ఏకలవ్యుని పుట్టువూర్వోత్తరాలు - ఆరుద్ర

 

 

ఆరుద్ర గారి "వ్యాసపీఠం" నుంచి ఓ వ్యాసం

మహాభారతంలో "అయ్యో పాపం!" అనిపించి సానుభూతికి నోచుకునే కొన్ని పాత్రలలో ఏకలవ్యుడు ఒకడు. ఈ ఉదాత్త పాత్ర గురించి సామాన్య పాఠకులకూ సాధారణ సాహితీ పరులకూ తెలుగు భారతం, ఆది పర్వంలో లభ్యమైనంత సమాచారం మాత్రమే తెలుసు. ఆదిపర్ం పంచమాశ్వాసంలో ౨౩౧వ వచనం నుంచి ౨౫వ పద్యం దాకా పదిహేను గద్య పద్యాలలో నన్నయ్యగారు ఏకలవ్వుని అస్త్ర విద్యాభ్యాసం, పాటవ ప్రదర్శనం, గురుదక్షిణ సమర్పణం తెలియజేశారు. తన శిష్యులలో  ఒకే ఒకణ్ణి అందరి అందరికన్నా మిన్నగా చేయాలని ఇంకొక అసమాన పరాక్రమశాలిని ఆచార్యుడు అంగవికలునిగా చేయడం అనుచితం. అడిగి బొటనవ్రేలు కోసి ఇచ్చిన శిష్యుడు మహోన్నత వ్యక్తి. ఈ ఘట్టం తర్వాత ఏకలవ్యుడు ఏమయ్యాడు?

ఈ ప్రశ్నకు తెలుగు భారతంలో జవాబు దొరకదు. భారత కథలో ఎంతో ప్రముఖ పాత్రను వహించకపోతే ఆదిపర్వంలో ఏకలవ్యుని కథను కథనం చేయడం అనవసరం. తెలుగు భారతంలో దొరకదు గానీ వ్యాస భారతంలో ఏకలవ్యుని అట్టు పుట్టు ఆనవాళ్ళన్నీ ఓపికతో గాలించితే చేతినిండా చిక్కుతాయి. నన్నయ్యగారు గానీ, తిక్కన గారు గానీ వ్యాస భారతాన్ని యధామూలంగా అనువదించకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. భారతానికి హరివంశం ఖిలపర్వం, సంస్కృత భారంతలో మూల హరివంశాన్ని జోడించి చదివితే ఏకలవ్వుని పుట్టు పూర్వోత్తరాలన్నీ పువ్వులాగ విచ్చుకొంటాయి.

సంస్కృత హరివంశంలోని ౩౪వ అధ్యాయాన్ని చదివితే ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పాండవులకు గాని కృష్ణునికిగాని ఏకలవ్వుడు పరాయివాడు కాదు. పాండవులకు గాని కృష్ణునికిగాని ఏకలవ్వుడు పరాయివాడు కాదు. రక్తబంధువు. పాండవులు, ఏకలవ్యుడు పినతల్లి పెదతల్లి బిడ్డలు. కృష్ణుడూ ఏకలవ్యుడూ మేనత్త మేనమామ బిడ్డలు. ఈ బీరకాయ పీచు బంధుత్వాలు ఎర్రయ్యగారి తెలుగు హరివంశం వల్ల కూడా కొంత తెలుస్తాయి. ఏకలవ్యునికీ, కీచకునికి కూడా బంధుత్వం ఉంది. సుధేష్ణ పాండవులకు స్వయానా పినతల్లి కూతురు. ఉత్తరకుమారునికి పాండవులు మేనమామలు.

యాదవకులంలో అంధక వంశశాఖ ఉంది. అందులో శూరుడను రాజుకు వసుదేవుడు మొదలయిన తొమ్మండుగురు కొడుకులూ, అయిదుగురు కుమార్తెలూ వున్నారు. ఆ పుత్రికల పేర్లను హరివంశం ఇలా చెబుతుంది.

పృధుకీర్తి: పృథాచైవ
శ్రుతదేవా శ్రుత శ్రవఁ
రాజాధిదేవీ చకదా
పంచైతై వీరమాతరః
                 (అధ్యాయం  శ్లో ౧౯-౩౨)

వసుదేవుని ఈ అయిదుగురు అక్క చెల్లెళ్లూ ఎవరెవరిని పెళ్ళాడారో, వాళ్ళ సంతానం పేరులేమిటో కూడా హరివంశం ఈ అధ్యాయంలోని ఇతర శ్లోకాలలో చెబుతుంది.

౧. పృదకీర్తి
        భర్తః వృద్ధశర్మ కరూశాధిపతి
        కొడుకుః దంతవక్త్రుడు

౨. శ్రుతదేవ
        భర్తః కేకయేశ్వరుడు హిరణ్యధన్వుడు
        కొడుకుఛ ఏకలవ్యుడు

౩. శ్రుతశ్రవ
        భర్తః చేదిరాజు దనుఘోషుడు
        కొడుకుః శిశుపాలుడు

౪. పృధ(కుంతి)
       భర్తః పాండురాజు
       కొడుకులుః పాండవులు

౫. రాజాధిదేవి
       భర్తః అనంతపతి
       కొడుకులుః విందాను విందులు


         కేకయరాజుకూ శ్రుతదేవకూ పుట్టిన ఏకలవ్యుడు నిషాదుడెందుకయ్యాడు? హరివంశంలోనే ఒక శ్లోకం ఆ సంగతిని చెబుతుంది.

దేవశ్రవాః ప్రజాతస్తు
నైషాదిర్యః చ్రతిశ్రుతిః
ఏకలవ్యో మహారాజ
నిషాదైః వధివర్థితః
                     (౬-౪ శ్లో ౩౩)


ఈ శ్లోకార్థమేమిటంటే? దేవశ్రవునికి ఏకలవ్యుడు జన్మించి నిషాదులచే పెంచబడ్డాడని, దేవశ్రవుడు వసుదేవుని తమ్ముళ్ళలో ఒకడు. శ్రుతదేవ అనే పేరుకు బదులు దేవశ్రవ అనే పేరు ఈ శ్లోకంలో చోటుచేసుకుంది. ఎర్రయ్యగారు ఆంధ్ర హరివంశంలో "శ్రుతదేవ కుంగేకయేశ్వరుని వలన నేకలవ్యుడు పుట్టి నిషాదులలోన బెరిగె" అని ఈ శ్లోకాన్నే అనువదించారు.(పూర్వం ౩-౧౬౧) కేకయ రాజు సుక్షత్రియుడు కానందు వల్లనే నిషాదుడయ్యాడు.



సంస్కృత భారతం - విరాటపర్వం - పదహారో అధ్యాయంలో కేకయ రాజుల ప్రసక్తి వుంది. "కీచకుని వివరాలను జనమేజయుడు చెప్పమంటే వైశంపాయనుడు చెప్పాడు." క్షత్రియ పురుషునికి బ్రాహ్మణ స్త్రీ వలన పుట్టినవాడిని సూతుడంటారు.

ఈ విధమైన ప్రతిలోమ జాతులలో సూతునికి ద్విజత్వం ప్రాప్తిస్తుంది. వీళ్ళని రధకారులని పిలుస్తారు. పూర్వం రాజులకు సూతవంశాలతో వైవాహిక సంబంధాలు వుండేవి.

అయినా సూతుని రాజ శబ్దంలో వ్యవహరించరుగాని కొందరు సూతులు రాజులను ఆశ్రయించి రాజ్యాలు సంపాదించారు. వాళ్ళని సూతరాజులంటారు. వాళ్ళలో కేకయుడు కూడా ఒకడు. ఇతడు సూతులకు అధిపతి. క్షత్రియ స్ర్రీకే పుట్టాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. పెద్దభార్య మాళవి. ఈమెకు బాణుడు అనే కొడుకు పుట్టి కీచకుడు అనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. కేకయుని రెండో భార్యకు చిత్ర అనే కుమార్తె పుట్టి సుధేష్ణ అనే పేరుతో పెరిగింది. ఈమె విరటుని రెండో భార్య. పెద్ద భార్య శ్వేత చనిపోయాక విరటుడు ఈమెను పెళ్ళాడాడు.

మూలంలోని ఈ శ్లోకాలను తిక్కనగారు తమ విరాటపర్వంలో తెనిగించలేదు. పైగా మూలంలో లేని విషయాన్ని మరొకచోట చెప్పారు. ఉత్తర కుమారుడు శమీవృక్షం దగ్గర బృహన్నలతో పాండవుల గురించి అడిగి "ఏనమ్మహానుభావుల మేనల్లుండ" అని చాటుకొన్నట్టు రాశారు. (విరాట-౪-౧౨౦) సుధేష్ణ పాండవుల పినతల్లి కూతురే అన్న సంగతి ఇందువల్ల తేలుతుంది.

హరివంశంలో ఏకలవ్యడి విద్యాభ్యాసం ప్రసక్తిగాని, గురుదక్షిణ సంగతిగాని లేదు. ఏకలవ్యుడు జరాసంధుని ఆంతరంగికులలో ఒకడు. జరాసంధుని సైన్యాలకు ఏకలవ్యుడే సేనాధిపతి. మధర మీద పద్దెనిమిది సార్లు జరాసంధుడు దండెత్తాడు. ప్రతీముట్టడి లోనూ ఏకలవ్యుడు సైన్యాధిపత్యం వహించాడు. సంస్కృత హరివంశంలో ౯౩వ అధ్యాయం నుంచి ౯౯వ అధ్యాయం దాకా ఏకలవ్యుని సంగర విక్రమం కనబడుతుంది.


ఏకలవ్యుడు
(Ekalavya)

రామాయణ, భారతాలు, పురాణాలు చదవని వాళ్ళక్కూడా కొన్ని పాత్రల గురించి కొంతయినా తెలుసు. అలాంటి లోక ప్రసిద్ధి చెందినా పాత్రల్లో ఏకలవ్యుని పాత్ర ఒకటి. "అతను ఏకలవ్యుడంతటి దీక్ష కలవాడు" అని, "నేను మీకు ఏకలవ్యుడి లాంటి శిష్యుణ్ణి" అని అనడం వింటూ ఉంటాం. మరి ఏకలవ్యుడికి అంత ప్రాధాన్యత ఎలా వచ్చిదో తెలియాలంటే ఆ పాత్ర గురించి పూర్తిగా తెలియాలి కదా! అదేంటో తెలుసుకుందాం.
ఏకలవ్యుడు ఒక ఎరుకల కుటుంబంలో పుట్టాడు. అతని తండ్రి హిరణ్యధన్వుడు. సహజంగానే ఎరుకలవారికి విలువిద్యలో ప్రవేశం ఉంటుంది. ఏకలవ్యుడికి అందులో మరీ ప్రావీణ్యం ఉంది. తాను నిషాద (ఎరుకల) కుటుంబంలో పుట్టినప్పటికీ విలువిద్యలో అగ్రగణ్యుడిగా నిలవాలనుకున్నాడు..
ఒకరోజు ఏకలవ్యుడు, అస్త్రవిద్యలో గురువర్యుడు అయిన దోణాచార్యుని వద్దకు వెళ్ళి, ''అయ్యా, నాకు మీ దగ్గర శిష్యరికం చేయాలని ఉంది" అని అడిగాడు. ద్రోణుడికి నిషాద బాలుడైన ఏకలవ్యుని శిష్యునిగా స్వీకరించడం ఇష్టం లేకపోయింది. కానీ, ఆ మాత బహిరంగంగా చెప్పకుండా "బాగా సాధన చేయి, అదే వస్తుంది" అన్నాడు. ఏకలవ్యుడు రెట్టించలేదు. ద్రోణుడన్న ఆ మాటనే ఆశీర్వాదంగా భావించి, వెనుదిరిగి వెళ్ళాడు. అంతేకాదు, ద్రోణాచార్యుని విగ్రహాన్ని తయారుచేసుకుని, భక్తిగా నమస్కరించాడు. ఇక ఆ విగ్రహాన్నే, నిలువెత్తు దైవంగా, ప్రత్యక్ష గురువుగా తలుస్తూ కఠోర దీక్షటో విలువిద్యలో అపార నైపుణ్యం సంపాదించాడు.
ఏకలవ్యునికి విలువిద్యలో ఎంత నైపుణ్యం అబ్బిందంటే, కళ్ళతో చూడకుండా, కేవలం శబ్దాన్ని బట్టి బాణాన్ని ప్రయోగించగలడు. కంటితో చూస్తూ వేసిన వారికే ఎన్నోసార్లు గురి తప్పుతుంది. కానీ ఏకలవ్యుడు మట్టుకు శబ్దవేది విద్యలో ఆరితేరినవాడు కావడంతో గురి తప్పదు.
ఏకలవ్యుడి సంగతి అలా ఉండగా...
దోణాచార్యుడు అస్త్ర విద్యలో సాటిలేని మేటి. అందుకే భీష్ముడు కౌరవ పాండవులకు దోణాచార్యుని అస్త్ర విద్యలు నేర్పేందుకు గురువుగా నియమించాడు. గురువు అందరికీ సమానమే. కానీ శిష్యులు అనేక రకాలుగా ఉంటారు. ద్రోణుడు అందరికీ నేర్పిస్తున్నప్పటికీ, అర్జునుడు అందరికంటే మిన్నగా ఉన్నాడు. దాంతో అర్జునుడిపై ద్రోణుడికి మహా ప్రేమ. తన అనుంగు శిష్యునిగా భావించి ఎన్నో కిటుకులు నేర్పాడు.
ఓ సందర్భంలో ద్రోణుడు, తన శిష్యునితో కలిసి వేటకు వెళ్ళాడు. అడవిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత, వారి వెంట ఉన్న కుక్క అరిచింది. కొంత దూరంలో ఉన్న ఏకలవ్యుడు, ఎవరు, ఏమిటి అని చూడకుండానే, శబ్దవేది విద్యలో ఘటికుడు కనుక కుక్క మొరిగిన దిశగా బాణం వేశాడు. ఆ బాణం సరిగ్గా కుక్కకు తగిలింది. కుక్క మూలుగుతూ పడటంతో ఏకలవ్యుడు అటుగా వచ్చాడు. తన గురువు ఎదురుగా కనిపించడంతో ఆనందానికి గురయ్యాడు.
ఏకలవ్యుడి విలువిద్యా చాతుర్యానికి ద్రోణుడు మనసులో ముగ్ధుడయ్యాడు. అర్జునుడికి మాత్రం కోపం, దుఃఖం పొంగుకొచ్చాయి. ''తనను విలువిద్యలో అందరికంటే ప్రతిభావంతుడిగా తయారుచేస్తానని మాట ఇచ్చి తప్పారు అనిపించింది. అక్కడ గురువుగారి విగ్రహం కూడా ఉంది. అంటే, తనను మాయచేసి, ఎరుకలవాన్ని మరింత ప్రతిభాశాలిగా తీర్చిదిద్దారు'' అనుకున్నాడు. దాంతో "గురువుగారూ, మీరు మాట తప్పారు.. మీకు నాకంటే నిషాదుడే ఎక్కువ కదూ!'' అనేశాడు.
ద్రోణుడు అర్జునుడు బాధపడటం సహించలేకపోయాడు. నిజంగానే తాను అర్జునిడికి ఇచ్చిన మాట నెరవేరలేదు. దాంతో ఏకలవ్యునివైపు తిరిగి, ''ఎకలవ్యా! విలువిద్యలో నువ్వు నిజంగానే ఘనత సాధించావు.. మరి, నా గురుదక్షిణ ఏది?" అన్నాడు.
ఏకలవ్యుడు గురువు మెచ్చుకోవడంతో అంతులేని ఉద్వేగానికి గురయ్యాడు. కన్నీళ్ళతో కాళ్ళమీద పడిపోయి, "కోరుకోండి, అయ్యా.. నేను ఇవ్వగలిగింది ఎదైయినా ఇస్తాను'' అన్నాడు. ద్రోణుడు "నీ కుడిచేతి బొటనవేలు ఇస్తావా?" అన్నాడు. ఏకలవ్యుడు నిర్వికారంగా తన బొటనవేలు కోసిచ్చాడు. అంటే తన ప్రాణానికి ప్రాణమైన విలువిద్యను త్యాగం చేశాడు.
- See more at: http://www.teluguone.com/devotional/content/ekalavya-278-2850.html#sthash.5PHTVxvV.dpuf
ఏకలవ్యుడు
(Ekalavya)

రామాయణ, భారతాలు, పురాణాలు చదవని వాళ్ళక్కూడా కొన్ని పాత్రల గురించి కొంతయినా తెలుసు. అలాంటి లోక ప్రసిద్ధి చెందినా పాత్రల్లో ఏకలవ్యుని పాత్ర ఒకటి. "అతను ఏకలవ్యుడంతటి దీక్ష కలవాడు" అని, "నేను మీకు ఏకలవ్యుడి లాంటి శిష్యుణ్ణి" అని అనడం వింటూ ఉంటాం. మరి ఏకలవ్యుడికి అంత ప్రాధాన్యత ఎలా వచ్చిదో తెలియాలంటే ఆ పాత్ర గురించి పూర్తిగా తెలియాలి కదా! అదేంటో తెలుసుకుందాం.
ఏకలవ్యుడు ఒక ఎరుకల కుటుంబంలో పుట్టాడు. అతని తండ్రి హిరణ్యధన్వుడు. సహజంగానే ఎరుకలవారికి విలువిద్యలో ప్రవేశం ఉంటుంది. ఏకలవ్యుడికి అందులో మరీ ప్రావీణ్యం ఉంది. తాను నిషాద (ఎరుకల) కుటుంబంలో పుట్టినప్పటికీ విలువిద్యలో అగ్రగణ్యుడిగా నిలవాలనుకున్నాడు..
ఒకరోజు ఏకలవ్యుడు, అస్త్రవిద్యలో గురువర్యుడు అయిన దోణాచార్యుని వద్దకు వెళ్ళి, ''అయ్యా, నాకు మీ దగ్గర శిష్యరికం చేయాలని ఉంది" అని అడిగాడు. ద్రోణుడికి నిషాద బాలుడైన ఏకలవ్యుని శిష్యునిగా స్వీకరించడం ఇష్టం లేకపోయింది. కానీ, ఆ మాత బహిరంగంగా చెప్పకుండా "బాగా సాధన చేయి, అదే వస్తుంది" అన్నాడు. ఏకలవ్యుడు రెట్టించలేదు. ద్రోణుడన్న ఆ మాటనే ఆశీర్వాదంగా భావించి, వెనుదిరిగి వెళ్ళాడు. అంతేకాదు, ద్రోణాచార్యుని విగ్రహాన్ని తయారుచేసుకుని, భక్తిగా నమస్కరించాడు. ఇక ఆ విగ్రహాన్నే, నిలువెత్తు దైవంగా, ప్రత్యక్ష గురువుగా తలుస్తూ కఠోర దీక్షటో విలువిద్యలో అపార నైపుణ్యం సంపాదించాడు.
ఏకలవ్యునికి విలువిద్యలో ఎంత నైపుణ్యం అబ్బిందంటే, కళ్ళతో చూడకుండా, కేవలం శబ్దాన్ని బట్టి బాణాన్ని ప్రయోగించగలడు. కంటితో చూస్తూ వేసిన వారికే ఎన్నోసార్లు గురి తప్పుతుంది. కానీ ఏకలవ్యుడు మట్టుకు శబ్దవేది విద్యలో ఆరితేరినవాడు కావడంతో గురి తప్పదు.
ఏకలవ్యుడి సంగతి అలా ఉండగా...
దోణాచార్యుడు అస్త్ర విద్యలో సాటిలేని మేటి. అందుకే భీష్ముడు కౌరవ పాండవులకు దోణాచార్యుని అస్త్ర విద్యలు నేర్పేందుకు గురువుగా నియమించాడు. గురువు అందరికీ సమానమే. కానీ శిష్యులు అనేక రకాలుగా ఉంటారు. ద్రోణుడు అందరికీ నేర్పిస్తున్నప్పటికీ, అర్జునుడు అందరికంటే మిన్నగా ఉన్నాడు. దాంతో అర్జునుడిపై ద్రోణుడికి మహా ప్రేమ. తన అనుంగు శిష్యునిగా భావించి ఎన్నో కిటుకులు నేర్పాడు.
ఓ సందర్భంలో ద్రోణుడు, తన శిష్యునితో కలిసి వేటకు వెళ్ళాడు. అడవిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత, వారి వెంట ఉన్న కుక్క అరిచింది. కొంత దూరంలో ఉన్న ఏకలవ్యుడు, ఎవరు, ఏమిటి అని చూడకుండానే, శబ్దవేది విద్యలో ఘటికుడు కనుక కుక్క మొరిగిన దిశగా బాణం వేశాడు. ఆ బాణం సరిగ్గా కుక్కకు తగిలింది. కుక్క మూలుగుతూ పడటంతో ఏకలవ్యుడు అటుగా వచ్చాడు. తన గురువు ఎదురుగా కనిపించడంతో ఆనందానికి గురయ్యాడు.
ఏకలవ్యుడి విలువిద్యా చాతుర్యానికి ద్రోణుడు మనసులో ముగ్ధుడయ్యాడు. అర్జునుడికి మాత్రం కోపం, దుఃఖం పొంగుకొచ్చాయి. ''తనను విలువిద్యలో అందరికంటే ప్రతిభావంతుడిగా తయారుచేస్తానని మాట ఇచ్చి తప్పారు అనిపించింది. అక్కడ గురువుగారి విగ్రహం కూడా ఉంది. అంటే, తనను మాయచేసి, ఎరుకలవాన్ని మరింత ప్రతిభాశాలిగా తీర్చిదిద్దారు'' అనుకున్నాడు. దాంతో "గురువుగారూ, మీరు మాట తప్పారు.. మీకు నాకంటే నిషాదుడే ఎక్కువ కదూ!'' అనేశాడు.
ద్రోణుడు అర్జునుడు బాధపడటం సహించలేకపోయాడు. నిజంగానే తాను అర్జునిడికి ఇచ్చిన మాట నెరవేరలేదు. దాంతో ఏకలవ్యునివైపు తిరిగి, ''ఎకలవ్యా! విలువిద్యలో నువ్వు నిజంగానే ఘనత సాధించావు.. మరి, నా గురుదక్షిణ ఏది?" అన్నాడు.
ఏకలవ్యుడు గురువు మెచ్చుకోవడంతో అంతులేని ఉద్వేగానికి గురయ్యాడు. కన్నీళ్ళతో కాళ్ళమీద పడిపోయి, "కోరుకోండి, అయ్యా.. నేను ఇవ్వగలిగింది ఎదైయినా ఇస్తాను'' అన్నాడు. ద్రోణుడు "నీ కుడిచేతి బొటనవేలు ఇస్తావా?" అన్నాడు. ఏకలవ్యుడు నిర్వికారంగా తన బొటనవేలు కోసిచ్చాడు. అంటే తన ప్రాణానికి ప్రాణమైన విలువిద్యను త్యాగం చేశాడు.
- See more at: http://www.teluguone.com/devotional/content/ekalavya-278-2850.html#sthash.5PHTVxvV.dpuf

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!