---శుభోదయం -సూక్తులు------

---శుభోదయం -సూక్తులు------


భక్తి పత్రమొ పుష్పమో ఫలమో తోయ 

మో యొసంగక వేలుపు లోసగ రెందు

బొంగి పొరలెడి ప్రేమ నొసంగు; వలయు 

నన్ని సుఖములు తనుదానె కన్నతల్లి !

పత్రము,పుష్పము, ఫలము,నీరు భక్తితో సమర్పిస్తేనే దేవుడు వరాలిస్తాడట. (అదీ అనుమానమే) ప్రతిఫల మాసింపక మనకు అన్ని సుఖములు,ప్రేమ,వాత్సల్యము యిచ్చేది కన్నతల్లి ఒక్కతే

.

పరోపదేశే పాండిత్యం సర్వేషాం సుకరం నృణాం 

ధర్మే స్వయ మనుస్టానం కస్య చిత్తు మహాత్మనామ్ 

.

అర్థము:-- పరులకు ఉపదేశము చేయడములో అందరూ మహా పండితులే కానీ స్వయముగా తాము 

ధర్మము పాటించడము మాత్రం ఎవరో మహాను భావులు మాత్రమే చేయగలరు.

ఉపకారేణ నీచానా మపకారోహి జాయతే

పయః పానం భుజంగానాం కేవలం విష వర్ధనం 

తా:-నీచులకు ఉపకారము చేసినా వాళ్ళు మనకు అపకారమే చేస్తారు.ఎలాగయితే పాముకు పాలు పోయడం వలన దానికి విషము వృద్ధి యై మనల్ని కాటువేస్తుందో అలాగ.

మాతా పిత్రో ర్నిత్యం ప్రియం కుర్యాత్ 

ఆచార్యస్య చ సర్వదా 

తేషు హి త్రిషు తృప్తేషు 

తపస్సర్వ సమాప్యతే 

.

అర్థము:-- తల్లి తండ్రులతో, గురువులతో ఎప్పుడూ ప్రియముగా మాట్లాడ వలయును. వారు చెప్పినట్టు నడుచుకొని వారికి సంతోషము కలుగ జేయ వలయును. ఈ ముగ్గురు తృప్తి చెందినచో సర్వ తపములు ఫలించి నట్లే.

మాతృవత్పరదారాంశ్చ పరద్రవ్యాణి లోష్టవత్ 

ఆత్మవత్స్స ర్వ భూతాని యః పశ్యతి స పండితః

అర్థము:-పరస్త్రీలను తల్లి లాగానూ, యితరుల ధనమును మట్టి పెళ్లలు లాగాను,

అన్ని భూతములు తనలాగా చూసే వారే నిజమైన పండితులు.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!