ప్రాతః ద్యూత ప్రసంగేన/

పైకి తప్పుగా కనిపించినా లోపల ఎంత గొప్ప అర్థాన్నిదాచుకొని ఉందో  చాటు శ్లోకం. -------

-  ‘విద్వాన్’తిరుమలపెద్దింటి.నరసింహాచార్యులు....


“ ప్రాతః ద్యూత ప్రసంగేన/ మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతాం/

నక్తం చొరప్రసంగేన/ కాలో గచ్ఛతి ధీమతః//” 

అర్థం.

ప్రాతః = ఉదయంపూట. ద్యూత ప్రసంగేనా = జ్యూదం గురించి మాటాడుకొంటూ.

మధ్యాహ్నే = మధ్యాహ్నసమయంలో. స్త్రీ ప్రసంగాతాం = స్త్రీ గురించి మాటాడుతూ 

నక్తం =రాత్రుళ్ళు. చోరప్రసంగేన = దొంగల గురించి ప్రసంగిస్తూ.

ధీమతః= బుద్ధిమంతులు (లేక పెద్దలు.) కాలో గచ్ఛతి= కాలాన్ని గడుపుతారు. ఏ మాశ్చర్యం! బుద్ధిమంతులు, ఉదయం జూదం గురించి, మధ్యాహ్నం స్త్రీని గూర్చి, రాత్రి దొంగలను గూర్చి మాటాడుకొంటూ కాలం గడుపుతారట!

 పై వాటిని గూర్చి చర్చించుకొనే వారు బుద్ధిమంతులు ఎలా అవుతారు. చాల విచిత్రంకదా! 

( క్రింది వివరణ చదవకుండా కొంచం ఆలోచించి ఈ చాటువులో విశేషం ఏమిటో తెలుసుకొందుకు ప్రయత్నించండి.తెలియ లేదా అయితే.) 

ఇప్పుడు విశేషార్థం చూడండి.

“ కురుక్షేత్ర మహాసంగ్రామానికి ముఖ్య కారణం శకుని మాయాజ్యూదమేకదా! ఆకథ మహాభారతం లో ఉంది కనుక ‘ద్యూత ప్రసంగం’ అంటే (ఉదయం) మహాభారతాన్ని చదువుతూ, అట్లే సీతాదేవిని అపహరించటం వలెనే కదా! రామ రావణ యుద్ధంజరిగి లోక కంటకుడైన రావణుడు అంతరించాడు. ఈ చరిత్ర కలిగినది రామాయణం. స్త్రీ ప్రసంగం అంటే (మధ్యాహ్నం పూట) రామాయణాన్ని చదువుతూ, వెన్న దొంగిలించడం,గోపికల (భక్తుల) వస్త్రాల్ని, మనసులని దొంగిలించి, ‘గోపికా మానస చోరుడుగా కీర్తించ బడిన శ్రీకృష్ణ వృత్తాంతం కలిగిన గ్రంథం ‘శ్రీమద్భాగవతం’ నక్తం చోర ప్రసంగం అంటే రాత్రిపూట భాగవతం చదువుతూ” అనగా బుద్ధిమంతులు కాలాన్ని వృధాచేయకుండా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడుకాలాల్లో “మహాభారత, రామాయణ, భాగవతాది” గ్రంధాలు చదువుతూ కాలాన్ని సద్వినియోగం చేసుకొంటారు, అని పై చాటువుకి విశేషార్థం. చూశారా పై చాటువుల గొప్పతనం.

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!