---శుభోదయం -సూక్తులు------

---శుభోదయం -సూక్తులు------


భక్తి పత్రమొ పుష్పమో ఫలమో తోయ 

మో యొసంగక వేలుపు లోసగ రెందు

బొంగి పొరలెడి ప్రేమ నొసంగు; వలయు 

నన్ని సుఖములు తనుదానె కన్నతల్లి !

పత్రము,పుష్పము, ఫలము,నీరు భక్తితో సమర్పిస్తేనే దేవుడు వరాలిస్తాడట. (అదీ అనుమానమే) ప్రతిఫల మాసింపక మనకు అన్ని సుఖములు,ప్రేమ,వాత్సల్యము యిచ్చేది కన్నతల్లి ఒక్కతే

.

పరోపదేశే పాండిత్యం సర్వేషాం సుకరం నృణాం 

ధర్మే స్వయ మనుస్టానం కస్య చిత్తు మహాత్మనామ్ 

.

అర్థము:-- పరులకు ఉపదేశము చేయడములో అందరూ మహా పండితులే కానీ స్వయముగా తాము 

ధర్మము పాటించడము మాత్రం ఎవరో మహాను భావులు మాత్రమే చేయగలరు.

ఉపకారేణ నీచానా మపకారోహి జాయతే

పయః పానం భుజంగానాం కేవలం విష వర్ధనం 

తా:-నీచులకు ఉపకారము చేసినా వాళ్ళు మనకు అపకారమే చేస్తారు.ఎలాగయితే పాముకు పాలు పోయడం వలన దానికి విషము వృద్ధి యై మనల్ని కాటువేస్తుందో అలాగ.

మాతా పిత్రో ర్నిత్యం ప్రియం కుర్యాత్ 

ఆచార్యస్య చ సర్వదా 

తేషు హి త్రిషు తృప్తేషు 

తపస్సర్వ సమాప్యతే 

.

అర్థము:-- తల్లి తండ్రులతో, గురువులతో ఎప్పుడూ ప్రియముగా మాట్లాడ వలయును. వారు చెప్పినట్టు నడుచుకొని వారికి సంతోషము కలుగ జేయ వలయును. ఈ ముగ్గురు తృప్తి చెందినచో సర్వ తపములు ఫలించి నట్లే.

మాతృవత్పరదారాంశ్చ పరద్రవ్యాణి లోష్టవత్ 

ఆత్మవత్స్స ర్వ భూతాని యః పశ్యతి స పండితః

అర్థము:-పరస్త్రీలను తల్లి లాగానూ, యితరుల ధనమును మట్టి పెళ్లలు లాగాను,

అన్ని భూతములు తనలాగా చూసే వారే నిజమైన పండితులు.


Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.