శ్రీ గుర్రం జాషువా - టీవీయస్.శాస్త్రి

శ్రీ గుర్రం జాషువా - టీవీయస్.శాస్త్రి

గబ్బిలం (1941) ఆయన రచనల్లో సర్వోత్తమమైనది. కాళిదాసు మేఘసందేశం తరహాలో సాగుతుంది. అయితే యిందులో సందేశాన్ని పంపేది యక్షుడు కాదు. ఒక అంటరాని కులానికి చెందిన కథానాయకుడు తన గోడును కాశీ విశ్వనాథునికి చేరవేయమని గబ్బిలంతో సందేశం పంపడమే దీని కథాంశం. ఎందుకంటే గుడిలోకి దళితునకు ప్రవేశంలేదు కాని గబ్బిలానికి అడ్డు లేదు. కథానాయకుడి వేదనను వర్ణించిన తీరు హృదయాలను కలచివేస్తుంది. చూడండీ,ఆయన మనో భావాన్ని దళిత యువకిడి ద్వారా యెంత చక్కగా చెప్పారో!

"వాని నుద్ధరించు భగవంతుడే లేదు

మనుజెడెట్లు వాని గనికరించు

వాడు జేసికొన్నపాపకారణ మేమో

యింతవరకు వాని కెరుకలేదు."


"ఆ యభాగ్యుని రక్తంబు నాహరించి

యినుపగజ్జెల తల్లి జీవనము సేయు

గసరి బుసకొట్టు నాతని గాలిసోక

నాల్గు పడగల హైందవ నాగరాజు"(హిందూ మతంలో వున్నచాతుర్వర్ణ వ్యవస్థను గురించి యెంత భావ యుక్తంగా చెప్పారో,చూసారుగా!)


"కులము లేని నేను కొడుకుల బుట్టించి

ఈ యఖాతమందే త్రోయవలేనే

భార్యయేల బుట్టుబానిస కని వాడు

జరుపసాగే బ్రహ్మచర్య దీక్ష"


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!