శ్రీకృష్ణుడు మానినీ చిత్తచోరుడు.

శ్రీకృష్ణుడు మానినీ చిత్తచోరుడు అంటే ఏమిటి? 

చిత్తమంటే మనస్సు అనే అంతఃకరణ. మనసు అంటే ఆలోచనలే..

గోపికలు మొదట్లో "మధురానగరిలో చల్ల నమ్మబోదూ" అని తిరిగేవారు. 

ఇప్పుడు పాలూ, పెరుగూ, వెన్నా మరచిపోయారు. అత్తగారు భర్తా, పిల్లలూ ఎవరూ గుర్తులేరు. కొందరు భర్తగా, కొందరు కుమారుడుగా, ఆవులు దూడగా భావించుకున్నారు. ఎవరిఊహ వారిదే. ఎవరికి వారు అతడి సాన్నిహిత్యంలోనే ఉన్నారు. ఇదే యోగం. పతంజలి మాటలలో "చిత్తవృత్తి నిరోధం." గోకులంలో అందరూ మానినులే. అందరి హృదయాలలోనూ కృష్ణుడే. ఈపరిస్థితిలోనే ఒక రాత్రి వారికి రాసక్రీడ అనుభవం జరిగినది. మధ్యలోనే కృష్ణుడు వెళ్ళిపోయాడు. తరువాత వెంటనే గోకులాన్ని వదలి అక్రూరునితో మధుర వెళ్ళిపోయాడు. కాని అందరిహృదయాల్లో చిత్తచోరుడుగా ఉండిపోయాడు. చోరుడు అంటే చిత్తాన్ని పూర్తిగా ఆక్రమించినవాడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!