‘పళ్ళు - పదారు’ ‘మూగమనసులు !

‘పళ్ళు - పదారు’ ‘మూగమనసులు !

.

మూగమనసులు సినిమాలో కొసరాజు -

‘ గౌరమ్మా నీ మొగుడెవరమ్మా ’ పాట రాశారు. 

.

‘సగం దేహమై నేనుంటే , అది పెళ్ళామంటే సెల్లదులే

పళ్ళు పదారు రాలునులే

పళ్ళు పదారు రాలునులే’

పళ్ళు ఎవరికైనా ముప్పై రెండు కదా? 

పదారు (పదహారు) అని ఎందుకు రాశారు? 

‘పళ్ళు - పదారు’ అనే ప్రాస కోసమేనా?

కొసరాజు అలా అర్థమేమీ లేకుండా రాస్తారా?!

మరి దీనిలో అంతరార్థమేంటి?

పురాణాల్లో శివుడు అర్ధ నారీశ్వరుడు కదా?

నోట్లో సగం పళ్ళు గౌరి (పార్వతి) వే. కాబట్టి

మిగిలిన పదహారు పళ్ళ సంగతే ప్రస్తావించి, 

అవి రాల్తాయని చమత్కారంగా చెప్పటమన్నమాట!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!