"పుష్పవిలాసం" ....

నలవైఆరేళ్ళక్రిందట్నే అంటే అరవై ఎనిమిదిలో చంద్రాభొట్ల సత్యనారాయణమూర్తి గారు ఒక పద్యరచయిత గారు "పుష్పవిలాసం" అనే పేరుతో ముప్ఫైనాలుగు పద్యాల ఖండికనొకదాన్ని వ్రాసినారు.ఈరోజు వారు స్వయంగా సభలో చదివి వినిపించినారు.

ఎంతోఅందమైన ఛందోబద్ధమైన పాపయ్యశాస్త్రిగారి పుష్పవిలాప పద్యాలకు దీటైన పద్యాలలో పువ్వులను కోయవద్దని తరుణులకు తను చెప్పబోగా ఒక చిన్ని పువ్వు కోయకుండా మా బ్రతుకులను నిరర్థకం చేయవద్దని నిష్ఠురమాడినట్టు (జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి అభిమాని వీరు, మాటమాటకు వారి ని తలచుకుంటూనే పద్యపఠన గావించినారు గాని ఇది నా వాదన అంటూ ) వ్రాసినారు.

"హరి చరణాలనో , తరుణుల శిరో భూషణాలుగా కాక తొడిమనుంచి సోలి, రాలి మాతృగర్భంలో మేము సమాధికావలెనా?

మీ కవితాసౌరభాలు రసజ్ఞులను అలరించాలని మీరు కోరినట్టే మా పరిమళాలు జగత్తును అలరించాలని మేము కోరరాదా?

నానాగుణవర్ణాదులలో కదంబమాలగా మేము అందగించినట్టు నానాగుణవర్ణాదులున్న మానవజాతి ఐకమత్యమనే సూత్రంలో అందం చేకూర్చాలని మా మౌనసందేశం కోసి మాలగా కడితేనే కదా!

గుచ్చినా, సూదులు గుచ్చినా మా ముక్తి కొరకే అయితే తప్పేముంది.మీ వైద్యులు శస్త్రచికిత్సలో మిమ్మల్ని బాధపెట్టే కదా మీకు మంచి చేస్తారు! ఇదీ అలానే కదా!"

ఎంతో నచ్చింది నాకు. వారు తోచింది వ్రాసుకుంటున్నారంట కానీ ప్రచురణ జోలికి పోవడం లేదంట. కాశీలో దైవసాన్నిధ్యంలో కాలం గడుపుతున్నారు

Comments

  1. Promote your Website or Blog at http://forum.telugushortfilmz.com/

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!