నారాయణ తీర్థులు (1580-1680)




నారాయణ తీర్థులు  (1580-1680)

 


- రచన : తనికెళ్ళ భరణి   


 

నా చిన్నతనంలో సంక్రాంతి పండుగని

చాలా అద్భుతంగా జరువుపుకునేది ఊరు ఊరంతా....

పొద్దున్నే కుంకుడు కాయలు కొట్టి తలంటు స్నానం....

కొత్త బట్టలు...వాకిట్లో పట్టు పరికిణీలు కట్టుకుని కన్నెపిల్లల ముగ్గులు...

గంగిరెద్దు మేళం...హరిదాసులూ...

అలాంటప్పుడు ఓ హరిదాసు వచ్చేవాడు...

చక్కగా ఊర్వ్థపుండ్రాలూ...వొంటినిండా! నెత్తిమీద ఎర్రగా మెరిసిపోతున్న రాగిచెంబూ

దాని వెనకనుంచి మోకాళ్ళ దాక ఓ గుడ్డ...

ఓ చేతిలో తంబూర...మరో చేతిలో చిడతలూ...

కాళ్ళకి గజ్జెలు...మొలకి చిత్రంగా చీర....కట్టేవాడు

విశేషం ఏమిటంటే...

ప్రతి గుమ్మం ముందు ఆగి...కాసేపు చిందేస్తూ..

కృష్ణంకలయ సఖీ సుందరం

బాలకృష్ణం కలయ సఖీ సుందరం

కృష్ణం గత విషయ తృష్ణం....

అంటూ అత్యంత మనోహరంగా పాడేవాడు...

ఎన్నడూ ’భవతీ భిక్షాం దేహి’ అని అడిగి ఎరగడు...

పిల్లల మందరం...ఆయన పాట పాడ్తోంటే చాలా దూరం వెంటపడే వాళ్ళం..

ఆ తర్వాత తెలిసింది...వాటిని ’కృష్ణలీలా తరంగాలు’ అంటారనీ

అవి రాసినాయన `నారాయణ తీర్థులు’ అనీ....

నిజంగా ఆ పాటలు వింటోంటే...ఆ నాటి నుంచీ ఈ నాటివరకు హృదయం పన్నీటి తరంగాల్లో స్నానం చేసినట్టే ఉంటుంది....

నారాయణతీర్థుల కాలం గురించీ...ఆయన జన్మస్థలం గురించీ రకరకాల వాదనలున్నాయ్... మహామహోపాధ్యాయులు ఎంతో మంది చాలా కాలం పరిశోధించి...అనేక రకాలుగా తేల్చారు. కానీ ఆయన ఆంధ్రదేశంలోని గుంటూరు జిల్లా ‘కాజ’ అనే గ్రామంలో పుట్టారనీ...ఉత్తరోత్తరా - దక్షిణ ప్రాంతానికి వలస వెళ్ళారనీ అంటే తెలుగువాళ్ళమైన మనకో తృప్తి...

ఈయన తండ్రి పేరు తల్లావఝల నీలకంఠశాస్త్రి...

ఈయన పేరు తల్లావరుల గోవిందశాస్త్రి.

అయితే గోవిందశాస్త్రికి యవ్వనంలోనే ’పరిణామశూల’ (అంటే బహూశ కడుపులో గడ్డవంటిది) వచ్చి విపరీతంగా బాధపడ్తుంటే...ఎవరి సలహా మేరకో సింగరాయ కొండలోని నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ...ఈ తరంగాలు రచించాడనీ - వాటినే అద్దంకి ప్రాంతంలోని 60గ్రామాలకీ తనే స్వయంగా నేర్పాడనీ ప్రతీతి...

సరే...గోవిందశాస్త్రికి పెళ్ళైంది...అత్తారి ఊరు కృష్ణ అవలి ఒడ్డున ఉన్న వేదాద్రి!. ఓసారి అత్తవారింటికి వెళ్ళాలనీ...కృష్ణ ఈదుకుంటూ పోతున్నాడు...తీరా క్రిష్ణమ్మ పోంగింది!!

గోవిందశాస్త్రికి పట్టుతప్పింది...కాళ్ళుచేతులు కొడ్తున్నా...

ఈడ్చుకు పోతోంది కృష్ణమ్మ! తేలిపోతున్నాడు

నీళ్ళుమింగేశాడు....ఉక్కిరి బిక్కిరి పోతున్నాడు....

పాదాలు ఒకసారి అడుగు తాకీ పైకొచ్చాయ్...

తెలిసిపోయింది...ప్రాణం పోబోతుందని...

ఈ సమయంలో ‘అపత్సన్యాసం’తీసుకుంటే....?

(సన్యాస దీక్ష తీసుకుని మరణిస్తే ముక్తి అన్న ఒక నమ్మకం)

వెంటనే మనసులోనే సన్యసించాడు. కృఘ్ణడికో దణ్ణం పెట్టుకునీ...’శరణం భవకరుణాలయ - గురు దీన దయాళో’ అనుకున్నాడు.

పరమాత్మ పరమభాగవవోత్తముణ్ణీ.....అంత తొందరగా పోనిస్తాడూ...అక్కడో దుంగ దొరికింది...! దాని సాయంతో వొడ్డుకొచ్చాడు. ప్రాణం నిలిచింది...ఇంటికెళ్ళి..భార్యకి జరిగిందంతా చెప్పి ‘మరి అపత్సవ్యాసం స్వీకరించాను...! అనుజ్ఞ ఇస్తే’ అన్నాడు...అర్థోక్తిగా

ఆవిడ దు:ఖాన్ని గుండెల్లో దిగమింగుకునీ మౌనంగ సన్యాసాన్ని అంగీకరిస్తూ ‘వీక్షే కదా దేవ దేవం’......అనుకుంది.

వెంటనే గోవిందశాస్త్రి తన గురువుగారైన శివ పరమానంద తీర్థుల ఆజ్ఞ మేరకు ఆయన ఆధ్వర్యంలో యథావిధిగ సన్యాసాశ్రమం స్వీకరించి నారాయణ తీర్థులయ్యాడు...

ఇకపోతే జగత్ర్పసిద్ధమైన కృష్ణలీల తరంగిణిని భాగవత పురాణం లోని దశమ స్కంధం ఆధారంగా ఒక పెద్ద సంస్కృత నాటకం రాసీ....ప్రతీ అంకానికి ‘తరంగం’ అని పేరు పెట్టీ... పన్నెండు తరంగాలు ప్రకటించారు. ఇందులో దాదాపు 156 కీర్తనలు ఉన్నాయి. అందులో బాగా జనరంజకం అయిన తరంగాలు...


  ఏహి ముదం దేహి - యదుకుల కాంభోజి

  కలయ కళ్యాణిని - కేదార గౌళ

  కలయ - యశోదే - కేదార గౌళ

  క్షేమం కురు సతతం - సావేరి

  గోవింద ఘటయ - కాంభోజి

  గోవింద మిహ - గోపివే నంద - మధ్యమావతి.

  జయ జయ గోకులబాల - కురంజి

  నందగేహినీ - ద్విజావంతి

  పూరయ మహకామం - బిలహరి

  కృష్ణం కలయ సఖి - ముఖారి

  బాలగోపాల క్రిష్ణ - మోహన 

  వీక్షే కద దేవ దేవం - ఆనంద భైరవి

  మంగళాయ - కేదార గౌళ

  శరణం భవ కరుణాలయ - సౌరాష్ట్రం 


మరో విశేషం ఏమిటంటే....నారాయణ తీర్థులవారికి సిద్ధయ్య అనే శిఘ్యడుండేవానీ...అతనే తర్వాత సిద్ధేంద్రయోగి అయ్యాడనీ...కూచిపూడి నృత్యానికి మూల పురుషుడై.....కూచిపూడి నృత్యానికి ప్రపంచ ప్రఖ్యాతి తెచ్చి పెట్టారనీ...కూడా అంటారు.

నారాయణ తీర్థుల వారికీ దృష్టిదోషం ఉండేది... రోజూ రాత్రిళ్ళు భోజనాలయ్యాక....వసారాలో పడుకునీ కళ్ళుమూసుకుని తరంగాలు పాడుకునేవారు.

బాలకృఘ్ణడొచ్చి.....తీర్థులవారి బొజ్జమీదెక్కి....తాండవం చేసేవాడు.

తాండవ క్రిఘ్ణడి నృత్యం రోజూ చూస్తున్న సిద్దయ్య...ఓ రోజు అడిగాడు. "గురూ గారు రోజూ బాలకృఘ్ణడు మీ బొజ్జమీద తాండవం చేస్తోంటే మీకు పొట్టనొప్పిగా ఉండట్లేదూ?"

"బాలకృఘ్ణడి తాండవమా...ఎప్పుడ్రా..."

"అయ్యో! రాత్రిళ్ళు....మీరు నిద్రపోయే ముందు తరంగాలు అంటారు గదా....అప్పుడు బాలకృఘ్ణడు తాండవం చేస్తాడు...నేను రోజూ చూస్తున్నాగా"!

"ఎంత అదృష్టవంతుడివిరా...గుడ్డిపీనుగుని నాకు కనపడ్డేం!" అని కళ్ళు తుడుచుకునీ

"ఒరే...ఈసారి కృఘ్ణడు కనబడ్తే మనిద్దరికీ జన్మరాహిత్యం ఎప్పుడో కనుక్కో..."

"ఓ......అలాగే"అన్నాడు సిద్దప్ప...

మర్నాడు రాత్రి బాలకృఘ్ణడు కనపడగానే దణ్ణం పెట్టీ "జగద్గురూ....మా గురూగారికీ, నాకూ మోక్షం ఎప్పుడు?" అన్నాడు.

"నీకు ఈ జన్మలోనే...(నా దర్శనం అయ్యిందిగా.....!)

మీ గురూగారికి మాత్రం మరో జన్ముంది!!" అన్నాడు. మురళి మనోహరంగా మోగింది...

అంచేతే సిద్దేంద్రయోగి...యక్షగానంని ఆంధ్ర దేశం అంతటా ప్రదర్శించీ...పుణ్యలోకాల కెళ్ళారు. 

ఆ తర్వాత...వారి గురువు నారాయణతీర్థులు...

 

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!