‘నా పాట నీ నోట పలకాల సిలకా’

‘నా పాట నీ నోట పలకాల సిలకా’ పాటలో 

‘నా నీడ సూసి నువు కిలకిలా నవ్వాల’ అంటూ నవ్వు గురించి రాసి; 

.

ఆచార్య ఆత్రేయ మరో మూడు పాటలను మాత్రం కన్నీటితో తడిపారు.

ఈ మూడు పాటల్లోని భావాలూ, వ్యాఖ్యానాలూ సినిమా పాత్రల పరిమిత

పరిధిని దాటిపోయాయి. అందరికీ అన్వయించే స్థాయిలో తెలుగులో స్థిరపడిపోయాయి. సందర్భానుసారం కోట్ చేసే పంక్తులుగా మారాయి.

‘ముద్దబంతి పూవులో మూగకళ్ళ వూసులో ’ పాటలో -

నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి

ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా

మనసును పైపైన కాకుండా లోతుగా అర్థం చేసుకోవాలనే సూచన..

‘మానూ మాకును కాను రాయీ రప్పను కానే కాను’ పాటలో-

కలలు కనే కళ్ళున్నాయి, అవి కలతపడితె నీళ్ళున్నాయి

కలల కనటం , అనుకున్నది జరగకపోతే కన్నీళ్ళు రావటం ఎవరికైనా సామాన్యమే అనే వాస్తవానికి అద్దం పట్టటం.

ఇక ‘పాడుతా తీయగా సల్లగా...’ పాటలో -

గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు

ఉండమన్న వుండవమ్మ శాన్నాళ్ళు

ఏడిస్తే బాధ తగ్గిపోయి ఊరట కలుగుతుందనేది కవితాత్మకంగా చెప్పటం. ఆ బాధ ఎంతటిదయినా కాలం గడిస్తే దాని తీవ్రత తగ్గిపోతుందని కూడా చెప్పటం .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!