు

"ఇద్దరమ్మాయిలూ-ముగ్గురబ్బాయిలు" కధలో

సంకురాత్రి గురించి ఇలాఆ పండగంత అందంగా చెప్పారు.

" తెల్లవారిందనే దురభిప్రాయంతో కోడికూసింది.కాకులు మేలుకున్నాయి.ఈగలు

డ్యూటీకి బయలుదేరాయి.దోమలు విశ్రాంతికి ఉపక్రమించాయి.

దాలిగుంటలో పిల్లులు

బద్దకంగా లేచి వళ్ళు విరుచుకొని బయటకు నడిచాయి. ఆవులు అంబా అన్నాయి.

పువ్వులు వికసించాయి. నవ్వడం అలవాటయిన పిల్లలు చక్కగా నవ్వారు. ఉత్తి

పుణ్యానికి ఏడవటం వృత్తిగా గల పిల్లలు చక్కగా ఏడవటం మొదలు పెట్టారు.కొద్దో

గొప్పో పాడిగల ఇళ్ళలో అమ్మమ్మలూ, బామ్మలూ భూపాల రాగచ్చాయలో "అమ్మా

గుమ్మడేడే " అని పాడుతూ మజ్జిగ చిలుకుతున్నారు. ముద్దబంతి పూలలా బొద్దుగా

పచ్చగా ఉన్న అమ్మాయిలు పంచకళ్యాణి గుర్రాలకుమల్లే శోభిస్తూ కళ్ళు నులుపు

కుంటూ, అమ్మల చేతా, బామల చేతా సున్నితంగా చీవాట్లు తింటూ యిళ్ళు కల

కలలాడేలా తిరుగుతున్నారు. కొందరు గుమ్మాలలో పేడనీళ్ళు చల్లి, సంక్రాంతి

ముగ్గులు తీర్చిదిద్దుతూ, ముగ్గులంత సజీవంగా నవ్వుతున్నారు "

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!