గయోపాఖ్యానం!

గయోపాఖ్యానంలో అర్జుడు పెట్టిన ఒట్టు పద్యం జనాలకి చిర పరిచితమే .. 

నదిలో అర్ఘ్య ప్రదానం చేస్తున్న శ్రీకృష్ణుని చేతిలో గయుని నిష్ఠీవనం 

( ఉమ్మి ) పడింది! కృష్ణుడు ఆగ్రహంతో ఊగి పోయి, గయుని వధిస్తానని శపధం చేసాడు. గయుడు పరువెత్తి పోయ అర్జునుని శరణు వేడాడు. 

అప్పుడు అర్జునుడు ఒట్టు పెట్టి మరీ అతనికి అభయ మిచ్చాడు.

"నిటలాక్షుండిపు డెత్తి వచ్చినను రానీ !యన్నదమ్ముల్నను

న్విటతాటంబున బాసి పోయినను పోనీ ! కృష్ణఁడే వ

చ్చి, ‘వ ద్దిటు పార్ధా ! ’యననీ !మఱేమయిన గానీ, లోకముల్బెగిలం

బటు దర్పంబున నిల్చి యీ గయుని ప్రాణంబేను రక్షించెదన్ ! ‘

.

అర్ధం..

.

‘ ఆశివుడే నామీద దండెత్తి రానీ ! అన్నదమ్ములు నా మీద కినుకతో నన్ను విడిచి పోతే పోనీ ! సాక్షాత్తు శ్రీకృష్ణడే వచ్చి, ‘‘అర్జునా ! వద్దు గయుని కాపాడ వద్దు ’

’ అననీ !ఇంకేమయినా కానీ, లోకాలు అదిరిపోయేలాగున నిలబడతాను. ఈ గయుని కాపాడుతాను ! ’’

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!