భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా)

భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) గా ప్రసిద్ధి చెందిన 

సరోజని నాయుడు గారు రాసిన ఈ కవిత గుర్తుచేసుకుందామా?

(ఈ రోజు ఆమె వర్ధంతి ..)

Bangle sellers are we who bear

Our shining loads to the temple fair…

Who will buy these delicate, bright

Rainbow-tinted circles of light?

Lustrous tokens of radiant lives,

For happy daughters and happy wives.

Some are meet for a maiden’s wrist,

Silver and blue as the mountain mist,

Some are flushed like the buds that dream

On the tranquil brow of a woodland stream,

Some are aglow with the bloom that cleaves

To the limpid glory of new born leaves

Some are like fields of sunlit corn,

Meet for a bride on her bridal morn,

Some, like the flame of her marriage fire,

Or, rich with the hue of her heart’s desire,

Tinkling, luminous, tender, and clear,

Like her bridal laughter and bridal tear.

Some are purple and gold flecked grey

For she who has journeyed through life midway,

Whose hands have cherished, whose love has blest,

And cradled fair sons on her faithful breast,

And serves her household in fruitful pride,

And worships the gods at her husband’s side

.

కాలమెంత మారినా ,నాగరికత ఎంత పెరిగినా ..వనితల మనసులు దోచే గాజులు మాత్రం.. రూపలెన్నో మారుతున్నాయి ,కానీ.. సింగారం లో వాటి స్థానం మాత్రం.. చెక్కుచెదరకుండా.చిరస్థాయి గా అలాగే ఉంది

క్రీ.పూ. 2300 – 1000 సంవత్సరాల నటి సింధు నాగరికతకాలం నాటినుండి ముంచేతులకు, మణికట్టుకు ఆభరణాలు ధరించే అలవాటు , ఆచారం ఉంది. మొహంజొదారోలో బయల్పడిన స్త్రీ బొమ్మ చేతినిండా గాజులు కప్పేసి ఉంటాయి. ముంజేతి కడియాలను చాలా అరుదుగా ధరిస్తున్నారు. లతలు, మొసళ్లు, సింహాలు, ఏనుగులు,నెమళ్లవంటి ముఖాకృతిలో ఉండే ముంజేతి కడియాలు ఇష్టపడని మహిళ ఉంటుందా. ఈనాడు మట్టిగాజులు, లక్క గాజులు, ప్లాస్టిక్ గాజులు, రాళ్ల గాజులు , నవరత్నాల గాజులు అంటూ విభిన్నమైన , వినూత్నమైన గాజులు అందుబాటులో ఉండి అతివలను అలరిస్తున్నాయి.

హిందూ సంస్కృతి

అతి పూరాతనమైన చేతికళల పరిశ్రమలలో చేతిగాజుల పరిశ్రమ ఇకటి. మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైనవి మట్టిగాజులు. చేతికి గాజులులేని స్త్రీలను వుహించలేము. స్త్రీలచేతులకు గాజులు వుండటం గౌరవ సూచకము.స్త్రీలు ఆభరణాలపై,పట్టుచేరెల పై ఎంత మక్కువ చూపెదరో, గాజులపై అంతే మక్కువ చూపిస్తారు. గాజులను మహిళలు ధరించడం సనాతన భారతీయ సంప్రదాయములో ఒకభాగము. ముతైదువకు వుండే ఐదు లక్షణాలలో గాజులు ఒకటి. గాజుల తయారి,అమ్మకం పై ఆధారపడి నేటికి కొన్ని లక్షల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి.ఎక్కడ తిరునాల, లేదా జాతర జరిగిన మనకు తప్పని సరిగా కన్పించేవి గాజులమ్మేదుఖాణాలు. గ్రామ ప్రాంతాలలోని వారపు సంతలలో కాడా గాజులమ్మేవారు కన్పిస్తారు. పూర్వకాలములో ప్రత్యేకముగా ఒక కులము (గాజుల బలిజ) వారు ఈ గాజులమ్మే వృత్తిలో వుండేవారు. గాజుల వుత్పత్తిదారులనుండి గాజులను టోకులో కొనుగోలున తెచ్చుకుని వూరూర తిరుగుచు, ఇంటింటికి తిరిగి గాజులమ్మేవారు. పూర్వకాలములో ఇంటిలో పెళ్ళి జరిగిన, శ్రీమంతము జరిగిన, లేదా ఏ శుభకార్యము జరిగిన గాజులోళ్ళను ఇంటికి పిలిపించుకుని, ఇంటిళ్ళిపాది ఆడవాళ్ళు గాజులు వేయించుకుని, వారికి నమస్కరించి, తగిన విధముగా సంభావన యిచ్చి పంపేవారు.ఏదైన కార్యము మీద బయటకు వెళ్ళునప్పుడు గాజులమ్మేవారు కాని, మట్టిగాజులు ధరించిన స్ర్తీ ఎదురుగా వచ్చిన శుభకరమని, వెళ్ళె కార్యాము జయప్రథముగా జరుగుతుందని భావిస్తారు. ఆధునీక కాలములో వచ్చిన పెను మార్పుల కారణముగా వూరూర తిరిగి గాజులమ్మే వారు కనుమరిగైపోయారు. కాని గాజుల వాడకం మారలేదు, తగ్గలేదు. అధునాతనంగా, పారిశ్రామికంగా దేశము మారినను, ఇప్పటికి గాజుల పరిశ్రమ హస్తకళ/చేతి వృత్తుల పరిశ్రమగా కొనసాగుతు, కొన్ని లక్షల మధ్య తరగతి కుటుంబ ఆడవారికి జీవనోపాది కల్పిస్తున్నది. వేదకాలం నాటి కన్న ముందే స్ర్తీలు గాజులు ధరించే వారని లభించిన ఆధారలను బట్టి తెలుస్తున్నది. మహోంజొదార త్రవ్వకాలలో లభించిన చిత్రాలలో చేతికి కంకణంధరించిన స్త్రీ చిత్రాలున్నాయి. యక్షిణి చిత్రాలలోని కూడా యక్షిణి చేతికి కంకణం ధరించినది. బాణబట్టు తన కావ్యములో సరస్వతిదేవి చేతికి గాజులు (కంగణ్‌) ధరించినట్లుగా పెర్కొన్నాడు.పురాతన తవ్వకాలలో తక్షశిల వద్ద, మౌర్య సామ్రాజ్యకాలం నాటి రాగి గాజులు లభించాయి. అజంతా చిత్రాలలోని, ఎల్లోరా శిల్పాలలోని స్త్రీలు గాజులు (కంగణ్‌) ధరించడం కన్పిస్తున్నది. B.C.230-100 నాటికే సిందులోయలో గాజులు ధరించెవారని తెలుస్తున్నది. జానపదపాటలలో,కావ్యాలలో,సాహిత్యములో గాజుల ప్రస్తవన విస్రుతముగా కన్పిస్తున్నది.సిక్కులు తమ మతాచారం లో లోహంతో చేసిన గాజును ధరించెదరు.దానిని ‘కడ’ (kada) అంటారు.చేతికి ధరించే ఈ కంకణములను ఎక్కువగా గాజు (Glass) తో చెయ్యడం వలన “గాజులు” అనే పేరు తెలుగులో రూడి అయ్యింది. గాజులనే కరకంకణములని కూడా అంటారు. గాజులను సంస్కృరములో ‘కంకణ్‌’ అనియు, హిందిలో ‘చిడియ’, ‘చుడ’ అని అంటారు. పంజాబులో వధువులు పెళ్ళికి 21 రోజుల ముందు నుండి కాని, లేదా పెళ్ళి తరువాత సంవత్సరం వరకు ఏనుగు దంతము (ivory) తో చేసిన గాజులని ధరించదం సంప్రదాయం. ఉత్తర ప్రదేశ్‌లో పెళ్ళికూతురు ఏర్రచీర, ఏర్రగాజులు ధరించడం శుభదాయకంగా తలంచెదరు. మహరాస్ట్రలో, కర్నాటకలో, ఆంధ్రలో పెళ్ళికూతురు పచ్చగాజులు ధరించడం ఆనవాయితి. పచ్చరంగు శుభానికి పతీకగా భావిస్తారు.

అలాగే పూర్వకాలంలో రాజస్తాన్‌ వివాహిత స్త్రీలు భర్త వున్నంత కాలము మణికట్తు నుంచి,ముంచెయ్యివరకు ఏనుగు దంతముతో చేసిన గాజులు ధరించేవారు.అలాధరించడం వలన తన కుటుంబానికి, భర్తకు, మరియు సంతానానికి శుభం కలుగుతుందని నమ్మకము, విశ్వాసం.పశ్చిమ బెంగాల్‌లో చిన్న గవ్వలు లేదా ఎర్ర పగడాలతో చేసిన గాజులను చేతులకు వేసుకొనడం పెళ్లయిన ఆడవారికి ఆచారంగా వున్నది. నేటికి ఆదివాసి, గిరిజన స్త్రీలు చేతులకు నిండుగా, ముంజేతి వరకు తెల్లటి, వెడల్పాటి చెక్కతో లేదా వెదురు తో చేసిన గాజులు ధరించడం గమనించవచ్చును.స్త్రీ దేవరామూర్తులకు ఎర్రగాజులను భక్తులు కానుకగా,మూడుపులుగా సమర్పించెదరు. కలకత్తలో కాళి దేవతకు ఎర్రగాజులను భక్తులు సమర్పించుకుంటారు. మిగాతా ప్రాంతాలలో నల్లటి గాజులను సమర్పించుకుంటారు. దక్షిణ భారతదేశములో స్త్రీ గర్భవతిగా వున్నప్పుడు, పుట్టింటి వారు ‘శ్రీమంతము’లో ఒకచేతికి 21 గాజులు, మరోచేతికి 22 గాజులు తొడుగుతారు.గాజుతో చేసె గాజుల పరిశ్రమను మొగలుల కాలములో బాగా ప్రోత్యాయించారు. ముఖ్యముగా ఫెరొజాబాద్‌లో గాజుల పరిశ్రమ అబివృద్ది చెందుటకు కారణము మొగలు సుల్తాను లు యిచ్చిన ప్రోత్యాహమే కారణము.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!