కర్పూరవసంతరాయలు ! రచన --డా; సి, నారాయణ రెడ్డి-

కర్పూరవసంతరాయలు !

రచన --డా; సి, నారాయణ రెడ్డి-

.

ఇది ఒక కథాత్మక గేయకావ్యం-- క్రీస్తుశకం 1386 నుండి 1402 వరకు కొండవీడును రాజధానిగా చేసుకొని అంధ్రదేశాన్ని పాలించిన ' రసికప్రభువు' -కుమారగిరి రెడ్డి. కుమారగిరి రెడ్డి ఆస్తాన నర్తకి 'లకుమ; ఈ లకుమా ప్రభువుల ప్రణయగీతం కర్పూరవసంతరయలు మల్లంపల్లి సోమశేఖరశర్మగారి HISTORY OF REDDY'S KINGDOMS లో కుమారగిరి రెడ్డి కి కర్పురవసంతరయలు అన్న బిరుదు ఉన్నదని ఉదహరించటం జరిగింది. ప్రతి సంవత్సరం 9 రోజులు వసంతోత్సవాలు నిర్వహిస్తుండేవాడు 'కుమారగిరి'. పంజాబు నుండి కర్పూరాన్ని, గోవా నుండి కుంకుమ ద్రవ్యాలను తెప్పించి ఆ 9 రోజులు జనంపై వెదజల్లుతుండేవాడట. అందుకే అతనిని 'కర్పురవసంతరయలు గా పిలిచేవారట. కుమారగిరి రెడ్డి స్వయం గా పండితుడు, కవి. ఇతడు వసంతరాజీయ్యము అనే నాట్యశాస్త్ర గ్రంథాన్ని వ్రాసినట్లు చరిత్ర. రాజ్య భారాన్ని తన మంత్రి, బావ అయిన కాటయ వేమారెడ్డి పై మొపి, సంగీత, నాట్య, వినోదాలతో కాలాన్ని కర్పూరం వలె వెలిగించాడు. క్లుప్తంగా కథాశరీరం. 'కుమారగిరి', 'లకుమ' నాట్యానికి, ఆమె తనూ లావణ్యానికి దాసుడు అవుతాడు. రాజ్యాన్ని, రాణిని విస్మరిస్తాడు. రాజ్య పరిరక్షణ కోసం రాణి లకుమ ను అర్థిస్తుంది. లకుమ ప్రాణత్యాగం తో ఈ కావ్యం ముగుస్తుంది. రెడ్డీ రాజులచరిత్రకు ప్రాణం పోసిన శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారికి అంకితమిచ్చారు నారాయణ రెడ్డి గారు. ఇక ఈ కావ్యం లొని కొన్ని ఘట్టాలు చైత్రపూర్ణీమనాడు జానువెన్నెలరెడు ఉదయింఛచినాడదొ మదనునికి సైదొడు కొండవీడానాడు వెండివెన్నెలలొన కనిపించె నచ్చముగ కైలాసగిరివొలె ఆసుప్రసన్నసమయాననగరొధ్యానమందున కళాల క్ష్మి అందెసవరించిండది ఆనాదలహరి రాజాంతరంగముననిండినదపుడు నర్తకియె తప్ప అన్యముకానబడదు రాజునకపుడు రెనిముగ్దమనస్సులొన మన్మధునీఅరవబాణమవతరించినది రెనిస్నిగ్ధహ్రుదంతాన ఆంమ్రుతాంశు పదునెడవకళయెస్పురించినది సార్వబౌముని రాజస మ్మడుగువట్టినది అతిమస్రణ రసలొలత పైకిలెసినది రత్నహారము దీసి రాజు వెదికడాసె తలవంచి లకుమ అడుగులు ముందునకువెసె దండ తొపాటుకరదండయుగళము గూడ లకుమ గళమందున అలంకరణమైపొయె చంద్రుడొక్కడు అతనిచుట్టుగచంక్రమించును వెలచుక్కలు లకుమ యెక్కతె ఆమెచుట్టుగలాస్స్యమాడెను లక్షఊహలు తొలుత లకుమాకింకిణులకు రాయండుముగ్దుండయ్యె ఆవెనుక ఆమె తనూ లావణ్యమునకె దాసుండయ్యె ఆయమ వసంతరాయని మానస సరొవరాంతరాళ విహారయైన రాజమరాళి ఇలా లకుమతొనె కాలాన్ని వెల్లబుచ్చుతూ రాజ్యాన్ని;రాణి ని విస్మరిస్తాడు 'కుమారగిరి'

రేడు నాఅంతహపురమునకు రాడనెడుదుఖము కన్నను రాచగద్దెను విడిన వార్తయె రంపమున గొసినది ఆతకత్తె లనాదరించుట అధిపులకు ధర్మమ్మె కాని వారి అడుగులమ్రొలబ్రతుకును ధారవొయుట యేటిన్యాయం కేళీకామందిరము కన్ననుఓలగమ్ము పవిత్రమైనది వ్యక్తికన్నను దేశపరిరక్షణ ఆదరపాత్రమైనది రాజ్జ్యరక్షణకొసం 'లకుమ' నుఅర్ధిస్తుంది రాణి] నీ పయిన్ ఒక ఘోరభారము మొపగా వచ్చితి చెల్లి పాలముంతువొ నీటముంతువొ భాధ్యతను గమనించి తల్లి నిన్ను రాయలు కన్నులందుననిల్పినందుకు పరితపించను కాని దేశమ్మును తృణమ్మట్టు కాలద్రొయుట నెట్ల్లు సైతును గుండె రాయిగ జేసికొని కడకొక్కమాటయెయందునమ్మా భుపతిని ఎటులైనవీడిపొవుటయె నీకు అవశ్యమమ్మా ఆలొచన పడుతుంది లకుమ, రాణీని, రాజ్జ్యాన్ని నాకొసంవిడనాడిన రాజునొదలి ఎలావెల్లను రాణీకిచ్చినమాట ఎలానిలుపుకొను ఎందుకి హ్రుదయమ్మునిచ్చితివీశ్వారా; ఈసానిదానికి అనుకుంటు తూర్పువాకిట భాలభానునితొల్లికిరణము తొంగిచూచెను లకుమలొనొకవజ్రసంకల్పమ్ము వేళ్ళనుదన్నిలెచె అనాటి అసురసంధ్యాలకుమరక్తాంబరముగట్టి రాయనికిఎదురుగానిల్చె ఇదిఎమివేషమే మదవతీ యననామె శివతాండవమున కిఇ చీరయేతగుననియె మృడునియాకృతి దొప ఒడలెల్ల పొంగించె డండండముక్కుమని డమరుకము పల్కించె నృత్యమందిరము శొణితవర్ణితమ్మయె ఆమెలొ అసురసంధ్యామూర్తికననయె ఒక్కమాటుగ నామెఒడిలొనచెయివెసె నృపునికనులందొకమెరుపు తళుక్కునదూసె మరునిముసమున లకుమ ధరణీ పైగూలె ప్రభుడప్పుడుగగ్గొలుపడి ఏమియునుతొచక ఎదలొదిగినబాకునూడంబెరికె దాని పిడిచుట్టు పత్రమ్ముకనిపించె రక్తసిక్తాక్షరములను రేడుపటియించె ఓలకుమా యెటనుంటివొ నివు;ఇంకెచట పరమసాధ్విజగత్ స్వర్ణాసనముపైన కొమరగిరి చరితమ్ము కొండవీటను శీశీరమును సైతమువసంతముగ రూపుగట్టించు కొండవీటను పాదుకొన్నట్టి మట్టిలొసైతము కర్పూరసొరభములు వీచు

ఈ కావ్యాన్ని స్వ్యయంగా నారాయణరెడ్డి గారు ఆలపించారు ఈ కావ్యాన్ని చదివినా విన్నా శతకొటిమల్లికల సువాసనని మనం కూడా ఆస్వ్యాదించవచ్చు

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!