శ్రీనాధుడి పద్యాలు .....


శ్రీనాధుడి పద్యాలు 

--------------------------


తక్కువ తెలిసి ఉండి, గర్వంతో ఎక్కువ మాట్లాడే కుకవుల గురించి శ్రీనాథుడు వ్రాసిన పద్యం...


బోధ మల్పంబు గర్వ మభ్యున్నతంబు 

శాంతి నిప్పుచ్చరంబు మచ్చరము ఘనము 

కూపమండూకములుబోలె గొంచె మెరిగి 

పండితంమన్యులైన వైతండికులకు. (భీమ ఖండం -1 -13 )


తనకు భిక్ష దొరకలేదని కాశీ నగరాన్ని శపించబోతాడు వ్యాసుడు. అతడిని శర్వాణి వారించే పద్యాలు...


భిక్ష లేదని ఇంత కోపింతురయ్య 

కాశికాపట్టణముమీద గాని నేయ !

నీమనశ్శుద్ది తెలియంగ నీలకంఠు 

డింత చేసేనుగాక కూడేమి బ్రాతి? (భీమ ఖండం 2-114 )


శివుడు నిన్ను శోధించడానికి భిక్ష పుట్టకుండా చేసాడని చెప్పేసింది. 


తెలుగు భాష గొప్పతనాన్ని మొదట చాటిన వాడు శ్రీనాధుడే ! క్రీడాభిరామం లోని ఈ పద్యం చూడండి...


జనని సంస్కృతంబు సకల భాషలకును - దేశభాషలందు దెనుగులెస్స 

జగతి తల్లికంటె సౌభాగ్యసంపద - మెచ్చుటాడు బిడ్డ మేలుగాదే ?



కంజీవరం వెళ్ళినప్పుడు అక్కడి తమిళుల విందులో శ్రీనాధుడి తిప్పలు అంతా ఇంతా కావు. 


తొలుతనే వడ్డింత్రు దొడ్డ మిరియపు జారు

చెవులలొ బొగవెళ్ళి చిమ్మిరేగ

బలు తెరంగుల తోడ బచ్చళ్ళు చవి గొన్న 

బ్రహ్మ రంధ్రము దాక బారు నావ

యవిసాకు వేచిన నార్నెల్లు పసి లేదు

పరిమళ మెంచిన బండ్లు సొగచు

వేపాకు నెండించి వేసిన పొళ్ళను

గంచాన గాంచిన గ్రక్కువచ్చు

నఱవ వారింటి విందెల్ల నాగడంబు

చెప్పవత్తురు తమ తీరు సిగ్గు లేక

చూడవలసిన ద్రావిళ్ళ కీడు మేళ్ళు... 


అసలే భోజన ప్రియుడైన శ్రీనాధుడు అలవాటు లేని తమిళుల భోజనముతో ఎలాటి అవస్థలు పడ్డాడో కదా. ఆంధ్రుల భోజనములో పప్పు ప్రధానము. తమిళులకు చారు ముఖ్యం. అలవాటు లేని చారు అదీగాక మిరియపు చారు మొదటనే వడ్డించేసరికి కవి సార్వభౌముడికి చిర్రెత్తింది. 


బుడతకీచువారు(పోర్చుగీసువారు) మన దేశానికి రాకముందు మనకు మిరపకాయలు లేవు. కారానికి మిరియాలే వాడేవారు. మనకు పోర్చుగీసు వారివల్లనే మిరపకాయలు లభించాయి. మిరియాలకు బదులుగా కారానికి వాడేవి కాబట్టి వీటిని(మిర్యపుకాయలు) మిరపకాయలు అని పిలుస్తారు.

సేకరణ:-భావరాజు  పద్మిని.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!