పోతన గారి నారదుడు !- (తెలుగు భాగవతం -ప్రధమ స్కంధము.)

పోతన గారి నారదుడు !-

(తెలుగు భాగవతం -ప్రధమ స్కంధము.)

.

క.

"వాయించు వీణ నెప్పుడు 

మ్రోయించు ముకుందగీతములు జగములకుం

జేయించుఁ జెవుల పండువు 

మాయించు నఘాళి నిట్టి మతి మఱి గలఁడే!

భావము:

“ నారదమహర్షి సర్వదా మహతీ విపంచి వాయిస్తు, ముకుందగీతాలు మ్రోయిస్తు, సకల జగత్తులకు వీనులవిందు చేస్తు, లోకుల పాపసమూహాలను మాయిస్తు, సంచరించే మేటి భక్తుడు. 

ఆయనకు ఆయనే సాటి.”

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!