కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !
శ్రీ కృష్ణ స్తోత్రము . శ్లో !! కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ ! నాసాగ్రే నవమౌక్తికం కర తలే వేణుం కరే కంకణమ్ ! సర్వాంగే హరి చందనం చ కలియన్ కంఠే చ ముక్తావళి ! గోప స్త్రీ పరివేష్టి తో వవిజయతే గోపాల చూడామణీః !! తా. లలాటమున కస్తూరీ తిలకము దిద్దుకొన్న వాడును , వక్షః స్థలమున కౌస్తుభ మణిని ధరించిన వాడును , ముక్కునకు బులాకీగా మంచి ముత్యమును ధరించిన వాడును , చేతుల లో వేణువు గలవాడును , చేతులకు కంకణములు ధరించిన వాడును , దేహమందతటను హరిచందనము పూయ బడిన వాడును , కంఠమునందుముత్యాల హారమును ధరించిన వాడును , గోపికా స్త్రీలతో పరివేష్టింపబడి యున్నవాడును , అగు గోపాల చూడామణి అయిన శ్రీ కృష్ణుడు విజయమునుపొందు గాక !!

ఎన్నాళ్ళ నుండో ఉన్న సందేహాలు తీరాయి.
ReplyDeleteకురుక్షేత్రం తర్వాత బ్రతికి ఉన్నవారిలో యౌధేయుడు కూడా ఒకడు. అయితే అతను కూడా బభ్రువహనుడి లాగే తాతగారి రాజ్యానికి వారసుడిగా దౌహిత్రునిగా ధర్మరాజు వివాహానికి పూర్వమే అంగీకరించడం వలన యుద్ధంలో పాల్గొనకుండా తాతగారి రాజ్యం లోనే ఉండిపోయాడు. అందువలననే అతను ధర్మరాజు తర్వాత కూడా హస్తినాపురానికి రాజు కాలేదు.
ReplyDeleteనాగకన్య ఉలూపి (ఉలూచి) అర్జునుల కుమారుడు ఇరావంతుడు. ఇతను కూడా మహాభారత యుద్ధంలో మరణించాడు.
ReplyDeleteఓ విధంగా కురుక్షేత్ర యుద్ధం చాలా మంది క్షత్రియులను పొట్టన బెట్టుకుంది. కాని అందులో గల మర్మమేమంటే.. ధర్మానిదే విజయం.. అన్నాదమ్ముల నడుమ వైరం ఎంతటి ఘోరానికైనా ఉసిగొల్పగలదనే నీతి ఇందులోనే ఇంప్లిసిట్ గా బోధపడేటటువంటి విషయం.
Deleteఐతే నాదోక సందేహం.. ఆ కాలంలో వీరులందరికి అమ్మాయిలే పుట్టలేదా..? లేదా.. ఆయా వీరాంగనాలు తరవాతి కాలం లో ఓ రుద్రమ, ఓ మణికర్ణికలుగా అవతరించారేమో..
Deleteమీ సందేహం సబబైనదే, శ్రీధరా 🙂.
Delete// “ ఆయా వీరాంగనాలు తరవాతి కాలం లో ఓ రుద్రమ, ఓ మణికర్ణికలుగా అవతరించారేమో..” // పోనీ అలానే అనుకున్నా కూడా అసలు వాళ్ళ జన్మ గురించిన ప్రసక్తి అంటూ ఉండాలిగా?
నేనా కోణం లో అడగలే దాచార్య.. అనంటే.. /*ధర్మ రాజు+ద్రౌపది= ప్రతివింధ్యుడు,
Delete2.భీముడు+ద్రౌపది= శ్రుతసోముడు
3.అర్జునుడు+ద్రౌపది= శ్రుత కీర్తి
4.నకులుడు+ ద్రౌపది=శతానీకుడు
5.సహదేవుడు+ద్రౌపది= శ్రుత సేనుడు */ లలో కేవలం పుత్రులనే ఊటంకించారు తదా శర్మాచార్య వారు.. మరి వారికి ఆడ సంతానం లేదా.. లేదా ఆ కాలం నుంఢే ఈ నాటి "బేటి బచావో" ఆందోళన్ లేదా..! డీఎన్ఏ ఫింగర్ప్రింటింగ్ కం జెనెటిక్ ఇంజినియరింగ్ ఆ కాలం లోనే ఉండిందా.. ఆ లెక్కన చూస్తే కురుక్షేత్ర కాలం కంటే మునుపే భారతావనినా సైంటిఫిక్ బూముండే దన్నమాట..!