హృదయమందున్న జ్యోతియే ఆత్మ వస్తువు.

హృదయమందున్న జ్యోతియే ఆత్మ వస్తువు.

దానితేజస్సు సర్వ వ్యాప్తమైఉంటుంది. అందులోనే లోకములన్నీ కనుపిస్తాయి.

బాల కృష్ణుడు ఈదీపశిఖలో కనుపింఛే బ్రహ్మాండాన్నే తన నోటిలో యశొదకు చూపిస్తాడు. 

.

ఈజ్యోతి అతి సూక్ష్మమైనది. కృష్ణుడు నోరుతెరచి తన హృదయాంతర్గతమైన జ్యోతినే యశోదకు చూపిస్తాడు. చిత్తముయొక్క విక్షేప శక్తివలన ఆమె అబ్బురపడి చూస్తూ ఉండిపోయినది. ఆమె యశోద. అంటే యశమును ఇచ్చునది. ఆమెద్వారా ఈ సంఘటన లోకానికి తెలిసినది. ఆయన యశస్సు లోకానికి చాటిచెప్పినది.ఆమెకు జగత్తుకు కారణమైన బిందువుని చూపిస్తే , ఆమెకు దానిలోని లోకములన్నీ కనుపించాయి. అర్జునునికి ఒక్క విశ్వరూపం మాత్రమే చూపించాడు. కృష్ణుడు ఆమె అవిద్యను ఆమెకి తిరిగి ఇచ్చివేశాడు. ఆమె కృష్ణుని దివ్యత్వంతెలుసుకోలేదు

. బాలునికి ఏగాలో సోకినది. అని అనుకొని విభూతి పెట్టి ఉంటుంది

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!